చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
copy edit
పంక్తి 100: పంక్తి 100:
==ఇవీ చూడండి==
==ఇవీ చూడండి==
* [[చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం]]
* [[చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం]]
* [[చిలకలూరిపేట మండలం]]

==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

05:27, 31 జనవరి 2022 నాటి కూర్పు

చిలకలూరిపేట
—  పట్టణం  —
చిలకలూరిపేట is located in Andhra Pradesh
చిలకలూరిపేట
చిలకలూరిపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చిలకలూరిపేట
వైశాల్యము [1]
 - మొత్తం 18.13 km² (7 sq mi)
జనాభా (2011)[1]
 - మొత్తం 1,01,398
పిన్ కోడ్ 522 616
ఎస్.టి.డి కోడ్

చిలకలూరిపేట ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక పట్టణం.[2] గుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉంది. గుంటూరు జిల్లాలో నాలుగవ అతిపెద్ద పట్టణం. త్రికోటేశ్వర స్వామి వెలసిన కోటప్ప కొండ ఇక్కడికి 13 కి మీ దూరంలో వుంది.

చరిత్ర

చిలకలూరిపేటను పూర్వం పురుషోత్తమ పట్నం అని, చిలకల తోట అని, రాజాగారి తోట అని, చిలకలూరిపాడు అని, పిలిచే వారు. పురుషోత్తమ పట్నం అనేది ప్రస్తుతం పట్టణ శివారులో ఉన్న ఒక గ్రామం. బ్రిటిషు వారు దీనిని చిక్‌పేట అని పిలిచే వారు. ఇక్కడి పండ్ల తోటల వలన చిలుకలు ఎక్కువగా వచ్చేవి, అందుచేత దీనిని చిలకలూరు అని జమీందార్ల కాలంలో అనేవారు.

ఈ ప్రాంతాన్ని పాలించిన జమిందారులు ప్రజలతో ఉదారంగ ఉండే వారు. పన్ను రాయితీలు ఇస్తూ ప్రజలకు భారం తక్కువగా ఉండేలా చూసేవారు. పిండారీలు చిలకలూరిపేటపై దాడి చేసినపుడు, జమీందార్లు సమర్ధంగా వ్యవహరించి ఆ ముఠాలను వెళ్ళగొట్టారు. 1818లో జమీందార్లు గోపురం గుర్తుతో తమ స్వంత నాణేలను (పగోడాలు) ముద్రించుకున్నారు. వారికి మంచి పరిపాలనా దక్షులుగ ఈష్టిండియా కంపెనీ ప్రభుత్వం నుండి బహుమతి వచ్చింది.

దేవాలయాలు

శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయం: ఈ ఆలయం చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న కొమరవల్లిపాడులో ఉంది. క్రీ.శ. 1712 లో చిలకలూరిపేట జమీందారయిన శ్రీ రాజమానూరి వేంకటకృష్ణరాయణం బహద్దూర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. చిలకలూరిపేట ప్రక్కనే ఉన్న పసుమర్రు గ్రామంలో ఒక మహమ్మదీయుని ఇంటిలో కాకరపాదు త్రవ్వుచుండగా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహం లభించింది. రాజా వారు, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ నిమిత్తం చంఘిజ్ ఖాన్ పేటకు తరలించుచుండగా ఓంకార నది ఒడ్డునగల కొమరవల్లిపాడుకు రాగానే విగ్రహం కదలలేదట. ఆ రాత్రి స్వామివారు జమీందారుగారికి కలలో సాక్షాత్కరించి, అక్కడనే ప్రతిష్ఠించమని కోరగా, అదే విధంగా దైవానుసారం, జమీందారు గారు కొమరవల్లిపాడు లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర కథనం. స్వామివారు వామాంకమున లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని నేత్రపర్వంగా భక్తుల అభీష్టాలు నెరవేర్చుచున్నారని ప్రతీతి.

కళలు

పురుషోత్తమపట్నం ప్రాధాన్యత కలిగిన స్థలం. ఇస్మాయిల్‌ అనే శిల్పి కారణంగా ఈ ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. శిల్పకళను మైలాపూరులో తన గురువైన షణ్ముగాచారి వద్ద నేర్చుకున్న ఈయన ఈ ఊరిలో స్థిరపడ్డాడు. ఆయన చెక్కిన శిల్పాలు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించ బడ్డాయి. ఆయన పేరు "Reference Asia" అనే పుస్తకంలో చేర్చబడింది.

పరిశ్రమలు

పట్టణంలో ధాన్యం మిల్లులు, పత్తి జిన్నింగు మిల్లులు, నూనె మిల్లులు, వాహనాల మరమ్మత్తు సంస్థలున్నాయి. చిలకలూరిపేట వాహన నిర్మాణం, మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు.

ఇవీ చూడండి

మూలాలు

  1. 1.0 1.1 "District Census Handbook - Guntur" (PDF). Census of India. p. 14,46. Retrieved 18 January 2015.
  2. "Adminsistrative divisions of Guntur district" (PDF). guntur.nic.in. Archived from the original (PDF) on 26 జూన్ 2014. Retrieved 16 January 2015.