బ్రిటన్ రాణి విక్టోరియా
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
| Victoria | |
|---|---|
| Photograph by Alexander Bassano, 1882 | |
| పరిపాలనా కాలం | 20 June 1837 – 22 January 1901 |
| పట్టాభిషేకం | {{{Coronation}}} |
| ముందువారు | William IV |
| తర్వాతివారు | Edward VII |
| Prime Ministers | See list |
| Consort | Albert of Saxe-Coburg and Gotha |
| సంతతి | |
| Victoria, German Empress Edward VII of the United Kingdom Alice, Grand Duchess of Hesse Alfred, Duke of Saxe-Coburg and Gotha Helena, Princess Christian of Schleswig-Holstein Princess Louise, Duchess of Argyll Prince Arthur, Duke of Connaught Prince Leopold, Duke of Albany Beatrice, Princess Henry of Battenberg | |
| పూర్తి పేరు | |
| Alexandrina Victoria | |
| రాజగృహం | House of Hanover |
| తండ్రి | Prince Edward, Duke of Kent and Strathearn |
| తల్లి | Princess Victoria of Saxe-Coburg-Saalfeld |
| ఖననం | 2 February 1901 Frogmore, Windsor |
| సంతకం | |
విక్టోరియా (అలెగ్జాండ్రినా విక్టోరియా; మే 24, 1819 - జనవరి 22, 1901) యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్కు క్వీన్ రీజెంట్గా 1837, జూన్ 20 నుంచి, మరియు 1876, మే 1 నుంచి భారత దేశంలోని బ్రిటిష్ రాజ్యానికి తొలి రాణిగా మరణించే వరకు కొనసాగారు. ఇతర బ్రిటీష్ రాజుల కంటేను, అదే విధంగా చరిత్రలోని ఇతర రాణుల కన్నా గరిష్ఠంగా ఆమె 63 సంవత్సరాల 7 నెలల పాటు పరిపాలించారు. ఆమె పాలనాకాలాన్ని విక్టోరియా కాలం (విక్టోరియన్ ఎరా) అంటారు. ఈ కాలంలో బ్రిటీష్ సామ్రాజ్యంలో పారిశ్రామిక, సాంస్కృతిక, రాజకీయ, శాస్త్ర, సైనిక రంగాలు అభివృద్ధి సాధించాయి.
విక్టోరియా జర్మనీ సంతతకి చెందినది; ఆమె జార్జ్3 నాలుగో కుమారుడు ప్రిన్స్ ఎడ్వర్డ్, డ్యూక్ ఆఫ్కెంట్, స్ట్రాధీర్న్ల కుమార్తె. ఆమె జన్మించిన ఏడాదికే డ్యూక్ ఆఫ్ కెంట్, మూడవ జార్జ్ మరణించారు. ముగ్గురు అన్నలు వారసులను కనకుండానే మరణించడంతో ఆమె తన 18వ ఏట పాలనా బాధ్యతలు పొందింది. ఆమె సింహసనం అధిష్టించే నాటికే బ్రిటన్ రాజ్యాంగం ఉన్న సుస్ధిర సామ్రాజ్యం. రాజు లేదా రాణికి కొన్ని స్వచ్ఛంద అధికారాలు ఉన్నాయి. వాటిని ప్రధాన మంత్రి సలహా మేరకు అమలు చేయవచ్చు; కానీ రాణికి ఎంతో కీలకమైన గుర్తింపు ఉండేది. ఆమె కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం అప్రతిహాతంగా విస్తరించింది. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుగాంచింది.
ఆమె తొమ్మిది మంది పిల్లలు మరియు 42 మంది మనువలు, మనవరాళ్ళు యూరోప్ ఖండంలోని రాజుకుటుంబాలతో వివాహం సంబంధాలు కలిగి ఉన్నారు. అందువల్లనే ఆమెను "యూరప్ అమ్మమ్మ" అని పిలుస్తారు.[1] ఆమె హనోవర్ రాజుకుటుంబానికి చెందిన చివరి రాణి; ఆమె కుమారుడు కింగ్ ఎడ్వర్డ్ 7 సాక్స్-కొబర్గ్ మరియు గోథా రాజ కుటుంబానికి చెందినవాడు.
విషయ సూచిక
సింహసన వారసురాలు[మార్చు]
విక్టోరియా 1819 మే 24 న ఉదయం 4.15 నిమిషాలకు లండన్లోని కెన్సింగ్టన్ ప్యాలెస్లో జన్మించింది.[2] డ్యూక్ ఆఫ్ కెంట్ ప్రిన్స్ ఎడ్వర్డ్, మరియు ప్రిన్సెస్ విక్టోరియా ఆఫ్ సాక్స్, కొబర్గ్, సాల్ఫీల్డ్ స్టాథరిన్ యొక్క ఏకైక కుమార్తె. డ్యూక్ ఆఫ్ కెంట్ యునైటెడ్ కింగ్డమ్ ప్రస్తుత రాజు జార్జ్ 3 నాలుగవ కుమారుడు. విక్టోరియాకు ఆర్క్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ చార్లెస్ మానర్స్ సట్టాన్ 24 జూన్ 1819న కెన్సింగ్టన్ ప్యాలెస్లోని కపోలా గదిలో సన్నిహితుల సమక్షంలో పేరు పెట్టాడు. దీనికి ఆమె గాడ్పేరెంట్స్ రష్యా రాజు అలగ్జాండర్1 (బదులు ఆమె అంకుల్ డ్యూక్ ఆఫ్ యార్క్), ఆమె మామ ప్రిన్స్ రీజెంట్ (తర్వాత జార్జ్4, ఆమె అత్త ఉర్టమ్బర్గ్ రాణి చార్లోటి (బదులు ఆమె చెల్లెలు ప్రిన్సెస్ అగస్టా సోఫియా ఉన్నారు.) ఆమె అమ్మమ్మ డచెస్ ఆఫ్ సాక్స్ కోబర్గ్ సాల్ఫీల్డ్ (బదులుగా చిన్నారి రాకుమారి మేనత్త ప్రిన్సెస్ మేనీ, డచెస్ ఆఫ్ గ్లోసెస్టర్, ఎడిన్బర్గ్) పాల్గొన్నారు. ప్రిన్స్ రెజెంట్ సూచన మేరకు ఆమె తండ్రి పేరులోని అలెంగ్జాండ్రినా అని, తల్లి పేరులో ఉన్నవిక్టోరియా అనీ పేరుపెట్టారు.[3]
రాజుగారి పెద్ద కుమారులు ప్రిన్స్ రిజెంట్, డ్యూక్ ఆఫ్ యార్క్, డ్యూక్ ఆఫ్ క్లారెన్స్ ( తర్వాత విలియమ్4) ముగ్గురికీ చట్టబద్ద వారసులు లేరు. విక్టోరియా ఆమె తండ్రి, మేనమామల తర్వాత వారసత్వం అందుకునే విషయంలో అయిదవ స్థానములో ఉంది. ఆమె తాత, తండ్రి 1820లో మరణించారు. డ్యూక్ ఆఫ్ యార్క్ 1827లో మరణించాడు. 1830లో ఆమె అంకుల్ జార్జ్ 4 మరణించారు. తన మేనమామ విలియం4కు భావించదగ్గ వారసురాలయింది. విక్టొరియా మైనర్గా ఉన్నప్పుడు రాజు విలియం మరణిస్తే ఆ బాలికను రాణిని చేయడానికి వీలుకల్పించేందుకు పార్లమెంటు 1830లో రిజెంట్ చట్టం చేసింది. దీని ప్రకారం రాణి మైనర్గా ఉన్న సమయంలో విక్టోరియా తల్లి డచస్ ఆఫ్ కెంట్ రిజెంట్గా ఉంటుంది. ఆమె అధికారాలను నియంత్రించేందుకు కౌన్సిల్కు అధికారాలు ఉండవు.[4] రెజెంట్గా ఉండేందుకు డచస్ సామర్థ్యాన్ని కింగ్ విలియమ్ నమ్మలేదు. అందువల్ల ఆమె సమక్షంలోనే విక్టోరియాకు 18వ పుట్టినరోజు వరకూ జీవించి ఉండాలనుకుంటున్నానని, ఫలితంగా రెజెన్సీని తొలగించవీలుంటుందని ప్రకటించాడు.[1]
విక్టోరియా ఆ తర్వాత తన బాల్యాన్ని 'ఒక విషాదం' అని వర్ణించింది.[5] విక్టోరియా తల్లి రాకుమారిని సంరక్షిస్తుండేది, 'కెన్సింగ్టన్ విధానం'గా పేర్కొనే పద్ధతిలో ఆమెను దాదాపు ఏకాంతంలో పెంచింది. డచస్, ఆమె ప్రేమికునిగా పేర్కొనే, ఆమె ఆజ్ఞలు శిరసావహించే సర్ జాన్ కాన్రాయ్లు కఠిన నియమ నిబంధనల పరిధిలో ఆమెను పెంచారు. అనవసర వ్యక్తులు, బలహీనులగా భావించేవారిని, రాకుమారిపై ఆధారపడే వారిని కలవడాన్ని నిరాకరించారు.[6] ఇతర పిల్లలతో ఆమె కలవడానికి అనుమతించలేదు. కింగ్చార్లెస్ స్పానియల్, డాష్లు ఆమె ప్రధాన సహచారులు. రాణి అయ్యేవరకూ ఆమె రాత్రిపూట తల్లివద్ద పడుకునేది.[6] యుక్తవయసు వచ్చిన విక్టోరియా వారి నుంచి హెచ్చరికలు నిలువరించగలిగింది, కాన్రాయ్ని తన వ్యక్తిగత కార్యదర్శిగా చేయాలన్న వారి ప్రయత్నాలను వ్యతిరేకించింది. రాణి అయిన తర్వాత కాన్రాయ్ను తన నివాసప్రాంతం నుంచి తొలగించింది (కానీ అతన్ని తన తల్లి నివాసం నుంచి తొలగించలేక పోయింది) ఆమె తల్లిని కూడా ప్యాలెస్లో దూరంగా ఉంచి, ఆమెను కలవడానికి కూడా నిరాకరించింది.[6]
డచస్పై ఆమె మరుదుల భార్యలు, వారి పరసంబంధాల పిల్లలు పుకార్లు పుట్టించారు. అవి విస్తరించడంతో ప్రజలు రాజకుటుంబాన్ని చీదరించుకున్నారు; విక్టోరియా నైతికతగా ప్రతిపాదితమైన లైంగిక అక్రమత్వం గురించి చిన్నపాటి అనుమానాన్ని కూడా తోసిపుచ్చమని ఆమె తన కుమార్తెకు చెప్పింది.[6]
విక్టోరియా యొక్క సంరక్షకురాలు హానోవర్కి చెందిన బారోనెస్ లెజెన్ విక్టోరియా ప్రభావం ఉండేది, విక్టోరియా సింహాసనం అదిష్టించిన తర్వాత ఆమె విక్టోరియా గృహ బాధ్యతలు నిర్వహించడం కొనసాగించింది. విక్టోరియాకు బారెన్ లీజెన్తో సన్నిహిత సంబంధాలు రాణి ప్రిన్స్ విక్టోరియాను వివాహం చేసుకోవడంతో నిలిచిపోయాయి. ఇంటివ్యవహారాలు చూడగల సామర్థ్యం లీజెన్లో లేవని ప్రిన్స్ ఆల్బర్ట్ గుర్తించాడు, వారి తొలి సంతానం సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ పరిస్థితులు అనుమానించాడు.
పరిపాలన తొలిరోజులు[మార్చు]
యాక్సెషన్[మార్చు]
విక్టోరియాకు 1837 మే 24న 18యేళ్లు నిండాయి, మరియు రెండవ బ్రిటిష్ రిజెన్సీ తొలగించారు. 1837 జూన్ 20న విలియం4 తన 71వ యేట గుండెపోటుతో మరణించాడు,[7] విక్టోరియా యునైటెడ్ కింగ్డమ్ రాణి అయ్యింది.[8] ఆమె తన డైరీలో ఇలా రాసుకుంది, " అమ్మ లేపితే ఉదయం 6గంటలకు నిద్రలేచాను... కాంటర్బరీ ఆర్చ్ బిషప్, లార్డ్ కానిన్హామ్ నన్ను చూడ్డానికి వచ్చారని చెప్పింది. బెడ్ మీద నుంచి లేచి నా సిట్టంగ్ రూమ్కు ఒంటరిగా వెళ్లి (నా డ్రెసింగ్ గౌన్లో) వారిని చూసాను. ఆ ఉదయం 2 తర్వాత 12 నిమిషాలకు, "మా అంకుల్, రాజుగారు మరణించారని, అందువల్ల నువ్వే రాణివి అని లార్డ్ కానిన్హామ్ చెప్పారు..."[7] ఆమె పరిపాలన తొలి రోజు సిద్దం చేసిన అన్ని అధికారపత్రాలు (ప్రకటన, ప్రమాణస్వీకారం మొదలైనవి)ఆమెను అలెంగ్జాండ్రినా విక్టోరియాగా పేర్కొన్నాయి, కానీ ఆమె తన తొలి ప్రివీ కౌన్సిల్ సమావేశ రిజిస్టర్లో విక్టోరియా అనే సంతకం చేసింది; అందువల్ల తాను అలెగ్జాండ్రియా విక్టోరియాగానే పరిపాలించాలనుకున్నప్పటికీ తొలిపేరును ఆమె ఇష్టానుసారమే వదిలేసింది.[9] ఆమె సింహాసనాధిష్ట ఉత్సవం 1838 జూన్ 24న జరిగింది, ఆమె బకింగ్హామ్ ప్యాలెస్ను నివాసం చేసుకున్న తొలి రాణి అయింది.[10]
సాలిక్ చట్టం ప్రకారం ఏ మహిళా హానోవర్ పాలకులు కాలేరు; ఇది 1714నుంచి బ్రిటన్తో పాలుపంచుకుంటోంది. హానోవర్ ఆమె అంకుల్ డ్యూక్ ఆఫ్ కంబర్లాండ్, టెవియోట్డేల్ పరమైంది. ఆయనే కింగ్ అగస్టస్1 అయ్యాడు. (ఆయన జార్జ్3 యొక్క ఎనిమిది మంది సంతానంలో అయిదవ కుమారుడు). 1840లో విక్టోరియాకు తొలి సంతానం కలిగే వరకూ ఎర్నస్ట్ ఆగస్టస్ యునైటెడ్ కింగ్డమ్ అధికారపగ్గాలు చేపట్టగల వారసునిగా ఉన్నాడు.[11]
ఆమె సింహాసనం అధిష్టించే నాటికి ప్రభుత్వం విగ్ పార్టీ నియంత్రణలో ఉంది. విగ్ ప్రధానమంత్రి లార్డ్ మెల్బోర్న్ రాణి అనుభవంలేని రాజకీయ జీవితంపై బలమైన ప్రభావం ఉండేది. ఆమె సలహాలకు అతనిపై ఆధారపడేది. కొందరు విక్టోరియాను "మిసెస్ మెల్బోర్న్" అని అంటూండేవారు.[12] అయితే మెల్బోర్న్ మంత్రివర్గం ఆట్టేకాలం నిలవలేదు; క్రమేపీ అది అపఖ్యాతికి గురైంది, అంతేగాక, బ్రిటీష్ కాలనీల నిర్వహణ, ముఖ్యంగా 1837లో తిరుగుబాటుల సమయంలో మరింత కష్టమైంది. జమైకా రాజ్యాంగాన్ని తొలగించే బిల్లును హౌస్ ఆఫ్ కామన్స్ లో రాడికల్స్, టోరీస్ (అప్పట్లో విక్టోరియా వీరిని అసహ్యించుకునేది) కలిసి అడ్డుకోవడంతో 1839లో లార్డ్ మెల్బోర్న్ రాజీనామా చేశాడు.[13]
విక్టోరియా ముఖ్య సలహాదారుడు ఆమె బంధువు బెల్జియం రాజు కింగ్ లియోపాల్డ్ 1 (ఆమె తల్లి సోదరుడు, విక్టోరియా సహజన్మురాలు రాకుమారి చార్లెటి భర్త).[12]
టోరీకి చెందిన సర్ రాబర్ట్ పీల్ను కొత్త మంత్రిమండలిని ఏర్పాటుచేయమని రాణి ఆదేశించింది. కానీ ఓటమి ఎదుర్కొన్నది, దీన్నే బెడ్ఛాంబర్ క్రైసిస్ అంటారు. ఆ సమయంలో పోషణ విధానం (వారి పార్టీ అభిమానం ఆధారంగా రాజకుటుంబాలకు చెందిన సభ్యులను ప్రధాని నియమించాలి) ఆధారంగా రాజకుటుంబీకులను నియమించడం ఆనవాయితీ. రాణి బెడ్చాంబర్ మహిళల్లో చాలామంది విగ్ పార్టీకి చెందినవారి భార్యలే, వారి స్థానంలో టోరీల భార్యలను నియమించాలని పీల్ అనుకున్నారు. కానీ మర్యాదపూర్వ సంస్థల్లో సభ్యులుగానే కాకుండా తనకు ఎంతో సన్నిహితులుగా భావించిన వారిని తొలగించడాన్ని విక్టోరియా గట్టిగానే వ్యతిరేకించింది. రాణి ఏర్పరచిన నిబంధనల్లో తాను అధికారం కొనసాగించలేనని పీల్ తన కమిషన్ను రద్దు చేశాడు, దీంతో మెల్బోర్న్ తిరిగి అధికారంలోకి వచ్చాడు.[12]
వివాహం[మార్చు]
విక్టోరియా తన భవిష్యత్ భర్త, సమీప బంధువు ప్రిన్స్ ఆల్బర్ట్ ఆఫ్ సాక్స్-కోబర్గ్, గోధాను మొదటసారిగా 1836లో తన 17వ ఏట కలిసింది. కొందరు రచయితలు ఆమె మొదట ఆల్బర్ట్ చాలా నిరుత్సుకతగా ఉన్నాడని గ్రహించినట్టు పేర్కొన్నారు.[14] అయితే ఆమె డైరీ ప్రకారం, మొదటినుంచి అతని స్నేహంలో ఎంతో ఆనందించింది. ఆల్బర్ట్ తో కలిసిన తర్వాత ఆమె ఇలా రాసింది "(ఆల్బర్ట్) చాలా అందగాడు, నా జుత్తు రంగులోనే అతని జుత్తూ ఉంది; అతని కళ్లు పెద్దవిగా నీలం రంగులో ఉన్నాయి. చక్కని ముక్కు, ముద్దొచ్చే పెదవులు, చక్కని పలువరస; అతని ముఖ కవళికలు భావప్రకటనలో మరింత చూడముచ్చటగా ఉంది".[15] తన మేనమామ బెల్జియం రాజు లియోపాల్డ్1కి రాసిన ఉత్తరంలో "ఆల్బర్ట్ రూపంలో నాకు అత్యంత ఆనందం కలిగించే బహుమతిని అందించినందుకు ఎంతో కృతజ్ఞతలు.... అతను నన్ను ఎంతో సుఖపెడతాడన్న నమ్మకం కలిగించే లక్షణాలు కలిగి ఉన్నాడు"[16] ఆల్బర్ట్ తండ్రి ఆమె తల్లి సోదరుడు ఎర్నెస్ట్ ఈ సంబంధానికి అంగీకరించాడు. అయితే కేవలం 17 ఏళ్ళ రాకుమారి విక్టోరియా ఆల్బర్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఇంకా పెళ్ళికి సిద్ధపడలేదు.
విక్టోరియా 1837 జూన్ 20న 18 ఏళ్ళకే సింహాసనం అధిష్టించింది. రాణి ఇంకా పెళ్ళికాని యువతి అయినప్పటికీ, తన తల్లితో ఉండవలసిన అవసరం ఏర్పడలేదు. కెన్సింగ్టన్ విధానంతో ఆమె తన తల్లి పట్ల ఆగ్రహంతో ఉంది. బకింగ్హామ్ ప్యాలెస్ లో మారుమూల అపార్ట్మెంట్ ను తన తల్లికి ఏర్పాటు చేసింది, ఆమెను కలవడానికి ఇష్టపడేది కాదు. తల్లి నుంచి విడిపోవాలంటే పెళ్ళి చేసుకోవాలని విక్టోరియాకు లార్డ్ మెల్బోర్న్ సూచించాడు. పెళ్ళి విషయంలో తొందరపాటును నిలువరించినప్పటికీ, ఆమె లేఖలు తన కాబోయే భర్తగా ఆల్బర్ట్ చదువు అవసరాన్ని విక్టోరియా తన లేఖల్లో పేర్కొంది.[17]
విక్టోరియా తొలిదశలో ఎంతో ప్రతిష్ఠ పొందినప్పటికీ, 1839లో కోర్టు వల్ల కొంత దెబ్బతిన్నది. అప్పట్లో ఆమె తల్లి వద్ద పనిచేస్తున్న లేడీ ఫ్లోరా హేస్టింగ్స్ కడుపులో కణితి కారణంగా 1839 జూలైలో మరణించింది. లేడీ ఫ్లోరా డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించింది. విక్టోరియా తల్లి ప్రేమికునిగా చాలాకాలం ప్రచారంలో ఉన్న సర్జాన్ కాన్రాయ్ కు, ఫ్లారాతో అక్రమ సంబంధం ఉందని, ఆమె గర్భం దాల్చిందని పుకార్లు వ్యాపించాయి. తన బాల్యంలో ఆనందం లేకుండా చేసిన కెన్సింగ్టన్ విధానంలో కీలకపాత్ర వహించిన కాన్రాయ్ పట్ల ఆగ్రహంతో విక్టోరియా ఈ పుకార్లు నమ్మింది. లేడీ ఫ్లోరాకు ఒత్తిడిమీద పరీక్షలకు అంగీకరించగా ఆ పరీక్షలో ఆమెకు కణితి ఏర్పడిందని తేలింది. చాలా నెలలకు, ఆమె మరణించిన తర్వాత కాన్రాయ్, లేడీ ఫ్లారా సోదరుడు లేడీ ఫ్లారాపై రాణి దుష్ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ పత్రికా ప్రచారం చేపట్టారు.
విక్టోరియా రాణి అయిన తర్వాత 1839లో రెండో పర్యాయం ఆల్బర్ట్ ను కలిసి అతని స్నేహాన్ని అభిమానించడం కొనసాగించింది, ఆమె అతన్ని గురించి ఇలా రాసింది, "....డియర్ ఆల్బర్ట్... అతను ఎంతో సున్నితుడు, ఎంతో కరుణ గలవాడు, ఎంతో మంచివాడు, మరెంతో స్నేహ యోగ్యుడు కూడా. అంతకు మించి అతనిలో సౌమ్యత చూడగల్గుతారు"[14] ఆల్బర్ట్ విండ్సర్ చేరిన అయిదురోజుల తర్వాత 1839 అక్టోబర్ 15న వివాహానికి రాణి ప్రతిపాదించింది.[18]
రాణి, రాకుమారుడు ఆల్బర్ట్ ల వివాహం 1840 ఫిబ్రవరి 10న లండన్ సెంట్ జేమ్స్ ప్యాలెస్లోని చాపెల్ రాయల్లో జరిగింది. ఆల్బర్ట్, రాణి భర్తగా మాత్రమే కాకుండా లార్డ్ మెల్బోర్న్ స్థానంలో రాజకీయ సలహాదారునిగా, ఆమె రాణి జీవిత తొలినాళ్ళలో, మెల్బోర్న్ మరణానంతరం ఎంతో కీలకపాత్ర వహించాడు.[19] విక్టోరియా తల్లిని ప్యాలెస్ విడిచిపెట్టింది. విక్టోరియా ఆమెని అరుదుగా కలుస్తుండేది.
విక్టోరియా తొలి గర్భంతో ఉన్న సమయంలో ఆల్బర్ట్ తో కలిసి లండన్లో ఒక గుర్రపు బండిలో వెళుతుండగా ఎడ్వర్ట్ ఆక్స్ ఫోర్డ్ ఆమెపై హత్యాయత్నం చేశాడు.[8] ఆక్స్ ఫోర్డ్ రెండుసార్లు కాల్చాడు, కానీ రెండు బుల్లెట్లు గురితప్పాయి. రాజద్రోహం క్రింద విచారించి అతన్ని పిచ్చివాడిగా నిర్ధారించి వదిలేసారు.[20] రాజదంపతుల తొమ్మిదిమంది సంతానంలో, 1840 నవంబర్ 21న పుట్టిన మొదటి పాపకు విక్టోరియా అని పేరు పెట్టారు.[21]
విక్టోరియా రాణిపై మరింత హత్యాయత్నాలు 1842 మే, జూలై మధ్య కాలంలో జరిగాయి. మొదటిది, 1842 మే 29న తన క్యారేజ్లో వెళుతుండగా సెంట్ జేమ్స్ పార్క్ వద్ద ఆమెపై జాన్ ఫ్రాన్సిస్ పిస్టల్తో కాల్చాడు,[8] కానీ వెంటనే పోలీస్ కానిస్టేబుల్ విలియం ట్రౌన్స్ అతన్ని పట్టుకున్నాడు. ఫ్రాన్సిస్పై రాజద్రోహం నేరం మోపారు. ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చారు. ఫ్రాన్సిస్కు శిక్ష విధించిన మర్నాడే, జూలై 3న జాన్ విలియం బీన్ అనే కుర్రాడు రాణిపై కాల్పులు జరిపే యత్నం చేశాడు.[8] 1840లో ఆక్స్ ఫోర్డ్ ను వదిలేయడమే, ఇపుడు దాడులకు పురికొల్పుతోందని ఆల్బర్ట్ భావించాడు. అతని తుపాకీలో కేవలం కాగితాలు, పొగాకు పొడి మాత్రమే ఉన్నప్పటికీ విలియం బీన్కు మరణ దండన విధించారు. అయితే అలాంటి శిక్షలు మరీ దారుణమని భావించి, ప్రిన్స్ ఆల్బర్ట్ పార్లమెంటులో 1842 రాజద్రోహ చట్టం ఆమోదించడానికి మద్దతునిచ్చాడు. ఈ చట్టం క్రింద ఎవరైనా రాజు, రాణిల సమక్షంలో ఆయుధాలను రాణిని హెచ్చరించేందుకు ఉపయోగిస్తే ఏడేళ్ల కఠిన జైలు శిక్ష, కొరడా దెబ్బలు తినవలసి ఉంటుంది.[22] బీన్స్ కు ఆ విధంగా 18 నెలలు జైలు శిక్ష విధించారు. అతను కానీ, ఆ తరువాత ఎవరూ కొరడా దెబ్బలు తినలేదు.[23]
ఈ రెండు హత్యాయత్నాలు జరిగిన అదే ఎండకాలంలో విక్టోరియా మొదటిసారిగా రైలు ప్రయాణం చేసింది. స్లాఫ్ రైల్వే స్టేషను (విండ్సర్ కోట సమీపంలోఉంది) నుంచి పాడింగ్టన్ బ్రిడ్జ్ (లండన్లో) వరకూ, గ్రేట్ వెస్టర్న్ రైల్వే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యారేజ్లో 1842 జూన్ 13న ప్రయాణించింది. ఆమెతోపాటు ఆమె భర్త, వారితోపాటు గ్రేట్ వెస్టర్న్ రైల్వే లైన్ ఇంజనీర్ ఇసాంబర్డ్ కింగ్డమ్ బ్రూనెల్ ప్రయాణించారు. అప్పుడు రైలు చాలా వేగంగా వెళుతోందని,20 mph (30 km/h) పట్టాలు తప్పుతుందేమోనని భయాందోళనతో రాణి, రాజు ఇద్దరూ ఫిర్యాదు చేశారు.[8]
విక్టోరియా తొలి రాజకీయాలు, హత్యాయత్నాలు :[మార్చు]
కార్న్ చట్టాన్ని రద్దుచేయడంతో పీల్ మంత్రిమండలి సందిగ్ధంలో పడింది. అప్పట్లో కన్సర్వేటివ్స్ గా పిలువబడ్డ చాలామంది టోరీలు చట్టం రద్దును నిరాకరించారు. కానీ కొందరు టోరీలు (పీల్ వర్గీయులు), చాలామంది విగ్స్ పార్టీవారు అందుకు సమర్ధించారు. 1846లో పీల్ రాజీనామా చేశాడు. చాలా స్వల్ప మద్దతుతో రద్దుకు ఆమోదం లభించింది. ఆయన స్థానంలోకి లార్డ్ జాన్ రస్సెల్ వచ్చాడు. రస్సెల్ మంత్రివర్గం విగ్ పార్టీదే అయినా, రాణి ఆమోదించలేదు. విక్టోరియాను వ్యతిరేకించినవారిలో విదేశాంగ కార్యదర్శి లార్డ్ పామర్స్టాన్, మంత్రి మండలి, ప్రధానితో లేదా రాణితో చర్చించకుండానే పామర్స్టాన్ వ్యవహరించేవాడు.[24]
పామర్స్టాన్ తనకు తెలియకుండానే అధికార సమాచారాన్ని విదేశీ నాయకులకు పంపుతున్నాడని 1849లో విక్టోరియా లార్డ్ రస్సెల్కు ఫిర్యాదు చేసింది. 1850లో ఆమె తన అభ్యంతరాన్ని మళ్ళీ వ్యక్తం చేసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. 1851లో పామర్స్టాన్ను అధికారం నుంచి తొలగించారు, అతను ఆ సందర్భంలోనూ ప్రెసిడెంట్ లూయిస్-నెపోలియన్ బోనపార్టీలు ఫ్రాన్స్లో సైనికదాడికి ప్రభుత్వం అంగీకరించిందన్న సంగతిని ముందే ప్రధానితో సంప్రదించకుండా ప్రకటించాడు.[24]
| విక్టోరియా బ్రిటీష్ ప్రధానమంత్రులు | |
| సంవత్సరం | ప్రధానమంత్రి (పార్టీ) |
| 1835 | లార్డ్ మెల్బోర్న్ (విగ్ ) |
| 1841 | సర్ రాబర్ట్ పీల్ (కన్సర్వేటివ్) |
| 1846 | లార్డ్ జాన్ రస్సెల్ (విగ్స్) |
| 1852 (ఫిబ్రవరి) | లార్డ్ డర్బీ (కన్సర్వేటివ్) |
| 1852 (డిసెంబర్ ) | లార్డ్ అబర్డీన్ (పీల్ అనుచరుడు) |
| 1855 | లార్డ్ పామర్స్టాన్ (లిబరల్) |
| 1858 | డర్బీ (కన్సర్వేటివ్) |
| 1859 | పామర్స్టాన్ (లిబరల్) |
| 1865 | రస్సెల్ (లిబరల్) |
| 1866 | డర్బీ (కన్సర్వేటివ్) |
| 1868 (ఫిబ్రవరి) | బెంజిమన్ డిజ్రేయిలి (కన్సర్వేటివ్) |
| 1868 (డిసెంబర్) | విలియం ఎవర్ట్ గ్లాడ్స్టోన్ (లిబరల్) |
| 1874 | డిజ్రేయిలి (కన్సర్వేటివ్) |
| 1880 | గ్లాడ్స్లాన్ (లిబరల్) |
| 1885 | లార్డ్ సాల్సిబరి (కన్సర్వేటివ్) |
| 1886 (ఫిబ్రవరి) | గ్లాడ్స్టోన్ (లిబరల్) |
| 1886 (జూలై) | సాల్సిమరి (కన్సర్వేటివ్) |
| 1892 | గ్లాడ్స్టోన్ (లిబరల్) |
| 1894 | లార్డ్ సాల్సిబరి (లిబరల్) |
| 1895 | సాల్సిబరి (కన్సర్వేటివ్) |
| బ్రిటిష్ ప్రధానుల జాబితాను చూడండి. ఆమె బ్రిటిష్ ప్రధానులకు అలాగే విక్టోరియా రాణి ప్రధానుల జాబితాను చూడండి. | |
రస్సెల్ ప్రధానిగా ఉన్న కాలంలోనూ విక్టోరియా రాణికి వ్యక్తిగతంగా అసంతృప్తిగా ఉన్నట్టు రుజువయింది. 1849లో లండన్లోని కాన్స్టిట్యూషన్ హాల్ వైపు రాణి వెళుతుండగా నిరుద్యోగి, ఆగ్రహంతో ఉన్న ఐరిష్ వ్యక్తి విలియం హామిల్టన్ పౌడర్తో నిండిన పిస్టల్తో ఆమెను బెదిరించాడు. హామిల్టన్కు 1842 చట్టం ప్రకారం ఛార్జ్ దాఖలు చేసారు. నేరం రుజువు కావడంతో అత్యధికంగా ఏడేళ్ల కారాగారం విధించారు.[25]
1850లో మతిస్థిమితం లేని మాజీ సైనికాధికారి రాబర్ట్ పేట్ ఆమెపై దాడి చేయడంతో రాణి స్వల్ప గాయాలతో తప్పించుకుంది. క్యారేజ్లో వెళుతుండగా పేట్ తన చేతి కర్రతో దాడిచేసి, ఆమె టోపీని ధ్వంసం చేశాడు, రాణికి గాయాలయ్యాయి. పేట్పై విచారణ జరిపారు. పేట్ తనకు మతిస్థిమితం లేదని రుజువు చేసుకోలేకపోయాడు. హామిల్టన్ తరహాలో శిక్షకు గురయ్యాడు.[24]
ఐర్లాండ్[మార్చు]
విక్టోరియా రాణికు ఐర్లాండ్ పట్ల ఎంతో అభిమానం ఉండేది. కెర్రీలోని కిల్లర్నీలో సెలవు రోజులు గడపాలనుకునేది. రాణి పట్ల ఐరిష్ అభిమానం ఆమెకు ఆ దేశం పట్ల ప్రత్యేక దృష్టి కల్పించింది. 1845లో బంగాళదుంప తెగులు వ్యాపించి నాలుగు మిలియన్ల ఐరిష్ ప్రజల ప్రాణనష్టం సంభవించింది, మరో మిలియన్ మంది వలసపోయారు.[26] ఈ భీకర కరువు (ఐరిష్ భాషలో 'అన్గోర్టా మోర్ ')కు స్పందించి విక్టోరియా రాణి స్వయంగా 2000 స్టెర్లింగ్లు (2000 పౌండ్ల స్టెర్లింగ్లు) ఐర్లాండ్కు విరాళంగా అందజేసింది.[27] అయితే, ఒట్టామాన్ సామ్రాజ్యానికి చెందిన సుల్తాన్ అబ్దూల్ మెసిద్ 10,000 పౌండ్లు సహాయం పంపుతానని ప్రకటించాడు. విక్టోరియా రాణి తాను కేవలం 2,000 పౌండ్లే పంపిన కారణంగా 1,000 పౌండ్లే పంపమని సుల్తాన్ను కోరింది. సుల్తాన్ వెయ్యి స్టెర్లింగ్లే పంపినప్పటికీ ఆయన రహస్యంగా మూడు ఓడల్లో ఆహారపదార్ధాలు పంపాడు. బ్రిటిష్ కోర్టులు ఆ ఓడలను నిలువరించేందుకు ప్రయత్నించాయి. కానీ ఆహారంతో ఉన్నవి డ్రోగేడా హార్బర్ చేరుకున్నాయి. అక్కడ ఒట్టామన్ నావికులు వాటిని ఒదిలేసి వెళ్లారు.[ఉల్లేఖన అవసరం] కానీ ఐర్లాండ్కు వితరణగా 5 స్టెర్లింగ్లే ఇచ్చిందన్న ఊహాగానాలు 19వ శతాబ్దిలో ప్రచారంలోకి వచ్చాయి. అదే రోజు బాటర్ సి డాగ్ షెల్టర్కి మరో 5 స్టెర్లింగ్స్ రాణి దానం చేసింది. ఇది అబద్ధం. నిజానికి ఆమె 2000 స్టెర్లింగ్లు అందజేసింది. ఐరిష్ కేథలిక్ బిషప్స్ అందరికంటే ఎక్కువే పంపింది, వారిలో ఒక్కరు మాత్రం 1000 స్టెర్లింగ్లు ఆకలితో ఉన్నవారికి, 10వేల స్టెర్లింగ్లు ఒక విశ్వవిద్యాలయం ప్రాజెక్టుకు అందజేశారు.[28]
దీనికి తోడు ఆమె ప్రధానమంత్రి లార్డ్ జాన్ రస్సెల్ ఐర్లాండ్ కరువు పరిస్థితులను అతిగా చూపించే పాలసీని అనుసరించాడని, ఫలితంగా ఆమెకు ఐర్లాండ్లో ప్రతిష్ఠ దెబ్బతిన్నదని నిత్యం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఐరిష్కు గట్టి మద్దతునిస్తున్న రాణి మెనూత్ గ్రాండ్ మద్దతునిచ్చి, ఐర్లాండ్లో పర్యటనకు వస్తానని, సెమినరీ సందర్శిస్తానని చెప్పింది.[29]
విక్టోరియా తొలి ఐర్లాండ్ అధికార పర్యటనను 1849లో ఐర్లాండ్ లార్డ్ లెఫ్టెనెంట్ లార్డ్ క్లారెండ్ ఏర్పాటు చేశాడు. ఆయన ఐర్లాండ్లో బ్రిటీష్ అధికారి. ఐర్లాండ్లో సంక్షోభం దృష్ట్యా అక్కడి బ్రిటిస్ రాజకీయ నాయకులను రాణి సమక్షంలో ఉండాలని హెచ్చరించాడు, కరువు ప్రాంతాల నుంచి దృష్టి మరల్చే ఏర్పాటు చేశాడు. ఐర్లాండ్లో రాణి ప్రతిష్ఠకు అక్కడి కరువు పరిస్థితుల వల్ల భంగం కలిగినప్పటికీ అక్కడి పార్టీ సమావేశాల్లో ఐరిష్ జాతీయులు భగవంతుడా రాణిని రక్షించు అని కీర్తించారు.[30] ఆమె ఐర్లాండ్లో 'కరువురాణి'గా గుర్తింపు పొందింది,[31] ఇప్పటిలానే అప్పుడు కూడా అవమానాలకు గురయింది.[32] 1852లో ఆమె ఐర్లాండ్లో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన పెద్ద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సందర్శించింది. మిలియన్కు పైగా ప్రజలు దానికి హాజరయ్యారు, ఆ ఎగ్జిబిషన్ రూపకర్త జాన్ బెన్సన్ను రాణి నైట్హుడ్తో సత్కరించింది.[33]
1870,1880లో ఐర్లాండ్లో రాచరిక ప్రభావం చాలామటుకు తగ్గింది. ఆమె కుమారుడు ప్రిన్స్ ఆఫ్ వాలెస్ డెన్మార్క్ రాకుమారి అలెగ్జాండ్రా వివాహ సందర్భంగా వీరి పెద్ద కుమారుడు ప్రిన్స్ ఆల్బర్ట్ పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలపరాదని డబ్లిన్ కా ర్పోరేషన్ నిర్ణయించడాన్ని నిరసిస్తూ విక్టోరియా రాణి ఐర్లాండ్లో పర్యటించడానికి నిరాకరించింది. డబ్లిన్ ప్రజలకు బహుమానంగా ఇచ్చిన ఆమె భర్త స్వర్గీయ ఆల్బర్ట్ విగ్రహాన్ని డబ్లిన్ కార్పోరేషన్ రాణికి తిరిగి పంపించడంతో విక్టోరియా ఎంతో బాధపడింది. దీనికి తోడు డబ్లిన్లోని సెయింట్ స్టిఫెన్స్ గ్రీన్ ప్రాంతములో ఆల్బర్ట్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి, ఆ ప్రాంతానికి ఆల్బర్ట్ గ్రీన్గా పేరు మార్చాలన్న ఆలోచనను వ్యతిరేకించడం, ఆమెను మరింత బాధించింది. ఆమె ఎంతో ప్రేమించిన ఆల్బర్ట్ జ్ఞాపకాలకు సంభవించిన అవమానాలతో, ఐరిష్ ప్రజల పట్ల ఆమె అభిప్రాయాన్ని మార్చివేశాయని పేర్కొంటారు.[34]
ఐర్లాండ్ రాయల్ రెసిడెన్స్ ఏర్పాటు చేయాలని అనేకమంది ప్రధానులు, లార్డ్ లెఫ్టెనెంట్, రాజకుటుంబీకులు సైతం చేసిన ఒత్తిడులను విక్టోరియా తిరస్కరించింది.[30] ఐరిష్ యూనియనిస్ట్ పార్టీ అధినేత లార్డ్ మిడిల్టన్ రాసిన '1930 ఐర్లాండ్: డూప్ ఆర్ హీరోయిన్ ' పుస్తకంలో ఆమె నిర్ణయం రాచరికానికి, యూనియన్కి పెద్ద దెబ్బగా రుజువైందని పేర్కొన్నాడు.[35]
రాణి చివరిసారిగా 1900 సంవత్సరంలో ఐర్లాండ్ పర్యటించింది. రెండవ బోయర్ యుద్ధంలో బ్రిటీష్ సైన్యంతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చింది. ఆమె రాకను వ్యతిరేకించే ఉద్యమానికి ఆర్థర్ గ్రిఫిత్ నాయకత్వం వహించాడు. ఆయన కుమన్ న గేథేల్ అనే సంస్థను ఏర్పాటు చేసాడు. రాణిని నిరసిస్తూ చేసిన ప్రచారం కారణంగా ఏర్పడిన సంబంధాలను ఉపయోగించుకొని ఐదేళ్ల తర్వాత గ్రిఫిత్ సిన్పీన్[30] అనే కొత్త రాజకీయ విప్లవం తేవడానికి ప్రయత్నిచాడు. దీంతో ఐర్లాండ్ స్వతంత్ర దేశంగా అవతరించడానికి దోహదపడింది.
భారత్ రాణి[మార్చు]
చివరి మొగల్ చక్రవర్తిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సింహాసనం నుంచి దించేసిన తర్వాత, కంపెనీ కూడా రద్దయిన తర్వాత విక్టోరియా 1876 మే 1 నుంచి ఆమె మరణించే వరకు భారత్కు మహారాణిగా వ్యవహరించింది. 1877లో ఢిల్లీ దర్బార్లో ఆ మేరకు ప్రకటించారు. బ్రిటీష్ సామ్రాజ్యంలో భారత్ లాంఛన ప్రాయంగా కలిసి, భారత ఉపఖండంపై బ్రిటన్ ఆధిపత్యం, సంరక్షణ పొందిన 19ఏళ్ల తర్వాత ఆ పదవి కల్పించారు. ఆమెకు ఆ పదవి అందడంలో ప్రధాని బెంజిమన్ డిజ్రేయిలి మన్ననలు అందుకుంటాడు.[36] విక్టోరియా 1867లో హిందీ, పంజాబీ నేర్చుకోవడం ప్రారంభించింది. రాణి విక్టోరియా స్మారకార్తం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్నగర్ లో విక్టోరియా మెమోరియల్ హోం భవనం ఉంది.[37][38] ఈ భవనంలో ప్రస్తుతం అనాథ పిల్లలకోసం విక్టోరియా మెమోరియల్ స్కూల్ నడుపుతూ, వారందరికి ఉచిత విద్యను అందిస్తున్నారు.[39]
వైధవ్యం[మార్చు]
రాజు టైఫాయిడ్ జ్వరంతో 1861 డిసెంబర్ 14న మరణించడానికి విండ్సర్ కాజిల్లో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. విక్టోరియాకు అయన మరణం శరాఘాతమయింది. అదే యేడాది మార్చిలో తల్లి మరణం సయితం ప్రభావం చూపింది.[40] ఆమె శ్రద్ధాంజలి ఘటించే మార్గంలో పడింది. తర్వాత జీవితాంతం నల్లని దుస్తులే ధరించింది. ప్రజలకు కనిపించడం తగ్గించేసింది, ఆ తర్వాత సంవత్సరాల్లో ఎప్పుడోగాని రాణి లండన్లో కనిపించేది కాదు. ఆమె అలా ఏకాంతంలో ఉండడంతో ఆమెకు 'విడో ఆఫ్ విండ్సర్" అనే పేరు వచ్చింది. తన భర్త మరణానికి తన కుమారుడు ఎడ్వర్డ్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కారణమని ఆమె ఆరోపించింది. తన కుమారుని యొక్క చెడు ప్రవర్తన గురించి నవంబర్లో వార్త చేరగానే, కుమారుడిని సముదాయించేందుకు ఆయన కేంబ్రిడ్జ్ బయలు దేరి వెళ్లాడు.
విక్టోరియా ప్రజలకు దూరంగా ఉండేందుకు కల్పించుకున్న ఒంటరితనం రాచరిక ప్రతిష్టను దెబ్బతీసింది. ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చింది. ఆమె తన అధికారబాధ్యతలు చేపట్టినా, తన రాజనివాసంలో, స్కాట్లాండ్లోని బల్మోరల్ కోట, రైట్ ఐలాండ్లోని ఓజ్బోర్న్ హౌస్లో, వండ్సర్ కేజిల్లో ఒంటరిగా ఉండేందుకు యిష్టపడింది.[40]
కాలం గడిచేకొద్దీ, ఆమె స్కాట్లాండ్కి చెందిన జాన్ బ్రౌన్ అనే పనివాడిపై అన్నింటికీ ఆధారపడటం ఎక్కువయింది.[40] వారి మధ్య ప్రేమబంధం, రహస్య వివాహం జరిగాయని ఆరోపణలు ఉన్నాయి, కానీ ఆ ఆరోపణలు సహజంగానే విలువలేకుండా పోయాయి. అయితే విక్టోరియా మరణించినపుడు ఆమె మృతదేహాన్ని కాఫిన్లో పెట్టినపుడు రెండు జతల జ్ఞాపకార్ధాలను ఆమె కోరిక మేరకు ఉంచారు. ఒక ప్రక్క ఆల్బర్ట్ డ్రసింగ్ గౌన్ ఒకటి ఉంచారు. ఆమె ఎడమచేతిలో కొద్దిగా బ్రౌన్ జుత్తును, అతని ఫోటోని ఉంచారు. విక్టోరియా చేతికి జాన్ బ్రౌన్ తల్లి పెళ్ళి ఉంగరం పెట్టారన్నది 2008లో తెలిసింది.[41][ఉల్లేఖన అవసరం] బ్రౌన్తో ప్రేమకలాపాలు, వివాహం సంబంధించిన పుకార్లు ఆమెకు మిసెస్ బ్రౌన్ అనే పేరు తెచ్చిపెట్టాయి.[40] వారి మధ్య సంబంధాలు ఆధారంగానే 1997లో మిసెస్ బ్రౌన్ సినిమా వచ్చింది.[42]
తదుపరి సంవత్సరాలు[మార్చు]
గోల్డెన్ జూబ్లీ, హత్యాయత్నం[మార్చు]
బ్రిటీష్ సామాజ్రం 1887లో విక్టోరియా గోల్డెన్ జూబ్లీని నిర్వహించింది. జూన్ 20న విక్టోరియా తన అధికారంలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేసింది. దీనికి 50 మంది యూరప్ రాజులు, రాకుమారులు ఆహ్వానం అందుకున్నారు. ఆ సమయంలో ఆమెకు తెలియకపోయినప్పటికీ, ఐరిష్ రాజరిక వ్యతిరేకులు కొందరు వెస్ట్ మినిస్టర్ ఎబేను పేల్చివేయడానికి పథకం వేశారు. ఈ హత్యాయత్నం బయటపడిన తరువాత అది జూబ్లీ కుట్రగా పిలువబడింది. ఆ మర్నాడే విక్టోరియా పెద్ద ఊరేగింపులో పాల్గొంది. ఇది, మార్క్ ట్వైన్ మాటల్లో చెప్పాలంటే, "ఇరువైపులా కనుచూపుమేర విస్తరించింది'". ఈ సమయానికి విక్టోరియా గొప్ప రాణిగా మరింత ప్రతిష్ఠ సంపాదించుకుంది.[24]
డైమండ్ జూబ్లీ[మార్చు]
విక్టోరియా 1896 సెప్టెంబర్ 25న జార్జ్3ని ఇంగ్లండ్, స్కాట్లాండ్, బ్రిటీష్ చరిత్రలో సుదీర్ఘపాలకుడన్న స్థాయిని అధిగమించింది. తన యొక్క డైమండ్ జూబ్లీ జరిగే 1897 వరకు అన్ని రకాల ప్రభుత్వ ప్రత్యేక ఉత్సవాలను ఆలస్యం చేయాలని రాణి కోరింది. డైమండ్జూబ్లీ ఆనందోత్సాహ కార్యక్రమాలన్నింటినీ బ్రిటీష్ సామ్రాజ్యంలో పెద్ద ఎత్తున నిర్వహించాలని కలోనియల్ సెక్రలరీ జోసెఫ్ ఛాంబర్లీన్ ప్రతిపాదించాడు.
స్వయంపాలనా సంస్థానాలు, వలస ప్రధానులను ఆహ్వానించారు. డైమండ్ జూబ్లీ ఊరేగింపులో ప్రతీ బ్రిటీష్ కాలనీ, డొమేనియన్ల నుంచి వచ్చిన సైనికదళాలు, మహారాణి గౌరవార్ధం భారత్ పంపిన సైనికులు పాల్గొన్నారు. డైమండ్ జూబ్లీ ఉత్సావాల్లో మహారాణి పట్ల అభిమానం వెల్లివిరిసింది. సెంట్పాల్స్ కేథడ్రల్ బయట థాంక్స్ గివింగ్ సర్వీస్ నిర్వహించారు. విక్టోరియా రాణి తన కేరేజ్లో ప్రయాణించింది; ఆమె నల్లని దుస్తులు, తెల్ల లేసులతో ఉన్న దుస్తులు ధరించింది.[12] డైమండ్ జూబ్లీ సందర్భంగా అనేక మొక్కలు నాటారు, హెన్లీ ఆన్ థేమ్స్ వద్ద విక్టోరియా క్రాస్ ఆకారంలో 60 మొక్కలు నాటారు.[43][44] విక్టోరియా క్రాస్ను 1856 జనవరి 29న విక్టోరియా క్రిమియన్ యుద్ధంలో శౌర్యప్రతాపాలు ప్రదర్శించినవారికి రివార్డులిచ్చే సమయంలో ప్రవేశపెట్టింది. ఇప్పటికీ ఈ శౌర్య అవార్డులను ఆధునిక కామన్వెల్త్ దేశాలయిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కామన్వెల్త్ బ్రేవరీ అవార్డులుగా బహూకరిస్తున్నారు.
మరణం, వారసత్వం[మార్చు]
భర్త మరణానంతరం పెట్టుకున్న ఆనవాయితీగా విక్టోరియా 1900 సంవత్సరం క్రిస్మస్ను రైట్ దీవుల్లోని ఆస్బోర్న్ హౌస్లో గడిపేందుకు వెళ్లింది. అక్కడే 1901 జనవరి 22న సాయింత్రం ఆరింటికి బ్రెయిన్ హెమరేజ్తో మరణించింది,[45][46] అప్పుడు ఆమె వయసు 81 సంవత్సరాలు. మరణ సమయంలో ఆమె పెద్ద కుమారుడు భవిష్యత్ రాజు పెద్ద మనవడు జర్మనీ రాజు విల్ హేలం2 ఉన్నారు. ఆమె కోరిక మేరకు పార్ధివ శరీరాన్ని తెల్లని దుస్తుల్లో ఉంచారు. పెళ్ళి టోపీ ధరింపచేసారు. ఓస్బోర్న్ హౌస్పై రెపరెపలాడుతుండే రాయల్ స్టాండర్డ్ను కాఫిన్పై కప్పారు. దీన్ని ఆ తర్వాత విక్టరియా మనవడు జార్జ్ టొరంటో విశ్వవిద్యాలయంలోని విక్టోరియా కాలేజికి బహూకరించాడు.[47] ఫిబ్రవరి 2 సాయంత్రం తర్వాత విండ్సర్ గ్రీన్ పార్క్ వద్ద ఫ్రాగ్మోర్ మొసొలియమ్లో ఆల్బర్ట్ సమాధి పక్కన సమాధి చేశారు. విక్టోరియాకు బ్లాక్ ఫ్యూనల్ ఇష్టం ఉండేది కాదు, కనుక లండన్లో అంతా ఉదారంగు, తెలుపు రంగుతో నిండిపోయింది. మొసోలియాలో ఆమెను ఖననం చేసే సమయంలో మంచుకురిసింది.[48]
అమెరికాలో ఆమె గౌరవార్ధం అధ్యక్షుడు విలియం మెక్ కిన్లీ జాతీయ పతాకాన్ని అవనతం చేయించాడు. ఈ విధంగా విదేశీయుల గౌరవార్ధం అక్కడ గతంలో జరగలేదు. అందువల్లనే మెక్ కిన్లీ ఆతరువాత ఏడాది హత్యకు గురై మరణించినపుడు బ్రిటన్ ఆయన పట్ల గౌరవాన్ని ప్రకటించింది. విక్టోరియా 63 సంవత్సరాల ఏడు నెలల రెండురోజులు పాలించింది. ఇది బ్రిటిష్ రాజులు అందరికంటే అత్యధిక పాలన. ఆమె తన తాత జార్జ్3 దీర్ఘకాల రాచరికాన్ని (ఎలిజిబెత్ 2 అధిగమించినప్పట్నుంచీ) ఆమె మరణానికి మూడు రోజుల ముందే అధిగమించింది.[49]
విక్టోరియా మరణంతో యునైటెడ్ కింగ్డమ్లో హానోవర్ వంశస్తుల పాలన ముగిసింది. ఆమె భర్త సాక్స్ కోబర్గ్-గోధా వంశానికి చెందినవాడు. ఆమె కుమారుడు, వారసుడు ఎడ్వర్డ్ 7 ఈ కొత్త రాజకుటుంబానికి తొలిరాజు.[14] ఆ తర్వాత 1917 లో కింగ్ జార్జ్ మనవడు తమ రాజకుటుంబంలో ఇంటి పేరును సాక్స్ కోబర్గ్-గోధా నుంచి (ప్రస్తుతం ఉన్న) విండ్సర్ హౌస్గా మార్చాడు.
పెద్ద కుమార్తె మరణించిన ఏడు నెలల వ్యవధిలో మరో ముగ్గురు సంతానాన్ని రాణి కోల్పోయింది. (ఆమె పెద్ద కుమార్తె విక్టోరియా తన 60వ యేట 1901 ఆగస్టులో వెన్ను కాన్సర్తో మరణించింది). ఆమె తన 42మంది మనవలు, మనవరాళ్లలో 11 మందిని కోల్పోయింది. (ముగ్గురు మృతశిశువులు, ఆరుమంది బాల్యంలో పోయారు, ఇద్దరు యుక్తవయసులో మరణించారు.)[50]
ఉత్తరదాయిత్వం[మార్చు]
బ్రిటన్లో[మార్చు]
విక్టోరియా రాణి పాలన క్రమేపీ ఆధునిక రాజ్యాంగబద్ద రాచరికాన్ని నెలకొల్పడాన్ని సూచించింది. అనేక చట్టబద్ద సంస్కరణలతో హౌస్ ఆఫ్ కామన్స్ అధికారాలు పెరగడం గమనించారు, హౌస్ ఆఫ్ లార్డ్స్, అధికారాలు తగ్గించారు, క్రమేపీ రాజు కేవలం సింబల్గా మారుతూ వచ్చారు. వాల్టర్ బెగహాట్ మాటల్లో చెప్పాలంటే విక్టోరియా పాలన నుంచి రాజు కేవలం "సంప్రదించేందుకు, సలహాలు ఇచ్చేందుకు, హెచ్చరికలు జారీచేసేందుకే హక్కు కలిగి ఉన్నాడు".[30]
విక్టోరియా పాలన రాజకీయపరంగా కంటే క్రమేపీ నామమాత్రంగా మారింది. గతంలో హానోవర్ కుటుంబానికి చెందిన అంతకు ముందున్నవారి లైంగిక, ఆర్థిక, వ్యక్తిగత దుష్ప్రచారాలు రాజరికానికి అప్రతిష్ఠ తెచ్చాయి. అందుకు విరుద్ధంగా విక్టోరియా పాలన నీతికి నియమాలకు, కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. బ్రిటన్లో కుటుంబపాలన ధోరణితో మధ్యతరగతి గుర్తింపు పొందే వీలుకలిగింది.[14]
విక్టోరియా వంశీయులలో హఠాత్తుగా వంశానుగతంగా వచ్చే రక్తస్రావ జబ్బు గుర్తించడంతో ఆమె అసలు తండ్రి డ్యూక్ ఆఫ్ కెంట్ కాదని, ఆ జబ్బు ఉన్నవాడని సూచనలు వ్యక్తమయ్యాయి. రాజకుటుంబీకుల్లో ఆ జబ్బు మొదటగా విక్టోరియాకే ఉన్నట్టు ప్రతీతి. ఆమె సొంతవారసుల్లో ఎవరికీ అలాంటి జబ్బు లేకపోవడంతో, ఆమెలో అప్పటికప్పుడు వచ్చిన పరివర్తన లేదా ఆమె నిజానికి వివాహేతర పుట్టుక కావడం అయి ఉండవచ్చు, ఆమె తండ్రి హిమోషిలియా జబ్బు ఉన్న వ్యక్తి తప్ప డ్యూక్ ఆఫ్ కెంట్ కాదు.[51] ఉన్నట్టుండి కలిగే పరివర్తన సుమారు 30 శాతం హెమోఫిలియా ఎ, బి కేసుల్లోనే సంభవిస్తుంది.[52][53] అయితే విక్టోరియా తల్లికి హెమోఫిలియా వ్యక్తితో సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి జబ్బు ఉన్న వ్యక్తి ఎక్కడైనా వుంటే తీవ్రస్థాయి అనారోగ్యానికి గురవుతాడన్నది ఎక్కడా పేర్కొనలేదు.[54]
విక్టోరియా ద్వారా ఆమె ఐదుగురు కుమార్తెల్లో ఇద్దరికి, రాకుమారి అలైస్, రాకుమారి బిట్రీస్కూ సంక్రమించిందన్న ఆధారాలు ఉన్నాయి. ఆమె కుమారుడు లియోపాల్డ్కి ఆ జబ్బు వచ్చింది. ఆమె కుటుంబీకుల్లో ఆమె ముని మనవడు రష్యా జావెర్కి అలెక్సి, ఆస్టురియా ప్రిన్స్ ఆల్ఫెన్స్, స్పెయిన్ రాజు అల్ఫెన్సో 8, రాణి విక్టోరియా యూజిని (విక్టోరియా మనవరాలు)ల పెద్ద, చిన్న కుమారులు హెమోఫిలియా జబ్బుబారిన పడ్డారు.[55]
రాణి విక్టోరియా తొలినాళ్లలో అపఖ్యాతికి గురయినప్పటికీ ఆ తర్వాత 1880ల్లో, 1890ల్లో ఎంతో గౌరవ మర్యాదలు అందుకుంది. 2002లో BBC వందమంది గొప్ప బ్రిటీష్ వ్యక్తుల సర్వేలో విక్టోరియా 18వ స్థానంలో నిలిచింది.[56]
తొలి పోస్టల్ స్టాంప్పై ఆమె తల బొమ్మ ముద్రించారు. దీనికి 1837లో వేయన్సిటీ మెడల్ ఆధారం. నాణాల రూపకర్త విలియం వ్యాన్ దీన్ని తయారుచేసాడు. విక్టోరియా 15యేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె ముఖాన్ని వ్యాన్ చిత్రించాడు.[57] పెళ్ళి కూతురు చక్కటి తెల్ల దుస్తులు ధరించడాన్ని ఆమె వివాహం నుంచి సంప్రదాయంగా చేసింది. అంతకుముందు పెళ్ళిల్లో పెళ్ళికూతురు తనకు ఇష్టమైన రంగు దుస్తులనే ధరించేది.[58]
చిత్రశ్రేణి (గ్యాలరీ)[మార్చు]
ప్రపంచవ్యాప్తంగా[మార్చు]
అంతర్జాతీయ స్థాయిలో విక్టోరియా అత్యంత గౌరవప్రతిష్ఠలు కలిగిన వ్యక్తి అయింది. బ్రిటన్ సామ్రాజ్య విస్తరణ ప్రభావంతోనే గాకుండా యూరప్ అంతటా ఆమె కుటుంబసంబంధాలు కలిగి ఉండి 'యూరప్ అమ్మమ్మ'గానూ ఆప్యాయంగా పిలవబడింది. ఉదాహరణకు మొదటి ప్రపంచయుద్ధంలో కీలకపాత్ర వహించిన మూడు దేశాల రాజులు విక్టోరియా మనుమలు లేదా ఆమె మనుమరాళ్ళతో వైవాహిక సంబంధాలు కలిగినవారే. విక్టోరియా తొమ్మిదిమంది సంతానంలో ఎనిమిది మంది యూరప్ రాజకుటుంబాల వారినే వివాహం చేసుకున్నారు, మరో కుమార్తె ప్రిన్సెస్ లూయిసి లోర్నీ మార్కస్ భవిష్యత్తు కెనడా గవర్నర్ జనరల్ను పెళ్ళి చేసుకుంది.[59]
విక్టోరియా,ఆల్బర్ట్ లకు 42 మంది మనవలు, మనవరాళ్ళు, వారి సంతతివారు మొత్తం వందల్లో ఉంటారు. 2009 నాటికి విక్టోరియా వారసులైన యూరప్ రాజులు, మాజీ రాజులు: క్వీన్ ఎలిజిబెత్ 2 ( ఆమె భర్త కూడా), నార్వే రాజు హెరాల్డ్, స్వీడన్ రాజు కార్ల్16, గస్టాఫ్, డెన్మార్క్ రాణి మార్గరెటి2, స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్1 (ఆయన భార్య), గ్రీస్ పదవీచ్యుత రాజు కాన్స్టాంటిన్ 2 (ఆయన భార్యకూడా), రొమేనియాకు చెందిన మైకేల్, సెర్బియా, రష్యా, జర్మనీ, సాక్స్ కోబర్గ్-గోధా, హానోవర్, హెస్సీ, బాడెన్, ఫ్రాన్స్ (లెజిటమిస్ట్) రాజ్యాధికారానికి పోటీలో ఉన్నవారంతా ఆమె వంశీకులే.[60]
ప్రపంచంలో అనేక ప్రదేశాలకు విక్టోరియా పేరు పెట్టారు. వాటిలో రెండు ఆస్ట్రేలియా రాజ్యాలు (విక్టోరియా, క్వీన్స్ లాండ్), బ్రిటిష్ కొలంబియా రాజధాని (విక్టోరియా), సాస్కబవాన్ (రెగినా) సియాచెలిస్ రాజధాని; ఆఫ్రికాలోని పెద్ద సరస్సు, విక్టోరియా ఫాల్స్ ఉన్నాయి.[30]
విక్టోరికా లేదా సిట్టా విక్టోరియా మధ్యధరా సముద్రంలోని గోజో దీవి రాజధాని మాలైసి గ్రామం పేరు. దానికి విక్టోరియా అనే పేరును 1887లో విక్టోరియా రాణి డైమండ్ జూబిలీ ఉత్సవాల సందర్భంగామాల్టా బిషప్ మాన్స్ సర్ పిట్రీపేస్ అభ్యర్ధన మేరకు పెట్టాడని బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇప్పటికీ ఆ దీవిలోని గోజిటన్లు మాత్రం పాత పేరు రబత్తోనే ఆ పట్టణాన్ని పిలుస్తున్నారు.
కెనడాలో విక్టోరియా డేగా మే 24న లేదా అంతకుముందు చివరి సోమవారం సెలవుదినంగా వాడుకలో ఉంది. విక్టోరియా రాణి జన్మదినం, ప్రస్తుత కెనడా సార్వభౌమాధికారిగా వ్యవహరిస్తున్న రాజు పుట్టినరోజు గౌరవార్ధం సెలవుదినం పాటిస్తుంటారు. ఇది కేవలం కెనడాలోనే పాటించేది అయినప్పటికీ, స్కాట్లాండ్లో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఎడిన్బర్గ్ డూండీలలో సెలవుదినాన్ని పాటిస్తున్నారు.[61]
చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన బ్రిటష్ రాణి ఆమె, బ్రిటీష్ సామ్రాజ్యం గతంలో ఉన్న ప్రాంతాల్లో ఆమె విగ్రహాలు వెలిశాయి. బకింగ్హామ్ ప్యాలెస్లోనే కాకుండా విక్టోరియా మెమోరియల్ను, ఆమె మరణించిన ఏడాది తర్వాత ప్యాలెస్ రూపు తిరిగి మార్చడంలో భాగంగా ఆమె విగ్రహం ఏర్పాటు చేశారు. భారత్లో కోల్కతాలో ప్రముఖంగా విక్టోరియా మెమోరియల్ ఏర్పాటు చేశారు, ఘనాలోని కేప్ కోర్ట్ పట్టణంలో ఘనంగా రాణి ముఖం వరకు ఉండే బొమ్మను అక్కడి పార్క్ లో నిర్లక్ష్యానికి గురవుతోంది, అక్కడ మేకలు గడ్డి తింటున్నాయి. అనేక సంస్థలు, మార్గాలు, పార్కులు, కట్టడాలకూ ఆమె పేరు పెట్టారు.[14]
దక్షిణ ఆస్ట్రేలియా రాజధాని నగరం అడెలైడ్లోని విక్టోరియా స్క్వేర్లో[62], క్వీన్స్ లాండ్ స్టేట్ రాజధాని నగరం [63] బ్రిస్బేన్ లోని క్వీన్స్ స్వ్వేర్, అలానే విక్టోరియా స్టేట్ రాజధాని మెల్బోర్న్ లోని డొమైన్ గార్డెన్స్లో విక్టోరియా రాణి విగ్రహాలు ఉన్నాయి. న్యూసౌత్వేల్స్ రాజధాని సిడ్నీలో (డబ్లిన్లోని ఐరిష్ పార్లమెంట్ భవనం ప్రాంగణంలో తిరిగి ఏర్పాటు చేశారు), క్వీన్ విక్టోరియా భవనం (1898లో విక్టోరియా గౌరవార్ధం ఆమె పేరు పెట్టారు) దక్షిణ ద్వారం వద్ద ప్రసస్థంగా కనపడుతుంది. సిడ్నీలో విక్టోరియా రాణి విగ్రహం మకారీ వీధిలోని ఫెడరల్ కోర్టు ప్రాంగణం ముందుభాగంలో ఉంది, రోడ్డుకి అవతలవైపు ఆల్బర్ట్ ది గుడ్ పేర చెక్కిన ఆల్బర్ట్ విగ్రహాన్ని చూస్తున్నట్టు ఉంటుంది.
దక్షిణ ఆస్ట్రేలియా రాజధాని పెర్త్లోని కింగ్స్ పార్క్లో చలువరాతి విగ్రహం ఉంది, వాటర్లూ యుద్ధంలో ఉపయోగించిన ఫిరంగులూ ఆ విగ్రహం చుట్టూ ఉన్నాయి. ఆస్ట్రేలియా విక్టోరియాలోని బల్లార్ట్ ప్రధాన వీధిలో విక్టోరియా రాణి కాంస్య విగ్రహం ఉంది. భారత్లో బెంగుళూరు నగరంలో ప్రధాన రహదారుల్లో ఒకటైన MG రోడ్డు ప్రారంభంలో రాణి విగ్రహం ఉంది.[64] అలాగే న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లో హార్బర్ వైపు కెంట్, కేంబ్రిడ్జ్ టెర్రాస్ మధ్య ఒక విగ్రహం ఉంది.
విక్టోరియా గౌరవార్ధం విగ్రహాలు ఏర్పాటుచేయడం కెనడాలో సర్వసాధారణం, ఆమె పాలనలో ఆ దేశ సమూహం సరిహద్దులతో కూడి ఉండడంతో, అనేక కొత్త ప్రావేన్సీలు కల్పించడంతో ఆమెకు కెనడాలో గౌరవం ఎక్కువ. కెనడా పార్లమెంటు గోడ మీద ఆమె బొమ్మ చెక్కారు. అలాగే పార్లమెంటు లైబ్రరీలో, ఆవరణలోనూ ఆమె విగ్రహాలున్నాయి.[65]
హాంకాంగ్లో హాంకాంగ్ ద్వీపం కాజ్వే బేలోని విక్టోరియా పార్క్ తూర్పు వైపు విక్టోరియా రాణి విగ్రహం ఉంది. సెంట్రల్లోని స్టాట్యూ స్క్వేర్లో ఆమె విగ్రహాన్ని ఉంచిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఆక్రమణ సమయంలో ధ్వంసం చేస్తారన్న భయంతో ఆ విగ్రహాన్ని టోక్యోకు తరలించారు. జపాన్ ఆ యుద్ధంలో ఓడిపోగా 1945లో సైన్యాన్ని వెనక్కి రప్పించిన తర్వాత హాంగ్కాంగ్ తిరిగి తేరుకోవడానికి యునైటెడ్ కింగ్డమ్ తోడ్పడింది. రాణి విగ్రహాన్ని తెచ్చి ఆ పార్క్లో అమర్చారు. అలాగే మాల్టా రాజధాని వెల్లెట్టా నగరం మధ్యలో విక్టోరియా రాణి విగ్రహం ఉంది.[66]
యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏర్పడటానికి ముందు బ్రిటిష్ కాలనీగా ఉన్న వా జులూ నాటల్ ప్రావెన్సీ రాజధాని పీటర్ మారిట్జ్బర్గ్ లో ప్రావెన్సీ శాసనసభ భవనం ఎదుట విక్టోరియా విగ్రహం ఉంది. అలాగే దక్షిణాఫ్రికా పార్లమెంట్ ఎదుట కూడా ఏర్పాటుచేశారు.
విక్టోరియా రాణి 1892 జూలై 16న లిబేరియా అంబాసిడర్ ఎడ్వర్డ్ విల్మాంట్ బ్లిడన్ ప్రతినిధిగా మార్థా ఆన్ రిక్స్ ను విండ్సర్ కేజిల్కు ఆహ్వానించింది. మార్త రీక్స్, టెన్నెసీకి చెందిన మాజీ బానిస. వెస్ట్ ఆఫ్రికా నుంచి అమెరికాకు బానిసల వ్యాపారం నిమిత్తం బానిసలను పంపకుండా అడ్డుకునేందుకు తీరంలో గస్తీ నిర్వహించేందుకు బ్రిటిష్ నావీని పంపడంతో రాణిని అభినందించేందుకు సుమారు పదిహేనేళ్లపాటు పైసాపైసా కూడబెట్టి, లైబీరియా నుంచి అమె ఇంగ్లాండ్ చేరుకుంది. రాణితో మార్థా కరచాలనం చేసి ఆమెకు కాఫీట్రీ క్విల్ట్ను బహుమతిగా ఇచ్చింది, దాన్ని రాణి 1893లో అంతర్జాతీయ కొలంబియా ప్రదర్శనకు పంపింది. అయితే ఇపుడు ఆ క్విల్ట్ ఎక్కడున్నదీ రహస్యమే. గాంబియాలోని రాయల్ విక్టోరియా టీచింగ్ హాస్పిటల్కు రాణి పేరు పెట్టారు. [67]
టైటిల్స్, స్టయిల్స్, కోట్ ఆఫ్ ఆర్మ్స్, సిఫర్[మార్చు]
| Royal styles of Victoria of the United Kingdom | |
|---|---|
| Reference style | Her Majesty |
| Spoken style | Your Majesty |
| Alternative style | Ma'am |
టైటిల్స్, స్టయిల్స్[మార్చు]
- 24మే 1819- 20జూన్ 1837 : హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ అలెగ్రాండ్రినా విక్టోరియా ఆఫ్ కెంట్[68]
- 20జూన్ 1837-22జనవరి 1901 : హర్ మెజస్టీ ది క్వీన్[68]
- 1మే 1876-22 జనవరి 1901 : హర్ ఇంపీరియల్ మెజిస్టీ ది క్వీన్ ఎంప్రస్.[68]
హానోవర్ రాజు మేల్ లైన్ మనవరాలు, విక్టోరియాకు హానోవర్ రాకుమారి ; బ్రన్స్ విక్,బనెన్బర్గ్ డచస్ టైటిల్స్ ఉన్నాయి. అలాగే సాక్స్-కోబర్గ్-గోధా రాకుమారి గా, సాక్సోని డచస్ గానూ, రాకుమారుడు ప్రిన్స్ భార్యగా గౌరవపదవులు ఉన్నాయి.[68]
ఆమె పాలనాకాలం పూర్తయ్యే సమయానికి ఆమెకున్న గౌరవపదవులు, స్టయిల్స్.
| “ | Her Majesty Victoria, by the Grace of God, of the United Kingdom of Great Britain and Ireland Queen, Defender of the Faith, Empress of India.[69] | ” |
సైనికుల కోట్[మార్చు]
హానోవర్ సింహాసనాన్ని విక్టోరియా అధిష్టించలేకపోవడంతో రాజకుటుంబ ఆయుధాలు 1837 నుంచి హానోవర్ గుర్తులను కలిగిలేవు. కానీ నాలుగు వంతులు, ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ గుర్తులు ఉండేవి. విక్టోరియా ఆయుధాలు మాత్రం ప్రస్తుతరాణితో సహా ఆమె తర్వాత సింహాసనం అధిష్టించిన వారసులందరూ పొందారు.
స్కాట్లాండ్ వెలుపల విక్టోరియా ఆయుధాల షీల్డ్, ఆమె రాయల్ స్టాండర్డ్పై ఉన్నది:
మూడు మాసాలకు ఒకసారి ఉపయోగించేది:
1, 4 గులెస్ , మూడు సింహాలు పస్సంట్ గార్జెంట్ పేల్ లేదా (ఇంగ్లండ్కి);
2, లేదా పురాతన సింహం బొమ్మ, డబుల్ త్రేఅస్సృరే ట్రర్ఫ్లారీ-కౌంటర్ఫ్లారీ గులెస్ (స్కాట్లాండ్కి) త్రేస్సురే
3 అజూరీ ; హార్ప్ లేదా తీగెల ఆర్జంట్ (ఇర్లాండ్ కి);
దౌత్య సంబంధ పతకం, లేదా బంగారం (లేదా పసుపు), గులెస్ ఎరుపు రంగుది, అజూరీ నీలం, అర్జెంట్ కాంస్యం ( లేదా తెలుపు).
స్కాట్లాండ్లో మొదటి, నాలుగవ భాగాలు స్కాట్సింహం, రెండవది ఇంగ్లీష్ సింహాలు ఉన్నాయి. సింహం, యూనికార్న్ కూడా స్కాట్లాండ్, మిగతా యునైడెడ్ కింగ్డమ్కఈ వ్యత్యాసం ఉంది.[70][71]
|
రాయల్ సిఫర్ (అక్షరాల అల్లిక)[మార్చు]
విక్టోరియా రాయల్ సిఫర్ను మొదట పోస్టుబాక్స్ పై ఉపయోగించేది. ఉత్తరాల మీద వి.ఆర్ అనే అక్షరాలు ఒకదానికొకటి కలిసిపోయి ఉండేవి. విక్టోరియా రెజినా, గుర్తుగా VR అని రాసేది. ఆమె రాణి అయిన తర్వాత ఇవి పోస్ట్ బాక్స్ పై కనిపించలేదు. విక్టోరియా సిఫర్ అక్షరాలు మాత్రమే పోస్ట్ బాక్స్ లపై క్రౌన్ లేకుండా కనపడేవి.[71]
పూర్వీకులు, వంశీయులు[మార్చు]
పూర్వీకులు, సమీపబంధువులు[మార్చు]
సాక్స్ కోబర్ గసాల్ ఫీల్డ్ డ్యూక్ ఫ్రాన్సిస్ మనవరాలు, మనవడు, ప్రిన్సు కుమారుడు డ్యూక్ ఎర్నెస్ట్ ఆల్బర్ట్ తండ్రి, ఫ్రాన్సిస్ కుమార్తె రాకుమారి విక్టోరియా, విక్టోరియా తల్లి.
(డ్యూక్ ఫ్రాన్సిస్ మరోకుమారుడు లియోపాల్డ్1 బెల్జియం తొలిరాజు (1831-1865 మధ్యకాలంలో పరిపాలించాడు), విక్టోరియా అంకుల్ మాత్రమే గాకుండా, కింగ్ లియోపాల్డ్2 (1865-1909), మెక్సికో రాణి కార్లోటా (1864-1867) తండ్రి కూడా.
సారాంశాలు[మార్చు]
వీటిని కూడా చూడండి[మార్చు]
గమనికలు మరియు సూచనలు[మార్చు]
మరింత చదవడానికి[మార్చు]
బాహ్య లింకులు[మార్చు]వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
మూస:Canadian monarchs మూస:English, Scottish and British monarchs మూస:British princesses మూస:Hanoverian princesses మూస:Princesses of Saxe-Coburg and Gotha by marriage |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
- CS1 errors: missing periodical
- CS1 errors: OCLC
- CS1: Julian–Gregorian uncertainty
- CS1 maint: multiple names: authors list
- గూగుల్ అనువాద వ్యాసాలు
- All articles with unsourced statements
- Articles with unsourced statements from July 2010
- Articles with unsourced statements from June 2010
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- విక్టోరియా ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్
- ఉమెన్ ఆఫ్ ది విక్టోరియన్ ఎరా
- మోనార్క్స్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్
- మోనార్క్స్ ఆఫ్ ఆస్ట్రేలియా
- హెడ్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కెనడా
- హెడ్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ న్యూజిలాండ్
- ప్రొటెస్టెంట్ మోనార్క్స్
- క్వీన్స్ రెగ్నెంట్
- ఇండియన్ ఎంప్రెసెస్
- భారతీయ రాజవంశీయులు
- ఇంగ్లీష్ అండ్ బ్రిటీష్ ప్రిన్సెస్
- ఫౌండర్స్ ఆఫ్ ఇంగ్లీష్ స్కూల్స్ అండ్ కాలేజీ
- 1986 జననాలు
- 2003 మరణాలు
- 19 సెంచరీ మోనార్క్స్ ఇన్ యూరప్
- 19 సెంచరీ ఫీమెల్ రూలర్స్