మన్మథ
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
మన్మధ తెలుగు సంవత్సరాలలో 29వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం జయ, తర్వాత సంవత్సరం దుర్ముఖి. దీని అర్థం మనస్సును మధించేది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1895-1896, 1955-1956, 2015-2016 లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి మన్మథ అని పేరు.
2015 : మన్మధ నామ సంవత్సరం 21 మార్చి 2015 శనివారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 8 ఏప్రిల్ 2016 శుక్రవారం దుర్ముఖి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "మన్మధ"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 29 | మన్మథ | 35-36 | 95-96 | 155-156 | 215-216 | 275-276 | 335-336 | 395-396 | 455-456 | 515-516 | 575-576 | 635-636 | 695-696 | 755-756 | 815-816 | 875-876 | 935-936 | 995-996 | 1055-1056 | 1115-1116 | 1175-1176 | 1235-1236 | 1295-1296 | 1355-1356 | 1415-1416 | 1475-1476 | 1535-1536 | 1595-1596 | 1655-1656 | 1715-1716 | 1775-1776 | 1835-1836 | 1895-1896 | 1955-1956 | 2015-2016 | 2075-2076 | 2135-2136 | 2195-2196 | 2255-2256 | 2315-2316 | 2375-2376 | 2435-2436 | 2495-2496 | 2555-2556 | 2615-2616 | 2675-2676 | 2735-2736 | 2795-2796 |
సంఘటనలు
[మార్చు]- సా.శ. 1895 : భాద్రపద, ఆశ్వయుజ మాసములలో తిరుపతి వేంకట కవులు విజయనగరములో అవధానములు జరిపారు.[3] పుష్యమాసము క్రొత్తపల్లెలో శ్రీ రావు జగ్గారాయనింగారు వీరిచేత శతావధానము చేయించారు.
- సా.శ. 1896: తిరిగి వీరిచే ఫాల్గుణమాసము న గద్వాల సంస్థానములో శతావధానము జరిగింది.[4]
- సా.శ. 1955 : కార్తీక బహుళ ద్వాదశి - నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది.
- సా.శ. 2015 : గోదావరి నది పుష్కరము
జననాలు
[మార్చు]- సా.శ.1775 ఫాల్గుణమాసము : కర్ణాటక సంగీత చక్రవర్తి ముత్తుస్వామి దీక్షితార్ జననం.
- సా.శ.1895 భాద్రపద బహుళ షష్ఠి : విశ్వనాథ సత్యనారాయణ, తెలుగు సాహిత్యవేత్త.
- సా.శ.1956 పుష్య బహుళ పాడ్యమి: ఒద్దిరాజు సీతారామచంద్రరావు - ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడు (జ.1887, సర్వజిత్తు).
- సా.శ.1956 మాఘ శుద్ధ సప్తమి : వేదాటి రఘుపతి - అష్టావధాని, రచయిత, పరిశోధకుడు.[5]
- సా.శ.1956 ఫాల్గుణ బహుళ పంచమి: బెజగామ రామమూర్తి - అష్టావధాని, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కార గ్రహీత.[6]
మరణాలు
[మార్చు]- క్రీ. శ. 1895 : ఫాల్గుణ బహుళ తదియ : మాడభూషి వేంకటాచార్యులు - ప్రముఖ తెలుగు కవి.
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 43. Retrieved 27 June 2016.[permanent dead link]
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 56. Retrieved 27 June 2016.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 664.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 668.