పి. బి. శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
చి
→జీవితం
Content deleted Content added
కూచిమంచిప్రసాద్ (చర్చ | రచనలు) చి →జీవితం |
|||
పంక్తి 40:
ఆయన ఆంధ్ర పదేశ్ నందు [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[కాకినాడ]] పట్టణమునందు ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు [[సెప్టెంబర్ 22]] , 1930 న జన్మించాడు.<ref>[http://www.thehindu.com/features/cinema/veteran-singer-pbs-passes-away/article4617069.ece]</ref> ఆయన కళాశాల చదివి బి.కాం. డిగ్రీని సంపాదించాడు. ఆయన పూర్వీకులు [[పసలపూడి]] గ్రామానికి చెందినవారు.
ఆయన ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అవి [[తెలుగు]], [[కన్నడం ]] , [[తమిళం]] , [[మళయాళం]] , [[హిందీ]] , [[ఉర్దూ]] , [[ఆంగ్లం]] , [[సంస్కృతం]]. ఆయన అనేక గజళ్ల ను తెలుగు లో పాడాడు. శ్రీనివాస్ యుగళ గీతాలను కోరస్ పాటలను [[గీతా దత్]], [[షంషాద్ బేగమ్]] మరియు [[జిక్కీ]] లతో కలిసి ఆలపించారు. ఆయన [[ఆర్.నాగేంద్ర రావు]] యొక్క [[జాతక ఫలం]] అనే చిత్రం ద్వారా తమిళం, కన్నడం, తెలుగు చిత్రాల లో పరిచయమైనాడు<ref>[http://www.hindu.com/fr/2008/09/19/stories/2008091951110200.htm The Hindu : Music cannot thrive without rasikas]</ref>. ఆయన దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు. తెలుగు చిత్రాల్లొ ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించాడు. [[శాంతినివాసం]] చిత్రం లో మహానటుడు నాగయ్య గారికి "శ్రీ రఘురాం జయ రఘురాం " అనే పాటను పాడటం విశేషం.
శ్రీనివాస్ 1952 లో జెమిని వారి హిందీ చిత్రం "మిస్టర్ సంపత్" తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ " తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందాడు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర"<ref>[http://www.hindu.com/mp/2009/01/03/stories/2009010353731300.htm The Hindu: Harishchandra (1955)]</ref> లో పాడాడు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో [[పి.సుశీల]] తో పాడాడు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ [[రాజ్ కుమార్]] కు చాలా కాలంపాటు పాటలు పాడాడు. ఇవి విమర్శకులచే, అభిమానులచే మరియు పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో [[జెమిని గణేశన్]] కు అనేక పాటలు పాడారు. ఆయన పాటలలో ప్రముఖమైనది "నిలవే ఎన్నిదం నెరుంగతె". ఆయన ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడాడు. ముఖ్యంగా కొన్ని పాటలను [[ఎం.జి.రామచంద్రన్]] మరియు [[శివాజీ గణేశన్]] లకు పాడాడు. 1964 లో [[మై భీ లడకీ హూ]] అనే హిందీ చిత్రం లో [[లతా మంగేష్కర్]] తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు జెమినీ గణేశన్, ముత్తురామన్, రవిచంద్రన్, జైశంకర్.
|