ఆర్థర్ కాటన్: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 149: | పంక్తి 149: | ||
==కృషి== |
==కృషి== |
||
[[File:Davalesvaram Anicut.JPG|thumb|ధవలేశ్వరం ఆనకట్ట-నిర్మాణ దశ]] |
|||
[[File:Gannavaram aquaduct.JPG|thumb|150px| గన్నవరం అక్వాడక్ట్]] |
|||
కాటన్ ముఖ్యంగా [[కృషి]] చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో [[గోదావరి]] నుండి నిర్మించిన [[కాలువ]]ల నిర్మాణం మొదటిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు [[వ్యవసాయం]] లో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక [[జిల్లా]]లను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. కాటన్ 1836 - 38 సంవత్సరాలలో''' కొలెరూన్''' నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది. ఆ తర్వాత 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు. కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్దే. ఇంతేకాక ఆయన బెంగాల్, ఒరిస్సా, బీహార్, మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత రుణగ్రస్తులు. |
కాటన్ ముఖ్యంగా [[కృషి]] చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో [[గోదావరి]] నుండి నిర్మించిన [[కాలువ]]ల నిర్మాణం మొదటిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు [[వ్యవసాయం]] లో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక [[జిల్లా]]లను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. కాటన్ 1836 - 38 సంవత్సరాలలో''' కొలెరూన్''' నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది. ఆ తర్వాత 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు. కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్దే. ఇంతేకాక ఆయన బెంగాల్, ఒరిస్సా, బీహార్, మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత రుణగ్రస్తులు. |
||
==ఉభయగోదావరిజిల్లాలు-కాటన్== |
==ఉభయగోదావరిజిల్లాలు-కాటన్== |
||
పవిత్ర జీవనది కి ఇరువైపుల వున్న ఉభయగోదావరి జిల్లాలు 18 వశతాబ్దివరకు అతివృష్టి వలన వరదముంపుకు లోనగుచు,అనావృష్టివలన కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1831-32ల్ లో అతివృష్టి,తుపానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కల్గిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడుచుపెట్టుకుపొయ్యారు.అలాగే 1839లో ఉప్పెన మరియు కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొనింది.1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట,ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల,ప్రజల ఆర్థికమరియు జీవనగతులను మర్చివేసింది.తమపాలిట దుఖఃదాయినిగా వున్న గోదావరిని,ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు.ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణాంతరము,పండితులు గోదావరిలో స్నానమాచరించి, సంకల్పంచెప్పునప్పుడు |
పవిత్ర జీవనది కి ఇరువైపుల వున్న ఉభయగోదావరి జిల్లాలు 18 వశతాబ్దివరకు అతివృష్టి వలన వరదముంపుకు లోనగుచు,అనావృష్టివలన కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1831-32ల్ లో అతివృష్టి,తుపానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కల్గిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడుచుపెట్టుకుపొయ్యారు.అలాగే 1839లో ఉప్పెన మరియు కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొనింది.1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట,ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల,ప్రజల ఆర్థికమరియు జీవనగతులను మర్చివేసింది.తమపాలిట దుఖఃదాయినిగా వున్న గోదావరిని,ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు.ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణాంతరము,పండితులు గోదావరిలో స్నానమాచరించి, సంకల్పంచెప్పునప్పుడు |
01:28, 15 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సర్ ఆర్థర్ కాటన్ SIR ARTHUR COTTON | |
---|---|
దస్త్రం:Arthan kaaTan.jpg | |
జననం | 15 మే 1803 |
మరణం | 24 జూలై, 1899 |
ఇతర పేర్లు | కాటన్ దొర |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కాటన్ దొర |
తల్లిదండ్రులు |
|
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్(జ.మే 15, 1803 ఆక్స్ఫోర్డ్ - మ.జూలై 24,1899 డోర్కింగ్) బ్రిటీషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు.
కాటన్ తన జీవితాన్ని బ్రిటీషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవితలక్ష్యం మరణించేసరికి పాక్షికముగానే మిగిలిపోయినది. కాని ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన చేసిన కృషికి ఈనాటికీ గౌరవింపబడుతున్నారు.[1] 1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్ బిరుదాంకితుడైనాడు. ఈయన ధర్మోపదేశకుడు మరియు బ్రిటిష్ ధర్మోపదేశకురాలుఎలిజిబెత్ కాటన్ యొక్క తండ్రి.[2]
జీవితం
ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు.
ఆర్ధర్ కాటన్ దొర జీవితంలోని కొన్నిముఖ్యఘటనల పట్టిక
సంవత్సరము | కాటన్ జీవిత విశేషాలు |
1803 | ఇంగ్లాండులోని కేంబరుమిర్ ఏబీలో హెన్రికాటన్ దంపతులకు 10వ కుమారునిగా జన్మించాడు. |
1818 | క్రాయిడన్ వద్ద ఆడిస్కొంబో సైనికశిక్షణాలయంలో కాడెట్ గా చేరిక |
1819 | సెకండ్ లెప్టినెంట్ అయ్యాడు. |
1820 | వేల్సులో ఆర్డినెన్సు సర్వేకు వెళ్లెను |
1821 | బ్రిటిష్ ఇండియా ఉద్యోగిగా ఇండియాకు సముద్రప్రయాణము. |
1822 | పాంబన్ జలసంధిని లోతుచేయుపనిలో సదరన్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీరుగా చేరిక |
1824 | బర్మాపై యుద్ధసమయంలో సైన్యంలో చేరెను |
1827 | మద్రాసులో తటాక విభాగం సూపరెండెంట్ ఇంజనీరుగా పనిచేసెను.తరువాత పాంబన్ జలసంధిని లోతుచేయుపనిలో నియుక్తుడయ్యెను. |
1828 | కెప్టెను హోదాను పొందెను |
1828-29 | కావేరి సమస్యపై పరిష్కారంకై ప్రయత్నం మొదలు పెట్టెను |
1830 | రెండున్నర సంవత్సరాలు సెలవు పై ఇంగ్లాండు వెళ్ళెను. |
1832 | శెలవు తరువాత వచ్చి,కావేరి పనులు చేపట్టెను.కాని మళ్లి అనారోగ్యకారణంచే ఇంగ్లాండు వెళ్లిపొయ్యెను. |
1837 | మద్రాసు నౌకాశ్రయ నిర్మాణకార్యక్రమము ప్రారంబించాడు. |
1840 | కృష్ణానదిపై ఆనకట్ట సాధ్యమేనని రిపోర్టు సమర్పించాడు. |
1841 | ఆస్ట్రేలియాకు ప్రయాణం.ఎలిజెబెత్ తో 29-10-41 న పెళ్ళి |
1843 | ఇండియాకు తిరిగివచ్చెను. |
1846 | గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్టకు లండను దైరక్టర్లనుండి ఆమోదం లభించినది. |
1847 | ఏప్రిల్ లో గోదావరినదిపై ఆనకట్ట పనులు ప్రారంభం |
1848 | కృష్ణానది ఆనకట్ట పునాదుల త్రవ్వకంపనులపై సలహలిచ్చెను. |
1848 | కెప్టెను ఆర్కు ఆనకట్ట పనులప్పగించి,ఆరోగ్యంకై ఆస్ట్రేలియా వెళ్ళెను |
1850 | ఇండియా వచ్చెను.వచ్చిన వెంటనే కల్నల్ హోదా లభించినది. |
1852 | గన్నవరం అక్విడక్టు పనులు ప్రారంభం.ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తి. |
1860 | పదవీ విరమణ పొంది ఇంగ్లాండుకు వెళ్లిపొయ్యెను.'సర్'బిరుదు ప్రదానం జరిగినది. |
1863 | మరల ఇండియా వచ్చి సోన్ లోయలోని ప్రాజెక్టులకు సలహలనిచ్చెను |
1877 | కె.సి.ఎస్.ఐ.బిరుదు ఇవ్వబడెను |
1899 | ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూసెను.96సం.2నెలలు జీవించాడు. |
కాటన్ జీవితం-మైలురాళ్ళు
సంవత్సరము | కాటన్ జీవితంలోని మైలురాళ్లు |
1826-29 | పాంబన్ జలసంధి అభివృద్ధి |
1836-39 | తాంజోర్ జిల్లాలోని కావేరి డెల్టా అబివృద్ధి,కోలెరోన్ ఆనకట్ట నిర్మాణము |
1836 | మద్రాసు హర్బరు పధకము అమలు |
1837 | మద్రాసు నుండి రెడ్హిల్సు వరకు రైలుమార్గం నిర్మాణపనులపై పర్యవేక్షణ |
1838-40 | విశాఖ నౌకాశ్రాయ నిర్మాణ ప్రాజెక్టు పని.దేశంలోనే ప్రముఖ రేవుగా నేడు ఆవిర్భవించినది |
1843-52 | ధవళేశ్వరం-విజ్జేశ్వరం మధ్య గోదావరి పై ఆనకట్ట నిర్మాణము |
1852 | గన్నవరం అక్విడక్టు నిర్మాణం |
1856 | క్రిష్ణానదిపై ఆనకట్ట నిర్మాణంపై నివేదిక సమర్పణ |
1859 | ఒడిస్సా ప్రభుత్వానికి నీటిపారుదల పై నివేదిక తయారుచేసి సమర్పించాడు |
1878 | తుంగభద్రకాలువలనిర్మాణము.ఉత్తరభారతంలోనినదులను దక్షిణభారతనదులతో అనుసంధానంపై నివేదిక |
కృషి
కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయం లో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. కాటన్ 1836 - 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది. ఆ తర్వాత 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు. కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్దే. ఇంతేకాక ఆయన బెంగాల్, ఒరిస్సా, బీహార్, మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత రుణగ్రస్తులు.
ఉభయగోదావరిజిల్లాలు-కాటన్
పవిత్ర జీవనది కి ఇరువైపుల వున్న ఉభయగోదావరి జిల్లాలు 18 వశతాబ్దివరకు అతివృష్టి వలన వరదముంపుకు లోనగుచు,అనావృష్టివలన కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1831-32ల్ లో అతివృష్టి,తుపానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కల్గిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడుచుపెట్టుకుపొయ్యారు.అలాగే 1839లో ఉప్పెన మరియు కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొనింది.1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట,ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల,ప్రజల ఆర్థికమరియు జీవనగతులను మర్చివేసింది.తమపాలిట దుఖఃదాయినిగా వున్న గోదావరిని,ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు.ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణాంతరము,పండితులు గోదావరిలో స్నానమాచరించి, సంకల్పంచెప్పునప్పుడు
నిత్య గోదావరిస్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశియం కాటనుంతం భగీరథం
అని పఠించెవారు.అంతటి గౌరవాన్నిపొందాడు.ఉభయగోదావరి జిల్లాలోని చాలా గ్రామాలలో ఇతరదేశనాయకుల విగ్రహాలున్నా,లేకపోయిన తప్పనిసరిగా కన్పించె విగ్రహం గుర్రముమీద స్వారిచేస్తున్న కాటన్ దోర,లేదా బస్ట్సైజు కాటన్ విగ్రహం.అంతగా ఈప్రాంతపుప్రజల గుండెలల్లో 150 సంవత్సరాలు గడిచిన నిలచివున్న చిరంజీవి కాటన్ దొర.ఆతరువాత ఈ మధ్య కాలములో ఈ ఆనకట్ట ను మరింత గా అభివేద్ధిపరచి,ధృడంగా చేయబడినది కట్టబడినది.
కాటన్మ్యూజియం
కాటను దొర చేసిన సేవలను గుర్తుంచుకొని ఆంధ్రపదేశ్ ప్రభుత్వంవారు ఆయనపేరుమీద ఒక మ్యూజియం ఏర్పాటు చెయ్యడం సంతోషించదగ్గ విషయం.ఈ మ్యూజియంను ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా ,కాటన్దొర ఆనకట్టకట్టునప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అల్నాటి భవనంలో ఏర్పాటుచేసారు.రెండంతస్తులభవనమీది.రాతిగోడలకట్టడం.పైకప్పు పెంకులతో నిర్మించబడినది.భవనంచుట్టూ ఆవరణలో పూలమొక్కలు,ఫెన్సింగ్ మొక్కలున్నాయి.మ్యూజియం ఆవరణమీదుగా,మ్యూజియం భవనంకు అతిచేరువగా ఆనకట్టకు వెళ్ళు రహదారియొక్క ఫ్లైఒవర్ వంతెనవున్నది.ఈవంతెన క్రింది కాలీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతనయంత్రాలు(రివెటింగ్ యంత్రం, స్టేం బాయిలర్లు,కంప్రెసర్లు,సానపట్టు యంత్రాలు,బోరింగ్ యంత్రాలను వుంచారు.ముఖ్యభవనంకు కుడివైపున అలనాటి రెండు పిరంగులనుంచారు.మ్యూజియంలోని క్రిందిగదులలో,ఆనకట్టకు సంబంధించిన వివరాలు,కొన్ని నమూనాలున్నాయి.మధ్యహాలులో ఆనకట్ట నిర్మాణానికిచెందిన చిత్రాలతోకూడిన వివరాలున్నాయి.మరోక హాలులో కాటన్ దొర జీవిత విశేషాలు వివరించిన ఫలకాలున్నాయి.మరొక హాలులో గోదావరినది రాజమండ్రినుండి,సముద్రంలో కలియు వరకు నమూనావుంది.ఈ నమూనాకు వెనుక గోడపై,ఆనకట్ట నిర్మాణవిశేషాలు,ఎన్నిఎకరాలకు నీరందుతున్నదనే వివరాలు,వున్నాయి.పై అంతస్తులో ఆంద్రప్రదేశ్ లోని ఇతరప్రాజెక్టుల వివరాలు,కొన్ని నమూనాలు,కాటన్ ఆద్వర్యంలో ఇతరచొట్ల జరిగిన పనుల చిత్రాలున్నాయి.దిగువ గదిలో కాటన్ దొర మునిమనుమాడు ఈ మ్యూజియంను సందర్శించినప్పుడు రాసిన స్పందన చిత్రమున్నది.కాటన్ గారి వివిధవయస్సులోని చిత్తరువులు,తల్లిదండ్రులచిత్రాలు,కాటన్ బస్ట్సైజు విగ్రహంవున్నాయి.మ్యూజియం బయట అవరణలో గోదావరినది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలియువరకు చూపించూ నమూనాకలదు.
విచారించదగ్గ విషయమేమంటే,ఈ మ్యూజియం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం.ఆనకట్టకు వాడిన యంత్రాలు బయట వుంఛడం వలన వాటిమీద దుమ్ము,దూళి చేరిపోతున్నది.భవనంకిటికి తలుపు విరిగివున్నాయి.ఎవ్వరైన సులభంగా లోనికి జొరబడి,వస్తువులను దొంగలించే అవకాశమున్నది.మ్యూజియంలోపల గైడ్ లేడు,వాటి ప్రాముఖ్యత్యను వివరించటానికి.నామునాలు కూడా చాలా వరకు రంగువెలసి వున్నాయి.ఇక్కడి ప్రజలు ఇంకా అయన్ని గుర్తుంచుకొని వూర్లల్లో విగ్రహాలు పెట్తూన్నారు.కాని పాలకులే .....
చిత్రమాలిక
ఆనకట్ట నిర్మాణంలో ఉపయోగించిన యంత్రాలు
ధవళేశ్వరం ఆనకట్టకు చేరువగా వున్న కాటన్ మ్యూజియంలో వుంచిన ,ఆనాడు ఆనకట్ట నిర్మాణంలో వాడిన యంత్రాలు.క్రిష్ణానది బ్యారేజి నిర్మాణంలో వాడినవి,కొన్ని యంత్రాల కూడా వున్నాయి.
-
ఆనకట్ట తలుపులకు రివిటు రంధ్రాలు చేయు యంత్రం
-
గ్రైండింగు మెషిన్/సానపెట్టు యంత్రము
-
బోరింగ్ మెషిన్/భూమిలో రంధ్రాలు చేయు యంత్రము
-
ఎయిర్ కంప్రెస్సరు/గాలిసంకోచనయంత్రము
-
స్టీమ్ బాయిలర్
-
అనకట్ట నిర్మాణంలో వాడిన ఇటుకలు
-
ఆనకట్ట తలుపులకు రివిట్లువేయుటకు ఉపయోగించిన స్టీము ఇంజను
-
కాటన్ గారు ధవళేశ్వరంలో కట్టీన ఆక్వాడక్టు
మూలాలు
- ↑ Hope, Elizabeth; Digby, William (2005). General Sir Arthur Cotton his life and work. New Delhi: Asian Educational Services. p. 4. ISBN 81-206-1829-7.
{{cite book}}
:|access-date=
requires|url=
(help) - ↑ | ఆర్థర్ కాటన్ యొక్క కుమార్తె ఎలిజిబెత్ కాటన్]
వనరులు
- Years of vision ,padmabhooshan P.R.Rao festschrift november' 2008