బలదేవ్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలదేవ్ సింగ్
1949లో భారత పార్లమెంటు ఆవరణలో పచ్చదనంపై బలదేవ్ సింగ్ (మధ్య)తో బాబాసాహెబ్ అంబేద్కర్ (కుడి వైపు), కె. ఎం. మున్షి (ఎడమవైపు)
1వ రక్షణ మంత్రి (భారతదేశం)
In office
1947 ఆగష్టు 17 – 1952 మే 13
ప్రథాన మంత్రిజవహర్‌లాల్ నెహ్రూ
అంతకు ముందు వారుస్థానం ఏర్పాటు చేయబడింది
తరువాత వారుఎన్.గోపాలస్వామి అయ్యంగార్
పార్లమెంటు సభ్యుడు - లోక్‌సభ
In office
1952–1959
వ్యక్తిగత వివరాలు
జననం(1902-07-11)1902 జూలై 11
రూపర్, పంజాబ్ ప్రావిన్స్ బ్రిటిష్ ఇండియా పంజాబ్, బ్రిటీష్ రాజ్ ఇప్పుడు భారతదేశం
మరణం1961 జూన్ 29(1961-06-29) (వయసు 58)[1]
ఢిల్లీ భారతదేశం
రాజకీయ పార్టీఇండియన్ నేషనల్ కాంగ్రెస్
శిరోమణి అకాలీ దళ్
అకాలీదళ్
కళాశాలఖల్సా కళాశాల, అమృత్‌సర్

బలదేవ్ సింగ్ (1902 జూలై 11 - 1961 జూన్ 29) ఒక భారతీయ సిక్కు రాజకీయ నాయకుడు, భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, భారతదేశపు మొదటి రక్షణ మంత్రి. అంతేకాకుండా, అతను 1947లో భారతదేశ స్వాతంత్ర్య, అలాగే భారత విభజన ఫలితంగా జరిగిన చర్చల ప్రక్రియలలో పంజాబీ సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహించిన నాయకుడు.స్వాతంత్ర్యం తరువాత, బల్‌దేవ్ సింగ్ మొదటి రక్షణ మంత్రిగా ఎంపికయ్యాడు. అంతేగాదు ప్రపంచంలోని ఏ దేశానికైనా "మొదటి సిక్కు రక్షణ మంత్రి"గా గణతికెక్కారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి కాశ్మీర్ యుద్ధం అతని పదవీకాలంలో జరిగింది. పంజాబీ, హిందీలో నాయకుడు లేదా అధిపతి అని అర్ధం సూచంచే సర్దార్ బిరుదుతో అతడిని తరచుగా సంబోధిస్తారు.

ప్రారంభ, రాజకీయ జీవితం[మార్చు]

బల్‌దేవ్ సింగ్ 1902 జూలై 11న పంజాబ్‌ లోని రూప్‌నగర్ జిల్లా, దుమ్నా గ్రామంలోని ఒక ఖత్రీ కుటుంబంలోని జన్మించాడు. అతని తండ్రి సర్ ఇంద్ర సింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త, అతని తల్లి నిహాల్ కౌర్ సింగ్ (ఆమె గ్రామం మాన్పూర్).బల్‌దేవ్ సింగ్ మొదట కైనౌర్‌లో తరువాత అమృత్‌సర్‌ లోని ఖల్సా కళాశాలలో చదివాడు. అతను తరువాత తన తండ్రి పనిచేస్తున్నఉక్కు పరిశ్రమకు చెందిన సంస్థలో పనిచేయడం ప్రారంభించాడు.అతను అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగాడు. పంజాబ్‌ లోని జల్లాన్‌పూర్ గ్రామానికి చెందిన హర్‌దేవ్ కౌర్‌ని వివాహం చేసుకున్నాడు. వారికి సర్జిత్ సింగ్, గురుదీప్ సింగ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.1937లో భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పాంథిక్ పార్టీతరుపు అభ్యర్థిగా బలదేవ్ సింగ్ గెలిచాడు. అతను మాస్టర్ తారా సింగ్, శిరోమణి అకాలీదళ్‌తో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాడు.

క్రిప్స్ మిషన్, రెండవ ప్రపంచ యుద్ధం[మార్చు]

క్రిప్స్ మిషన్ 1942లో భారతీయులకు స్వయం పరిపాలనను అందించడానికి భారతదేశానికి వచ్చినప్పుడు, బలదేవ్ సింగ్ సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపిక చేయబడ్డాడు. ఇందులో ప్రధాన భారత రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీలు ఉన్నాయి. కానీ మిషన్ ఎటువంటి పురోగతిని సాధించలేదు.కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించగా, బలదేవ్ సింగ్, ఇతర సిక్కు నాయకులు మద్దతు ఇవ్వలేదు. పంజాబ్‌లో యానియన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమైక్యవాద ముస్లిం లీగ్ నాయకుడు సర్ సికిందర్ హయత్ ఖాన్‌తో బలదేవ్ సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ప్రభుత్వంలో 1942 వేసవికాలంలో కొంతకాలం పాటు ప్రాంతీయ అభివృద్ధి మంత్రిగా పనిచేసాడు.

క్యాబినెట్ మిషన్, ప్రభుత్వం[మార్చు]

భారత రాజకీయ స్వాతంత్ర్యం కోసం ప్రతిపాదనలను చర్చించడానికి వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్రణాళికకు సిక్కు దృక్కోణానికి ప్రాతినిధ్యం వహించడానికి బలదేవ్ సింగ్ మళ్లీ ఎంపికయ్యాడు. మతపరమైన మైనారిటీల హక్కుల ప్రత్యేక రక్షణలతో భారతదేశం సమైక్య దేశంగా ఉండాలని సిక్కుల అభిప్రాయాన్ని సింగ్ పునరుద్ఘాటించాడు. ఒకవేళ విభజన అనివార్యమైతే, ముస్లిం ఆధిపత్యం నుండి సిక్కులకు ప్రాదేశిక రక్షణ కల్పించే విధంగా పంజాబ్ విభజన జరగాలని కూడా సింగ్ పట్టుబట్టాడు. బల్దేవ్ సింగ్, ఇతర సిక్కులు మొదట్లో మిషన్ 16 మే పథకాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకించినప్పటికీ, సిక్కు సమాజానికి ఎలాంటి రక్షణ కల్పించలేదనే కారణంతో, కాంగ్రెస్ నాయకులు జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ నేతృత్వంలోని కొత్త వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో సిక్కు సమాజం తరుపున సభ్యుడుగా బలదేవ్ సింగ్ చేరాడు.సింగ్ డిఫెన్స్ మెంబర్ అయ్యాడు, ఈ పదవిని గతంలో బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ భారత సైనిక దళం నిర్వహించాడు. అయితే, 1947 ప్రారంభంలో, కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ మధ్య వైరుధ్యం కారణంగా మధ్యంతర ప్రభుత్వం పనిచేయదని స్పష్టమైంది.

భారతదేశ విభజన తరువాత[మార్చు]

రక్షణ మంత్రిగా బలదేవ్ సింగ్[మార్చు]

సి. రాజగోపాలచారి, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌తో సింగ్

1947 ఆగస్టు 15న, భారతదేశం స్వతంత్ర దేశంగా మారింది. భారతదేశపు మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో బలదేవ్ సింగ్ భారతదేశపు మొదటి రక్షణ మంత్రి అయ్యాడు. సింగ్ భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడుగా కూడా పనిచేసాడు.

కొత్తగా సృష్టించబడిన పాకిస్తాన్ నుండి బయలుదేరిన 10 మిలియన్లకు పైగా హిందువులు, సిక్కులకు భద్రత, ఉపశమనం, ఆశ్రయం కల్పించడానికి భారత సైన్యం చేస్తున్న ప్రయత్నాలకు నాయకత్వం వహించే హోం మంత్రి వల్లభాయ్ పటేల్‌తో పాటు బలదేవ్ సింగ్ బాధ్యత వహించాడు. పంజాబ్, బెంగాల్‌లో సరిహద్దుకు ఇరువైపులా భయంకరమైన హింస చెలరేగింది. ఒక మిలియన్ కు పైగా ప్రజలు మరణించారని అంచనావేసారు.మిలియన్ల మంది వలసలవలన, జరిగిన క్రూరత్వం వలన శారీరక, వ్యక్తిగత గాయాలతో బాధపడ్డారు.

సైన్యం సిద్ధపడకుండా సంఘర్షణతో నలిగిపోయి, పట్టుబడింది. వేలాది మంది ముస్లిం అధికారులు పాకిస్థాన్‌కు బయలుదేరారు. కలకత్తా, ఢిల్లీ, బొంబాయిలలో అల్లర్లు చెలరేగాయి. పటేల్, సింగ్ ముందు నుండి నాయకత్వం వహించారు. భారీ టోల్ ఉన్నప్పటికీ, సైన్యం చివరకు భారతదేశం అంతటా, పంజాబ్, బెంగాల్ సరిహద్దులలో శాంతిని, చట్టాన్ని పునరుద్ధరించింది. భారతదేశానికి చేరుకున్న లక్షలాది మంది ప్రజల కోసం వారు భారీ సహాయ కార్యకలాపాలను నిర్వహించారు.

కాశ్మీర్‌లో యుద్ధానికి సన్నాహాలు, ప్రణాళికకు రక్షణ మంత్రి సింగ్ నాయకత్వం వహించాడు.ఈ యుద్ధం పాకిస్తాన్ గిరిజనులతో విరుచుకుపడింది. కొంతమంది సైనిక అధికారులు పాకిస్తాన్‌లో విలీనం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోకి చొరబడ్డారు. దాదాపు రెండు సంవత్సరాలలో, భారత సైన్యం ప్రపంచంలోని అత్యంత ఎత్తు ప్రదేశాల నుండి ఉగ్రవాదులతో, పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తింది. శ్రీనగర్ నుండి, బారాముల్లా పాస్ దాటి రైడర్లను వెనక్కి నెట్టడంలో సైన్యం విజయం సాధించింది. అయితే ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో నెహ్రూ కాల్పుల విరమణ ప్రకటించటంతో భూభాగంలో గణనీయమైన భాగం ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం దృఢమైన నియంత్రణలో ఉండి, ఆక్రమిత కాశ్మీర్ వివాదం  పుట్టింది.

1948 సెప్టెంబరులో, హోం మంత్రి వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు, బలదేవ్ సింగ్, అతని కమాండర్లు ఆపరేషన్ పోలో కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. వారం రోజుల పాటు హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశారు. కశ్మీర్ వివాదం, భారతదేశ రాజకీయ సమైక్యత సమస్యలపై బలదేవ్ సింగ్, పటేల్‌కు సన్నిహిత సలహాదారుగా ఉన్నాడు.బలదేవ్ సింగ్ రాజకీయ సమగ్రతపై నెహ్రూ విశ్వాసం సన్నగిల్లినందున బలదేవ్ సింగ్ రక్షణ మంత్రి పదవి నుండి తొలగించబడ్డాడు.[2]

తరువాత జీవితంలో[మార్చు]

1952 లో, భారత కొత్త రాజ్యాంగం ప్రకారం జరిగిన మొదటి ప్రజాస్వామ్య ఎన్నికల్లో బల్దేవ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా భారత పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. అయితే అతను నెహ్రూ పరిపాలనలో చేరలేదు. సింగ్ సిక్కు ఆందోళనలను గౌరవించి, అకాలీదళ్ తరుపున ప్రధాన రాజకీయ ప్రతినిధిగా కొనసాగాడు.1957 లో పార్లమెంటుకు తిరిగి ఎన్నికయ్యాడు.

1961లో సుదీర్ఘ అనారోగ్యంతో సింగ్ ఢిల్లీలో మరణించాడు. అతను తన ఇద్దరు కుమారులు సర్జిత్ సింగ్ (సా.శ. 1927-1993), గుర్దీప్ సింగ్‌తో జీవించాడు. సర్జిత్ సింగ్, ప్రకాష్ సింగ్ బాదల్ ప్రభుత్వంలో సహకార మంత్రిగా పనిచేసాడు. అతను రాజ్ మొహిందర్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. అతనికి ఒక కుమారుడు తేజ్‌బాల్ సింగ్, ఒక కుమార్తె జస్ప్రీత్ కౌర్ ఉన్నారు. గురుదీప్ సింగ్ బల్జిత్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. నలగురు పిల్లలు ఉన్నారు. బల్‌దేవ్ సింగ్‌కు ఏడుగురు మనవరాళ్లు ఉన్నారు. అతని మేనల్లుడు రవి ఇందర్ సింగ్ పంజాబ్ విధాన సభ స్పీకరుగా పనిచేసాడు.

ఇది కూడ చూడు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Sardar Baldev Singh, 58, Dies; First Defense Minister of India". The New York Times. 1961-06-30.
  2. Book Reminiscences of the Nehru Age by MO Mathai.

వెలుపలి లంకెలు[మార్చు]