మామిడిపూడి రామకృష్ణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మామిడిపూడి రామకృష్ణయ్య తెలుగు రచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

రామకృష్ణయ్య నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాకు చెందిన పురిణి గ్రామంలో వేంకటేశయ్య, నరసమ్మ దంపతులకు 1896 జూలై 26న జన్మించాడు. అతనితో పాటు అతని సహోదరులు 16 మంది. వారు -విమల, లక్ష్మీవెంకటకృష్ణన్, సరస్వతి, దశరథరాం, రామ, మైత్రేయి, కృష్ణమూర్తి, తులసి, జానకి, రోహిణి, శ్రీనివాస్, వెంకటేష్, లలిత, పట్టాభిరాం, శ్రీరాం లు. అతని భార్య ఇందిరమ్మ. ఈమె తల్లి దండ్రులు అల్లాడి మహాదేవశాస్త్రి, మీనాక్షి ల కుమార్తె. [1]

రామకృష్ణయ్య న్యాయవాద వృత్తి నిర్వహిస్తూ రచనలు చేస్తుండే వాడు. శ్రీ మద్వాల్మీకి రామాయణ కథా కథనాన్ని గ్రంథస్థముయవలసినదిగా అతని మిత్రులు ప్రోత్సహహించారు. ఆ ప్రకారమే రామకృష్ణయ్య వాల్మీకి రామాయణ కథను "శ్రీమద్వాల్మీకి రామాయణ కథామృతం" శీర్షికతో తెలుగులో, సులభ వచనాశైలిలో రాసి ప్రచురించి, గ్రంథాన్ని తమ సోదరుడు, పేరొందిన చరిత్రకారుడు మామిడిపూడి వెంకటరంగయ్య కి అంకితం చేశాడు[2]. ఈ గ్రంథం మొదట 1961లో ప్రచురించబడింది. చిత్రకారుడైన ఆతని కుమారుడు కృష్ణమూర్తి ఈ పుస్తకానికి ముఖచిత్రాన్ని వేసాడు.

అతని మరొక రచన శ్రీ భగవద్గీతామృతం. సామాన్య సాధకులు వారి దైనందిన జీవితాలలో భగవద్గీత సందేశాన్ని అన్వయించుకొని, వారు ఉన్నత మార్గంలో పయనించేందుకు దోహదపడే రీతిలో ఈ గ్రంథాన్ని రాశాడు. దీనికి ఆంగ్ల అనువాదాన్ని కూడా వెలయించాడు. ఈ రెండు అతని జీవితకాలంలోనే అచ్చయ్యాయి.

రామాకృష్ణయ్య కుమారులు మళ్లీ 2014లో ఈ మూడు గ్రంథాలను చాల కళాత్మకంగా, వర్ణ చిత్రాలతో, హైదరాబాదు కళాజ్యోతి ప్రస్ లో అచ్చువేయించి పంచి పెట్టారు.

వనరులు[మార్చు]

  • vikrama simhapuri madala sarwaswam, Srimad Bhagavadgeeta, author: M.Ramakriaswhnaiah, Kalajyoti Process pvt Ltd, HYs.2013.
  • శ్రీమద్ భగవద్గీతామృతము, మామిడిపూడి రామకృష్ణయ్య, రామన్న పబ్లికేషన్స్, హైదరాబాద్,2014.
  • శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతము(మూడు సంపుటాలు), మామిడిపూడి రామకృష్ణయ్య, చామన్న పబ్లికేషన్స్, హైదరాబాద్, 2016.

మూలాలు[మార్చు]

  1. "మున్నుడి".
  2. SRI MAMIDIPUDI RAMAKRISHNAIAH (1995). SRI MADVALMIKI RAMAYANA KADHAMRUTHAMU. CCL, ROP HYDERABAD, HYDERABAD PAR INFORAMTICS. MAMIDIPUDI DASARATHARAM.