టిప్పు సుల్తాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 16: పంక్తి 16:


== సైనిక బాధ్యత మొదలు ==
== సైనిక బాధ్యత మొదలు ==
[[File:Shivaji in action; bazaar art, 1910's.jpg|thumb|150px|పోరాటములో శివాజీ]]
[[File:Shivaji in action; bazaar art, 1910's.jpg|thumb|left|150px|పోరాటములో శివాజీ]]
టిప్పూ సుల్తాన్, అతని తండ్రి హైదర్ ఆలిచే నియమించబడ్డ ఫ్రెంచ్ అధికారుల వద్ద [[యుద్ధవిద్య]]లు అభ్యసించెను. [[1766]]లో తన పదహేనవ యేట తన తండ్రితో కలసి [[మొదటి మైసూరు యుద్ధం]]లో పాల్గొన్నాడు. తన పదహారవ యేట జరిగిన యుద్ధాలలో [[ఆశ్వికదళం]]కు సారధ్యం వహించాడు. [[1775]]-[[1779]] మధ్య జరిగిన [[మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం]]లో తన వీరత్వాన్ని ప్రదర్శించాడు.
టిప్పూ సుల్తాన్, అతని తండ్రి హైదర్ ఆలిచే నియమించబడ్డ ఫ్రెంచ్ అధికారుల వద్ద [[యుద్ధవిద్య]]లు అభ్యసించెను. [[1766]]లో తన పదహేనవ యేట తన తండ్రితో కలసి [[మొదటి మైసూరు యుద్ధం]]లో పాల్గొన్నాడు. తన పదహారవ యేట జరిగిన యుద్ధాలలో [[ఆశ్వికదళం]]కు సారధ్యం వహించాడు. [[1775]]-[[1779]] మధ్య జరిగిన [[మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం]]లో తన వీరత్వాన్ని ప్రదర్శించాడు.



09:04, 12 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

టిప్పు సుల్తాను ముఖచిత్రం, 1792

టిప్పూ సుల్తాన్ (పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలి టిప్పు),మైసూరు పులి (నవంబర్ 20, 1750, దేవనహల్లిమే 4, 1799, శ్రీరంగపట్నం), హైదర్ అలీ అతని రెండవ భార్య ఫాతిమ లేక ఫక్రున్నీసా ల ప్రథమ సంతానం. అతనికి మంచి కవిగా పేరు వుండేది. మతసామరస్యం పాటించెడివాడు. ఫ్రెంచ్ వారి కోరికపై మైసూరులో మొట్టమొదటి చర్చి నిర్మించాడు. అతడికి భాషపై మంచి పట్టు ఉండేది.[1].బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు.

1782 లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి బ్రిటీషువారినీ ఓడించాడు. తండ్రి హైదర్ అలీ అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి రెండో మైసూరు యుద్ధం మంగుళూరు ఒప్పందము) తో ముగిసి 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానమునకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి సల్తనత్ ఎ ఖుదాదాద్ అని పేరు. మూడవ మైసూరు యుద్ధం మరియు నాలుగవ మైసూరు యుద్ధంలో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, 1799న శ్రీరంగపట్టణంను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.

బాల్యం

శ్రీరంగపట్టణం, కర్ణాటకలో టిప్పూ సుల్తాను వేసవిలో విడిదిచేసే మహలు

టిప్పూ సుల్తాను కోలార్ జిల్లా దేవనహల్లిలో జన్మించాడు. ఇది బెంగళూరుకు 45 మైళ్ళ దూరంలో వుంది. అతని తండ్రి హైదర్ అలీ మైసూరును పరిపాలించెడివాడు. అతని తల్లి ఫాతిమా కడప కోట గవర్నరు మొయినుద్దీన్ కుమార్తె.

సైనిక బాధ్యత మొదలు

పోరాటములో శివాజీ

టిప్పూ సుల్తాన్, అతని తండ్రి హైదర్ ఆలిచే నియమించబడ్డ ఫ్రెంచ్ అధికారుల వద్ద యుద్ధవిద్యలు అభ్యసించెను. 1766లో తన పదహేనవ యేట తన తండ్రితో కలసి మొదటి మైసూరు యుద్ధంలో పాల్గొన్నాడు. తన పదహారవ యేట జరిగిన యుద్ధాలలో ఆశ్వికదళంకు సారధ్యం వహించాడు. 1775-1779 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో తన వీరత్వాన్ని ప్రదర్శించాడు.

రాకెట్ల ఉపయోగం

1792, లో లోహపు కవచాలు గల రాకెట్లను (తగ్రఖ్) టిప్పూ సుల్తాన్ తన సైనికాదళంలో విజయవంతంగా ఉపయోగించాడు. బ్రిటిష్ వారితో జరిగిన స్వతంత్ర పోరాటాలలో ప్రముఖమైన మైసూరు యుద్ధాలు లో వీటిని సమర్థవంతంగా ఉపయోగించాడు. వీటి గురించి తెలుసుకొన్న బ్రిటిష్ వారు, తరువాత వీటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకొని, రాకెట్ రంగంలో తమ ప్రయోగాలను ప్రారంభించారు.[2]

టిప్పూసుల్తాను ఖడ్గం,సింహాసనం

మైసూరు బెబ్బులి టిప్పూ సుల్తాన్ ట్రావన్‌కోర్‌కు చెందిన నాయర్లతో యుద్ధములో తన ఖడ్గం పోగొట్టుకొని ఓడిపోయాడు. ట్రావన్‌కోర్ రాజు దానిని ఆర్కాట్ నవాబ్ కు బహూకరించాడు. అటునుండి అది లండన్ చేరింది. 2004లో జరిగిన వేలంలో భారతీయ వ్యాపారవేత్త విజయ్ మాల్య దానిని కొని దాదాపు 200 సంవత్సరాల తరువాత భారతదేశానికి తీసుకువచ్చాడు. టిప్పు సుల్తాన్‌ స్వర్ణమయ సింహాసనం మధ్యలో ఓ వజ్రం పొదిగి ఉంటుంది.ఈస్టిండియా కంపెనీ 1799లో మైసూరును హస్తగతం చేసుకున్న తర్వాత టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని ముక్కలు చేసి పంచుకున్నారు.

టిప్పు సుల్తాన్ - కొన్ని ముఖ్య పాయింట్లు

టిప్పు సుల్తాన్ కోటలో ఉన్న ఈ నీటి సరఫరా మార్గం ద్వారా శత్రువులు కోటలోకి చొరబడి కోటను ముట్టడించారు
టిప్పు సుల్తాన్ కోట ఆవరణలో ఉన్న శ్రీరంగనాధ మందిరం


మూలాలు

  1. Brittlebank, Kate. Tipu Sultan's Search for Legitimacy: Islam and Kingship in a Hindu Domain, Vol 5. Pp. 184. Oxford University Press.
  2. Stephen Leslie (1887) Dictionary of National Biography, Vol.XII, p.9, Macmillan & Co., New York Congreve, Sir William.