భారత రాష్ట్రపతి ఎన్నికల విధానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని భారత రాజ్యాంగ పరిషత్, ఐర్లాండ్ దేశం నుండి ఆదర్శంగా తీసుకుంది. ప్రతి ప్రాంతంలోని జనాభాను, ఆ ప్రాంత విస్తీర్ణాన్నీ ప్రాతిపదికంగా తీసుకొని ఎన్నికలను నిర్వహిస్తారు. ఆర్టికల్-54 లో రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన ఉంది. ఎలక్ట్రోరల్ కాలేజి సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఎలక్ట్రోరల్ కాలేజిలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉంటారు. 1992లో 72 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించారు. దీన్ని భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

ఓట్ల విలువ[మార్చు]

  • ఎలక్ట్రోరల్ కాలేజిలో మొత్తం ఓట్ల విలువ = 10,98,990. అందులో 50 శాతం ఎంపిలకు, 50 శాతం ఎమ్మెల్యేలకు ఉంటుది.
  • ప్రస్తుతం ఎలక్ట్రోరల్ కాలేజిలో 776 (544+223) మంది ఎంపీలు.
  • 4120 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారు.

ఎంపీల ఓట్ల విలువ[మార్చు]

  • దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 54,9495. దీన్ని ఎంపీల సంఖ్య 776 తో భాగిస్తారు. అదే 708.112 వస్తుంది.
  • దాన్నే 708 గా ఖరారు చేశారు.

ఎమ్మెల్యేల ఓట్ల విలువ[మార్చు]

  • ఎమ్మెల్యేలకు మాత్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటుంది.
  • దీన్ని నిర్ణయించడానికి 1971 జనాభాను ప్రాతిపదికన తీసుకుంటారు.
  • 1971 నాటి మొత్తం జనాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తారు. దానిని వేయితో భాగిస్తారు.[1]

ఉదాహరణ:

  • తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభా (1971 జనాభా లెక్కల ప్రకారం) 1,56,02,122.
  • దీన్ని 119 ఎమ్మెల్యేలతో భాగించగా 131950.650 వస్తుంది.
  • దాన్ని 1000 తో భాగిస్తే 131.95 వస్తుంది.
  • దీన్ని ఓటు విలువ 132 గా నిర్ణయించారు.

రాష్ట్రాల వారిగా ఎమ్మెల్యేలా ఓట్ల విలువ వివరాలు[మార్చు]

నెం. రాష్ట్రం జనాభా (1971) అసెంబ్లీ సీటు ఓటు విలువ రాష్ట్ర ఓట్ల విలువ
1 ఉత్తర ప్రదేశ్ 8,38,49,905 403 208 83,824
2 తమిళనాడు 4,11,99,168 234 176 41,184
3 జార్ఖండ్ 1,42,27,133 81 176 14,256
4 తెలంగాణ 1,57,02,122 119 132 15,708
5 ఆంధ్రప్రదేశ్ 2,78,00,586 175 159 27,825
6 మహారాష్ట్ర 5,04,12,235 288 175 50,400

మూలాలు[మార్చు]

  1. Andhrajyothi 16 july 2017

వర్గం[మార్చు]