బోధ్ గయ
బోధ్ గయ | |
---|---|
పట్టణం | |
![]() బుద్ధ విగ్రహం | |
Coordinates: 24°41′42″N 84°59′33″E / 24.6950°N 84.9925°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | గయ |
విస్తీర్ణం (2015) | |
• నగరం | 20.2 కి.మీ2 (7.8 చ. మై) |
• ప్రాంతీయ ప్రణాళిక ప్రకారం | 83.78 కి.మీ2 (32.35 చ. మై) |
జనాభా (2018) | |
• మొత్తం | 48,184 |
భాషలు | |
• అధికార | హిందీ |
కాల మండలం | UTC+5:30 (భారత కాలమాన ప్రకారం) |
పిన్ కోడ్ | 824231 |
Vehicle registration | BR-02 |
బుద్ధ గయ లేదా బోధ్ గయ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లాలో ఉంది. బుద్ధగయ పాట్నా నగరం నుండి 96 కిలోమీటర్ల దూరంలో, గయ పట్టణానికి సమీపంలో ఉంది. గతంలో ఇది మగధ అనే రాజ్యానికి రాజధానిగా ఉండేది. బౌద్ధమతంలోని నాలుగు ప్రధాన యాత్రా స్థలాలలో ఇది అతి ముఖ్యమైనది.[1] మిగిలిన మూడు కుషినగర్, లుంబినీ, సారనాథ్. బుద్ధగయలో వజ్ర సింహాసనం, బోధి వృక్షంతో కూడిన మహాబోధి ఆలయం ఉంది. గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. 2002 సంవత్సరంలో, బోధ్ గయలో ఉన్న మహాబోధి ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.[2]
చరిత్ర
[మార్చు]దాదాపు 528 బిసి కాలంలో, క్రీస్తుపూర్వం 328 వైశాఖ మాసంలో (ఏప్రిల్-మే) కపిలవస్తు యువరాజు గౌతముడు సత్యాన్వేషణ కోసం ఇల్లు వదిలి వెళ్ళాడు. జ్ఞాన అన్వేషణలో, గౌతముడు నిరంజన నది ఒడ్డున ఉన్న ఉరువేల అనే చిన్న గ్రామానికి వచ్చాడు. అతను ఆ గ్రామంలోని ఒక రావి చెట్టు కింద ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఒకరోజు, అతను ధ్యానంలో మునిగిపోయినప్పుడు, ఆ గ్రామానికి చెందిన సుజాత అనే అమ్మాయి అతని కోసం ఒక గిన్నెడు పాయసం, తేనె తెచ్చింది. ఆ ఆహారం తిన్న తర్వాత, గౌతముడు మళ్ళీ ధ్యానంలో మునిగిపోయాడు. మూడు పగళ్లు, రాత్రులు ధ్యానం చేసిన తర్వాత, ఆయనకు జ్ఞానోదయం లభించింది, ఆ తర్వాత ఆయన బుద్ధుడిగా ప్రసిద్ధి చెందాడు. దీని తరువాత, అతను వివిధ ప్రదేశాలలో 7 వారాలు ధ్యానం చేసి, తరువాత సారనాథ్ వెళ్లి అక్కడ తనకు జ్ఞానోదయం అయినట్లు ప్రకటించాడు. కొన్ని నెలల తర్వాత బుద్ధుడు ఉరువేల తిరిగి వచ్చాడు. ఇక్కడికి అతని ఐదుగురు స్నేహితులు వారి అనుచరులతో కలిసి అతన్ని కలవడానికి వచ్చి వారికి దీక్ష ఇవ్వాలని కోరారు. ఆ వ్యక్తులకు దీక్ష ఇచ్చిన తర్వాత, బుద్ధుడు రాజ్గిర్కు వెళ్ళాడు. కాలానుక్రమేణ ఈ గ్రామం సంబోధి, వైజరాసన లేదా మహాబోధి అనే పేర్లతో పిలువబడింది. 18వ శతాబ్దం నుండి బుద్ధగయ అనే పదం ప్రస్తావన కనిపించడం ప్రారంభమైంది.[3] క్రమంగా ఈ ప్రదేశం బుద్ధగయగా ప్రసిద్ధి చెందింది, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రోజు బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. బౌద్ధమతంలో బుద్ధగయను అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు.[4] బుద్ధుని కాలంలో ఉరువేల అని పిలువబడే ఇది లీలాజన (నిరంజన) నది ఒడ్డున ఉంది. ఈ ప్రదేశంలో మొదటి ఆలయాన్ని మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించాడు.[5]
మహాబోధి ఆలయం
[మార్చు]
మహాబోధి ఆలయం భారతదేశంలో ఇప్పటికీ నిలిచి ఉన్న అతి పురాతన ఇటుక ఆలయాలలో ఒకటి. మౌర్య చక్రవర్తి అశోకుడు బుద్ధుని జ్ఞానోదయం జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడు. 12వ శతాబ్దంలో ఘురిద్ రాజవంశానికి చెందిన భక్తియార్ ఖిల్జీ నేతృత్వంలో జరిగిన దండయాత్రలలో ఇది నాశనమైంది. తరువాత శ్రీలంక బౌద్ధ సంస్కర్త అయిన అనగరిక ధర్మపాల దీనిని తిరిగి పునరుద్ధరించాడు. ఈ ఆలయం 55 మీటర్లు (180 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఆలయం లోపల ఉన్న మందిరంలో బుద్ధుని పసుపు రంగు ఇసుకరాయి విగ్రహం ఉంటుంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Holy Sites of Buddhism: Bodh Gaya – Place of Enlightenment". buddhanet.net. Archived from the original on 1 September 2010. Retrieved 14 December 2019.
- ↑ Centre, UNESCO World Heritage. "Mahabodhi Temple Complex at Bodh Gaya". UNESCO World Heritage Centre. Retrieved 2025-04-02.
- ↑ Barua, Sukomal (2012). "Buddha Purnima". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh. Archived from the original on 8 May 2016.
- ↑ "Spectrum | Sundayobserver.lk – Sri Lanka". Sundayobserver.lk. 22 April 2012. Archived from the original on 13 October 2014. Retrieved 2 June 2014.
- ↑ "History – Bodhgaya Temple". Retrieved 2025-04-02.
- ↑ "Mahabodhi Temple". tourism.bihar.gov.in. Retrieved 2025-04-02.