ఎలకూచి బాలసరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి C.Chandra Kanth Rao ఏలకూచి బాలసరస్వతి పేజీని ఎలకూచి బాలసరస్వతికి దారిమార్పు లేకుండా తరలించారు
(తేడా లేదు)

19:17, 29 డిసెంబరు 2013 నాటి కూర్పు

ఏలకూచి బాల సరస్వతి కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. ఇతడు క్రీ.శ పదునారవ శతాబ్దము చివరను పదునేడు పుర్వార్థమున ఉండినట్లు చారిత్రక ఆధారములున్నవి. ఇతనికి మహోపాధ్యాయ బిరుదము గూడ కలదు. అందువల్ల యితడు కవిగా కాక యెక్కువ పండుతుడని ప్రసిద్ధికెక్కినాదు. యితడు శతాగ్ర ప్రబంధ కర్త యగుటచే నితడు సంస్కృతాంధ్ర ములందు రెండిట ఉద్దండుడని తెలియుచున్నది. ఈయన తాను రచించిన యాదవ రాఘవ పాండవీయ మను త్ర్యర్థికావ్యమున స్వ విషయము నిట్లు వర్ణించి కొని యున్నాడు.

స్వీయ చరిత్ర పద్యములు

కవిమాహి తరంగ కౌముదీనామ నాటక విధాన ప్రతిష్ఠాఘనుండ
సారసారస్య సచ్చంద్రికా పరిణయ ప్రముఖ శతాగ్రప్రబంధ కర్త
నంధ్ర చింతామణీ వ్యాఖ్యాత భాషా వివరణాది బహుతంత్రకరణ చణుఁడ
వేద శాస్త్ర పురాణ వివిధ సంగీత సాహిత్యాది విద్యోపబృంహణుఁడ
ననఘ కౌండిన్య గోత్రుండ హరిపదాబ్జ, భక్తి శీలుండ నెలకూచి భైరవార్య
కృష్ణదేవతనూజుండ నే విచిత్ర, కావ్యమొక్కటి నిర్మింపఁగాఁ దొడగి."
మెండైనట్టి విచిత్ర వైఖరులచే మీఁదౌ మహా కావ్యముల్
దండిం దొల్లియ చేసి రాదిములు తద్కావ్యాధిక శ్లాఘ్యమై
యుంటన్ రాఘవ కృష్ణ పాండవ కథా యుక్త ప్రబంధంబు వా
క్పాండిత్యం బలరార శ్లేషరచనైక ప్రౌఢినేఁ జేసెదన్.

అని వ్యాసికొని యున్నాడు. కాని సుభాషిత త్రిశతి కాంధ్రానువాదమగు మల్లభూపాలీయమున కవతారికా పద్యములు లభింపమిచే నందేమి వ్రాసికొనియున్నాడో తెలియరాదు.

ఈయన కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. తన త్రిశతిని ఆ సంస్థానా ధీశ్వరుడు సురభిమల్ల భూపాలుని పేర రచించి యాయనచే రెండు వేల దీనారముల బహుకరణ మందెనని ప్రసిద్ధి. కృతి పతి వంశజులగు శ్రీ సురభి రాజా వేంకట లక్ష్మారావు బహదురు వారు యిదివరలో నీ మల్ల భూపాలీయమును ప్రకటించుయున్నారు.

ఆయన రచనల విశిష్టత

బాల సరస్వతి రచనలలో యాదవ రాఘవ పాండవీయము తెనుగు నందలి త్ర్యర్థి కావ్యములలో కెల్ల మొదటిది. అతని రంగ కౌముది యప్పుడప్పుడే వెలువడుచున్న యక్ష గానములతో నొకటియై నాటక ముల కుప లక్షణగ నున్నది. ఆయన ఆంధ్ర శబ్ద చింతామణి ని తెలుగు వివరణమును గూడా రచించెను. వీనిని బట్టి చూడ అతనీ ప్రబంధ, ద్వ్యర్థి కావ్య, కావ్యాలంకార సంగ్రహములను రచించిన భట్టుమూర్తితో సరిపోల్చ వచ్చును.

ఇతని కవిత్వమున జీవముట్టిపడు చుండును. ఇతడు శతక త్రయమునకు మకుటముగ, సురభిమల్లా నీతి వాచస్పతి,సురభిమల్లా మానినీ మన్మధా, సురభిమల్లా వైదుషీ భూషణా అని అనుకరించుయున్నాడు. మకుట నిర్బంధంచే నితడు శతక త్రయమున శార్దూల మత్తేభములతోనే రచించవలసి వచ్చెను.

ఉదాహరణలు

శ్రీ మద్బాల సరస్వతీ ప్రకటలక్ష్మీ హేతువై శాంత మై
యా మోదావహ మై నిజానుభవ వేద్యం బై యనే హోదిగా
ద్యామేయ ప్రవిదోధరూపమహితం బై యొప్పుతేజంబు ప్రా
పై మీకి న్సిరు లీపుతన్, సురభిమల్లా నీతి వాచస్పతీ.
ఉల్లం బక్కల హంసపైఁ గుపితమై యున్న న్విరోదింపఁ గా
నిల్లౌ దాని సరోజనీ వనమె మాయింప న్సమరుండు; తా
నీళ్లు న్బాలును నేర్పరింపఁ గల పాండిత్యంబు మాంపంగ లేఁ
డల్లోకేశ్వరుఁ డేమెయి, న్సురభిమల్లా నీతి వాచస్పతీ.