Coordinates: 13°24′00″N 79°47′00″E / 13.4000°N 79.7833°E / 13.4000; 79.7833

నాగలాపురం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
చి వర్గం:చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 67: పంక్తి 67:


[[వర్గం:చిత్తూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు]]

14:06, 11 డిసెంబరు 2013 నాటి కూర్పు

వేద నారాయణ స్వామి ఆలయ ప్రవేశ గాలిగోపురం
నాగలాపురం
—  మండలం  —
చిత్తూరు పటంలో నాగలాపురం మండలం స్థానం
చిత్తూరు పటంలో నాగలాపురం మండలం స్థానం
చిత్తూరు పటంలో నాగలాపురం మండలం స్థానం
నాగలాపురం is located in Andhra Pradesh
నాగలాపురం
నాగలాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో నాగలాపురం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°24′00″N 79°47′00″E / 13.4000°N 79.7833°E / 13.4000; 79.7833
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రం నాగలాపురం
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 33,886
 - పురుషులు 16,778
 - స్త్రీలు 17,108
అక్షరాస్యత (2001)
 - మొత్తం 63.58%
 - పురుషులు 74.35%
 - స్త్రీలు 53.18%
పిన్‌కోడ్ {{{pincode}}}



నాగలాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576. తిరుపతికి 70 కి.మీ. వాయవ్యంగా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది. శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు. సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.

దేవాలయనిర్మాణం

ఈ దేవాలయ ప్రాకారాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపజేశాడని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాకారాలు విజయనగర కాలపు శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చు తునక. జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయ ప్రాకారాలను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానములు జీర్ణోద్దరణ చేస్తోంది.

నాగలాపురం ఆలయ ప్రధాన గోపురము

ఆలయ విశిష్టత

నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం

ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడ భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.

పండుగలు

  • ఇక్కడ ఫాల్గుణ మాసం శుద్ద ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, విశేషం. ఈ మూడు రోజుల్లో సూర్య కిరణాలు వరుసగా స్వామివారి పాదాలపై, నాభిపై, నుదుటిపై పడతాయి. ఈ మూడు రోజులు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది.
  • జేష్ఠ మాసంలొ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
  • వైకుంఠ ఏకాశి
  • ఆండాళ్ళ నీరోత్సవం
  • భోగి
  • సంక్రాతి
  • కనుమ
  • రథసప్తమి
  • కంచిగరుడసేవ

బాహ్య లంకెలు

  • తితిదే వెబ్ సైటు[1]

మండలంలోని గ్రామాలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.