గౌతమ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (బాటు: sk:Gautama Budha వర్గాన్ని sk:Siddhártha Gautama Buddhaకి మార్చింది; పైపై మార్పులు
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: io:Budo
పంక్తి 165: పంక్తి 165:
[[id:Siddhartha Gautama]]
[[id:Siddhartha Gautama]]
[[ilo:Sidarta Gautama Buddha]]
[[ilo:Sidarta Gautama Buddha]]
[[io:Budo]]
[[is:Gautama Búdda]]
[[is:Gautama Búdda]]
[[it:Gautama Buddha]]
[[it:Gautama Buddha]]

02:33, 25 నవంబరు 2012 నాటి కూర్పు


నిలబడియున్న బుద్ధుని శిల్పము, ఒకప్పటి గాంధార, ఉత్తర పాకిస్తాన్, క్రీ.పూ. 1వ శతాబ్దం.

సిద్ధార్థ గౌతముడు (సంస్కృతం; పాళి: సిద్దర్ధ గౌతమ) నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు మరియు బౌద్ధ ధర్మానికి మూల కారకులు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు: 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు. మిగతా లెఖ్ఖలను ఇంకా అత్యధికుల ఆమోదించలేదు.

గౌతముడిని శాక్య ముని అని కూడా పిలుస్తారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు మరియు భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్ని ఆయన మరణం తరువాత సంఘముచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదట, నోటి మాటగా బోధింపబడినా, దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత త్రిపీటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజింపబడి భద్రపరిచారు.

బుద్ధుని జీవితము

బుద్ధుని జీవితములో, కేవలం కొన్ని వివరములు మాత్రమే నిర్ధారించగలము, మిగతా వాటి చారిత్రకతకు ఆధారాలు కష్టమే. బౌద్ధ సాహిత్యం నుండి మనకు లభించు వివరములే ఎక్కువ. క్లుప్తంగా క్రింద వివరించబడినవి.

(2-3వ శతాబ్ధం) సిద్ధార్థుని జననం.

బుద్ధుడు మరియు అతని శిష్యులు, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు బుద్ధుని బోధనలను చర్చించి ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరచి ప్రచారం చెయ్యడానికి బుద్ధుని నిర్యాణం తర్వాత ఒక సంఘం ఏర్పడింది. ఒక శతాబ్దం తర్వాత ఇంకో సంఘం ఏర్పడింది. ఈ రెండు సంఘాలు బుద్ధుని బోధనలను ప్రచారం చేయసాగాయి. ఈ సంఘాలు బుద్ధుని బోధనలను, వేర్వేరు భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో బౌద్ధ భిక్షువుకు అప్పగించాయి. అప్పటి నుంచి బుద్దుని బోధనలు ముఖస్థంగా ప్రచారం కాసాగాయి. చరిత్ర ప్రకారం బుద్ధుని బోధనలను, రెండవ సంఘం ఏర్పడినప్పుడు గానీ, లేదా తర్వాత కొద్ది కాలానికి గానీ ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయి. కానీ, ఈ బోధనలు బుద్ధుని నిర్యాణానంతరం, మూడు, నాలుగు శతాబ్దాల వరకు ఎక్కడా గ్రంధస్థం చెయ్యబడలేదు. ఈ సమయంలో బౌద్ధ బిక్షువులు, గౌతమ బుద్ధుని జీవితాన్ని మరింత గొప్పగా మలచడానికి, అతని చరిత్రను, బోధనలను, మార్చడం గానీ, లేదా కొత్త విషయాలను జోడించడం గానీ చేసిఉండవచ్చునని కొందరి అభిప్రాయం.

ప్రాచీన భారతీయులు కాలక్రమము కన్నా తత్వశాస్త్రమునకే ప్రాముఖ్యతనిచ్చేవారు. అందువల్ల బౌద్ధ మత గ్రంధాలలో కూడా, శాక్యముని జీవిత చరిత్ర కన్నా ఆయన బోధనలకే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ గ్రంధాలలో ప్రాచీన భారతీయ నాగరికత మరియు జీవన విధానం వివరించబడింది.

బుద్ధుని జననం

సిద్ధార్ధుడు కపిలవస్తు దేశానికీ చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగొళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది. గౌతమ అనునది సిద్ధార్ధుని ఇంటి పేరు కాదు సిద్ధార్ధుని పెంచిన తల్లి గౌతమి. అందుకు గాను అతనికి ఆ పేరు వచ్చింది. తండ్రి శుద్దోధనుడు, తల్లిమహామాయ (మాయాదేవి, కోళియన్ దేశపు రాకుమారి). సిద్దార్డుడు గర్భమందున్నప్పుడు, మాయాదేవి, ఒక ఆరు దంతముల ఏనుగు తన గర్భములోకి కుడి వైపు నుండి ప్రవేశించినట్లుగా ఒక స్వప్నమందు దర్శించినది. అది జరిగిన పది చంద్ర మాసముల తర్వాత సిద్ధార్డుడు జన్మించెను. శాక్యవంశాచారము ప్రకారం, గర్భావతిగానున్న మాయాదేవి, ప్రసవానికి తన తండ్రిగారింటికి బయలుదేరింది. కానీ మార్గమధ్యంలో, లుంబిని అనే ప్రాంతంలో ఒక సాలవృక్షం క్రింద ఒక మగ బిడ్డను ప్రసవించినది.

అనేక ఆధారాలను బట్టి, ప్రసవ సమయంలోగాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గానీ మాయాదేవి మరణించినదని తెలుస్తుంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధర్దుడనే నామకరణం చేశారు. సిద్ధార్దుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్ధం. సిద్దార్దుడు జన్మించిన ఐదవ దినము నాడు, అతనికి నామకరణం చేసి, అతని భవిష్యత్తుని చెప్పమని, ఎనిమిది మంది జ్యోతిష్కులని శుద్దోధనుడు ఆహ్వానించెను. వారిలో కౌండిన్యుడనే పండితుడు, సిద్దార్దుడు భవిష్యత్తులో, బుద్ధుడవుతాడని జ్యోస్యం చెప్పెను. అప్పటి చరిత్ర, ఆచారాలను బట్టి చూస్తే, శుద్దోధనుడు, సూర్య వంశపు రాజైన ఇక్ష్వాకుని వారసుడని తెలియుచున్నది. కానీ కొందరు చరిత్ర కారుల ప్రకారం శుద్దోధనుడు ఒక ఆటవిక తెగ నాయకుడు.

బాల్య జీవితము మరియు వివాహము

సిద్ధార్దుడు బాల్యం నుంచి రాకుమరుడిగా విలాసవంతమైన జీవితం గడిపాడు. శుద్దోధనుడు, సిద్ధార్దుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతడికి ఎలాంటి తాత్విక విషయాలు గాని, సామాన్య ప్రజల కష్టసుఖాలు గాని తెలియకుండా పెంచాడు. సిద్ధార్దుడు తన పినతల్లి అయిన మహా పజాపతి పెంపకంలో పెరిగాడు.

సిద్దార్డునకు ౧౬ ఏండ్ల ప్రాయము వచ్చేసరికి యశోధరతో వివాహమయ్యింది. వీరికి రాహులుడనే కుమారుడు పుట్టాడు. ఈ విధంగా సిద్దార్డు ౨౯ ఏళ్ల వరకు రాజభోగాలను అనుభవించాడు. మహారాజు శుద్దోధనుడు, తన కుమారునకు కావలసిన రాజభోగాలనన్నింటినీ సమకూర్చినప్పటికీ, సిద్ధార్దుడు ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని భావిస్తూ ఉండేవాడు.

రాజ భోగాలనుంచి నిష్క్రమణ మరియు సన్యాసి జీవితం

ఈ చిత్రంలొ సిద్దార్దుడు తన అంత్తపురాని మరియు రాజ భోగాల వద్దలి పరివ్రాజక జీవితం గడపడానికి బయలుదేరాడు. అతనితొపాటు రాజభటులు, మీతుణా ప్రేమజంటలు, దేవతలను కుడ కనబడతారు

సిద్దార్డునకు ఐహిక ప్రపంచపు కష్ట్టసుఖాలు తెలియకూడదని శుద్దోధనుడు ఎంత ప్రయత్నించినా, తన ౨౯వ ఏట, ఒక రోజు సిద్ధర్డుడు, ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగ పిడితుడ్ని, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రధ సారధి ఛన్న(చెన్నుడు) ద్వారా, ప్రతి మానవుడూ ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది, ముసలితనాన్నీ, రోగాన్నీ, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడప నిశ్చయించాడు.

అప్పుడు సిద్ధార్దుడు పరివ్రాజక జీవితం గడపడానికి, తన రధ సారధి ఛన్న సహాయంతో, ఒకనాడు రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. ఈ విధంగా ఒక బోధిసత్వుని నిష్క్రమణ అతని భటులకు తెలియకుండా ఉండడానికి, అతని గుర్రపు డెక్కల చప్పుడు దేవతలచే అపబడిందని చెప్తారు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ(మహాభినిష్క్రమణ) (ది గ్రేట్ డిపార్చర్) అని అంటారు.

సిద్ధార్దుడు తన సన్యాసి జీవితాన్ని రాజగహ(మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం)లో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసార మహారాజ సేవకులు, సిద్దార్డుని గుర్తించడంతో, బింబిసారుడు, సిద్ధార్దుని అన్వేషణకు కారణం తెలుసుకుని, అతనికి తన సింహాసనాన్ని (మహారాజ పదవిని) బహుకరించాడు. కాని సిద్ధర్డుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ, తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు.

తర్వాత సిద్ధార్దుడు, రాజగహను విడిచిపెట్టి, ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు. అలరకలమ అనే సన్యాసి, తన బోధనలలో సిద్ధార్దుని ప్రావీణ్యున్ని చేసి, తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని అ బోధనలవల్ల సిద్ధార్దుని జ్ఞానతృష్ణ తీరకపోవడంతో అ కోరికను నిరాకరించాడు. తర్వాత సిద్ధార్దుడు ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్దుని జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు.

తర్వాత సిద్ధార్దుడు కౌండిన్యుడనే యోగి వద్ద మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్యబృందమంతా, జ్ఞాన సముపార్జన కొరకు, బాహ్య శరీర అవసరాలను (ఆహారంతో సహా) పూర్తిగా త్యజించి సాధన చేశేవారు. ఈ విధంగా సిద్ధార్దుడు రోజుకు ఒక పత్రాన్ని గాని, ఒక గింజను గాని ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింప చేసుకున్నాడు. చివరికి ఒకనాడు, సిద్ధార్దుడు, నదిలో స్నానమాచరిస్తుండగా నీరసంతో పడిపోయాడు. అప్పుడు సిద్ధార్దుడు తను ఎంచుకున్న మార్గం సరియైనది కాదని తెలుసుకున్నాడు.

జ్ఞానోదయం

తర్వాత సిద్ధార్దుడు ధ్యానం, అనాపనసతి(ఉశ్చ్వాస, నిశ్వాసలు) ద్వారా మద్యయ మార్గాన్ని కనిపెట్టాడు (ఐహిక సుఖాలను, కోరికలను త్యజించడం). ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు. తర్వాత సిద్ధార్దుడు, బుద్ధ గయలో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకొనుటకు భగవత్ ధ్యానం చేశాడు. కాని కౌండిన్యుడు మరియు అతని ఇతర శిష్యులు, సిద్ధార్దుడు జ్ఞాన సముపార్జన సాధనను విరమించినట్లుగా, క్రమశిక్షణా రహితుడుగా భావించారు. చివరకు, తన ౩౫వ ఏట, ౪౯ రోజుల ధ్యానం తర్వాత, సిద్ధార్దునకు జ్ఞానోదయమయ్యింది. కొందరి అభిప్రాయం ప్రకారం, సిద్ధార్దునకు భాద్రపద మాసంలో జ్ఞానోదయమయ్యిందని, ఇంకొందరి అభిప్రాయం ప్రకారం, సిద్ధార్దునకు ఫాల్గుణ మాసంలో జ్ఞానోదయమయ్యిందని చెప్తారు. అప్పటి నుండి, గౌతమ సిద్ధార్దుడు, గౌతమ బుద్ధునిగా మారాడు. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్దుదని భావిస్తారు.

జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని ౪ పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమందురు. అప్పుడు గౌతమ బుద్ధుడు, ప్రతి బుద్ధునకు ఉండవలసిన ౯ లక్షణాలను ప్రతిపాదించాడు.

ఆయాచన సూక్తిలో ఉన్నా కొన్ని గాధల ప్రకారం, జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, తను తెలుసుకున్న ధర్మాన్ని సామాన్య ప్రజలకు బోధించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. దీనికి కారణం, దురాశ, అసూయ, ద్వేషాలతో నిండిన మానవుడు, తను తెలుసుకున్న ధర్మాన్ని అర్ధం చేసుకోలేదని బుద్ధుడు భావించాడు. కానీ భ్రహ్మ సహంపతి విన్నపంతో, గౌతమ బుద్ధుడు, బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు. బాజి

సంఘాన్ని రూపొందించడం

బుధ్ధుని భోధనలను వినుచున్న శిష్యులు.

జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, తపుస్సా, భల్లక అనే ఇద్దరు వర్తకులను తన ప్రధమ శిష్యులుగా చేసుకున్నాడు. వారికి గౌతమ బుద్ధుడు తన తల నుండి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడనీ, వాటిని ఇప్పటికీ రంగూన్ లో ఉన్న ష్యూ డాగన్ ఆలయంలో భద్రపరిచారనీ ప్రజలు నమ్ముతున్నారు. తర్వాత బుద్ధుడు తన పూర్వాచార్యులైన అలరకలమ మరియు ఉద్దకరామపుత్తలకు తను తెలుసుకున్న పరమ సత్యం గురించి చెప్పాలని భావించాడు. కాని వారు అప్పటికే మరణించారు.

అప్పుడు బుద్ధుడు ఉత్తర భారతదేశంలో ఉన్న వారణాశిలో ఒక లేళ్ళ ఉద్యానవనంలో, కౌండిన్యిని దగ్గర తనతో పాటూ శిష్యరికం చేసిన మిగతా ఐదుగురు సన్యాసులకు, తను తెలుసుకున్న పరమ సత్యంపై మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. వీరంతా బుద్ధునితో కలిసి మొదటి బౌద్ధ భిక్షువుల సంఘాన్ని ఏర్పరిచారు. ఈ విధంగా బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. తర్వాత యాసుడు మరియు అతని ౫౪ మంది మిత్రుల చేరికతో బౌద్ధ మత సంఘంలోని వ్యక్తుల సంఖ్య ౬౦ ని దాటింది. తర్వాత ముగ్గురు కశ్యప సోదరులు మరియు వారి ౨౦౦, ౩౦౦, ౫౦౦ మంది శిష్యుల చేరికతో బౌద్ధ మత సంఘ పరిమాణం ౧౦౦౦ ని దాటింది. వీరంతా బుద్ధుని బోధనలను, సామాన్య ప్రజలకు బోధించడానికి ప్రపంచమంతా పర్యటించారు.

దేశ పర్యటన మరియు బౌద్ధ మత ప్రచారం

దేశ పర్యటన చేస్తున్న బుద్ధుడు

మిగిలిన ౪౫ సంవత్సరాల జీవితంలో గౌతమ బుద్ధుడు గంగా నదీ పరివాహక ప్రాంతాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్ మరియు దక్షిణనేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. ఈ ప్రజలలో గొప్పతత్వ వేత్తలను మొదలుకొని, వీధులను శుభ్రం చేసే అంటరానివారు, అంగుళీమాల లాంటి హంతకులు, అళవక వంటి నర మాంసభక్షకులు ఉండేవారు. బౌద్ధ మతంలో అన్ని జాతులు తెగలకు చెందిన ప్రజలు మారడానికి వీలుండడం మరియు కుల, వర్గ విభజనలేకపోవడంతో బౌద్ధ మత సంఘంలోకి వేల కొద్దీ ప్రజలు రావడం మొదలు పెట్టారు. దీని వల్ల గౌతమ బుద్ధుడు ఇతర మతస్తుల నుండిబెదిరింపులు, హత్యా యత్నాలు ఎదుర్కొన్నాడు.

బౌద్ధ మత సంఘం భిక్షువులతోనూ, సన్యాసులతోనూ, భారతదేశంలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ధర్మ ప్రచారం గావిస్తూ, ఒక్క వర్షా కాలం తప్ప, మిగతా సంవత్సరమంతా ప్రయాణించేది. వర్షాకాలంలో వచ్చే వరదలవల్ల అన్ని మతాలకు చెందినసన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేశేవారు. ఈ సమయంలో బౌద్ధ మత సంఘం ఒక ఆశ్రమాన్నిఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినేవస్సాన అని అంటారు.

మొదటి వస్సాన బౌద్ధ మత సంఘం ఏర్పడిన మొదటి సంవత్సరం వారణాసిలో ఏర్పాటు చేశారు. తర్వాత బుద్ధుడు గతంలోబింబిసారునకిచ్చిన మాట ప్రకారం మగధ సామ్రాజ్య రాజధాని అయిన రాజగహను సందర్శించాడు. అప్పుడు బింబిసారుడురాజగహకు సమీపంలో వేలువన వెదురు ఉద్యానవనంలో బౌద్ధ మత సంఘానికి ఒక ఆశ్రమాన్ని కట్టించాడు. గౌతమ బుద్ధుడు, తనశిష్యులతో కలిసి ఇక్కడ కొంత కాలం బస చేశాడు.

బుద్ధునికి జ్ఞానోదయమయిన విషయం తెలుసుకుని, శుద్దోధనుడు, బుద్ధుని, కపిలవస్తు రమ్మని రాజదూతలచే ఆహ్వానం పంపాడు. ౯ మంది దూతలు వెళ్ళగా ఎవ్వరూ రాజాహ్వానమును బుద్ధునికి విన్నవించకుండా బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగామారిపోయారు. కానీ బుద్ధుని బాల్య స్నేహితుడు కులుదాయి మాత్రం రాజాహ్వానాన్ని బుద్ధునికి విన్నవించి బౌద్ధ సంఘంలో చేరాడు. అప్పుడు బుద్ధుడు రాజాహ్వానాన్ని మన్నించి, జ్ఞానోదయమయిన ౨ సంవత్సరాల తర్వాత కపిలవస్తుకు కాలినడకనప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ధర్మబోధ చేస్తూ ౨ మాసాలలో కపిలవస్తుకు చేరుకున్నాడు. బుద్ధుడు కపిలవస్తుకుచేరుకున్నాక, రాజ భవనంలో బౌద్ధ సంఘానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చెయ్యబడింది. కానీ బౌద్ధ సంఘానికి ఎలాంటిఆహ్వానం రాకపోవడంతో వారంతా బుద్ధునితో కలిసి భిక్షాటనకు బయలుదేరారు. ఇది విన్న శుద్దోధనుడు బుద్ధునితో, "మనదిమహామస్సాట రాజవంశము. మన వంశంలో ఏ ఒక్క వీరుడు కుడా భిక్షాటన చెయ్యలేదు" అని అన్నాడు. దానికి బుద్ధుడు, "భిక్షాటనమీ రాజవంశాచారము కాదు. అది బుద్ధ వంశాచారము. ఇంతకు ముందు వేల కొద్దీ బుద్దులు భిక్షాటన చేశేవారు" అని చెప్పాడు.

తర్వాత శుద్దోధనుడు మరల బౌద్ధ సంఘాన్ని రాజ భవనానికి భోజనం కొరకు ఆహ్వానించ్చాడు. భోజనం తర్వాత ధర్మముపైజరిగిన చర్చలో, శుద్ద్దోధనుడు బౌద్ధ సంఘంలో చేరి శొతపన్నునిగా మారాడు. ఈ సమయంలో చాలా మంది రాజకుటుంబీకులుబౌద్ధ సంఘంలో చేరారు. బుద్ధుని సోదరులైన ఆనందుడు, అనిరుద్ధుడు, నందుడు మొదలగు వారంతా బౌద్ధ సంఘములో చేరిసన్యాసులుగా మారారు. సిద్ధార్ధుని కుమారుడైన రాహులుడు కూడా బౌద్ధ మత సంఘములో చేరాడు. అప్పటికి అతని వయస్సు ౭సంవత్సరములు మాత్రమే. దేవదత్తుడనే వ్యక్తి (వరుసకు బుద్ధుని సోదరుడు) మొదట బౌద్ధ భిక్షువుగా మారినా, తర్వాత బుద్ధునిశత్రువుగా మారి, బుద్ధుని చంపాలని చాలాసార్లు ప్రయత్నించాడు.

బుద్ధుని శిష్యులలో సరిపుత్త, మహా మొగ్గల్లన, మహా కశ్యప, ఆనంద, అనిరుద్ద మొదలగు ఐదుమంది ముఖ్యులు. వీరితో పాటూఉపాలి, సుభోతి, రాహుల, మహా కక్కన మరియు పున్న అనే ఐదుగురు సంగీత విద్వాంసులు ఉండేవారు.

బుద్ధుడు ఐదవ వస్సనలో వేశాలికి దగ్గరలో ఉన్న మహావానలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్దోధనుడు మరణశయ్యపైఉండడంతో, బుద్ధుడు అతని దగ్గరికి వెళ్లి ధర్మాన్ని బోధించడంతో, శుద్దోధనుడు మరణానికి ముందు బౌద్ధ సన్యాసిగా మారాడు. శుద్దోధనుని మరణం మరియి అంత్యక్రియలు సన్యాసినిల సంఘం ఏర్పడడానికి కారణమయ్యింది. బౌద్ధ గ్రంధాల ప్రకారం, బుద్ధుడుమొదట స్త్రీలను సన్యాసినిలుగా తీసుకోవడానికి నిరాకరించాడు. బుద్ధుని పిన తల్లి అయిన మహా పజాపతి, బుద్ధుని బౌద్ధ సన్యాసదీక్షను ప్రసాదించమని అడుగగా బుద్ధుడు నిరాకరించి, కపిలవస్తుని విడిచి పెట్టి, రాజగహకు ప్రయాణమయ్యాడు. కాని మహాపజాపతి నిరాశ చెందక, కొందరు శాక్య మరియు కొళియ వంశాలకు చెందిన స్త్రీలతో ఒక చిన్న గుంపుగా బయలుదేరి, బౌద్ధబిక్షువులను అనుసరిస్తూ రాజగహకు చేరుకుంది. తర్వాత కొంత కాలానికి, అంటే బౌద్ధ సంఘం ఏర్పడిన ఐదు సంవత్సరాల తర్వాతఆనందుని మధ్యవర్తిత్వంతో, స్త్రీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించి, వారికి కూడా బౌద్ధ సంఘంలోస్థానం కల్పించాడు. కానీ బుద్ధుడు, బౌద్ధ సంఘానికున్న నియమాలతో పాటు, వినయమనే కొత్త నియమాన్ని, స్త్రీలకు ప్రత్యేకంగాజతపర్చాడు. తర్వాత సిద్ధార్దుని భార్య యశోధర కూడా బౌద్ధ సన్యాసినిగా మారింది.

తర్వాత కొంతకాలానికి, దేవదత్తుడు, బుద్ధుని కించపరచడం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో, దేవదత్తుడు, తను బౌద్ధసంఘానికి నాయకత్వం వహిస్తానని బుద్ధుని కోరాడు. కానీ బుద్ధుడు నిరాకరించాడు. అప్పుడు దేవదత్తుడు మరియు బింబిసారునికుమారుడైన అజాతసత్రు కలసి, బుద్ధుని, బింబిసారుని హత్య చేసి, తద్వారా వారి పదవులు తీసుకోవాలని పధకం వేశారు. దేవదత్తుడు మూడు సార్లు బుద్ధుని హత్య చేయాలని ప్రయత్నించాడు. మొదటి సారి కొందరు విలువిద్యా నిపుణులను బుద్ధుని హత్యచేయడానికి నియమించాడు. వారంతా బుద్ధుని కలిసి అతని శిష్యులుగా మారిపోయారు. రెండవ సారి దేవదత్తుడు కొండపైనుండి ఒకపెద్ద బండరాయిని బుద్ధుని పైకి దొర్లించాడు. అది వేరొక బండ రాయిని ఢీకొట్టి చిన్న చిన్న ముక్కలుగా పగిలి బుద్ధుని పాదాలనుమాత్రం తాకింది. మూడవ సారి ఒక ఏనుగుకు సారాయిని పట్టించి బుద్ధుని మీదకు వదిలాడు. కాని ఆ ప్రయత్నం కూడావిఫలమయ్యింది. ఈ ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో, దేవదత్తుడు, బౌద్ద సంఘంలో స్త్రీలకు మాత్రమె కేటాయించిన వినయమనేనియమంపై కొత్తగా ఆంక్షలను విధించి, బౌద్ధ సంఘంలో కలతలు రేపాలని చూశాడు. కాని బుద్ధుడు ఆ ఆంక్షలను నిరాకరించడంతోదేవదత్తుడు సంఘ నియమాలను ఉల్లంఘించి, బుద్ధుని నియమ నిష్ఠలను విమర్శించడం మొదలు పెట్టాడు. ఈ రకంగా దేవదత్తుడు, మొదట కొందరు బౌద్ధ భిక్షువులను బౌద్ధ సంఘం నుంచి విడదీసినా, సారిపుత్త, మహా మొగ్గల్లనలు వారికి బౌద్ధ ధర్మాన్ని విశదీకరించిచెప్పి, తిరిగి వారిని బౌద్ధ సంఘంలోకి చేర్చారు. తర్వాత బుద్ధుడు తన ౫౫వ ఏట ఆనందుని, బౌద్ధ సంఘానికి ముఖ్య కార్యదర్శిగాచేశాడు.

బుద్ధుని నిర్యాణం

మహా పరనిభాన సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, తన ౮౦వ ఏట తాను కొద్ది రోజులలో మహా నిర్యాణమొందుతాననిప్రకటించాడు. తర్వాత, బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని (పంది మాంసమని కొందరంటారు) భుజించాడు. అదితిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుచరుడయిన ఆనందుని పిలిచి, తనఅస్వస్థతకు కారణం, కుంద ఇచ్చిన ఆహరం కాదని, తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి, కుందని ఒప్పించమని పంపాడు.

కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణంగురించి తెలియజేయడానికి, కావాలనే నిర్యాణమొందాడని ఒక వాదన ఉన్నది.

తర్వాత బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులనందరిని పిలిచి వారికి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు. కానీఎవ్వరు,ఏ సందేహాలను వెలిబుచ్చలేదు. అప్పుడు బుద్ధుడు మహా నిర్యాణమొందాడు. బుద్ధుని ఆఖరి మాటలు, “All composite things Pass away. Strive for your own liberation with diligence ”. బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిపిన తర్వాత, అతని అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు. వీటిలో కొన్ని ఇప్పటికిభద్రంగా ఉన్నాయంటారు (శ్రీలంకలో ఉన్న దలద మారిగావలో బుద్ధుని కుడివైపునుండే పన్ను ఇప్పటికి భద్రపరచబడి ఉంది. దీనినేటెంపుల్ ఆఫ్ టూత్ అంటారు). శ్రీలంకలో పాళీ భాషలో ఉన్న దీపవంశ మరియు మహావంశ శాసనాలను బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణమొందిన౨౧౮ సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ చైనాలో ఉన్న ఒక మహాయాన శాసనాన్ని బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడునిర్యాణమొందిన ౧౧౬ సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ రెండు ఆధారాలను బట్టి, బుద్ధుడు క్రీ.పూ. ౪౮౬లో (ధేరవాద శాసనం) గానీ లేదా క్రీ.పూ. ౩౮౩లో (మహాయాన శాసనం) నిర్యాణమొందాడు. కానీ ధేరవాద దేశాలలో బుద్ధుడు క్రీ.పూ. ౫౪౪ లేదా ౫౪౩లోనిర్యాణమొందాడని భావిస్తారు. దీనికి కారణం అశోకుని కాలం ప్రస్తుత అంచనాల కన్నా ౬౦ సంవత్సరాల ముందని వీరుభావించడమే.

బుద్ధుడు నిర్యాణ సమయంలో తన శిష్యులను, ఏ నాయకున్నీ అనుసరించవద్దని, తన సిద్ధాంతాలను, ధర్మాన్ని మాత్రమేఅనుసరించమని చెప్పాడు. కానీ మహా మొగ్గల్లన మరియు సారిపుత్తలు అప్పటికే నిర్యాణమొందటంతో బౌద్ధ సంఘం, మహాకశ్యపుని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.

బోధనలు

ఆయన యధాతథంగా బోధించినవి దొరుకుట కొంత కష్టమే అయినా, వాటి మూలాలను తెలుసుకోవడం అసంభవమైన పని కాదు. వివిధ బౌద్ధ భిక్షువులు, శాఖల మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నా, మూల సిద్ధాంతాలు, భిక్షువుల నియమావళి పట్ల అంగీకారం ఉన్నది. మచ్చుకు కొన్ని బోధనలు:

  • నాలుగు ఆర్య సూత్రాలు.
  • అష్టాంగ మార్గం.
  • అనిచ్చ (సంస్కృతం: అనిత్య): అన్ని వస్తువులు అనిత్యం
  • అనత్త (సంస్కృతం: అనాత్మ): నేను అని నిరంతరం కలిగే భావన ఒక "భ్రమ"
  • దుక్క (సంస్కృతం: దు:ఖం): అజ్ఞానము కారణముగా అన్ని జీవులు దు:ఖానికి గురి అవుతున్నాయి.

ప్రపనఛమ్ లొ ప్రథి మనిషి కి అదొ ఒక రోజు ఈ లొకన్ని వీదీ వెల్ల వలసినెధ కావున కొన్ని ష్త్బ్దల క్రిథమ మహ వయక్థిప్రపమ్ఛ గురించి వాటిని రామోహన్

భాష

బుద్ధుడు పండితుల భాషైన సంస్కృతాన్ని కాక సాధారణ ప్రజలు భాషించే పాళీ భాషలో మాట్లాడాడని అధికుల భావన, ఆయన మాటలను త్రిపిటకలో యథాతథంగా గ్రంథస్తం చేసారు కూడా. కొంత మంది మగథ ప్రాకృతి అని, మరికొందరు పరిశోధకులు నాటి ఈశాన్య భారతంలోని మరో భాషను మాట్లాడాడని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చూడండి

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:Link FA మూస:Link FA