భారతీయ జనసంఘ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+ బొమ్మ
పంక్తి 3: పంక్తి 3:
సంక్షిప్తంగా '''జనసంఘ్''' అని పిలువబడే '''భారతీయ జనసంఘ్''' పార్టీ [[1951]]లో [[శ్యాంప్రసాద్ ముఖర్జీ]] చే [[ఢిల్లీ]]లో స్థాపించబడింది. [[1977]]లో ఈ పార్టీని [[జనతా పార్టీ]]లో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన [[అటల్ బిహారీ వాజపేయి]], [[లాల్ కృష్ణ అద్వానీ]] లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. [[1980]]లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు [[భారతీయ జనతా పార్టీ]] స్థాపించారు. ప్రస్తుతం [[భాజపా]] [[భారతదేశం]]లో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.
సంక్షిప్తంగా '''జనసంఘ్''' అని పిలువబడే '''భారతీయ జనసంఘ్''' పార్టీ [[1951]]లో [[శ్యాంప్రసాద్ ముఖర్జీ]] చే [[ఢిల్లీ]]లో స్థాపించబడింది. [[1977]]లో ఈ పార్టీని [[జనతా పార్టీ]]లో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన [[అటల్ బిహారీ వాజపేయి]], [[లాల్ కృష్ణ అద్వానీ]] లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. [[1980]]లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు [[భారతీయ జనతా పార్టీ]] స్థాపించారు. ప్రస్తుతం [[భాజపా]] [[భారతదేశం]]లో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.
==ప్రారంభం==
==ప్రారంభం==
1951 [[అక్టోబర్ 21]]న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశాడు. [[రాష్ట్రీయ స్వయం సేవక్]] భావనలపై ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఎన్నికల చిహ్నంగా [[దీపం]] గుర్తు లభించింది. [[1952]]లో జరిగిన [[పార్లమెంటు]] ఎన్నికలలో ఈ పార్టీకి 3 లోకసభ స్థానాలు లభించాయి. అందులో ఒక స్థానం పార్టీ స్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించినది. [[1967]] తరువాత ఈ పార్టీ బలపడింది.
1951 [[అక్టోబర్ 21]]న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశాడు. [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] భావనలపై ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఎన్నికల చిహ్నంగా [[దీపం]] గుర్తు లభించింది. [[1952]]లో జరిగిన [[పార్లమెంటు]] ఎన్నికలలో ఈ పార్టీకి 3 లోకసభ స్థానాలు లభించాయి. అందులో ఒక స్థానం పార్టీ స్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించినది. [[1967]] తరువాత ఈ పార్టీ బలపడింది.

==హిందూ జాతీయ వాదం==
==హిందూ జాతీయ వాదం==
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఆధారపడిన పార్టీ కావడంతో ఈ పార్టీ హిందూ జాతీయవాద లక్షణాలను కలిగిఉంది. ఈ పార్టీలో ప్రముఖ స్థానాలను కలిగిన నాయకులు కూడా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలే. [[1964]]లో ఏర్పడిన [[విశ్వ హిందూ పరిషత్తు]] ఈ పార్టీకి సన్నిహితంగా ఉంది. [[జవహర్ లాల్ నెహ్రూ]] కాలంలో ఆయన సోషలిస్టు భావనలకు విసుగు చెందిన పలు [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] నేతలు ఈ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. [[రాజస్థాన్]], [[గుజరాత్]], [[మహారాష్ట్ర]], [[మధ్యప్రదేశ్]] మరియు [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రాలలో ఈ పార్టీ ఉనికి నిలుపుకుంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఆధారపడిన పార్టీ కావడంతో ఈ పార్టీ హిందూ జాతీయవాద లక్షణాలను కలిగిఉంది. ఈ పార్టీలో ప్రముఖ స్థానాలను కలిగిన నాయకులు కూడా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలే. [[1964]]లో ఏర్పడిన [[విశ్వ హిందూ పరిషత్తు]] ఈ పార్టీకి సన్నిహితంగా ఉంది. [[జవహర్ లాల్ నెహ్రూ]] కాలంలో ఆయన సోషలిస్టు భావనలకు విసుగు చెందిన పలు [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] నేతలు ఈ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. [[రాజస్థాన్]], [[గుజరాత్]], [[మహారాష్ట్ర]], [[మధ్యప్రదేశ్]] మరియు [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రాలలో ఈ పార్టీ ఉనికి నిలుపుకుంది.

20:34, 3 డిసెంబరు 2008 నాటి కూర్పు

1968 నుండి 1973 వరకు జనసంఘ్ అద్యక్షుడిగా ఉన్న అటల్ బిహారీ వాజపేయి
ప్రముఖ జనసంఘ నేతలలో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీ

సంక్షిప్తంగా జనసంఘ్ అని పిలువబడే భారతీయ జనసంఘ్ పార్టీ 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ చే ఢిల్లీలో స్థాపించబడింది. 1977లో ఈ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. 1980లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు భారతీయ జనతా పార్టీ స్థాపించారు. ప్రస్తుతం భాజపా భారతదేశంలో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.

ప్రారంభం

1951 అక్టోబర్ 21న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఎన్నికల చిహ్నంగా దీపం గుర్తు లభించింది. 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఈ పార్టీకి 3 లోకసభ స్థానాలు లభించాయి. అందులో ఒక స్థానం పార్టీ స్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించినది. 1967 తరువాత ఈ పార్టీ బలపడింది.

హిందూ జాతీయ వాదం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఆధారపడిన పార్టీ కావడంతో ఈ పార్టీ హిందూ జాతీయవాద లక్షణాలను కలిగిఉంది. ఈ పార్టీలో ప్రముఖ స్థానాలను కలిగిన నాయకులు కూడా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలే. 1964లో ఏర్పడిన విశ్వ హిందూ పరిషత్తు ఈ పార్టీకి సన్నిహితంగా ఉంది. జవహర్ లాల్ నెహ్రూ కాలంలో ఆయన సోషలిస్టు భావనలకు విసుగు చెందిన పలు భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతలు ఈ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ పార్టీ ఉనికి నిలుపుకుంది.

దేశంలో అత్యవసర పరిస్థితి కాలం

1975లో దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించడంతో విపక్షాలకు చెందిన పలు నేతలను ఎలాంటి కారణం లేకుండానే జైళ్ళకు తరలించారు. అదే కాలంలో భారతీయ జనసంఘ్ ప్రముఖ నేతలు కూడా జైలుజీవితం గడిపారు. 1977లో అత్యవసరపరిస్థితిని తొలిగించి ఎన్నికలు జరుపడంతో దేశంలో మారిన రాజకీయ సమీకరణాల వలన భారతీయ జనసంఘ్‌తో పాటు భారతీయ లోక్‌దళ్, కాంగ్రెస్ (ఓ), సోషలిస్ట్ పార్టీలు కలిసి ఉమ్మడిగా జనతా పార్టీనిేర్పాటు చేసుకున్నాయి. ఎన్నికలలో ఈ పార్టీ విజయం సాధించడంతో భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా ప్రభుత్వం పేరు సంపాదించినది. మురార్జీ దేశాయ్ నేతృత్వం వహించిన జనతా ప్రభుత్వంలో పూర్వపు జనసంఘ్ నేతలైన అటల్ బిహారీ వాజపేయికి విదేశాంగ మంత్రిత్వ శాఖ లభించగా, లాల్ కృష్ణ అద్వానీకి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ లభించింది.

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం

జనతా ప్రభుత్వం విచ్ఛిన్నం కావడంతో 1980 లోకసభ ఎన్నికల ముందు పూర్వపు భారతీయ జనసంఘ నేతలు జనతా పార్టీ నుండి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజపేయి భాజపాకు తొలి అద్యక్షుడిగా పనిచేశాడు. 1989 తరువాత ఈ పార్టీ బలపడింది. అటల్ బిహారీ వాజపేయి 3 సార్లు ప్రధానమంత్రి పదవిని కూడా చేపట్టినాడు.

మూలాలు