అచ్చంపేట (నాగర్కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 42: | పంక్తి 42: | ||
[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ. |
[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ. |
||
{{అచ్చంపేట (నాగర్కర్నూల్ జిల్లా) మండలంలోని గ్రామాలు}}{{నాగర్కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}} |
{{అచ్చంపేట (నాగర్కర్నూల్ జిల్లా) మండలంలోని గ్రామాలు}}{{నాగర్కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}} |
||
{{తెలంగాణ పురపాలక సంఘాలు}} |
|||
[[వర్గం:జనగణన పట్టణాలు]] |
[[వర్గం:జనగణన పట్టణాలు]] |
14:46, 8 మే 2021 నాటి కూర్పు
అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రం, నాగర్కర్నూల్ జిల్లా,అచ్చంపేట మండలానికి చెందిన జనగణన పట్టణం,[1] 2013 జూన్ 25న అచ్చంపేట పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]
ఈ పట్టణం నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణం అభివృద్ధిలో ఉంది. బస్సు డిపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.
చరిత్ర
ఈ ప్రాంతాన్ని పరిపాలించిన దేవినేని అచ్చమ్మ దొరసాని ఈ పట్టణాన్ని ఏర్పరిచింది కాబట్టి ఆమె పేరుమీదుగా ఇది అచ్చంపేట అయిందని కొందరు చరిత్రకారుల భావన. ఐతే18వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అలంపూరు బిజ్జల పాలక వంశానికి చెందని అచ్చమ్మ స్థాపించిందనీ, ఆమె పేరుమీదుగా అచ్చంపేట అయిందని కొందరు చరిత్రకారులు చెప్తారు. దేవినేని అచ్చమ్మ దొరసాని గ్రామాన్ని నెలకొల్పినట్టు పేర్కొనే శాసనం ఒకటి ఉమామహేశ్వరంలో లభిస్తోంది.[3]
పరిపాలన
గ్రామంలో 1898లో మునసబు ఆఫీసు, 1939లో తహశ్శీలు ఆఫీసు ఏర్పడ్డాయి. దీనితో 1939లోనే తాలూకా కేంద్రమైంది.[3]
గణాంకాలు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం - 28384, గ్రామీణ జనాభా 40504.పిన్ కోడ్ నం. 509375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.
విద్యాసంస్థలు
- ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
- ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
- త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
- ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
- ప్రగతి డిగ్రీ కళాశాల
- తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97), ఫోను నెం:08541-272040
పర్యాటక ప్రదేశాలు
- ఉమామహేశ్వరము. (శ్రీశైలం ఉత్తర ద్వారము)
- మల్లెలతీర్థం: శ్రీశైలం వెళ్ళేదారిలో వటవర్లపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉంటుంది.
- లొద్ది మల్లయ్య స్వామి దేవాలయం.
- సలేశ్వరం: తెలంగాణా అమరనాథ్గా పిలవబడుతుంది. ప్రత్యేకమైన ఉత్సవాల రోజుల్లో మాత్రమే ఇక్కడికి ప్రజలు వస్తుంటారు.
- ఫరహాబాద్ దృశ్య కేంద్రం: నల్లమల్ల అడవుల్లోనుండి కృష్ణానది సౌందర్యాన్ని చూడటానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఒక ప్రదేశం.
- మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం
- అక్కమహాదేవి గుహలు
- శ్రీ సాయిబాబా మందిరం:అవతారమూర్తిగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్న శ్రీ సాయిబాబా మందిరం, ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరంగా పేరుగాంచింది.
నీటిపారుదల భూమి
2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[4].
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nagarkurnool.pdf
- ↑ "Basic Information of Municipality, Atchampet Municipality". atchampetmunicipality.telangana.gov.in. Retrieved 12 April 2021.
- ↑ 3.0 3.1 లింగమూర్తి, కపిలవాయి (1992). పాలమూరు జిల్లా ఆలయాలు. 17.
- ↑ Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
బయటి లింకులు
[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ.