ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 68: పంక్తి 68:
* [[ఇద్దరు మొనగాళ్లు]] (1967)
* [[ఇద్దరు మొనగాళ్లు]] (1967)
* [[భూలోకంలో యమలోకం]] (1966)
* [[భూలోకంలో యమలోకం]] (1966)
* [[లోగుట్టు పెరుమాళ్ళు కెరుక]] (1966)
* [[లోగుట్టు పెరుమాళ్ల కెరుక]] (1966)
* [[పొట్టి ప్లీడరు]] (1966)
* [[పొట్టి ప్లీడరు]] (1966)
* [[ఆటబొమ్మలు]] (1966)
* [[ఆటబొమ్మలు]] (1966)
పంక్తి 79: పంక్తి 79:
* [[తోటలో పిల్ల - కోటలో రాణి]] (1964)
* [[తోటలో పిల్ల - కోటలో రాణి]] (1964)
* [[బంగారు తిమ్మరాజు]] (1964)
* [[బంగారు తిమ్మరాజు]] (1964)
* [[మంచి రోజులు వస్తాయి]] (1963)
* [[మంచి రోజులొస్తాయి]] (1963)
* [[గురువును మించిన శిష్యుడు]] (1963)
* [[గురువును మించిన శిష్యుడు]] (1963)
* [[ఏకైక వీరుడు]] (1962)
* [[ఏకైక వీరుడు]] (1962)

04:57, 17 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

ఎస్.పి.కోదండపాణి
జననంశ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి
1932
గుంటూరు
మరణం1974
వృత్తిసంగీత దర్శకుడు

ఎస్.పి.కోదండపాణి (1932 - 1974) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. వీరి పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి. వీరు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ వంటి కొన్ని పాటలు పాడారు కూడా.

జీవిత విశేషాలు

ఇతను 1932 వ సంవత్సరంలో గుంటూరులో జన్మించాడు. అతని బాల్యం గుంటూరు లో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరులోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నాడు. అద్దేపల్లి రామారావు నా ఇల్లు చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953 లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. సుసర్ల దక్షిణామూర్తి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకుడిగాను పనిచేశాడు. 1955 లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత కె.వి. మహదేవన్ వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగాడు.

హాస్యనటుడు పద్మనాభం రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవాడు. ఆయనకు సంగీత దర్శకుడిగా సేవలందించాడు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్ఠల వల్ల 1961లో కన్నకొడుకు చిత్రానికి సంగీత దర్శకుడయ్యాడు. తరువాత పదండి ముందుకు (1962), మంచి రోజులొచ్చాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, లోగుట్టు పెరుమాళ్ళకెరుక మొదలైన చిత్రాలకు పనిచేశాడు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవాడు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతను చిన్న వయసులోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్, 1974) న చనిపోయాడు.

పద్మనాభం చిత్రం శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న ద్వారా వీరు 1967లో ఈనాటి ఉత్తమ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ను తెలుగు తెరకు పరిచయం చేశాడు.

చిరకాలం గుర్తుండే పాటలు

చిత్రాలు

బయటి లింకులు