జి.ఎ.నటేశన్: కూర్పుల మధ్య తేడాలు
చి వర్గం:తమిళనాడు పాత్రికేయులు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
చి వర్గం:బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనమండలి సభ్యులు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
[[వర్గం:తమిళనాడు రచయితలు]] |
[[వర్గం:తమిళనాడు రచయితలు]] |
||
[[వర్గం:తమిళనాడు పాత్రికేయులు]] |
[[వర్గం:తమిళనాడు పాత్రికేయులు]] |
||
[[వర్గం:బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనమండలి సభ్యులు]] |
05:47, 12 నవంబరు 2021 నాటి కూర్పు
గణపతి అగ్రహారం అన్నాదురై అయ్యర్ నటేశన్ (1873 ఆగష్టు 25 - 1948 ఏప్రిల్ 29) స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, పాత్రికేయుడు, ప్రచురణకర్త, రాజకీయ నాయకుడు. అతను G. A. నటేశన్ & కో అనే ప్రచురణ సంస్థను స్థాపించాడు. అది జాతీయవాద పుస్తకాలను ప్రచురించింది. వాటిలో ప్రముఖమైనది ది ఇండియన్ రివ్యూ.
తొలి జీవితం
నటేశన్ తంజావూరు జిల్లాలోని గణపతి అగ్రహారం గ్రామంలో 1873 ఆగష్టు 25 న జన్మించాడు. కుంభకోణంలో పాఠశాల విద్య అభ్యసించి, మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఆర్ట్స్లో పట్టభద్రుడయ్యాడు. ప్రచురణకర్తగా వృత్తిని ప్రారంభించాడు. 1897లో తన స్వంత పబ్లిషింగ్ కంపెనీ, G. A. నటేసన్ & కోని ప్రారంభించే ముందు అతడు గ్లిన్ బార్లో క్రింద శిక్షణ పొందాడు.
స్వాతంత్ర్య పోరాటంలో
నటేశన్ 1900 తొలి రోజుల నుండి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. ఆంగ్లంలో ది ఇండియన్ రివ్యూ మాసపత్రికను ప్రారంభించాడు. ఎక్కువగా జాతీయవాద ఇతివృత్తాలపై రచనలు చేసే ది ఇండియన్ రివ్యూలో సాహిత్య సమీక్షలు, దృష్టాంతాలు, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయంపై కూడా రచనలు వేసేవారు. ఈ పత్రిక "ఆసక్తికరమైన అన్ని అంశాలపై చర్చకు అంకితం చేయబడింది" అని నటేశన్ మొదటి పేజీలో ప్రచారం చేశాడు.
మహాత్మా గాంధీ 1915లో భారతదేశానికి వచ్చిన తర్వాత మొదటిసారిగా మద్రాసు సందర్శించినప్పుడు, అతను జార్జ్టౌన్లోని తంబు చెట్టి వీధిలో నటేశన్ ఇంట్లోనే బస చేశాడు. అతని బస 1915 ఏప్రిల్ 17 నుండి 1915 మే 8 వరకు కొనసాగింది.
మలి జీవితం
తన తరువాతి జీవితంలో, నటేశన్ భావజాలంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో అతడు ఇండియన్ లిబరల్ పార్టీలో చేరాడు. 1922లో లిబరల్ పార్టీ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. 1923లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్కు నాన్-అఫీషియల్ సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1931లో రెండవసారి అతను కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యునిగా ఉన్న సమయంలో, నటేశన్ కెనడాలోని ఎంపైర్ పార్లమెంటరీ అసోసియేషన్కు భారతీయ దళ సభ్యుడిగా పనిచేశాడు. 1933-34లో ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ టారిఫ్ బోర్డు సభ్యునిగా కూడా నటేశన్ పనిచేశాడు. 1938లో మద్రాసు షరీఫ్గా నియమితులయ్యాడు.
నటేసన్ 1948 ఏప్రిల్ 29 న తన 74వ ఏట మరణించాడు. ఆయన మరణించే వరకు చురుకుగానే ఉన్నాడు.