భారతీ శతకం

వికీపీడియా నుండి
(భారతీ శతకము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భారతీ శతకం కొటికెలపూడి కోదండరామకవి భారతి అనగా సరస్వతీ దేవిని స్తుతిస్తూ రచించిన శతకం. ఈ కవి బొబ్బిలి సంస్థానంలోని ఆస్థాన కవి.

ఈ శతకంలో కవి భారతీదేవిని స్తోత్రం చేయడంతో పాటు వివిధ శాస్త్రాలలోను, రాజనీతి వంటి పరిపాలనా విషయాలలోను తనకు గల గాఢ పరిచయాన్ని తెలిపాడు. బొబ్బిలి రాజవంశంవారు విశిష్టాద్వైతాన్ని అనుసరించేవారు కనుక విశిష్టాద్వైత వేదాంత విషయాలను ఇందులో తెలుపడం విశేషం.

కొన్ని పద్యాలు[మార్చు]

ఇందులో కవి భారతీదేవిని సకల రూప శర్వాణిగా ఇలా వర్ణించాడు:

పరమ బ్రహ్మము చెంగటన్ ప్రకృతివై పద్మాక్షు పాలన రమా
తరుణీ రత్నమవై విభాకరుని చంతం చాయవై బమ్మ దే
వర యొద్దం తగ వాణివై శివు సమీపం బందు శర్వాణివై
కరమొప్పా రెడి నీకు జేశెద నమస్కారంబులో భారతి. (ప.12)

తా: పరంబ్రహ్మకు నీవు ప్రవృత్తివి. విష్ణువునకు రమాదేవివి, సూర్యునకు ఛాయవు. బ్రహ్మకు వాణివి. శివునికి పార్వతివి. సకల రూప స్వరూపిణిగా భారతీదేవిని భావించి కొలిచాడు.