భాయ్ గురుదాస్
Bhai Gurdas | |
|---|---|
19th century mural painting from Gurdwara Baba Atal depicting Bhai Gurdas | |
| Jathedar of the Akal Takht | |
| In office 1606 – 25 August 1636 | |
| అంతకు ముందు వారు | Position Established |
| తరువాత వారు | Mani Singh |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | Gurdas Bhalla 1551 Basarke, Amritsar, Punjab |
| మరణం | 25 August 1636 Goindwal, Tarn Taran Sahib, Punjab |
| బంధువులు | Mata Ganga (cousin) |
| తల్లి | Jivani |
| తండ్రి | Ishar Das |
| Known for |
|
భాయ్ గురుదాస్ (1551 – 1636 ఆగస్టు 25) ప్రభావవంతులైన సిక్కు మత రచయిత, చరిత్రకారుడు, సిక్కు మత బోధకుడు. సిక్కులకు ఉన్న 10 గురువులలో నలుగురు గురువులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి . అతను గురువుల బోధనలను గురు గ్రంథ్ సాహిబ్ లో చాలా భాగం వరకు పొందుపరచారు.[1]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]1551లో పంజాబ్ లోని గోయింద్వాల్ అనే చిన్న పల్లెటూరులో జన్మించాడు. అతని తండ్రి భాయ్ ఇషార్ దాస్, 3వ సిక్కు గురువు అయిన గురు అమర్ దాస్ కు మొదటి కజిన్. అతని తల్లి జీవని 1554లో గురుదాస్ మూడేళ్ళ వయసులో ఉన్నప్పుడు మరణించింది.[2][3]
12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తన తండ్రి కూడా మరణించాడు. అలా అనాథగా ఉన్న గురుదాస్ ను గురు అమర్ దాస్ దత్తత తీసుకున్నాడు. గురు దాస్ సంస్కృతం, బ్రజ్ భాష, పర్షియన్, పంజాబీ (గురుముఖీ) భాషలు నేర్చుకున్నాడు. ఆ తరువాత ఆయన మత బోధనలు చేసేవాడు. మొదట్లో ఆయన ఎక్కువగా గోయింద్వాల్, సుల్తాన్ పూర్ లోధీలలో నివసిస్తూ ఉండేవాడు. గోయింద్వాల్ లో ఢిల్లీ-లాహోర్ రోడ్డులో ప్రయాణించే స్వామీజీలు, ఫకీరుల ప్రవచనాలు వినేవాడు. ఆ తరువాత వారణాసి కి మకాం మార్చి, అక్కడ సంస్కృతం, హిందు మతానికి చెందిన గ్రంథాలను అధ్యయనం చేశాడు. గురు అమర్ దాస్ మరణించాకా, గురు రామ్ దాస్ ఈయనను ఆగ్రాలో మత బోధకునిగా నియమించాడు.
తరువాతి జీవితం
[మార్చు]1577లో హర్మందిర్ సాహిబ్ వద్ద కొలను తవ్వినప్పుడు గురుదాస్ కూడా పాల్గొన్నాడు. కర్తర్పూర్ కు యాత్ర వెళ్ళినప్పుడు మొఘల్ చక్రవర్తి అక్బర్ కు ప్రాచీన శ్లోకాలను వినిపించాడు. నిజానికి ఆ సమయంలో సిక్కులందరూ ముస్లిములకు వ్య తిరేకంగా ఉన్నారు. గురువుల కుటుంబంలోని అంతః కలహాలతో సిక్కు మతానికి కొంత నష్టం వాటిల్లిన సమయం కూడా అది. గురుదాస్ చేసిన ఈ పని వల్ల అక్బర్ సిక్కులు ముస్లిం మతానికి వ్యతిరేకంగా లేరని అర్ధం చేసుకున్నాడు. గురు రామ్ దాస్ మరణించాకా, తరువాతి సిక్కు గురువు గురు అర్జున్ కు గురు దాస్ చాలా మంచి సన్నిహితుడు. గురు అర్జున్ కు ఆయనంటే చాలా గౌరవం. ఆయనను తన మేనమామ అని పిలిచేవారు గురు అర్జున్. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ సిక్కు మత ప్రాభవంపై అసూయ పెంచుకున్నారు. గురుదాస్ కాబూల్, కాశ్మీర్, రాజస్థాన్, శ్రీలంక ప్రాంతాలకు వెళ్ళి సిక్కు మత ప్రచారం చేశారు.
సాహిత్య రచనలు
[మార్చు]19 సంవత్సరాలు కృషి చేసి 1604లో ఆది గ్రంథ్ను పూర్తి చేశారు. ఆది గ్రంథ్ ను గురు అర్జున్ చెప్తూండగా రాశారు గురుదాస్. ఇదే కాక గురు అర్జున్ రాసిన భాయ్ హైరా, భాయ్ సంత్ దాస్, భాయ్ సుఖా, భాయ్ మనసా రామ్ వంటి గ్రంథాలను కూడా పర్యవేక్షించారు. ఆయన స్వంతంగా పంజాబీ భాషలో రాసిన అన్ని రకాల సాహిత్యాన్నీ కలిపి వరన్ భాయ్ గురుదాస్ అని పిలుస్తారు.[2]
అకాల్ తక్త్ కు మొదటి జతేదార్
[మార్చు]1606 జూన్ 15న గురు హరగోబింద్ అకాల్ తక్త్ ప్రకటించారు. ఆయనే దానికి శంకుస్థాపన కూడా చేశారు. దాని నిర్మాణ బాధ్యతలను ప్రముఖ సిక్కు సేవకుడు బాబా బుద్ధ, భాయ్ గురుదాస్ లకు అప్పగించారు. దీని నిర్మాణంలో ఇంకో వ్యక్తికి అనుమతిలేదు. వహేగురు తక్త్ ను భద్రపరచవలసిన బాధ్యత కూడా గురు హరగోబింద్ దే. అది నిర్మాణం పూర్తవుతున్న సందర్భంలో గురు హరగోబింద్ ను గ్వాలియర్ కోటలో జైలులో ఉన్నప్పుడు బాబా బుద్ధను హర్మందిర్ సాహిబ్ లో జరగవలసిన సేవల బాధ్యతను, అకాల్ తక్త్ బాధ్యతలను గురుదాస్ కు అప్పగించారు ఆయన. అలా అకాల్ తక్త్ కు మొదటి జతేదార్ అయ్యారు భాయ్ గురుదాస్.
ఆయన రాసిన సాహిత్యం
[మార్చు]- సంస్కృతంలో 6 పంక్తులతో ఉండే 8 పద్యాలు రాశారు గురుదాస్.
- బ్రజ్ భాషలో 672 కవితలు, 3 స్వయ్యాలు.
- పంజాబీ భాషలో 912 పౌరిలు ఉన్న 40 వార్లు రాశారు.
మరణం
[మార్చు]1636 ఆగస్టు 25లో గోయింద్వాల్ లో మరణించారు భాయ్ గురుదాస్.[3] గురు హరగోబింద్ స్వయంగా ఆయన అంత్యక్రియలు చేశారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Saints - Sikhs.org
- ↑ 2.0 2.1 Jaggi, Rattan Singh. "GURDĀS, BHĀĪ (1551-1636)". Encyclopaedia of Sikhism. Punjabi University Punjabi. Retrieved 25 August 2015.
- ↑ 3.0 3.1 Bhai GURDAS (1551-1636) Archived 2019-02-05 at the Wayback Machine - SikhHistory.com