భారత సైనిక దళం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: or:ଭାରତୀୟ ସ୍ଥଳସେନା
పంక్తి 113: పంక్తి 113:
[[it:Bhāratīya Thalsēnā]]
[[it:Bhāratīya Thalsēnā]]
[[mr:भारतीय लष्कर]]
[[mr:भारतीय लष्कर]]
[[or:ଭାରତୀୟ ସ୍ଥଳସେନା]]
[[pt:Exército da Índia]]
[[pt:Exército da Índia]]

14:49, 11 జూన్ 2012 నాటి కూర్పు

భారత సైనిక దళ చిహ్నం

భారత రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత సైనిక దళం (ఇండియన్ ఆర్మీ) ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అనగా ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. కొన్ని దేశాలో ఉన్న ప్రతి యువకుడు తప్పనిసరిగా ఆర్మీలో పని చేయాలన్న నియమం భారత దేశంలో లేదు. స్వచ్ఛదంగా ఆసక్తికలవారు మాత్రమే ఆర్మీలో చేరవచ్చు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఎన్నో కార్యకలాపాలలో, ముఖ్యముగా శాంతి పరిరక్షణలో భారత సైనిక దళం పాలు పంచుకొంది.

అగ్ని-II క్షిపణి

చరిత్ర

బ్రిటిష్ ఇండియన్ సైన్యంలోని ఒక సిపాయి-ది గ్రేట్ రౌండ్ వరల్డ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్ అను పుస్తకం లోనిది

1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు అప్పటివరకు ఉన్న బ్రిటీష్ ఇండియన్ ఆర్మీని భారత్, పాకిస్తాన్‌ల కోసం రెండు భాగాలు చేసారు. అప్పుడే భారత సైన్యానికి "ఇండియన్ ఆర్మీ" అని పేరు పెట్టబడింది.

ఒక క్యాంపులో 39వ బెంగాల్ కు చెందిన సైనికులు

మొదటి కాశ్మీర్ యుద్దం

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర్య రాజ్యమయిన కాశ్మీర్‌ను పాలిస్తున్న మహరాజు ఇటు భారత దేశంలో లేదా అటు పాకిస్తాన్‌లో విలీనానికి అంగీకరించలేదు. కొద్ది రోజులకు పాకిస్తాన్ చొరబాటుదారులను కాశ్మీరుకు పంపి ఊళ్ళను ఆక్రమించుకోసాగింది. మరి కొద్దిరోజులను తన సైన్యాన్ని పంపి కాశ్మీరును ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నపుడు మహరాజు భారత ప్రభుత్వాన్ని శరణు కోరి భారత దేశంలో కాశ్మీర్‌ను విలీనం చేయడానికి అంగీకరించి ఒప్పందం చేసాడు. అప్పుడు భారత ప్రభుత్వం జనరల్ తిమ్మయ్య నేతృత్వంలో సైన్యాన్ని పంపి పాకిస్తాన్ సైన్యాన్ని కాశ్మీర్‌నుండి వెళ్ళగొట్టసాగింది. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభించి సరిహద్దు రేఖను నిర్ణయించడంతో వివాదానికి తెరపడింది.

హైదరాబాద్ విమోచనం

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాదును పాలిస్తున్న నిజాం హైదరాబాదును ప్రత్యేక స్వతంత్ర్య రాష్ట్రంగా గుర్తించాలని భారతదేశంలో విలీనం చేయడానికి అంగీకరించలేదు. చిన్న రాజ్యాలను భారత దేశంలో విలీనం చేయడంలో సమర్థుడయిన అప్పటి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల అనుసారం భారత సైన్యం హైదరాబాద్‌ను చుట్టు ముట్టింది. రజాకార్ల సైన్యం భారత సైన్యం ముందు నిలువలేక 5 రోజుల్లో చిత్తుగా ఓడిపోయింది. మరుసటి రోజు నిజాం హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు.

గోవా, డామన్-డయ్యు ఆపరేషన్

బ్రిటీష్, ఫ్రెంచ్ సైన్యాలు భారతదేశాన్ని విడిచి వెళ్ళినా, పోర్చుగీసు సైన్యం విడిచి వెళ్ళక గోవా, డామన్ డయ్యులను తన ఆధీనంలో ఉంచుకున్నది. పోర్చుగీస్ అధికారులు చర్చలకు అంగీకరించకపోవడంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ పేరుతో సైన్యాన్ని పంపింది. భారత సైన్యాన్ని తట్టుకొనలేక పోర్చుగల్ దేశం భారతదేశంతో సంధికి ఒప్పుకొని అన్ని ప్రాంతాలను విడిచి వెళ్ళేందుకు అంగీకరించింది.

భారత్ పాక్ యుద్దం 1965

దస్త్రం:18Cav on move.jpg
1965 యుద్దంలో ముందుకు వెళ్తున్న భారత యుద్ద ట్యాంకులు

చైనాతో జరిగిన యుద్దంలో ఓడిపోయిన భారత్ మరో యుద్దానికి సిద్దం కాలేదు, కాశ్మీర్ ప్రజలు పాకిస్తానుకు మద్దతు ఇస్తారు అన్న అపోహలతో 1965లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తన సైన్యాన్ని పంపి కాశ్మీర్‌ను ఆక్రమించుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యుద్దంలోనే అత్యధికంగా యుద్ద ట్యాంకులను ఉపయోగించారు. భారత ఆర్మీ హోరాహోరీగా పోరాడి అందుబాటులో ఉన్న యుద్దం ట్యాంకులన్నీ వినియోగించి పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. భారత్ 128 ట్యాంకులను నష్టపోయింది. 150 పాక్ ట్యాంకులను ధ్వంసం చేసి 152 ట్యాంకులను చేజిక్కించుకొంది. తాష్కెంట్‌లో లాల్ బహదూర్ శాస్త్రి - అయూబ్ ఖాన్‌ల మధ్య జరిగిన సంధితో ఈ యుద్దం ముగిసింది.

భారత్ పాక్ యుద్దం 1971

1971లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లో జరిగిన తిరుగుబాటుతో దాదాపు కోటి మంది శరణార్థులు భారతదేశాని రావడంతో భారత్-పాక్ యుద్దం మొదలయింది. తూర్పు పాకిస్తాన్‌కు పశ్చిమ పాకిస్తాన్ నుండి విమోచన కల్పించడం భారత్‌కు అన్ని విధాలా శ్రేయస్కరమయింది. తన బలగాలన్నిటినీ పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) వైపే గురి పెట్టగలిగింది. భారత సైన్యం జనరల్ అరోరా నేతృత్వంలో పాక్ సైన్యాన్ని లాహోర్ వరకు తరిమి కొట్టి 90,000 యుద్ద ఖైదీలను పట్టుకొంది. పాక్ ఓటమిని అంగీకరించడంతో ఈ యుద్దం ముగిసింది.

కార్గిల్ యుద్ధం

ప్రతికూల వాతవరణ పరిస్థితుల వల్ల భారత్ తన సైన్యాన్ని కొన్ని హిమాలయ ప్రాంతాల్లో నుండి వెనక్కు రప్పించిన కొద్ది రోజులకు 1999లో పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపి తీవ్రవాదులతో కలసి ఆ ప్రాంతాలు ఆక్రమించుకుంది. నెమ్మదిగా కీలకమయిన బటాలిక్, ద్రాస్ మరియు టైగర్ హిల్‌లను ఆక్రమించుకోవడంతో భారత్ 2,00,000 మంది సైన్యాన్ని సిద్దం చేసింది. కార్గిల్ యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకున్న పరిమితులవల్ల 30,000 మంది మాత్రమే పాల్గొన్నారు. సైన్యం అనేక కీలక పర్వతాలలో, చెక్ పోస్టుల వద్ద ఉన్న తీవ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొని రెండు నెలల్లో అన్నింటినీ స్వాధీనం చేసుకుంది.

వర్గీకరణ

  • డివిజన్: మేజర్ జనరల్ ఆధ్వర్యం వహించే ప్రతి డివిజన్‌లో 15,000 మంది యుద్దవిద్యల్లో ఆరితేరినవారు, 8,000 వారికి సహాయకులు ఉంటారు. ప్రస్తుతం ఆర్మీలో 34 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్‌లో కొన్ని బ్రిగేడ్‌లు ఉంటాయి.
  • బ్రిగేడ్: ప్రతి బ్రిగేడ్‌లో 4,000-5,000 మంది సైనికులు ఉంటారు. బ్రిగేడ్ అధికారిని బ్రిగేడియర్ అని పిలుస్తారు. ప్రతి బ్రిగేడ్‌లో కొన్ని బెటాలియన్‌లు ఉంటాయి
  • బెటాలియన్: కల్నల్ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించే ప్రతి బెటాలియన్‌లో 900 కంటే ఎక్కువమంది సైనికులు పనిచేస్తుంటారు.
  • కంపెనీ: మేజర్ ఆధ్వర్యంలో పనిచేసే కంపెనీలో 120 సైనికులు ఉంటారు.
  • ప్లటూన్: 32 మంది సైనికులు కల దీనికి లెఫ్ట్‌నెంట్ అధికారి.
  • సెక్షన్: హవల్దార్ లేదా సార్జంట్ నాయకత్వం వహించే సెక్షన్‌లో 10 మంది సైనికులు ఉంటారు.

ప్రస్తుత ఆర్మీలోని కొన్ని విభాగాలు:

  • 4 రాపిడ్ డివిజన్లు
  • 18 ఇన్‌ఫాంట్రీ డివిజన్లు
  • 10 మౌంటైన్ డివిజన్లు
  • 2 ఫిరంగి డివిజన్లు
  • 6 ఎయిర్ డిఫెన్స్ బ్రిగేడులు
  • 1 పేరాచూట్ బ్రిగేడ్
  • 4 ఇంజనీర్ బ్రిగేడులు
  • 14 హెలికాప్టర్ యూనిట్లు
  • 63 ట్యాంక్ రెజిమెంట్లు
  • 200 ఫిరంగి రెజిమెంట్లు

గణాంకాలు

విధులు నిర్వర్తిస్తున్న సైన్యం - 13,00,000
రిజర్వ్ సైన్యం - 12,00,000
ప్రధాన యుద్ద ట్యాంకులు - 5000+
ఫిరంగులు - 12,800
బాల్లిస్టిక్ మిస్సైళ్ళు - 100
ఎయిర్ మిస్సైళ్ళు - 90,000+
యుద్ద విమానాలు/వాహకాలు - 1130

యుద్ద ట్యాంకులు

భారత సైనిక దళ ప్రధాన ఆయుధం యుద్ద ట్యాంకు. అందులో కొన్ని:

T-90 భీష్మ ట్యాంకు

అర్జున్ MBT

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో DRDO తయారు చేసిన ట్యాంకు ఇది. మహాభారతంలో వీరుడయిన అర్జునుడి పేరు దీనికి పెట్టబడింది. చెన్నై వద్దనున్న ఆవడిలో భారత ప్రభుతానికి చెందిన భారీ వాహనాలను నిర్మించే ఫ్యాక్టరీలో ఈ ట్యాంకుకు సంబంధించిన పరికరాలు తయారు చేస్తారు. మొత్తం లక్ష్యంగా పెట్టుకున్న 124 ట్యాంకుల్లో ఇప్పటికే 15 ట్యాంకుల నిర్మాణం పూర్తి అయి ఆర్మీ వాటిని వినియోగిస్తున్నది. మిగిలిన 109 నాలుగేళ్ళలో ఆర్మీలో పూర్తిస్థాయిలో పాల్గొంటాయి.
విలువ: 14 కోట్ల రూపాయలు. బరువు: 58.5 టన్నులు. పొడవు: 10.638. సిబ్బంది: 4. వేగం: 72 కిమీ/గం

T-90 భీష్మ

అర్జున ట్యాంకుల నిర్మాణంలో జాప్యం జరగడం, నిర్మాణంలో ఉన్న T-72 ట్యాంకుల నిర్మాణానికి T-90 ట్యాంకుల నిర్మాణం ఉపయోగకరంగా ఉండడం, అప్పటికే పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటున్న T-80 ట్యాంకులకు సరిసమానయిన ట్యాంకులను సమకూర్చుకోవడం మొదలయిన కారణాల వల్ల 2001 రష్యా నుండి 310 ట్యాంకులను కొనుగోలు చేసారు. 2006లో మరో 1,000 ట్యాంకులను స్వదేశంలో తాయారు చేయవలసినదిగా రక్షణశాఖ 10,000 కోట్ల రూపాయల ఆర్డరును ఇచ్చింది. 2 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ ట్యాంకులో నిమిషానికి 210 రౌండ్లను ప్రయోగించగల సదుపాయమున్నది.
బరువు: 46.5 టన్నులు. పొడవు: 9.54 మీటర్లు. సిబ్బంది: 3. వేగం: 65 కిమీ/గం

క్షిపణులు

ఆకాశ్ క్షిపణి

ఆకాశ్

ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించగలిగే ఆకాశ్ మిస్సైల్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మింపబడినది. ఇది తాను ఉన్న చోటినుండి 30 కిమీ దూరంలో ఉన్నవాటిని నిరోధించగలదు. దీని బరువు 720 కేజీలు, పొడవు 5.8 మీటర్లు. DRDO తయారు చేసిన ఆకాశ్ మిస్సైళ్ళను భారత ఆర్మీ డిసెంబరు 2007లో పరీక్షించింది. పదిరోజులపాటు జరిగిన ఈ పరీక్షలలో అన్నిసార్లూ ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేధించింది. ఈ క్షిపణి శక్తి తెలుసుకొన్న మలేషియా ఇవి కొనుగోలు చేయుటకు ఆసక్తి చూపుతున్నది.

బ్రహ్మోస్

ఇది భారత్-రష్యాలు సమ్యుక్తంగా నిర్మించిన క్షిపణి. భారతీయ నది అయిన బ్రహ్మపుత్ర, రష్యా నది అయిన మొస్క్వా ల పేర్లను కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. 290 కిలోమీటర్ల దూరంలోపు 10 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న వాటిని కూడా ఈ క్షిపణి ధ్వంసం చేయగలదు. రాబోవు పదేళ్ళలో మరో 1,000 బ్రహ్మోస్ సూపర్‌సానిక్ మిస్సైళ్ళను నిర్మించడానికి భారత రక్షణ శాఖ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.

పృథ్వి

పృథ్వి క్షిపణి పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడిన మొట్ట మొదటి క్షిపణి. 1983లో మొదలు పెట్టిన ఈ క్షిపణి నిర్మాణం 1988లో పూర్తయింది. ఇది 150-300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

అగ్ని

కార్గిల్ యుద్దం తర్వాత పాకిస్తాన్‌ను దృష్టిలో పెట్టుకొని కేవలం 18 నెలల్లో DRDO అగ్ని క్షిపణిని తయారు చేసింది. ప్రస్తుతం ఇందులో మూడు రకాల క్షిపణులు ఉన్నాయి.
అగ్ని I: పొడవు - 15 మీ. రేంజ్ - 850 కిమీ.
అగ్ని II: పొడవు - 20 మీ రేంజ్ - 3300-4800 కిమీ.
అగ్ని III: పొడవు - 15 మీ రేంజ్ - 3500-5500 కిమీ.

బొమ్మలు


బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.