భారతదేశ ఎన్నికల వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనువాదం పూర్తి {{అనువాదం}} తొలగించాను
పంక్తి 1: పంక్తి 1:
: ''జరుగబోవు సార్వత్రిక ఎన్నికల కొరకు చూడండి [[భారత సార్వత్రిక ఎన్నికలు, 2009]].''
: ''జరుగబోవు సార్వత్రిక ఎన్నికల కొరకు చూడండి [[భారత సార్వత్రిక ఎన్నికలు, 2009]].''

{{అనువాదం}}
[[ఎన్నిక]]లు అనగా, సాధారణంగా ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకొని, ఆ ప్రతినిధుల ద్వారా, ప్రభుత్వాన్ని నడుపుటకు ఏర్పరచుకునే విధానము.
[[ఎన్నిక]]లు అనగా, సాధారణంగా ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకొని, ఆ ప్రతినిధుల ద్వారా, ప్రభుత్వాన్ని నడుపుటకు ఏర్పరచుకునే విధానము.



11:56, 30 మే 2009 నాటి కూర్పు

జరుగబోవు సార్వత్రిక ఎన్నికల కొరకు చూడండి భారత సార్వత్రిక ఎన్నికలు, 2009.

ఎన్నికలు అనగా, సాధారణంగా ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకొని, ఆ ప్రతినిధుల ద్వారా, ప్రభుత్వాన్ని నడుపుటకు ఏర్పరచుకునే విధానము.

స్వతంత్ర భారత దేశంలో 'ఎన్నికలు' ప్రజాస్వామ్య విలువలు గట్టిగా పునాదులు వేసుకునే సాంప్రదాయానికి సాక్ష్యాలు.

2004 లో జరిగిన ఎన్నికలలో దాదాపు 67 కోట్ల మంది ఓటర్లు వున్నారు. ఈ సంఖ్య ఐరోపా సమాఖ్యలోగల దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య కన్నా రెట్టింపు సంఖ్య. 1989 ఎన్నికల నిర్వహణ కొరకైన ఖర్చు 300 మిలియన్ డాలర్లు, మరియు పది లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఉపయోగం జరిగినది.[1]. ఓటర్లు మరియు నియోజకవర్గాల సంఖ్య అధికంగా వున్న కారణంగా, ఎన్నికలు అనేక విడతలుగా జరుపుకునే అవసరం వున్నది. 2004 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు 4 విడతలుగా జరిగినది. ఈ విషయాలన్నీ చూడుటకు భారత ఎన్నికల కమీషను వున్నది. ఈ కమీషను రాజకీయ పార్టీలకొరకు "ఎన్నికల నియమాళిని రూపొందిస్తుంది, మరియు ఎన్నికల ఫలితాలను ప్రకటించి, కేంద్ర లేక రాష్ట్ర శాసనాధికారికి జాబితా సమర్పిస్తుంది. ఈ విధానం ద్వారా, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు మార్గం సుగమం అవుతుంది.

భారత్ లో ఎన్నికల విధానము

భారత పార్లమెంటులో రాజ్యాధిపతి లేదా రాష్ట్రపతి మరియు రెండు సభలు వుంటాయి. భారత రాష్ట్రపతి ఐదు సంవత్సరాల కొరకు ఎలక్టోరల్ కాలేజి చే ఎన్నుకోబడుతాడు. ఈ ఎలక్టోరల్ కాలేజిలో ఫెడరల్ మరియు రాష్ట్రాల ప్రతినిధులు వుంటారు. భారత పార్లమెంటు ద్విసభా (బైకామెరల్) విధానాన్ని కలిగి, లోకసభ మరియు రాజ్యసభను కలిగివుంటుంది. లోక్‌సభ లో 545 సభ్యులు వుంటారు. ఈ సభ్యులలో 543 సభ్యులు భారత వోటర్లచే ఐదేండ్ల కొరకు ఎన్నుకోబడుతారు. రాష్ట్రపతిచే ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ సభ్యులు ఎన్నుకోబడుతారు. రాజ్య సభ లో 245 సభ్యులు గలరు, ఇందులో 233 సభ్యులు ఆరేండ్ల కొరకు ఎన్నుకోబడి, ప్రతి రెండేండ్లకు మూడవ వంతు సభ్యులు పదవీ విరమణ పొందే విధానాన్ని కలిగివుంటారు. అలాగే 12 మంది సభ్యులు కళాకారుల, జడ్జీల, క్రీడారంగ, వ్యాపారరంగ మరియు జర్నలిస్టుల మరియు సాధారణ ప్రజల సమూహాల నుండి ఎన్నుకోబడుతారు.

భారతదేశంలో ఎన్నికల చరిత్ర

మొదటి సారిగా ఎన్నికలు 1951 లో, 26 రాష్ట్రాలలో 489 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగాయి. ఆ కాలంలో బహుసంఖ్య నియోజకవర్గాలుండేవి. అనగా ఒక నియోజకవర్గంలో 2 సీట్లు లేదా కొన్నిసార్లు 3 సీట్లు వుండేవి. 1960 లో ఈ విధానాన్ని రద్దుచేశారు.

రాజకీయ పార్టీల చరిత్ర

భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏకఛత్రాధిపత్యానికి 1977 లో మొదటి సారిగా విఘాతం గలిగినది. ఇందిరా గాంధీ నేతృత్వంలో ఈ పార్టీ మొదటిసారిగా ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వున్న అనేక పార్టీలు ఏకమై కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అలాగే 1989 లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (వి.పి.సింగ్) నేతృత్వంలో మరోసారి కాంగ్రెస్ తన సత్తాను మరియు అధికారాన్ని కోల్పోయింది.

1992 లోనూ, తరువాతనూ, ఏకపార్టీ గుత్తాధిపత్యం నశించి, అనేక పార్టీల కూటముల వ్యవస్థ రూపునందుకుంది. ఈ వ్యవస్థలో అనేక పార్టీలు కూటములుగా ఏర్పడి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధానమునకు మార్గము ఏర్పడినది. ఇందులో ప్రాంతీయ పార్టీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తెలుగుదేశం, అన్నా డి.యం.కె. అస్సాం గణపరిషత్, నేషనల్ ఫ్రంట్, లోక్‌దళ్, బహుజనసమాజ్ పార్టీ, లాంటివి ముఖ్యమైనవి.

ప్రస్తుతం, "యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియెన్స్", కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విపక్షం లో "నేషనల్ డెమోక్రటిక్ అలియెన్స్" పార్టీని భాజపా నేతృత్వం వహిస్తున్నది.

భారత ఎన్నికల కమీషను

భారతదేశంలో ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల కమీషను ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కమీషనును భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినది. ఈ ఎన్నికల కమీషను, న్యాయస్థానాలకు అతీతంగా పని చేస్తుంది. కొన్నిసార్లు తానే న్యాయస్థానంగా కూడా పనిచేస్తుంది. ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటర్ల గుర్తింపు కార్డుల విడుదల, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ఫలితాల ప్రకటన మొదలగు కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తుంది.

ఎన్నికల విధానము

ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగాలంటే, దాదాపు ఎన్నికల తతంగం ఒక నెల కాలం పాటు జరుగుతుంది. అవసరమైతే ఇంకొన్నాళ్ళు ఎక్కువనూ తీసుకోవచ్చు. ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితా సవరణలు, క్లెయిములు వగైరా సాధారణ కార్యక్రమాలు జరుగుతాయి. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కు అయినటు వంటి ఓటు హక్కు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు కలిగి వుంటాడు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుట మరియు ఓటు హక్కు పొందుట ప్రతి భారత పౌరుని హక్కు మరియు విధి. సాధారణంగా, ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభంనకు ఓ వారం రోజుల ముందు నుంచే కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

ఎన్నికలకు (పోలింగ్ కు) ముందు

ఎన్నికలకు ముందు, ఎలక్షన్ కమీషన్, ఎన్నికల, నామినేషన్ల, పోలింగ్ మరియు కౌంటింగ్ ల తేదీలను ప్రకటిస్తుంది. అలాగే ఎన్నికల కోడ్ లనూ ప్రకటిస్తుంది. కేంద్రస్థాయిలో కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమీషన్, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరు ఎన్నికలను జరుపుటకు, సజావుగా సాగేందుకు కృషిచేస్తారు.

ఎన్నికల (పోలింగ్) రోజు

ఎన్నికల కేంద్రాలుగా, ప్రభుత్వ భవనాలను, పాఠశాలలను, కళాశాల భవనాలను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామంలో, పట్టణాలలోనూ పాఠశాలలు ప్రజలకు అందుబాటులో వుంటాయి గనుక వీటిని పోలింగు కేంద్రాలుగా వుపయోగిస్తారు. పోలింగు రోజున మద్యపాన దుకాణాలను మూసివేస్తారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు శెలవు ప్రకటిస్తారు. ప్రజలందరూ ఎన్నికలలో పాల్గొను విధంగా ప్రజలకు పిలుపునిస్తారు.

పోలింగు కొరకు, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. పోలింగు అయిన తరువాత, ఈ మెషిన్లను, అత్యంత జాగరూకతతో భద్రపరుస్తారు. పోలింగు రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా, పోలీసువారి సహాయ సహకారాలు వుంటాయి. దొంగవోట్లు పోలవకుండా, బూత్ ఆక్రమణలు లాంటి చర్యలు జరుగకుండా చూస్తారు. ప్రజలందరూ ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకారాన్ని అందిస్తారు. పోలింగ్ బూత్ లలో, పోలింగు సిబ్బందిగా ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను నియమించి, వారి సేవలను పొందుతారు.

ఎన్నికల (పోలింగ్) తరువాత

ఎలక్షన్ అయిన తరువాత, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను, ప్రకటింపబడిన వోట్లలెక్కింపు రోజున తెరచి, వోట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపడుతారు. దీనినీ ఎలక్షన్ కమీషనే నిర్వహిస్తుంది. ఎవరెవరికి ఎన్ని వోట్లు వచ్చాయో ప్రకటిస్తుంది. అలాగే గెలిచినవారినీ ప్రకటిస్తుంది. గెలిచినవారి జాబితాను దేశవ్యాప్తంగా ప్రకటించి, ఆయా జాబితాలను, గవర్నరుకూ, రాష్ట్రపతికీ అందజేయబడుతాయి. ఆతరువాత కార్యక్రమాన్ని, రాష్ట్రపతి కేంద్రస్థాయిలోనూ, గవర్నరు రాష్ట్రస్థాయిలోనూ చేపడుతారు.

వోటరు నమోదు విధానం

ఓటర్లు, తమ తమ మండల రెవెన్యూ కార్యాలయాలలోనూ, తహశీల్‌దారు కార్యాలయాలలోనూ తమ పేర్లు నమోదు చేసుకొన వచ్చును. ఈ ఆఫీసులు ఎలక్టోరల్ ఆఫీసులలాగా పనిచేస్తాయి. అలాగే కొన్ని నగరాలలో 'ఆన్-లైన్' సౌకర్యం ద్వారానూ తమ పేర్లను నమోదు చేసుకొనవచ్చును.

గైరుహాజరు వోటింగ్ (Absentee voting)

ఎవరైనా వోటింగు రోజు గైర్హాజరు ఐనచో వారి వోటు వృధా అవుతుంది. దీని గురించి అనేక తర్జన భర్జనలు జరుగుతూనే వున్నాయి. కానీ భారత్ లో అధికారికంగా "గైర్హాజరు వోటింగు విధాన"మంటూ ఏమీ లేదు.[2]

ఎన్నికల సంస్కరణలు

భారత ఎన్నికల కమీషను ద్వారా ప్రతిపాదింపబడిన ఎన్నికల సంస్కరణలు:

http://eci.gov.in/PROPOSED_ELECTORAL_REFORMS.pdf

ఇతర పఠనాలు

  • Subrata K. Mitra and V.B. Singh. 1999. Democracy and Social Change in India: A Cross-Sectional Analysis of the National Electorate. New Delhi: Sage Publications. ISBN 81-7036-809-X (India HB) ISBN 0-7619-9344-4 (U.S. HB).
  • Subrata K. Mitra, Mike Enskat, Clemens Spiess (eds.). 2004. Political Parties in South Asia. Greenwood: Praeger.
  • Subrata K. Mitra/Mike Enskat/V.B. Singh. 2001. India, in: Nohlen, Dieter (Ed.). Elections in Asia and the Pacific: A Data Handbook. Vol. I. Oxford: Oxford University Press

పాదపీఠికలు

ఇవీ చూడండి

  • 49-O దీనినే సాధారణంగా "ఓటు లేదు" అని వ్యవహరిస్తారు.

బయటి లింకులు