అల్లమ ప్రభు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 13: పంక్తి 13:
→ wirally.comలో ప్రచురితమైన కథనం
→ wirally.comలో ప్రచురితమైన కథనం
[https://www.wirally.com/mystic-saint-from-the-12th-century/]
[https://www.wirally.com/mystic-saint-from-the-12th-century/]

→సూర్య దినపత్రికలో ప్రచురితమైన కథనం
[https://m.suryaa.com/telangana-telugu-20260-.html]

07:54, 31 జూలై 2021 నాటి కూర్పు

అల్లమ ప్రభు 12 వ శతాబ్దానికి చెందిన గొప్ప వ్యక్తి. ఆ కాలంలో అంటరానితనంపైన పోరాడి సమాజంలో మార్పుని తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి. అంతేకాకుండా దేశసంచారం చేస్తూ ఎన్నో శివాలయాలని దర్శించి ఆత్మలింగాన్ని పొందిన మహా శక్తిమంతుడు.

జీవిత గాథ

అల్లమప్రభు 12 వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించాడు. ఈయన గొప్ప శివభక్తుడు. ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధువు. అయితే ఆయన కమలత అనే ఒక యువతిని వివాహం చేసుకోగా ఆమె తీవ్ర జ్వరంతో మరణించడంతో, అది తట్టుకోలేని ఆయన దేశసంచారం చేస్తూ అనేక శివాలయాలను దర్శించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే ఒక గురువు ఆత్మలింగాన్ని ఆయనకి ప్రసాదించాడట. ఇది ఇలా ఉంటె, శివనామంతో అన్ని శివాలయాలు దర్శిస్తుండగా అప్పటికే శక్తివంతమైన సాధువుగా అల్లమప్రభు ప్రసిద్ధి చెందగా, ఒక యోగి అల్లమప్రభుని కలసి అతడితో పోటీ పడాలని భావించాడు. ఆ యోగి వయసు 200 సంవత్సరాల ఉండగా, ఆయన కఠోర సాధనతో పంచభూతాలపైనా ఆధిపత్యం సాధించి శరీరాన్ని దృఢపరుచుకొని వయసుని అధిగమించాడు. ఇలా వయసుని అధిగమించాననే గర్వం ఆ యోగికి ఉంది. అయితే ఆ యోగి ఒక నది ఒడ్డున అల్లమప్రభు ని కలుసుకొని నేను అసలైన యోగిని. నువ్వు కాదు. కావాలంటే ఒక కత్తి తీసుకొని నా నెత్తి పైన కొట్టమని చెప్పగా, అప్పుడు అల్లమప్రభువు ఒక కత్తితో ఆ యోగి తలపైన కొట్టడంతో ఒక రాయికి తగిలినట్టు ఆ కత్తి మళ్ళి వెనుకకు వచ్చింది. అప్పుడు ఆ యోగి నన్ను ఏ కత్తి కూడా ఏమి చేయలేదు, నేను అమరుడను అని చెప్పి, నీవు ఏం చేయగలవు? అని అడగడంతో, అల్లమప్రభు నవ్వుతు నువ్వు కూడా నీ కత్తితో నా తలపైన ప్రయోగించి చూడు అనగా, ఆ యోగికి అల్లమప్రభు దృడంగా కాకుండా సామాన్యంగా కనిపించడంతో ఆగిపోగా, అల్లమప్రభు ఏమి పర్వాలేదు కత్తిని నా పైన ప్రయోగించు అనడంతో, ఆ యోగి కత్తితో తలపైన కొట్టగా, ఆ కత్తి అల్లమప్రభువు శరీరం మధ్యనుండి ఏదో గాలిలో వెళ్లినట్టు గా వెళ్లి భూమికి తాకడంతో ఆ యోగి అలానే కత్తితో పాటు కిందపడిపోయాడు. అప్పడు ఆ యోగి ఇది ఏమిటి అని అల్లమప్రభు ని అడగగా, 'ఇది ఇదో అదో కాదు ఇది శివుడు, ఇది ఏదైతే లేదో అది' అని ఆ యోగికి సమాధానం ఇచ్చాడు.

ఇక అల్లమ ప్రభు సంపాదించిన ఆ లింగాన్ని ఒక దట్టమైన గుట్ట పైన ప్రతిష్టించి పూజలు చేసాడు. ప్రస్తుతం ఆ గుట్టను అల్లమ ప్రభు గుట్ట అని పిలుస్తున్నారు.

అల్లమ ప్రభు గుట్ట, ఆలయం

ప్రస్తుతం ఆ లింగ ప్రతిష్టాపన జరిగిన గుట్ట తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా, నస్రుల్లాబాద్, బొమ్మన్ దేవ్ పల్లి దగ్గరలో ఉంది. దేవాలయంలో ఆ లింగం ఉంది. అందుకే ఆ లింగం మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. అక్కడ ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య నుండి మూడు రోజుల పాటు జాతర చాలా గొప్పగా జరుగుతుంది. ఈ జాతర సమయంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కుండా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయాన్ని దర్శించాలంటే అడవి మార్గం గుండా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి.


మూలాలు

→ wirally.comలో ప్రచురితమైన కథనం [1]

→సూర్య దినపత్రికలో ప్రచురితమైన కథనం [2]