గోదాదేవి: కూర్పుల మధ్య తేడాలు
+సమాచారపెట్టె ఆధునీకరణ |
タチコマ robot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: pl:Andal |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
[[వర్గం:ప్రముఖ వైష్ణవాచార్యులు]] |
[[వర్గం:ప్రముఖ వైష్ణవాచార్యులు]] |
||
[[en:Aandaal]] |
[[en:Aandaal]] |
||
⚫ | |||
[[de:Andal]] |
[[de:Andal]] |
||
[[pl:Andal]] |
|||
[[pt:Andal]] |
[[pt:Andal]] |
||
[[sv:Andal]] |
[[sv:Andal]] |
||
⚫ |
06:04, 2 జూన్ 2008 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
గోదా దేవి | |
గోదాదేవి | |
నామాంతరములు | కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్, ఆండాళ్, ఆముక్త మాల్యద |
జన్మస్థలం | శ్రీరంగం |
జన్మ నక్షత్రము | నల సంవత్సరం, కర్కాట మాసము, పుబ్బా నక్షత్రము, ఆషాఢ శుద్ధ చతుర్దశి |
కాలము | క్రీ.శ.776 |
దైవాంశ | లక్ష్మీ |
రచనలు | తిరుప్పావు, నాచ్చియార్ తిరుమళి |
విశేషములు | విష్ణుచిత్తుల పెంపుడు కుమారి, రంగనాథునికి తను ధారణ చేసిన మాలలు సమర్పించినది |
గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారనే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.
తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావు" వ్రతాచరణ చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది, వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది, అది చూసి విష్ణుచిత్తులవారు దుఃఖితులయితే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు.
గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ది, దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజూ రోజుకొక్కటి చొప్పున ఓ పాశురం విష్ణ్వాలయంలలో పఠిస్తారు.