బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం
రకంప్రజా
స్థాపితం1981
ఛాన్సలర్ద్రౌపది ముర్ము
వైస్ ఛాన్సలర్పర్వీందర్ కౌశల్
స్థానంరాంచీ, జార్ఖండ్, భారతదేశం
కాంపస్పట్టణ
అనుబంధాలుయూజీసీ


బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం (Birsa Agricultural University) జార్ఖండ్ రాష్ట్రం రాంచీ జిల్లా కన్కేలో ఉన్న విశ్వవిద్యాలయం. భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చే 1981, జూన్ 26న అధికారికంగా ప్రారంభించబడింది.[1]

వివరాలు[మార్చు]

సాంకేతికతను ఉపయోగించుకొని బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలోని వ్యవసాయం, పశు, అటవీ సంపదను అభివృద్ధి చేయడం ఈ విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా, గిరిజన, ఇతర వెనుకబడిన తరగతుల వారి ఆర్థికాభివృద్ధికి కావలసిన కార్యకలాపాలను విద్య, పరిశోధనల ద్వారా నిర్వహిస్తున్నది.

ప్రాంగణం[మార్చు]

రాంచీ - పట్రారు రోడ్డులో ఆధునిక ప్రాంగణంతో ఉన్న ఈ విశ్వవిద్యాలయం బిర్సా ముండా విమానాశ్రయం నుండి 17 కిలోమీటర్ల దూరంలో, రాంచీ రైల్వేస్టేషన్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో తొమ్మిది బాలుర, ఐదు బాలికల హాస్టళ్లు ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

  • వ్యవసాయ విభాగం
  • పశు సంవర్థక విభాగం
  • అటవీ విభాగం
  • బయో-టెక్నాలజీ కళాశాల

మూలాలు[మార్చు]

  1. Sarvgyan, Colleges. "Birsa Agricultural University, Ranchi". www.sarvgyan.com. Retrieved 1 July 2018.

బాహ్య లింకులు[మార్చు]