త్రినాథ వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
==వ్రత సామగ్రి== |
==వ్రత సామగ్రి== |
||
* తులసీ సహిత విష్ణువు యొక్క బొమ్మ లేదా చిత్ర పటము, |
* తులసీ సహిత విష్ణువు యొక్క బొమ్మ లేదా చిత్ర పటము, |
||
* [[మామిడి |
* [[మామిడి]] ఆకులు |
||
* [[అరటి |
* [[అరటి]]మొక్కలు |
||
* [[కొబ్బరి |
* [[కొబ్బరి]]కాయలు |
||
* [[పండ్లు]] |
|||
* [[పళ్లు]] |
|||
* [[పువ్వులు]] |
* [[పువ్వులు]] |
||
* [[పసుపు]] |
* [[పసుపు]] |
||
* [[కుంకుమ]] |
* [[కుంకుమ]] |
||
* [[గంధం]] |
* [[గంధం]] |
||
* హారతి కర్పూరం |
* హారతి [[కర్పూరం]] |
||
* [[అక్షింతలు]] |
* [[అక్షింతలు]] |
||
* [[అగ్గిపెట్టె]] |
|||
* [[అగ్గిపెట్]]టె |
|||
* అగరు వత్తులు |
* [[అగరు వత్తులు]] |
||
* వస్త్రం |
* [[వస్త్రం]] |
||
* యజ్ఞోపవితములు, |
* యజ్ఞోపవితములు, |
||
* తోరములు (తెల్లని దారమునకు పసుపురాసి 9 వరుసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి, ఈ తోరములను తులసీ సహిత విష్ణునికి పూజచేసి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు) |
* తోరములు (తెల్లని దారమునకు పసుపురాసి 9 వరుసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి, ఈ తోరములను తులసీ సహిత విష్ణునికి పూజచేసి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు) |
||
* ప్రత్యేక నివేదన (పిండి వంటలు) |
* ప్రత్యేక నివేదన (పిండి వంటలు) |
||
==సంక్షిప్తంగా వ్రత శ్లోకం== |
==సంక్షిప్తంగా వ్రత శ్లోకం== |
06:18, 17 నవంబరు 2011 నాటి కూర్పు
త్రినాథ వ్రతకల్పము:
త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతము. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.
వ్రత సామగ్రి
- తులసీ సహిత విష్ణువు యొక్క బొమ్మ లేదా చిత్ర పటము,
- మామిడి ఆకులు
- అరటిమొక్కలు
- కొబ్బరికాయలు
- పండ్లు
- పువ్వులు
- పసుపు
- కుంకుమ
- గంధం
- హారతి కర్పూరం
- అక్షింతలు
- అగ్గిపెట్టె
- అగరు వత్తులు
- వస్త్రం
- యజ్ఞోపవితములు,
- తోరములు (తెల్లని దారమునకు పసుపురాసి 9 వరుసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి, ఈ తోరములను తులసీ సహిత విష్ణునికి పూజచేసి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు)
- ప్రత్యేక నివేదన (పిండి వంటలు)
సంక్షిప్తంగా వ్రత శ్లోకం
సీ|| చిన నాటినుండియు - సిరియన నెరుగని
బీద బాపడొకడు - పెరుగుచుండె
గృహిణి ప్రార్ధన చేత - కూర్మితో గొనియెను
కురుచయై చెలగెడు - గోవునొండు
యా గోవు గానక - యజమాని యొకనాడు
దాని వెదుకబోయి - తాను గాంచె
బ్రహ్మ విష్ణు మహేశ్వ - రాభిధేయు లయిన
దేవతల నొక ప్ర - దేశమందు
గీ|| వారి నధిక భక్తి గొలిచి - వరలనపుడు
అష్ట భోగముల నంది త - నవని వీడె
పూర చరితులౌ దలచు - భూమి జనులు
వారి పూజించి భక్తిరో - బరగవలయు
ప్రార్ధన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే.
ఆచమనం
ఓం కేశవాయ స్వాహాః
ఓం నారాయణాయ స్వాహాః
ఓం మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీ త్రినాథష్టోత్తర శతనామావళి
- ఓం భూతాత్మనే నమః
- ఓం అవ్యయాయ నమః
- ఓం పురుషాయ నమః
- ఓం పరమాత్మాయ నమః
- ఓం బలాయ నమః
- ఓం భూతకృతే నమః
- ఓం శర్వాయ నమః
- ఓం ముకుందాయ నమః
- ఓం అమేయాత్మనే నమః
- ఓం శుభప్రదాయ నమః
- ఓం కృతయే నమః
- ఓం పాపనాశాయ నమః
- ఓం తేజసే నమః
- ఓం గణపతయే నమః
- ఓం యోగాయ నమః
- ఓం దీర్ఘాయ నమః
- ఓం సుతీర్థాయ నమః
- ఓం అవిఘ్నే నమః
- ఓం ప్రాణదాయ నమః
- ఓం మధువే నమః
- ఓం పునర్వసవే నమః
- ఓం మాధవాయ నమః
- ఓం మహాదేవాయ నమః
- ఓం సిద్ధయే నమః
- ఓం శ్రీబలాయ నమః
- ఓం నవనాయకాయ నమః
- ఓం హంసాయ నమః
- ఓం బలినే నమః
- ఓం బలాయ నమః
- ఓం ఆనందదాయ నమః
- ఓం గురవే నమః
- ఓం ఆగమాయ నమః
- ఓం అనలాయ నమః
- ఓం బుద్ధవే నమః
- ఓం పద్మనాభాయ నమః
- ఓం సుఫలాయ నమః
- ఓం జ్ఞానదాయ నమః
- ఓం జ్ఞానినే నమః
- ఓం శశిబింద్వాయ నమః
- ఓం పవనాయ నమః
- ఓం ఖగాయ నమః
- ఓం సర్వవ్యాపినే నమః
- ఓం రామాయ నమః
- ఓం నిధియే నమః
- ఓం సూర్యాయ నమః
- ఓం ధన్వినే నమః
- ఓం అనాదినిధనాయ నమః
- ఓం పవిత్రాయ నమః
- ఓం అణిమాయ నమః
- ఓం పవిత్రే నమః
- ఓం విక్రమాయ నమః
- ఓం కాంతాయ నమః
- ఓం మహేశాయ నమః
- ఓం దేవాయ నమః
- ఓం అనంతాయ నమః
- ఓం మృదవే నమః
- ఓం అక్షయాయ నమః
- ఓం తారాయ నమః
- ఓం హంసాయ నమః
- ఓం వీరాయ నమః
- ఓం ఆదిదేవాయ నమః
- ఓం సులభాయ నమః
- ఓం తారకాయ నమః
- ఓం భాగ్యదాయ నమః
- ఓం ఆధారాయ నమః
- ఓం శూరాయ నమః
- ఓం శౌర్యాయ నమః
- ఓం అనిలాయ నమః
- ఓం శంభవే నమః
- ఓం సుకృతినే నమః
- ఓం తపసే నమః
- ఓం భీమాయ నమః
- ఓం గదాయ నమః
- ఓం కపిలాయ నమః
- ఓం లోహితాయ నమః
- ఓం సమాయ నమః
- ఓం అజాయ నమః
- ఓం వసవే నమః
- ఓం విషమాయ నమః
- ఓం మాయాయ నమః
- ఓం కవయే నమః
- ఓం వేదాంగాయ నమః
- ఓం వామనాయ నమః
- ఓం విశ్వతేజాయ నమః
- ఓం వేద్యాయ నమః
- ఓం సంహారాయ నమః
- ఓం దమనాయ నమః
- ఓం దుష్టద్వంసాయ నమః
- ఓం బంధకాయ నమః
- ఓం మూలాధారాయ నమః
- ఓం అజాయ నమః
- ఓం అజితాయ నమః
- ఓం ఈశానాయ నమః
- ఓం బలపతే నమః
- ఓం మహాదేవాయ నమః
- ఓం సుఖదాయ నమః
- ఓం పరాత్పరాయ నమః
- ఓం క్రూరనాశినే నమః
- ఓం భోగాయ నమః
- ఓం శుభసంధాయ నమః
- ఓం పరాక్రమాయ నమః
- ఓం సతీశాయ నమః
- ఓం సత్పలాయ నమః
- ఓం దేవదేవాయ నమః
- ఓం వాసుదేవాయ నమః
- ఓం బ్రహ్మాయ నమః
- ఓం విష్ణవే నమః
- ఓం మహేశ్వరాయ నమః
- ఓం త్రిమూర్తి స్వరూప శ్రీ త్రినాథదేవాయ నమః
వ్రత కథ
- మధుసూదనుని కధ
భక్తులారా ! మనస్సు నిర్మలంతో వినండి. ఈ త్రినాధుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతము వలె నుండును. శ్రీపురము అను గ్రామము నందు మధుసూదనుడను నొక బ్రాహ్మణుడుండెడివాడు. మిక్కిలి దరిద్రుదగుటచే బిక్ష మెత్తుకుని జీవించే వాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు చాలనందున అ బాలుని శరీరము దిన దినము కృశించు చున్నది. ఆ బాలుడు చిక్క పోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను. "అయ్యా ! నేను చెప్పెడి మాట శ్రద్దగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలు గల ఆవు నొకటి తీసుకోండి " అని చెప్పగా ఆ మాట విని భర్త యేమని చెప్పు చున్నాడంటే 'ఓసీ' నీకు వెర్రి పట్టినదా ? మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చే ఆవు ఏలాగున దొరుకుతుంది ? ధన రత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ? ఎవరికైతే ధన సంపదలు కలిగి యుండునో, వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది . అట్టి వారికే లోకమంతా భయపడతారు. మనవంటి బీదవారిని ఎవరు అడగుతారు. అని బ్రాహ్మణుడు చెప్పెను. బార్య మిగుల దుఃఖించినదై, ఓ బ్రహ్మ దేవుడా ! నీవు మా వంటి బీద వారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించు చుండగా పిల్లవాని ఘోష చూసి ఏమియు తోచక ఆ బ్రాహ్మణుడు చింతా క్రాంతుడై విచారించి, తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి, ఆ వచ్చిన సొమ్ము అయిదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్లి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి, పెనిమిటిని చూచి అయ్యా ! ఈ సొమ్మును తీసుకు వెళ్లి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకు రండని చెప్పినది.
అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామము తిరిగెను. ఇట్లు తిరుగుచూ, పెద్ద భాగ్య వంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను. ధన ధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నియు పాలతో నిండి యున్నవి. దైవ ఘటన మాత్రం మరో విధముగా యున్నది. తన ఆవులలో 'భోదా' అనే ఆవు ఉండెను. అది మిగుల దుష్ట బుద్ధి గలది. బైటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తిని వేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తిని వేయుచుండెను. అది చూచి షావుకారు అతి కోపంతో యేమను చున్నాడంటే "ఇక దీని ముఖము చూడకూడదు. అవును ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చి వేస్తాను" అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో యిట్లనెను. "షావుకారూ! వినండి 50 రూపాయలు ఖరీదు కల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను ఆవూ దూడా రెండిటిని నాకు ఇప్పించండి" అని అనగానే "ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా" అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు "మీరు షావుకార్లు అయి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు" అని అన్నాడు . ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని, తన మదిలో విచారించి తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో, ఈ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా ! అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడచిన తరువాత ఆవు ఎటు పోయినదో కనిపించ లేదు. ప్రొద్దు పోయెడి వేళయినది ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెదక బోయినాడు. వీధుల్లోనూ, సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోను చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడచి వెళ్లి తోటలో ఒక చెట్టును చూచినాడు.
- మధు సూదనునకు త్రినాధ దేవులు దర్శన మిచ్చుట
అది ఒక గొప్ప మర్రి చెట్టు, పైన ముగ్గురు మనుష్యులు కూర్చుని వున్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకుని, లేచి పోవుచుండగా, త్రిమూర్తులు బ్రాహ్మణునితో 'ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది ? నీవు ఎక్కడికి వెళ్లుచున్నావు ? ఆ సంగతి మాతో చెప్పు " మనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి "అయ్యా ! నేను కడు బీదవాడను బిక్ష మెత్తుకుని బ్రతికే వాడను నాకు ఒక ఆవు ఉన్నది. అది కనిపించట్లేదు ఈ దినము శ్రీ పురము సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్లి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంత లోనే అమ్ముతారు గదా ! త్రినాధ స్వాములారా ! ఈ ఉద్దేశ్యముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను." అని తన సంగతి చెప్పెను.
అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు యేమి చెప్పుచున్నారంటే "నీ వేలాగూ సంతకు వెళ్లుచున్నావు కనుక, మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలెను" అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు "యేమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు యిట్లనిరి. ఒక్క పైసా ఆకు చెక్క, ఒక్క పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు యేమని చెప్పు చున్నాడంటే " ఓ త్రిమూర్తులారా ! నాకు పైసాలు ఎక్కడ దొరుకును ? నేను బీదవాడను గదా ? బిక్ష మెత్తుకుని జీవించు చున్నాను." అని అనగా, త్రిమూర్తులు యేమి చెప్పు చున్నారంటే "ఓ బ్రాహ్మణుడా ! విను, అదిగో ఆ గోరంట పొద కనిపించు చున్నది కదా ! దాని మొదట మూడు పైసాలున్నవి" ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్లి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగే సరికి మూడు పైసాలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టు నింకను పైకి లాగు చుండెను అది చూచి త్రినాదులవారు "బ్రాహ్మణుడా ! నీకు వెర్రి పుట్టినదా ? అందులో పైసలు ఇంకా లేవు. ఎంత దొరికినదో అంతే యుండును" అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని, అచ్చట నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాదులు ఇట్లు పలికిరి. "ఓ విప్రుడా ! తిరిగి ఎందుకొచ్చావు" అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించగా నీపై మీద గావంచాలో తెమ్మని త్రినాదులన్నారు. అందులకా బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది ? మీరు జగత్కర్తలు, నాతో కపటంగా చెబుతున్నారు అనగా "ఓయీ ! నీతో కపటంగా చెప్పలేదు. మమ్ము తలుచుకుని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీ పురం సంతలో ప్రవేశించినాడు. వెళ్లి చూడగా ఆవు కనిపించ లేదు .
- త్రినాదుల కరుణచే పై పంచెలో నూనె నిలుచుట
ఆకులు, వక్కలు, గంజాయి తీసుకుని, నూనె కోసం బజారుకెళ్ళి తెలికల వానితో "ఒక్క పైసా నూనె గావంచ లో పోయమన్నాడు అందులకా తెలికలవాడు ఆశ్చర్య పడి , "ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు. అని చెప్పినాడు. అక్కడ నుండి వెళ్లి ఒక ముసలి తెలికలవానిని నూనె అడిగినాడు అంత ముసలివాడు " దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా ఒక్క పైసా నూనె మాత్ర మిమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు తెలికలవాడు " ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు ! వీనిని మోసము చేసి పైసాలు తీసుకుంటాను" అని ఆలోచించి కొలత పాత్ర తిరగ వేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకొని అచట నుండి వెడలిపోయెను .
ఫలశ్రుతి
ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి గ్రుడ్డి తనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యము చెప్పిన యెడల నడ్డి తనము, గ్రుడ్డి తనము కలుగుతుంది. ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను. చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరు వేరుగా పూజించవలెను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను. తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను. మూడు దీపములు వెలిగించి "ఓ త్రినాధ స్వాములారా దయ చేయండి" అని అనవలయును. అంతా సమర్పించి త్రినాధ స్వాములవారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలయును. ప్రసాదము అందరూ పంచుకుని సేవించ వలెను. ఈ విధముగా త్రినాధులను పూజించి తరించండి " అని ఈ కధను సీతా దాసు చెప్పి యున్నారు.
మంగళహారతి
శ్లో || మంగళం భగవాన్ విష్ణు : మంగళం మధుసూదన
మంగళం పుండరీ కాక్ష మంగళం గరుడధ్వజ
నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే
శ్రీ లక్ష్మీ ప్రాణ నాదాయ జగన్నాదాయ మంగళం. ||
దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాధాయ మంగళం.
శ్రీ త్రినాధ మేళా సమాప్తం