33,404
దిద్దుబాట్లు
(→జీవిత చరిత్ర: విస్తరణ) ట్యాగు: 2017 source edit |
(→జీవిత చరిత్ర: విస్తరణ) ట్యాగు: 2017 source edit |
||
==జీవిత చరిత్ర==
ఈయన జన్మనామం బండారు ధర్మారావు. ఈయన పూర్వీకులు సైన్యంలో పనిచేశారు. బండారు వంశంలోని లక్ష్మన్న అనే వ్యక్తి సైనికోద్యోగం నుండి తిరిగి వచ్చి తాపీపనిలో స్థిరపడ్డాడు. అందరూ ఆయనను తాపీ లక్ష్మయ్య అని పిలుస్తూ ఉండేవారు. ఆయనకు ఒక కొడుకు. లక్ష్మయ్యకి అప్పన్న అని మనవడు పుట్టాక కొడుకు, కోడలు ఇద్దరూ మరణించారు. దాంతో అప్పన్న శ్రీకాకుళంలో లక్ష్మన్న దగ్గరే పెరిగాడు. లక్ష్మన్నకు మనవడిని బాగా చదివించాలనే కోరిక. కానీ అప్పన్నకు అయిదు సంవత్సరాల వయసులోనే లక్ష్మన్న కూడా మరణించాడు. దాంతో అప్పన్న పోషణ భారమంతా లక్ష్మయ్య భార్యమీద పడింది. అప్పన్నను బళ్ళో చేర్చినపుడు తాపీ లక్ష్మయ్య మనవడు అప్పన్న అని రాశారు. అప్పుడే అతని అసలు ఇంటి పేరైన బండారు మరుగున పడి తాపీ అని మారిపోయింది. అప్పన్న శ్రీకాకుళంలో మెట్రిక్ పూర్తి చేసి మద్రాసులో వైద్యవిద్య నభ్యసించాడు. అప్పన్న మంచి తెలివితేటలతో డాక్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై శ్రీకాకుళానికి తిరిగి వచ్చాడు. అప్పన్న భార్య నరసమ్మ. ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు కలిసి మొత్తం ఐదు మంది సంతానం. వీరిలో రెండవ వాడు ధర్మారావు.
ధర్మారావు [[1887]] సంవత్సరంలో [[సెప్టెంబర్ 19]]న ప్రస్తుతం [[ఒరిస్సా]]లో ఉన్న [[బెర్హంపూరు]] ([[బరంపురం]]) జన్మించాడు.<ref name="జన మాధ్యమాలలో తెలుగు వినియోగం">{{cite news |last1=ప్రజాశక్తి |title=జన మాధ్యమాలలో తెలుగు వినియోగం |url=http://www.prajasakti.com/Content/1687246 |accessdate=19 September 2019 |work=www.prajasakti.com |date=19 September 2015 |archiveurl=https://web.archive.org/web/20150923040329/http://www.prajasakti.com/Content/1687246 |archivedate=23 September 2015 |url-status=live }}</ref> ఈయనను చిన్నప్పుడు ఢిల్లీరావని కూడా పిలిచేవారు. ఈయన ప్రాథమిక విద్యను [[విజయనగరం]]
ధర్మారావుకు 1904 లో దూరపు బంధువు అయిన అన్నపూర్ణమ్మతో వివాహం జరిగింది. అప్పటికి ఆయన మెట్రిక్ ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత ఎఫ్. ఎ చదవడానికి పర్లాకిమిడి వెళ్ళాడు. అది రాజా గారి పోషణలో నడుస్తున్న కళాశాల. అక్కడే గిడుగు రామ్మూర్తి పంతులు చరిత్ర బోధించేవాడు. ఎఫ్. ఎ చదువు తర్వాత తండ్రి సంపాదన అంతంతమాత్రమే కావడం, అన్న వైద్య విద్య ఇంకా పూర్తి కాకుండా ఉండటం వల్ల ఆయన కొన్ని చిరుద్యోగాలు చేయవలసి వచ్చింది. 1906 లో ఒక సంవత్సరం పాటు టెక్కలి, బరంపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగయ్యాక రాజమహేంద్రవరంలో చేరడానికి వెళ్ళాడు కానీ అప్పుడే మద్రాసు నుంచి పచ్చయప్ప కళాశాలలో సీటు వచ్చిందని తండ్రి తెలియజేయగా మిత్రుల సలహా మేరకు మద్రాసు వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. అక్కడ నుంచి 1909 లో బి. ఎ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. మద్రాసు విద్యార్థి దశలో ఉన్నపుడే తమిళ సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని [[శిలప్పదికారం]], [[మణిమేఖలై]], [[కంబ రామాయణం]] లాంటి పుస్తకాలు అధ్యయనం చేశాడు.
ఇతని తొలి రచన [[1911]]లో [[ఆంధ్రులకొక మనవి]] అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతనికి మంచి పేరు ఉంది. [[కొండెగాడు]], [[సమదర్శిని]], [[జనవాణి]], [[కాగడా]] మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను [[1973]] [[మే 8]]న మరణించాడు. [[తెలుగు సినిమా]] దర్శకులు [[తాపీ చాణక్య]] ఇతని కుమారుడు.<ref>{{cite book|last=ఏటుకూరి|first=ప్రసాద్|title=తాపీ ధర్మారావు జీవితం-రచనలు|accessdate=19 March 2015|url=https://archive.org/details/in.ernet.dli.2015.492328}}</ref>
|