బులుసు వెంకట రమణయ్య

వికీపీడియా నుండి
(బులుసు వేంకటరమణయ్య నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బులుసు వెంకట రమణయ్య (డిసెంబరు 24, 1907 - మే 25, 1989) జననం విశాఖజిల్లా విజయనగరందగ్గర రామతీర్థంలో. జన్మదినం డిసెంబరు 24, 1907. విజయనగరం సంస్కృత కళాశాలలో చదువుకున్నారు. కాశీ విశ్వ విద్యాలయంలో అలంకారశాస్త్రంలో 1930-32లో పరిశోధన చేసేరు.మద్రాసులో కెల్లెట్ హైస్కూలులో ప్రధానాంధ్ర అధ్యాపకులుగా పని చేసేరు. “రావు” అన్న కలంపేరుతో ప్రసిద్ధపత్రికలలో కథలు ప్రచురించేరు.

పట్టాలు[మార్చు]

  • సాహిత్యవిద్యా ప్రవీణ,
  • ఉభయభాషాప్రవీణ,
  • P.O.L.

రచనలు[మార్చు]

  • విజయవిలాసము
  • పాండురంగ మాహాత్మ్యము
  • శ్రీ కాళహస్తి మాహాత్మ్యము
  • సారంగధర
  • బాలవ్యాకరణము
  • ప్రౌఢ వ్యాకరణాలకు టీకలు

అనువాదములు[మార్చు]

  • రసార్ణవ సుధాకరము
  • కువలయానందము

నాటకములు[మార్చు]

  • అభిషేకము నాటకము

కథలు, నవలలు[మార్చు]

  • పంచతంత్రము
  • అప్పటి ముచ్చటలు
  • చిత్తూరు దుర్గము
  • దీపకళికలు
  • పదహారు రాత్రులు
  • ఇందిరాదేవి
  • గజపతిరాజుల తెలుగు సాహిత్య పోషణము (1964)[1]
  • గజపతులనాటి గాథలు (1955)[2]

పదహారు రాత్రులు[మార్చు]

పదహారు రాత్రులు వేంకటరమణయ్య రచించిన కథాసంకలనం. ఇందులోని కథలు: చార్వాక - గణపతుల కథ, బాలరాజు కథ, బింబ - ప్రతిబింబముల కథ, సువర్ణమాల కథ, ముగ్గురు రాణుల కథ, కపట సన్యాసి కథ, మనసులేని మనువు కథ, పరకాయ ప్రవేశము కథ, ఎండమావులు నమ్మిన వర్తకుని కథ, ఎర్రపెదవుల రాక్షసి కథ, నాగరాజు పగబట్టిన కథ, పండ్లుతిన్న ఫలితము కథ, యమ - మన్మథుల కథ, కృతాకృతుని కథ, తేనెటీగ - ఎర్రతామర కథ, వలపు - గెలుపు

వర్గాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత డిజిటల్ లైబ్రరీలో గజపతిరాజుల తెలుగు సాహిత్య పోషణము పుస్తకం.
  2. భారత డిజిటల్ లైబ్రరీలో గజపతులనాటి గాథలు, మొదటి భాగము పుస్తక ప్రతి.