నందికొట్కూరు: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) చి →చరిత్ర |
చి en:Nandikotkur |
||
పంక్తి 47: | పంక్తి 47: | ||
[[వర్గం:కర్నూలు జిల్లా గ్రామాలు]] |
[[వర్గం:కర్నూలు జిల్లా గ్రామాలు]] |
||
[[en:Nandikotkur]] |
13:00, 12 అక్టోబరు 2013 నాటి కూర్పు
?నందికొట్కూరు మండలం కర్నూలు • ఆంధ్ర ప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణం | నందికొట్కూరు |
జిల్లా (లు) | కర్నూలు |
గ్రామాలు | 11 |
జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
74,199 (2001 నాటికి) • 37837 • 36362 • 63.12 • 75.01 • 50.76 |
నందికొట్కూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము.
చరిత్ర
నందికొట్కూరు గ్రామమునకు చుట్టుప్రక్కల తొమ్మిది నంది విగ్రహాలు ప్రతిష్టించడం వల్ల ఈ గ్రామమునకు మొదట నవనందికొట్కూరుగా పిలువబడినది. కాలక్రమేనా ఈ గ్రామము నందికొట్కూరుగా పూర్వాంతరం చెందినదని ప్రజల ఆబిప్రాయము.
నాటి నవనందీశ్వరాలయం చారిత్రక నేపధ్యము
13 వ శతాబ్ధమునకు పూర్వం ప్రస్తుత గ్రామము ఉన్న ప్రాంతము దట్టమైన ఆడవులతో నిండి ఉండేది. కాకతీయ ప్రభువు శ్రీ ప్రతాపరుద్రుడు తన సైన్యముతో శ్రీశైలము సందర్శించుటకు వెళ్ళుతూ కొంతసేపు ఈచ్చట సేద తీర్చుకొనుటకు విడిది చేయుచుండెడివాడు. రాజు కోరికపై సిరిసింగడు ఆనుసేన సామంతుడు ఈ ప్రాంతమును శైవ సాంప్రదాయముగా గ్రామము ఏర్పాటు చేసినట్లు ప్రస్తుతము ఉన్న కోట ప్రాంతము పురాతన 8వ వీరభద్ర సూర్యనారాయణ ఆలయాలు శిథిలమైన కోటబురుజుల చుట్టూ కంధకము శిలాశాసనము పరిశీలనను బట్టి తెలియుచున్నది. గ్రామము చుట్టూ 9 నంది విగ్రహములు స్థాపించి వాటి మధ్యలో వెలసిన గ్రామము కావున "నవనందికొట్కూరు" గా పిలవబడుచూ కాలక్రమముగా నందికొట్కూరుగా రూపాంతరము చెందినట్లుగా తెలియుచున్నది.
పూర్వకాలంలో రాజులు ఈ ప్రాంతం చుట్టూ 9 నందులను ప్రతిష్టించడం వలన ఈ ప్రాంతానికి నవనందికొట్కూరు అని పేరు వచ్చింది.
- తూర్పు దిక్కున : ఆత్మకూరు వెళ్ళెదారిలో ఉన్నది (జమ్మిచెట్టు దగ్గర)
- పడమర దిక్కున : మల్యాల గ్రామం వెళ్ళు రహదారిలో ఉన్నది. అయితే ప్రస్తుతం నంది అక్కడి పొలాలలో బూడిపోయినది.
- ఉత్తరం దిక్కున : ఈ నంది సి.యస్.ఐ. పాలెం నందు నంబర్ చిన్నయ్య పొలములో ఉన్నది. ప్రస్తుతం ఈ నంది శిథిలావస్తలో ఉన్నది.
- దక్షిణ దిక్కున : వీపనగండ్ల గ్రామము వెళ్ళే దారిలో ఈ నంది ప్రతిష్టించబడింది.
ఈ తొమ్మిది నవనందులపై ప్రజల అభిప్రాయం నమ్మకం :
- ఆప్పటి రాజులు ఈ నందుల క్రింద తమ వెండి, బంగారం, ధనము ఆన్నింటిని ఈ నందుల క్రింద ఉంచినారని ఇక్కడి వారి ఆభిప్రాయం.
- ఈ నందులను దాటి ఊరు (ప్రాంతం) నిర్మిస్తే ఈ ఊరు నశిస్తుందని ఈ ఊరుకే ఆరిష్టం అని ఇక్కడి ప్రజల నమ్మకం.
- ఈ నందికొట్కూరు ప్రాంతాన్ని అప్పటి నైజాం నవాబులు పరిపాలించారు. ఈ నందికొట్కూరు ప్రాంతంలోని మద్దిగట్ల అను గ్రామంలో ఎత్తైన బురుజును నిర్మించినారు, మరియు శివుని గుడి, అంజనేయస్వామి గుడిని కూడా నిర్మించినారు. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉన్నది. నందికొట్కూరు ప్రాంతంలోని సూర్యనారాయణ దేవాలయమును మరియు అంజనేయస్వామి దేవాలయమును అప్పటి రాజులు నిర్మించినారు, మరియు ఈ ప్రాంతంలో చౌడేశ్వరి దేవి ఆలయం ముఖ్యమైనవి.
సూర్యనారాయణ దేవాలయము
- ఈ దేవాలయము క్రీ.శ. 1300 వందల సంవత్సరములలో చోళ రజులలో సిరిసింగరాజు అనే సూర్యవంశరాజు ఈ సూర్యనారాయన దేవాలయమును నిర్మించెను.
- ఈ చోళరాజులలో సిరిసింగరాజు అలంపూరును పరిపాలిస్తుండేవాడు. ఒకానొక సమయములో సిరిసింగరాజు అలంపూరు నుండి శ్రీశైలం
వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము
నందికొట్కూరు పట్టణం నుంచి కొణిదేల గ్రామమునకు వెళ్ళే దారిలో అతి సుందరమైన, ప్రాచీనమైన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము వున్నది.