మన్నవ గిరిధరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మన్నవ గిరిధరరావు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు.

జీవిత విశేషాలు[మార్చు]

గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన మన్నవ ఇతని స్వగ్రామం[1]. ఇతడు విద్యార్థిగా వల్లభజోస్యుల సుబ్బారావు మొదలైనవారివద్ద శిష్యరికం చేశాడు. చరిత్రలో ఎం.ఎ. చదివాడు. యువభారతి అనే మాసపత్రికకు, భారతీయ మార్గం అనే మాసపత్రికకు, సాధన పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. గుంటూరులోని హిందూ కళాశాలలో రాజనీతిశాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నాడు. 1968-1974ల మధ్య ఉపాధ్యాయుల ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. ఇతడు జూలై 31, 2006న గుంటూరులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 77వ యేట మరణించాడు[2].

రచనలు[మార్చు]

  1. అప్రస్తుత ప్రసంగం
  2. కాంతిరేఖలు[3] (మూడు భాగాలు)
  3. లోకజ్ఞానం
  4. ఎలా చదవాలి?[4]
  5. మణిపూసలు
  6. పనికొచ్చేకథలు (రెండు భాగాలు)
  7. చదువుకుంటే బహుమతి
  8. సూక్తి సుధ
  9. హిందూ ధర్మ వైభవము
  10. భారత జాతికి ఆశాజ్యోతి
  11. వెర్రితలలు వేస్తున్న సెక్యులరిజం[5]
  12. ఎం.ఎల్.ఏ. ఆత్మకథ (నవల)[6]

మూలాలు[మార్చు]