మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot:Fixing ఆంధ్రప్రదేశ్ -> ఆంధ్ర ప్రదేశ్ మరియు వాటి వర్గాలను చూపటం
పంక్తి 139: పంక్తి 139:
{{ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}



[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ లోక్‌సభ నియోజక వర్గాలు]]
[[వర్గం:మహబూబ్ నగర్]]
[[వర్గం:మహబూబ్ నగర్]]



15:40, 20 మే 2012 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అంతకు క్రితం ఉన్న ఆలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాలు నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో కల్పబడింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

నియోజకవర్గపు గణాంకాలు

  • 2001 లెక్కల ప్రకారము నియోజకవర్గపు జనాభా: 17,41,848.
  • ఓటర్ల సంఖ్య: 13,05,702.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 15.12% మరియు 7.70%

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
మొదటి 1952-57 పి.రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్
1952-57 కె.జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
రెండవ 1957-62 జే.రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్
1957-62 పి.రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 జే.బి.ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 జే.రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 జే.బి.ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్
ఆరవ 1977-80 జే.రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 ఎస్.జైపాల్‌రెడ్డి జనత పార్టీ
తొమ్మిదవ 1989-91 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 1996-98 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ 1998-99 ఎస్.జైపాల్‌రెడ్డి జనత పార్టీ
పదమూడవ 1999-04 జితేందర్‌రెడ్డి భారతీయ జనతా పార్టీ
పదునాల్గవ 2004-09 దేవరకొండ విఠల్ రావు భారత జాతీయ కాంగ్రెస్
15వ లోక్‌సభ 2009- కె.చంద్ర శేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి

2004 ఎన్నికలు

2004లో జరిగిన 14 వ లోక్‌సభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్‌రావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. అంతకు పూర్వం 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భాజపా అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం మద్దతుతో ఎన్నికయ్యాడు.

2004 ఎన్నికలలో అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు
డి.విఠల్ రావు కాంగ్రెస్ పార్టీ 4,28,764
ఎల్కోటి యెల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ 3,80,857
గుండాల విజయలక్ష్మి 25,842
జి.రామచంద్రయ్య బహుజన్ సమాజ్ పార్టీ 18,304

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ 2004లో విజయం సాధించిన డి.విఠల్ రావు పోటీ చేయగా[1] మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కె.చంద్ర శేఖర్ రావు పోటీచేశాడు. హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో తెరాస అధ్యక్షుడు కె.సి.ఆర్. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన విఠల్ రావుపై 20,184 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009