కలంకారీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 22: పంక్తి 22:
#సహజ రంగులను అద్దడం
#సహజ రంగులను అద్దడం
==ప్రముఖ కలంకారీ కళాకారులు==
==ప్రముఖ కలంకారీ కళాకారులు==
గురప్ప చెట్టి, దామోదరాచారి, నిరంజన్,


==మూలాలు==
==మూలాలు==

10:12, 14 నవంబరు 2008 నాటి కూర్పు

గీతోపదేశం బాగా జనప్రియమైన చిత్రం. ఇది కలంకారీ శైలిలో వస్త్రంపై అద్దిన చిత్రం.

కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఇది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టింది. పురాతన హరప్పా నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలలో లభించిన ఒక వెండి పాత్ర మీద చిత్రాలు ఉన్న ఒక వస్త్రం ఆధారంగా కలంకారీ కళ చాలా ప్రాచీనమైనదని తెలుస్తోంది. బౌద్ధ ఆరామాలు కూడా ఈ కలంకారీ వస్త్రాలతో అలంకరించే వారు. అలెగ్జాండర్ కూడా కలంకారీ వస్త్రాలను తనతోపాటు తీసుకువెళ్ళాడంటారు. [1]కారీ అనగా హిందీ లేదా ఉర్దూలో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్ మరియు భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు.[2] ఐరోపా వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలుస్తుంటారు. ఉదాహరణకు పోర్చుగీసు వారు దీనిని పింటాడో అని అంటారు. డచ్చి వారు సిట్జ్ అనీ బ్రిటీష్ వారు షింజ్ అనీ పిలుస్తారు. కృష్ణా జిల్లా పెడనలో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్తుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఆర్యవటంలో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.


ఈ కళ శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఉన్న ఆధారాలను బట్టి, 13 మరియు 19వ శతాబ్దాల్లో కోరమాండల్ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది. కాబట్టి దక్కను పీఠభూమికి చెందిన అన్ని ప్రదేశాలలోనూ ఈ కళ విలసిల్లిందని తెలుస్తుంది. పట్టణాన్ని ఆనుకుని ఎల్లప్పుడూ ప్రవహించే సువర్ణముఖీ నదిలో ఈ కళకు ముఖ్యంగా అవసరమైన స్వచ్ఛమైన పారే నీరు లభించటం వలన ఇది ఇక్కడ బాగా ప్రాచుర్యం పొంది ఉండవచ్చు. ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తేశ్వరాలయం పర్యాటకులను, యాత్రుకులను ఆకర్షించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఈ కళ ఎక్కువగా హిందూ సాంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. ఇక్కడగల కళాకారులు ఇప్పటికీ రామాయణము, మహాభారతం, శివ పురాణం మొదలైన వాటిని నుంచి పాత్రలను చిత్రిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

కోరమాండల్ తీరం వెంబడి ఉన్న ముఖ్యమైన మచిలీపట్నం ఓడరేవు ద్వారా ఈ కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ వ్యాపించి ఉండవచ్చు. మచిలీపట్నం ఓడరేవుకు సౌకర్యాలు సరిగా లేకపోయినా గోల్కొండ ప్రభువులతో సంబంధాలు ఉండటంవలన అది ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది. గోల్కొండ ప్రభువులైన కుతుబ్ షాలు కళంకారీ ఉత్పత్తులను ఎక్కువగా కోరే పర్షియన్ వర్తకులతో వ్యాపార సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ఈజిప్టులో కైరో వద్దగల ఫోస్టాట్ అనే ప్రదేశం వద్ద పురాతత్వ శాఖ తవ్వకాలు జరిపే వరకూ భారతదేశంలో వస్త్రాలపై కళాఖండాలను చిత్రించే సంస్కృతి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ తవ్వకాల్లో వివిధ చిత్రాలతో కూడిన్ భారతదేశ నూలు వస్త్రాలు కనిపించాయి. ఈ వస్త్రాలను 18వ శతాబ్దంలో పశ్చిమ తీరం ద్వారా ఆ దేశాలను ఎగుమతి అయిఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.

కలంకారీ ఉత్పత్తులు మార్కెట్ అవసరాలను బట్టి వివిధ రూపాలలో తయారవుతుంటాయి. ప్రార్థనా వస్త్రాలు, దుప్పట్లు, దిండు గలీబులు, ప్రవేశ ద్వార వస్త్రాలు జంతురూపాలు, వివిధ పుష్పాలతో కూడిన డిజైన్లు మొదలైనవి మధ్య ఆసియా మార్కెట్ కోసం తయారు చేస్తే, కుట్టుపనిని పోలి ఉండే జీవమున్న చెట్లు లాంటి డిజైన్లు ఐరోపా మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు. దుస్తులకు అవసరమైన అంచులు, మరియు గోడలకు వేలాడదీయగలిగే చిత్ర పటాలు ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ధరించే వస్త్రాలకు అవసరమయ్యే డిజైన్లు తూర్పు ఆసియాకు ఎగుమతి అవుతుంటాయి.

సుగంధ ద్రవ్యాల వ్యాపారస్థులు వస్తుమార్పిడి పద్దతి ప్రకారం తమ వ్యాపారం కోసం భారతీయ వస్త్రాలను ముఖ్యంగా కళంకారీ వస్త్రాలను వాడేవారు. ముఖ్యంగా ఈ కళంకారిలో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానంలో వాడే రంగులు అన్నీ సహజసిద్ధమైన రంగులే (కూరగాయల నుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏ విధమైన హానీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు) ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారు.

19వ శతాబ్దపు ఈ కళాకారుల్లో ఎక్కువగా బలిజ కులస్తులే ఉండేవారు. వీరు సాంప్రదాయంగా వ్యవసాయంపై మరియు కుటీర పరిశ్రమలపై ఆధారపడి నివసించేవారు. ప్రస్తుతం కాళహస్తి చుట్టు పక్కలా సుమారు మూడు వందలమంది కళాకారులు వస్త్రాలను, రంగులను తయారు చేయడం, మొదలైన కళంకారీకి సంబంధించిన వివిధ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. 20 వ శతాబ్దం మధ్యకు వచ్చేసరికి చాలామంది కళాకారులు వ్యవసాయం వైపు లేదా ఇతర పనుల వైపు మళ్ళడంతో శ్రీకాళహస్తిలో ఈ కళ చివరకు అదృశ్యమయ్యే స్థాయికి చేరుకుంది. 1950లలో కమలా దేవి ఛటోపాధ్యాయ అనే కళా ఉద్యమకారిణి కృషితో ప్రభుత్వం ఈ కళ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి శ్రద్ధ తీసుకోవడంతో పునరుజ్జీవనం పొందింది.

చిత్రించే విధానం

  1. వస్త్రాలను శుభ్రం చేయడం
  2. వెదురు కలాల్ని సిద్ధం చేసుకోవడం
  3. బొగ్గుతో స్కెచ్ గీసుకోవడం
  4. నల్ల రంగుతో బొమ్మలను గీయడం
  5. సహజ రంగులను అద్దడం

ప్రముఖ కలంకారీ కళాకారులు

మూలాలు

  1. "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైటు నుంచి".
  2. "కలంకారీ ఆర్ట్.ఆర్గ్ వెబ్ సైటు నుంచి".
"https://te.wikipedia.org/w/index.php?title=కలంకారీ&oldid=352416" నుండి వెలికితీశారు