ఈమాట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36: పంక్తి 36:
==సంపాదక వర్గం==
==సంపాదక వర్గం==
ప్రస్తుతం (2021) ఈమాట సంపాదక వర్గంలో మాచవరం మాధవ్, సుధామయి సత్తెనపల్లి, మానస చామర్తి ఉన్నారు.
ప్రస్తుతం (2021) ఈమాట సంపాదక వర్గంలో మాచవరం మాధవ్, సుధామయి సత్తెనపల్లి, మానస చామర్తి ఉన్నారు.
గతంలో వేలూరి వేంకటేశ్వర రావు, పాణిని శంఖవరం, ఇంద్రగంటి పద్మ, కె.వి.ఎస్.రామారావు, కొలిచాల సురేశ్, కొంపెల్ల భాస్కర్, విష్ణుభొట్ల లక్ష్మన్న సంపాదకులుగా పనిచేశారు.
; '''విశ్రాంత సంపాదకులు'''

* వేలూరి వేంకటేశ్వర రావు
*పాణిని శంఖవరం
* ఇంద్రగంటి పద్మ
* కె.వి.ఎస్.రామారావు
* కొలిచాల సురేశ్
* కొంపెల్ల భాస్కర్
* విష్ణుభొట్ల లక్ష్మన్న
== పాలసీలు ==
== పాలసీలు ==
ఈమాట పత్రిక రచనల స్వీకరణ, ప్రచురణల్లో సమీక్షా పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ పద్ధతిలో మొదట రచనలను సంపాదకులు పరిశీలిస్తుంటారు, ఆపైన అవసరమైతే తత్సంబంధిత రంగాల్లో నిపుణులైన ఇతర విమర్శకులు ఇద్దరితో సమీక్షింపజేస్తారు. ఆ సమీక్షావివరాలు రచయితలకు అందజేసి కొద్దిస్థాయిలో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మార్పులు లేకుండానే తమ రచనలు ప్రచురణ కావాలని రచయితలు భావిస్తే ఆ రచన ఈమాట వారు తిరస్కరించడమో, రచయిత ఉపసంహరించుకోవడమో జరుగుతుంది. రచయితలతో సంప్రదింపుల ఫలితంగా ప్రచురణార్హమైన రచనలను తుదిగా నిర్ణయిస్తారు. ఈ పద్ధతిని కొందరు రచయితలు, సాహిత్యవేత్తలు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానంగా రచనల్లో ఉన్నత విలువలు నెలకొల్పేందుకు ఉద్దేశించే తాము ఈ ''పీర్ రివ్యూ'' విధానం ప్రవేశపెట్టామని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన పద్ధతి అని తెలుగువారు అలవాటుపడితే సరిపోతుందని సమాధానమిస్తున్నారు. ఇతర పత్రికల్లో సంపాదకులదే నిర్ణయమంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈమాటలో మాత్రం ఈ విధమైన పీర్ రివ్యూ పద్ధతితో రచయితలు, సమీక్షకులు, సంపాదకులు సమష్టి నిర్ణయంతో వ్యవహరిస్తున్నామని వ్రాశారు.<ref>{{cite journal|last1=వెంకటేశ్వరరావు|first1=వేలూరి|title=ఈమాట – నామాట|journal=ఈమాట|date=2008-11-01|volume=10|issue=నవంబర్ 2008|url=http://eemaata.com/em/issues/200811/1368.html#|accessdate=15 January 2015}}</ref>
ఈమాట పత్రిక రచనల స్వీకరణ, ప్రచురణల్లో సమీక్షా పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ పద్ధతిలో మొదట రచనలను సంపాదకులు పరిశీలిస్తుంటారు, ఆపైన అవసరమైతే తత్సంబంధిత రంగాల్లో నిపుణులైన ఇతర విమర్శకులు ఇద్దరితో సమీక్షింపజేస్తారు. ఆ సమీక్షావివరాలు రచయితలకు అందజేసి కొద్దిస్థాయిలో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మార్పులు లేకుండానే తమ రచనలు ప్రచురణ కావాలని రచయితలు భావిస్తే ఆ రచన ఈమాట వారు తిరస్కరించడమో, రచయిత ఉపసంహరించుకోవడమో జరుగుతుంది. రచయితలతో సంప్రదింపుల ఫలితంగా ప్రచురణార్హమైన రచనలను తుదిగా నిర్ణయిస్తారు. ఈ పద్ధతిని కొందరు రచయితలు, సాహిత్యవేత్తలు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానంగా రచనల్లో ఉన్నత విలువలు నెలకొల్పేందుకు ఉద్దేశించే తాము ఈ ''పీర్ రివ్యూ'' విధానం ప్రవేశపెట్టామని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన పద్ధతి అని తెలుగువారు అలవాటుపడితే సరిపోతుందని సమాధానమిస్తున్నారు. ఇతర పత్రికల్లో సంపాదకులదే నిర్ణయమంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈమాటలో మాత్రం ఈ విధమైన పీర్ రివ్యూ పద్ధతితో రచయితలు, సమీక్షకులు, సంపాదకులు సమష్టి నిర్ణయంతో వ్యవహరిస్తున్నామని వ్రాశారు.<ref>{{cite journal|last1=వెంకటేశ్వరరావు|first1=వేలూరి|title=ఈమాట – నామాట|journal=ఈమాట|date=2008-11-01|volume=10|issue=నవంబర్ 2008|url=http://eemaata.com/em/issues/200811/1368.html#|accessdate=15 January 2015}}</ref>

23:27, 30 జూన్ 2021 నాటి కూర్పు

ఈమాట
"ఈమాట" మార్చి 2009 సంచిక తెరపట్టు
ఎల్లలు లేని ప్రపంచానికి ఎలక్ట్రానిక్ తెలుగు పత్రిక
రకంద్వైపాక్షిక పత్రిక (1998), మాసపత్రిక (2017)
రూపం తీరుజాలపత్రిక
ప్రధాన సంపాదకులుమాధవ్ మాచవరం
సహ సంపాదకులుపాణిని శంఖవరం
రాజకీయత మొగ్గురాజకీయాలకు అతీతం
భాషతెలుగు
జాలస్థలిhttp://eemaata.com/

ఈమాట ఒక తెలుగు అంతర్జాల పత్రిక. ఇది ప్రధానంగా అమెరికాలోని ప్రవాసాంధ్రులచే నడుపబడుతున్నది. తెలుగులో అంతర్జాల పత్రికలు లేని 1998లో ద్వైమాసపత్రికగా ప్రారంభమైన ఈపత్రిక 2017 నుండి మాసపత్రికగా విడుదలవుతున్నది. పత్రిక రచనలు ప్రచురణల్లో సమీక్షా పద్ధతిని పాటిస్తుంది, యూనికోడ్ వాడడం వలన తెలుగులో వెతికే సదుపాయం, పాఠకుల స్పందనలు రచన పేజీలోనే వ్యక్తంచేసే విధానం కలిగివుంది.

లక్ష్యాలు

ఈ మాట గురించి సంపాదకులు తమ పత్రికలో ఇలా చెప్పారు -

సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం, ఒక మంచి సాహిత్య పత్రికను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్థాపించిన పత్రిక, ఈమాట. లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే ఈమాట లక్ష్యం. 1998 దీపావళి నాడు విడుదలైన మొదటి సంచిక నుంచి ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఈ పత్రిక ఇలా పెరగడానికి కారణం, ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే. పాఠకుల వెసులుబాటు కోసం ఈమాటని మూడు పద్ధతుల్లో ప్రచురిస్తున్నాం. యూనికోడ్‌లో చదవడం ఉత్తమమైన పద్ధతి. మీ కంప్యూటర్లపై యూనికోడ్ చదివే సదుపాయం లేకపోతే ఈమాటను తెలుగు లేదా రోమన్ లిపిలొ చదువుకునే వెసులుబాటు ఉంది. ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఈమాట ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన సహకారాన్ని కోరుతున్నాం.[1]

ప్రచురణా విధానం

ఈమాట పత్రిక సంపాదకులు పేర్కొన్నదాన్ని అనుసరించి ఈమాట పత్రిక ప్రచురణా విధానం కింది విధంగా ఉంటుంది:

  • ప్రతి పేజీ నుంచీ ఈమాటలో రచనలనిని పూర్తిగా తెలుగులో కూడా వెతకగలిగే సౌకర్యం.
  • ప్రతి రచన గురించీ మీ అభిప్రాయం అదే పేజీలో తెలుగులో కూడా తెలియచేయగలిగే సౌకర్యం.
  • ఏ రచయిత రచనల నైనా ఒకే పేజీలో చదవగలిగే సౌకర్యం.
  • మరికొన్ని ఉపయోగ్యతా పెంపుదలలు (usability enhancements)
  • కంటికింపైన రంగులు, పాత సంచికల సూచిక, శీర్షికల సూచిక

సంపాదక వర్గం

ప్రస్తుతం (2021) ఈమాట సంపాదక వర్గంలో మాచవరం మాధవ్, సుధామయి సత్తెనపల్లి, మానస చామర్తి ఉన్నారు. గతంలో వేలూరి వేంకటేశ్వర రావు, పాణిని శంఖవరం, ఇంద్రగంటి పద్మ, కె.వి.ఎస్.రామారావు, కొలిచాల సురేశ్, కొంపెల్ల భాస్కర్, విష్ణుభొట్ల లక్ష్మన్న సంపాదకులుగా పనిచేశారు.

పాలసీలు

ఈమాట పత్రిక రచనల స్వీకరణ, ప్రచురణల్లో సమీక్షా పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ పద్ధతిలో మొదట రచనలను సంపాదకులు పరిశీలిస్తుంటారు, ఆపైన అవసరమైతే తత్సంబంధిత రంగాల్లో నిపుణులైన ఇతర విమర్శకులు ఇద్దరితో సమీక్షింపజేస్తారు. ఆ సమీక్షావివరాలు రచయితలకు అందజేసి కొద్దిస్థాయిలో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మార్పులు లేకుండానే తమ రచనలు ప్రచురణ కావాలని రచయితలు భావిస్తే ఆ రచన ఈమాట వారు తిరస్కరించడమో, రచయిత ఉపసంహరించుకోవడమో జరుగుతుంది. రచయితలతో సంప్రదింపుల ఫలితంగా ప్రచురణార్హమైన రచనలను తుదిగా నిర్ణయిస్తారు. ఈ పద్ధతిని కొందరు రచయితలు, సాహిత్యవేత్తలు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానంగా రచనల్లో ఉన్నత విలువలు నెలకొల్పేందుకు ఉద్దేశించే తాము ఈ పీర్ రివ్యూ విధానం ప్రవేశపెట్టామని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన పద్ధతి అని తెలుగువారు అలవాటుపడితే సరిపోతుందని సమాధానమిస్తున్నారు. ఇతర పత్రికల్లో సంపాదకులదే నిర్ణయమంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈమాటలో మాత్రం ఈ విధమైన పీర్ రివ్యూ పద్ధతితో రచయితలు, సమీక్షకులు, సంపాదకులు సమష్టి నిర్ణయంతో వ్యవహరిస్తున్నామని వ్రాశారు.[2]

రచనలు

ఈమాట పత్రికలో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలు ప్రచురిస్తారు. రచనల్లో ప్రవాసాంధ్రుల జీవితం, అనుభవాలు, అనుభూతులు వంటివాటికి ప్రాధాన్యత ఇచ్చినా తెలుగు సంస్కృతీ సమాజాలకు సంబంధించిన ఏ రచన అయినా ప్రచురణార్హమేనని స్పష్టంచేశారు. ఈమాట ఆశయాలుగా సంపాదకులు, ప్రచురణకర్తలు పేర్కొన్నవి: (1) తెలుగు వారి అనుభవాల్ని అనుభూతుల్నీ జీవనాన్నీ జీవితాన్నీ ప్రతిబింబించే రచనలకి, రచయితలకి ఒక వేదిక కల్పించటం (2) ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండడం. (3) ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం.

శీర్షికలు

ఈ మాటలో వచ్చే శీర్షికలు - సంపాదకీయం, సమీక్షలు, సంప్రదాయ సాహిత్యం, కథలు, కవితలు, వ్యాసాలు, అనువాదాలు, శబ్ద తరంగాలు, ఈ-పుస్తకాలు, ప్రకటనలు, ధారావాహికలు/నవలలు, జిగిరీ, తోలుబొమ్మలాట వంటివి. ఇవే కాకుండా "గ్రంథాలయం" విభాగంలో అనేక పుస్తకాలు పాఠకులకు అందించే ప్రయత్నం జరుగుతున్నది. మార్చి 2009నాటికి ఈ గ్రంథాలయంలో లభిస్తున్న పుస్తకాలు : ATA 2006, కరుణ ముఖ్యం, కళాపూర్ణోదయం, కుండీలో మర్రిచెట్టు, క్రీడాభిరామం, నిశ్శబ్దంలో నీ నవ్వులు, ప్రభావతీ ప్రద్యుమ్నం, భాషాశాస్త్రానికి మరోపేరు భద్రిరాజు, మనుచరిత్ర, మేఘదూతః, వ్యవహారికోద్యమ చరిత్ర, శిలాలోలిత, సూర్యశతకం, స్వప్నవాసవదత్తం

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

  1. "మా గురించి". ఈమాట. ఈమాట బృందం. Retrieved 15 January 2015.
  2. వెంకటేశ్వరరావు, వేలూరి (2008-11-01). "ఈమాట – నామాట". ఈమాట. 10 (నవంబర్ 2008). Retrieved 15 January 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈమాట&oldid=3253550" నుండి వెలికితీశారు