ప్రదీప్ కుమార్ ఆమత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రదీప్ కుమార్ ఆమత్
ప్రదీప్ కుమార్ ఆమత్


అటవీ & పర్యావరణ, పంచాయతీ రాజ్, త్రాగునీరు, ఐ & పిఆర్ శాఖ మంత్రి
పదవీ కాలం
2022 జూన్ 5 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2000 – ప్రస్తుతం
నియోజకవర్గం బౌద్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1952 అక్టోబర్ 18
భారతదేశం
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
తల్లిదండ్రులు గౌరీశంకర్ ఆమత్
జీవిత భాగస్వామి సీమ రాణి ఆమత్
సంతానం 2

ప్రదీప్‌కుమార్‌ ఆమత్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బౌద్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న అటవీ & పర్యావరణ, పంచాయతీ రాజ్, త్రాగునీరు, ఐ & పిఆర్ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

ప్రదీప్‌కుమార్‌ ఆమత్ 2004లో రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బౌద్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం బిజూ జనతా దళ్ పార్టీ లో చేరి 2009, 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రదీప్ కుమార్ 2009 మే 25 నుండి 2014 మే 20 వరకు & 2017 మే 16 నుండి 31 మే 2019 వరకు రెండుసార్లు ఒడిశా అసెంబ్లీ స్పీకర్‌గా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

మంత్రిగా[మార్చు]

శాఖ నుండి వరకు
స్టీల్ & మైన్స్ శాఖ సహాయమంత్రి 05 ఫిబ్రవరి 2008 21 మే 2009
ఆర్ధిక, పబ్లిక్ ఎంట్రప్రెస్స్ శాఖ మంత్రి 21 మే 2014 06 మే 2017
ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి 21 అక్టోబర్ 2016 06 మే 2017
అటవీ & పర్యావరణ, పంచాయతీ రాజ్, త్రాగునీరు, ఐ & పిఆర్ శాఖ మంత్రి 2022 జూన్ 5 ప్రస్తుతం

మూలాలు[మార్చు]

  1. Sakshi (6 June 2022). "ఒరిస్సా కొత్త క్యాబినెట్‌.. ఎన్నాళ్లో వేచిన ఉదయం." Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
  2. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.