దేవులపల్లి రామానుజరావు: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) కొత్త పేజీ: '''దేవులపల్లి రామానుజరావు''' తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాట... |
K.Venkataramana (చర్చ | రచనలు) +వర్గం:1917 జననాలు; +వర్గం:సాహితీకారులు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
==యితర లింకులు== |
==యితర లింకులు== |
||
* [http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=3&ContentId=24150 నమస్తే తెలంగాణా లో వ్యాసం] |
* [http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=3&ContentId=24150 నమస్తే తెలంగాణా లో వ్యాసం] |
||
[[వర్గం:1917 జననాలు]] |
|||
[[వర్గం:సాహితీకారులు]] |
07:53, 7 సెప్టెంబరు 2013 నాటి కూర్పు
దేవులపల్లి రామానుజరావు తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని అలుపెరగని పోరాటం చేసిన సాహితీకారుడు. తెలంగాణలో ‘శోభ’, ‘గోల్కొండ’ పత్రికలకు సంపాదకుడిగా, సురవరం ప్రతాపరెడ్డి తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు ఆయన.
జీవిత విశేషాలు
దేవులపల్లి రామానుజరావు 1917 లో ఓరుగల్లు లో జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి బి.ఎ., నాగపూర్ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి చదివారు. రామానుజరావు పదహారు గ్రంథాలు రాయడమే కాక పెక్కు సంస్థలకు తన సేవలందించారు. 22 సంస్థలతో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం కలిగి ఉండటమే కాక విద్యారంగంలోనూ, ఉస్మానియా యూనివర్సిటిలోనూ అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.
అంతేకాదు, సహకార రంగ వ్యాపార సంస్థ డైరెక్టర్గా, సాధారణ భీమా సంస్థ డైరెక్టర్గానూ పని చేశారు. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలకు పాలక సభ్యుడిగా, వ్యవస్థాపకుడిగా, పరిపాలకుడిగా తన విలువైన సేవలందించారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొన్న ఆయన 1960-62 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.