గోరటి వెంకన్న: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8: పంక్తి 8:
| birth_name = గోరటి వెంకన్న
| birth_name = గోరటి వెంకన్న
| birth_date = [[1963]]
| birth_date = [[1963]]
| birth_place = [[గౌరారం ([[తెల్కపల్లి]])]], [[నాగర్‌కర్నూల్ జిల్లా]]
| birth_place = గౌరారం ([[తెల్కపల్లి]]), [[నాగర్‌కర్నూల్ జిల్లా]]
| native_place =
| native_place =
| death_date =
| death_date =

15:33, 4 జూలై 2021 నాటి కూర్పు

గోరటి వెంకన్న
గోరటి వెంకన్న
జననం
గోరటి వెంకన్న

1963
ఇతర పేర్లుగోరటి వెంకన్న
వృత్తిపాటల రచయిత, కవి,గాయకుడు, శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)
తల్లిదండ్రులు
  • నర్శింహ (తండ్రి)
  • ఈరమ్మ (తల్లి)

గోరటి వెంకన్న ప్రముఖ ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాట లకు మూలాధారాలు. మా టీవీలో ప్రసార మవుతున్న రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.

2016 కాళోజీ స్మారక పురస్కారాన్ని అందుకుంటున్న ప్రజాకవి, రచయిత, గాయకుడు గోరటి వెంకన్న
2016 కాళోజీ స్మారక పురస్కారాన్ని అందుకున్న తరువాత కుటుంబసభ్యులతో గోరటి వెంకన్న


2020, నవంబరులో శాసనమండలి సభ్యుడిగా (గవర్నర్ కోటా) ప్రమాణ స్వీకారం చేశాడు.[1]

జననం

గోరటి వెంకన్న 1963 లో నాగర్‌కర్నూల్ జిల్లా, గౌరారం (తెల్కపల్లి)లో ఆయన జన్మించాడు. నాన్న పేరు నర్సింహ. అమ్మ ఈరమ్మ. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు.

చిన్నతనంలో ఆయనకు సినిమా పాటలంటే చాలా చిన్న చూపు ఉండేది. బడిలో పాట పాడమంటే ఎక్కువగా భక్తి పాటలు పాడేవాడు. ఆయన తండ్రి కూడా మంచి కళాకారుడే. తల్లి కూడా మంగళ హారతులూ మొదలైన పాటలు పాడేది. అలా ఆయనకు చిన్నప్పటి నుంచీ పాటల మీద ఆసక్తి కలిగింది. అలా ఉండగా ఆయన ఊర్లో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్న లోని సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలను తీసుకువచ్చి ఇచ్చాడు. వాటిలో పాటలను ఆయన అలవోకగా పాడేవాడు.[2]

రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో 1984 లో ఆయన రాసిన నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయరో అనే పాట చాలా పేరు సాధించిపెట్టింది. ఆయనను చిన్నతనంలో ప్రోత్సహించిన వెంకటరెడ్డి మాస్టారు ప్రోత్సాహంతో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాలుపంచుకోసాగాడు. అదే ప్రభావంతో అనేక పాటలు రాశాడు. అలా ఆయన రాసిన పాటలు జన నాట్యామండలి వాళ్ళు సభల్లో పాడేవారు.

సినీరంగ నేపథ్యం

రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నదో

అనే పాట ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ వినడం తటస్థించింది. ఆయన ఈపాట రాసింది ఎవరా అని రెండు నెలలపాటు వెతికి పట్టుకున్నాడు. శంకర్ ఆయన్ను సినిమా కోసం పాట రాయమని అడిగితే నిర్లక్ష్యంగా చూశాడు. సినిమా పాటలన్నీ పడికట్టు పదాలతో రాయబడి ఉంటాయనీ సినిమాల వల్ల సమాజంలో మార్పు రాదనే అభిప్రాయంతో ఉన్నాడు. చివరకు మిత్రుడు సాహు ఇచ్చిన ట్యూన్ తో జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో అనే పాటను రాశాడు. అది బాగా హిట్టయింది. అలాగే "కుబుసం" సినిమా కోసం ఆయన రాసిన పల్లె కన్నీరు పెడుతోంది అనే పాట కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

రచనలు

  • ఏకనాదం:
  • రేల పూతలు: ఎవరికో కొన్ని వర్గాల వారికి మాత్రమే అర్థమై, పరిమితమైన కవితా సంకలనాలకు నేడు కొదువ లేదు. కాని సామాన్య జనానికి అర్థమై, వారి నాలుకల మీద నిలిచిన సజీవమైన కవిత పాటే కదా! ఆ పాటలే నేడు కరువైనాయి. ఆ కరువును తీర్చడానికే మూడు పాటల సంకలనాలు వెలువరించాడు గోరటి. వాటిలో రేలపూతలు ఒకటి
  • అల చంద్రవంక

పురస్కారాలు

  1. కాళోజీ నారాయణరావు పురస్కారం - 09.09.2016[3]

చిత్రమాలిక

మూలాలు

  1. The Hans India, Telangana (14 November 2020). "Telangana Cabinet strikes balance with MLC posts". www.thehansindia.com. Archived from the original on 14 November 2020. Retrieved 28 November 2020.
  2. http://www.telugulo.com/view_news.php?id=1905
  3. నమస్తే తెలంగాణ (9 September 2016). "గోరెటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రదానం". Archived from the original on 10 September 2016. Retrieved 9 September 2016.

యితర లింకులు