ప్రశాంత్ నారాయణన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన వైసా భీ హోతా హై పార్ట్ II, షాడోస్ ఆఫ్ టైమ్, బాంబిల్ అండ్ బీట్రైస్, వయా డార్జిలింగ్, మర్డర్ 2[1] వంటి సినిమాలో తన పాత్రలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2]
నారాయణన్ కేరళలోని కన్నూర్లో మలయాళీ కుటుంబంలో జన్మించి ఢిల్లీలో పెరిగాడు.[3] ఆయన రాష్ట్ర బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాలలో చదువుకున్నాడు.[4]
ప్రశాంత్ నారాయణన్ 1991లో యాడ్ ఏజెన్సీని ప్రారంభించాలనే ఆలోచనతో ముంబైకి వచ్చి గోవింద్ నిహలానీ 'రుక్మావతి కి హవేలీ', సుభాష్ ఘయ్ 'సౌదాగర్', శ్యామ్ బెనెగల్ 'సర్దారీ బేగం' వంటి సినిమాలకు సహాయ కళా దర్శకునిగా ప్రారంభించి చాణక్య టీవీ సిరీస్కి కాస్ట్యూమ్ డైరెక్టర్గా పని చేశాడు. ఆయన మళ్లీ నాటకాలలో నటించడం ప్రారంభించి సాటర్డే సస్పెన్స్, పరివర్తన్, ఫర్జ్, ఫుల్వా, గాథ, కభీ కభీ, జానే కహన్ మేరా జిగర్ గయా జీ, షాగున్ వంటి టెలివిజన్ షోలలో నటించాడు.[5][6]