స్వామినేని ముద్దునరసింహంనాయుడు: కూర్పుల మధ్య తేడాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:హేతువాదులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
[[వర్గం:1792 జననాలు]] |
[[వర్గం:1792 జననాలు]] |
||
[[వర్గం:1856 మరణాలు]] |
[[వర్గం:1856 మరణాలు]] |
||
[[వర్గం:హేతువాదులు]] |
06:58, 1 జూన్ 2013 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
స్వామినేని ముద్దునరసింహంనాయుడు (1792-1856) వ్యవహారిక భాషావాది, తొలి తెలుగు వ్యాసకర్త.[1] తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంధం హితసూచని (1853) రచయిత.[ఆధారం చూపాలి] హేతువాది . ఈయన పెద్దాపురం జిల్లా మునసబుగా పనిచేస్తూ చనిపోయారు. హితసూచనిని ముద్దునరసింహంనాయుని మరణానంతరం రాజమండ్రిలో న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన కుమారుడు రంగప్రసాదనాయుడు తొలిసారిగా 1862లో ముద్రింపజేశాడు.[2] ఆ పుస్తకాన్ని 1986 లో రాజమండ్రి ఆంధ్రకేసరి యువజన సమితి వారు పునర్ముద్రించారు.
చిన్నయసూరి వంటి పండితులు అలంకారభూషితమైన గ్రాంధికభాషలో రచనలు చేస్తున్న సమయంలో ముద్దునరసింహంనాయుడు ధైర్యంగా వ్యవహారిక భాషలో అనేక విషయాలపై వ్యాసాలను ప్రకటించడం మొదలుపెట్టి తెలుగు గద్యరచనకు వ్యవహారిక భాషే మేలైనదని సూచించాడు. హితసూచనిలో నరసింహనాయుడు వ్యవహారిక తెలుగు భాషలో చదువు, పెళ్లి తదితర జీవితానికి సంబంధించిన విషయాలపై ఎనిమిది వ్యాసాలను పొందుపరచాడు. ఈయన వ్యాసాలను సాధారణంగా ఉపయోగించబడే పదప్రయోగమైన వ్యాసం అనకుండా, ప్రమేయాలన్నాడు.[3]