పసునూరు శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
== ==
== ==


== శీర్షిక పాఠ్యం ==
==వృత్తి జీవితం==
==వృత్తి జీవితం==
లా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత 1992లో కొన్ని రోజుల పాటు [[హై కోర్టు]]లో ప్రాక్టీసు చేసినా, అందులో తాను ఇమడలేనని భావించి తన ప్రవృత్తినే వృత్తిగా మార్చుకునేందుకు 1993లో హైదరాబాద్ లోని [[ఆంధ్రభూమి]] దినపత్రికలో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించారు. రెండేళ్ళు ఆంధ్రభూమిలో పని చేసిన తరువాత ఇండియా టుడే తెలుగు పత్రికలో సబ్ ఎడిటర్ గా ఎంపికయ్యారు. 1995 ప్రారంభం నుంచి 2008 నవంబర్ వరకు పధ్నాలుగేళ్ళు [[ఇండియా టుడే]]కు ఎన్నో విశిష్ట కథనాలు అందించి, కవిగానే కాకుండా పాత్రికేయునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2008 నవంబర్ చివరి వారంలో ఆ ఏడాది కొత్తగా ప్రారంభమైన 24 గంటల వార్తా చానల్ హెచ్.ఎం.టి.విలో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు. ప్రస్తుతం హెచ్.ఎం.టి.విలో బాధ్యతాయుతమైన హోదాలో కొనసాగుతున్నారు.
లా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత 1992లో కొన్ని రోజుల పాటు [[హై కోర్టు]]లో ప్రాక్టీసు చేసినా, అందులో తాను ఇమడలేనని భావించి తన ప్రవృత్తినే వృత్తిగా మార్చుకునేందుకు 1993లో హైదరాబాద్ లోని [[ఆంధ్రభూమి]] దినపత్రికలో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించారు. రెండేళ్ళు ఆంధ్రభూమిలో పని చేసిన తరువాత ఇండియా టుడే తెలుగు పత్రికలో సబ్ ఎడిటర్ గా ఎంపికయ్యారు. 1995 ప్రారంభం నుంచి 2008 నవంబర్ వరకు పధ్నాలుగేళ్ళు [[ఇండియా టుడే]]కు ఎన్నో విశిష్ట కథనాలు అందించి, కవిగానే కాకుండా పాత్రికేయునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2008 నవంబర్ చివరి వారంలో ఆ ఏడాది కొత్తగా ప్రారంభమైన 24 గంటల వార్తా చానల్ హెచ్.ఎం.టి.విలో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు. ప్రస్తుతం హెచ్.ఎం.టి.విలో బాధ్యతాయుతమైన హోదాలో కొనసాగుతున్నారు.

14:21, 4 మార్చి 2010 నాటి కూర్పు

పసునూరు శ్రీధర్ బాబు పేరు ఆధునిక తెలుగు కవిత్వావరణంలో సుపరిచితమైన పేరు. ఆయన తొలి కవితా సంకలనం అనేక వచనం 2001లో విడుదలైంది. సాహితీ ప్రియుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ కవితా సంపుటికి అజంతా అవార్డు, రంగినేని స్మారక ట్రస్టు పురస్కారరం, సుమనశ్రీ ఉత్త్మ కవితా సంపుటి అవార్డులు లభించాయి. 1987 నుంచి వివిధ పత్రికల్లో కవిత్వాన్ని ప్రచురించిన శ్రీధర్ బాబు వృత్తిరీత్యా పాత్రికేయుడు.

జననం-బాల్యం

పసునూరు శ్రీధర్ బాబు (Pasunuru Sreedhar Babu) భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నల్లగొండ జిల్లాలోని మోత్కూరులో 1969 జూలై 21న జన్మించారు. ఆయన తండ్రి పసునూరు శ్రీరాములు, తల్లి నర్మదాదేవి. ఉపాధ్యాయుడు, అధ్యాపకులు, ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించిన తండ్రి ఉద్యోగరీత్యా శ్రీధర్ బాబు నల్లగొండ జిల్లాలోని ఉత్తటూరు, మోత్కూరు గ్రామాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. నల్లగొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్ లో ఉన్నత విద్య అభ్యసించారు. నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్ లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదివారు. ఆ తరువాత విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు.

వృత్తి జీవితం

లా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత 1992లో కొన్ని రోజుల పాటు హై కోర్టులో ప్రాక్టీసు చేసినా, అందులో తాను ఇమడలేనని భావించి తన ప్రవృత్తినే వృత్తిగా మార్చుకునేందుకు 1993లో హైదరాబాద్ లోని ఆంధ్రభూమి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించారు. రెండేళ్ళు ఆంధ్రభూమిలో పని చేసిన తరువాత ఇండియా టుడే తెలుగు పత్రికలో సబ్ ఎడిటర్ గా ఎంపికయ్యారు. 1995 ప్రారంభం నుంచి 2008 నవంబర్ వరకు పధ్నాలుగేళ్ళు ఇండియా టుడేకు ఎన్నో విశిష్ట కథనాలు అందించి, కవిగానే కాకుండా పాత్రికేయునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2008 నవంబర్ చివరి వారంలో ఆ ఏడాది కొత్తగా ప్రారంభమైన 24 గంటల వార్తా చానల్ హెచ్.ఎం.టి.విలో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు. ప్రస్తుతం హెచ్.ఎం.టి.విలో బాధ్యతాయుతమైన హోదాలో కొనసాగుతున్నారు.

అనేక వచనం కవితా సంపుటి తరువాత రాసిన కవితలన్నీ పుస్తక రూపంలో వెలుగు చూడాల్సి ఉంది. అనేక వచనంలోని కవితలు, ఆ తరువాత రాసిన కవితలన్నీ [1] ఎప్పటికప్పుడు ప్రత్యక్షమవుతున్నాయి. కవిత్వాభిమానుల ఆదరణతో ఈ బ్లాగు ఆరు నెలల వయసు కూడా రాక ముందే పదివేల హిట్లతో దూసుకుపోతోంది.

మూలాలు

  1. [www.anekavachanam.wordpress.com బ్లాగులో]