బల్వంతరాయ్ మెహతా
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
| బల్వంతరాయ్ మెహతా | |||
| |||
గుజరాత్ ముఖ్యమంత్రి
| |||
|---|---|---|---|
| ముందు | డాక్టర్ జీవ్రాజ్ మెహతా | ||
| తరువాత | హితేంద్ర కే దేశాయ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1900 ఫిబ్రవరి 19 భావ్నగర్, గుజరాత్, భారతదేశం | ||
| మరణం | 1965 సెప్టెంబరు 19 (వయసు: 65) సుతారి, కచ్చహ్, గుజరాత్ | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | సరోజ్బెన్ | ||
| మతం | హిందూ | ||
బల్వంతరాయ్ మెహతా (1900 ఫిబ్రవరి 19 - 1965 సెప్టెంబరు 19) భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతను సాహసోపేతమైన స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, పంచాయితీరాజ్ (స్థానిక ప్రభుత్వ) భావన మార్గదర్శకుడు. ఇతను బర్డోలి సత్యాగ్రహ సైనికుడు. రాచరిక రాష్ట్రాల రంగపు స్వయం పాలన కోసం ప్రజల పోరాటంలో ఇతని అత్యుత్తమ సహకారం ఉంది. ఇతని పేరు సుస్పష్టంగా ప్రజాస్వామ్య వికేంద్రీకరణతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా "బల్వంతరాయ్ మెహతా కమిటీ" సిఫార్సులు ఆధారంగా దేశంలో అమలు పరచబడి, బాగా ప్రాచుర్యం పొందిన పంచాయితీ రాజ్ అనే విప్లవాత్మక కార్యక్రమంతో ఇతను ఖ్యాతి పొందాడు.
ఫాదర్ ఆఫ్ పంచాయితీరాజ్
[మార్చు]స్వాతంత్ర్యం తరువాత ఇతను భారతదేశ లోక్సభకు పార్లమెంటు సభ్యునిగా రెండుసార్లు ఎన్నికయ్యాడు. ఇతను పార్లమెంట్ అంచనా కమిటీ అధ్యక్షుడుగా ఉన్నాడు.ప్రణాళిక ప్రాజెక్ట్స్ కమిటీ అధ్యక్షుడుగా భారతదేశంలోని రాష్ట్రాలలో మూడు అంచెల వ్యవస్థ స్థాపన కోసం మెరుగైన విధానానికి ఒక అద్భుతమైన నివేదికను ప్రవేశపెట్టాడు.అందువలన ఇతను భారతదేశపు పంచాయితీ రాజ్ ఫాదర్గా ప్రశంసించబడ్డాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- పంచాయితీ రాజ్ వ్యవస్థ - ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ.