గుల్జారీలాల్ నందా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: pnb:گلزاری لال نندہ
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: it:Gulzarilal Nanda
పంక్తి 25: పంక్తి 25:
[[es:Gulzarilal Nanda]]
[[es:Gulzarilal Nanda]]
[[fr:Gulzarilal Nanda]]
[[fr:Gulzarilal Nanda]]
[[it:Gulzarilal Nanda]]
[[mr:गुलझारीलाल नंदा]]
[[mr:गुलझारीलाल नंदा]]
[[pl:Gulzarilal Nanda]]
[[pl:Gulzarilal Nanda]]

15:07, 21 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

గుర్జారీలాల్ నందా

గుర్జారీలాల్ నందా (జూలై 4, 1898 - జనవరి 15, 1998) భారత జాతీయ రాజకీయనాయకుడు. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణము తరువాత. రెండవ సారి 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణము తర్వాత. రెండు సందర్భములలో ఈయన నెల రోజుల లోపే, భారత జాతీయ కాంగ్రేసు కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు. 1997లో ఈయనకు భారత రత్న పురస్కారం లభించింది.

తొలి జీవితము మరియు స్వాతంత్ర్య పోరాటము

నందాజూలై 4, 1898న అవిభాజిత పంజాబ్ ప్రాంతములోని సియాల్‌కోట్ (ప్రస్తుతము పంజాబ్ (పాకిస్తాన్) లో ఉన్నది) లో జన్మించాడు. ఈయన విధ్యాభ్యాసము లాహోర్, ఆగ్రా మరియు అలహాబాద్ లలో జరిగినది. 1920-1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవి పొందాడు. అదే సంవత్సరము సహాయనిరాకరణోద్యమములో చేరాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్టైల్ కార్మిక సంఘము కార్యదర్శి అయ్యి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి జైలు కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు.