శారదా పీఠం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: ks:شاردا پیٹھ తొలగిస్తున్నది: hi:शारदा-पीठ (deleted)
పంక్తి 26: పంక్తి 26:


[[en:Sharada Peeth]]
[[en:Sharada Peeth]]
[[ks:شاردا پیٹھ]]
[[hi:शारदा-पीठ]]
[[sa:शारदा-पीठम्]]
[[sa:शारदा-पीठम्]]

00:41, 14 అక్టోబరు 2012 నాటి కూర్పు

శారదా పీఠం, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతీ దేవి శక్తిపీఠం వద్ద ఉండేది. నీలం నదిని భారతదేశంలో కిషన్‌గంగ అని పిలుస్తారు. అయితే, ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప మరేమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉన్నది. ఇక్కడ షీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు.


ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు; హిందూ, బౌద్ధ ధర్మాలకూ నిలయంగా ఉండేది.

ఇక్కడి శారదా దేవినే, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతీ దేవిగా కొలుస్తారు. ఇక్కడి శారదాదేవి లేదా సరస్వతీ దేవికి చెందిన స్తోత్రం

                                             జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
                                           మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ 

ప్రస్తుత స్థితి

దస్త్రం:Sarada temple POK.jpg
శారద ఆలయం

ప్రస్తుతం ఈ పీఠం, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది కాశ్మీరీ పండితులు ఆలయ సందర్శనకీ, మరమ్మత్తులకీ అనుమతినివ్వమని ఇటు భారతదేశానికీ, జమ్మూ ‍కాశ్మీరుకీ; అటు పాకిస్తాన్ కీ, ఆజాదు కాశ్మీరుకీ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. [1]

బయటి లంకెలు

మూలాలు

  1. "Discuss opening of Sharda Peeth in PaK during talks: APMCC". greaterkashmir. Srinagar, India. June 18 2011. {{cite news}}: Check date values in: |date= (help)