మాసిడోనియన్ సామ్రాజ్యం
Macedonia Μακεδονία | |||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||
The Kingdom of Macedonia in 336 BC (orange) | |||||||||||||||||||||||||
| రాజధాని | |||||||||||||||||||||||||
| సామాన్య భాషలు | Ancient Macedonian, Attic, Koine Greek | ||||||||||||||||||||||||
| మతం | Greek polytheism, Hellenistic religion | ||||||||||||||||||||||||
| పిలుచువిధం | Macedonian, Makedon[3] | ||||||||||||||||||||||||
| ప్రభుత్వం | Hereditary monarchy | ||||||||||||||||||||||||
| Basileus | |||||||||||||||||||||||||
• 498/497–454 BC | Alexander I | ||||||||||||||||||||||||
• 454–413 BC | Perdiccas II | ||||||||||||||||||||||||
• 413–399 BC | Archelaus | ||||||||||||||||||||||||
• 359–336 BC | Philip II | ||||||||||||||||||||||||
• 336–323 BC | Alexander the Great | ||||||||||||||||||||||||
• 305–297 BC | Cassander | ||||||||||||||||||||||||
• 294–288 BC | Demetrius I | ||||||||||||||||||||||||
• 288–284 BC | Pyrrhus and Lysimachus | ||||||||||||||||||||||||
• 272–239 BC | Antigonus II | ||||||||||||||||||||||||
• 229–221 BC | Antigonus III | ||||||||||||||||||||||||
• 221–179 BC | Philip V | ||||||||||||||||||||||||
• 179–168 BC | Perseus (last) | ||||||||||||||||||||||||
| శాసనవ్యవస్థ | Synedrion | ||||||||||||||||||||||||
| చారిత్రిక కాలం | Classical Antiquity | ||||||||||||||||||||||||
| 7th century BC | |||||||||||||||||||||||||
| 512/511–493 BC | |||||||||||||||||||||||||
| 492–479 BC | |||||||||||||||||||||||||
| 359–336 BC | |||||||||||||||||||||||||
| 338–337 BC | |||||||||||||||||||||||||
| 336–323 BC | |||||||||||||||||||||||||
| 323 BC | |||||||||||||||||||||||||
| 322–272 BC | |||||||||||||||||||||||||
| 214–148 BC | |||||||||||||||||||||||||
| 168 BC | |||||||||||||||||||||||||
| విస్తీర్ణం | |||||||||||||||||||||||||
| 323 BC[5][6][7] | 5,200,000 km2 (2,000,000 sq mi) | ||||||||||||||||||||||||
| ద్రవ్యం | Tetradrachm | ||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||
మాసిడోనియా (/ˌmæsɪˈdoʊniə/ (
విను
) MASS-ih-DOH-nee-ə; Greek: Μακεδονία, Makedonía), దీనిని మాసిడాన్ (/ˈmæsɪdɒn/ MASS-ih-don) అని కూడా పిలుస్తారు.ఇది ఆర్కైకు గ్రీసు క్లాసికలు గ్రీసు సరిహద్దులో ఉన్న ఒక ప్రాచీన రాజ్యం.[8] ఇది తరువాత హెలెనిస్టికు గ్రీసులో ఆధిపత్య రాజ్యంగా మారింది.[9] ఈ రాజ్యాన్ని రాజవంశమైన ఆర్జియాడు రాజవంశం స్థాపించి ప్రారంభంలో పాలించింది. ఆ తర్వాత యాంటిపట్రిడు, యాంటిగోనిడు రాజవంశాలు పాలించాయి. ప్రాచీన మాసిడోనియన్లకు నిలయమైన తొలి రాజ్యం గ్రీకు ద్వీపకల్పం ఈశాన్య భాగంలో కేంద్రీకృతమై ఉంది.[10] ఇది నైరుతిలో ఎపిరసు, వాయువ్యంలో ఇల్లిరియా, ఉత్తరాన పేయోనియా, తూర్పున థ్రేసు, దక్షిణాన థెస్సాలీతో సరిహద్దులను కలిగి ఉంది.
క్రీ.పూ. 4వ శతాబ్దానికి ముందు మాసిడోనియా ఐగైలో రాజధానిగా ఉన్న ఒక చిన్న రాజ్యంగా ఉండేది. ఇది ఏథెన్సు, స్పార్టా, థీబ్సు వంటి గొప్ప నగర-రాజ్యాల ఆధిపత్య ప్రాంతానికి వెలుపల ఉండేది. అకెమెనిడు సామ్రాజ్యానికి కొద్దికాలం పాటు సామంతరాజ్యంగా ఉంది. ఆర్గియాడు రాజు 2వ ఫిలిపు (క్రీ.పూ. 359–336) పాలనలో పెల్లా రాజధానిగా ఉన్న మాసిడోనియా దండయాత్రలు, దౌత్యం ద్వారా ప్రధాన భూభాగ గ్రీసును, థ్రేసియను ఒడ్రిసియను రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. 2వ ఫిలిపు ఫలాంక్సులు కలిగిన సంస్కరించబడిన పురాతన సైన్యం సరిస్సా పైకును పట్టుకుని ఏథెంసు థెబ్సు పాత శక్తులను క్రీ.పూ 338 లో జరిగిన చెరోనియా యుద్ధం లో ఓడించాడు. 2వ ఫిలిపు కుమారుడు అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకు రాజ్యాల సమాఖ్యకు నాయకత్వం వహించాడు. తిరుగుబాటు చేసిన తర్వాత థెబ్సును నాశనం చేసినప్పుడు గ్రీసు మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకోవాలనే తన తండ్రి లక్ష్యాన్ని సాధించాడు. అలెగ్జాండరు తరువాతి విజయ పోరాటంలో సమయంలో ఆయన అకెమెనిడ్ సామ్రాజ్యంను పడగొట్టాడు. సింధు నది వరకు విస్తరించి ఉన్న భూభాగాన్ని జయించాడు. కొంతకాలం పాటు ఆయన 'మాసిడోనియను సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది - ఖచ్చితమైన హెలెనిస్టికు రాజ్యం, పురాతన గ్రీకు నాగరికత కొత్త కాలానికి పరివర్తనను ప్రారంభించింది. గ్రీకుకళలు సాహిత్యం కొత్తగా జయించిన భూములలో వృద్ధి చెందాయి. ప్రాచీన తత్వశాస్త్రం, ఇంజనీరింగ్, సైన్సులో పురోగతులు సామ్రాజ్యం, అంతకు మించి వ్యాపించాయి. పాశ్చాత్య తత్వశాస్తం కీలకాంశంగా మారిన అరిస్టాటిల్ రచనలు అలెగ్జాండరుకు బోధకుడిగా నిలిచాయి. అరిస్టాటిల్ రచనలు చాలా ముఖ్యమైనవి.
క్రీ.పూ. 323లో అలెగ్జాండరు ది గ్రేటు మరణం తర్వాత తదనంతరం జరిగిన డయాడోచి యుద్ధాలు, అలెగ్జాండరు స్వల్పకాలిక సామ్రాజ్యం విభజన జరిగినప్పటికీ, మాసిడోనియా టోలెమికు ఈజిప్టు, సెల్యూసిడ్ సామ్రాజ్యం అటాలిడు రాజ్యంతో పాటు మధ్యధరా ప్రాంతంలో ఒక గ్రీకు సాంస్కృతిక, రాజకీయ కేంద్రంగా మిగిలిపోయింది. దాని రాజధాని పెల్లా, పిడ్నా, ఆంఫిపోలిసు వంటి ముఖ్యమైన నగరాలు ఈ భూభాగం మీద నియంత్రణ కోసం జరిగిన అధికార పోరాటాలలో పాలుపంచుకున్నాయి. కాసాండరు అనే అధికారాన్ని చేజిక్కించుకున్న వ్యక్తి (తన భార్య థెస్సలోనికే ఆఫ్ మాసిడోను పేరు మీద) థెస్సలోనికా వంటి కొత్త నగరాలను స్థాపించాడు. మధ్యధరా ప్రాంతంలో రోం ఒక ప్రముఖ శక్తిగా ఎదగడంతో మాసిడోనియా యుద్ధాల కారణంగా మాసిడోనియను పతనం ప్రారంభమైంది. క్రీ.పూ. 168లో మూడవ మాసిడోనియను యుద్ధం ముగిసే సమయానికి, మాసిడోనియను రాచరికం రద్దు చేయబడింది. దాని స్థానంలో రోమను సామంతుల రాజ్యాలు ఏర్పడ్డాయి. క్రీ.పూ. 150–148లో నాల్గవ మాసిడోనియను యుద్ధం సమయంలో రాచరికం స్వల్పకాలిక పునరుద్ధరణ, మాసిడోనియా అనే రోమను ప్రావిన్సు స్థాపనతో ముగిసింది.
2వ ఫిలిపు పాలన నాటికి సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉండి, బంగారం, వెండి వంటి రాజ్య వనరులను తమ ఆధీనంలో ఉంచుకున్న మాసిడోనియను రాజులు నాణేలను ముద్రించడానికి తమ సైన్యాలకు నిధులు సమకూర్చడానికి, ఒక మాసిడోనియను నావికాదళాన్ని పోషించడానికి గనుల తవ్వకం కార్యకలాపాలను సులభతరం చేశారు. ఇతర డయాడోచి వారసత్వ రాజ్యాల మాదిరిగా కాకుండా అలెగ్జాండరు ప్రోత్సహించిన సామ్రాజ్య ఆరాధన మాసిడోనియాలో ఎప్పుడూ స్వీకరించబడలేదు. అయినప్పటికీ మాసిడోనియను పాలకులు రాజ్యానికి ప్రధాన పూజారులుగా, హెలెనిస్టికు మతంలోని దేశీయ, అంతర్జాతీయ ఆరాధనలకు ప్రముఖ పోషకులుగా పాత్రలు పోషించారు. సైన్యం అనే సంస్థ ద్వారా మాసిడోనియను రాజుల అధికారం సిద్ధాంతపరంగా పరిమితం చేయబడింది. అయితే మాసిడోనియను కామన్వెల్తులోని కొన్ని మునిసిపాలిటీలు ఉన్నత స్థాయి స్వయంప్రతిపత్తిని అనుభవించాయి. ప్రజా సభలతో కూడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూడా కలిగి ఉండేవి.
పద వ్యుత్పత్తి
[మార్చు]మాసిడోనియా (Greek: Μακεδονία, Makedonía) అనే పేరు Μακεδόνες (Makedónes) అనే జాతి నామం నుండి వచ్చింది. ఇది స్వయంగా పురాతన గ్రీకు విశేషణం μακεδνός (makednós) నుండి ఉద్భవించింది. దీని అర్థం 'పొడవైన, సన్నని', ఇది డోరియన్లకు సంబంధించిన ఒక ప్రజల పేరు కూడా (హెరోడోటసు), బహుశా పురాతన మాసిడోనియన్లను వర్ణించేది కావచ్చు.[11] ఇది పురాతన గ్రీకులో 'పొడవైన' లేదా 'ఎత్తైన' అని అర్థం వచ్చే μακρός (makrós) అనే విశేషణంతో అత్యంత సంభావ్యంగా సజాతీయ పదం.[11] ఈ పేరుకు వాస్తవానికి 'పర్వత ప్రాంత వాసులు', 'పొడవైన వారు', లేదా 'పొడవుగా పెరిగిన పురుషులు' అని అర్థం అని నమ్ముతారు.[note 1]యూజీన్ ఎన్. బోర్జా పశ్చిమ మాసిడోనియాలోని పర్వత ప్రాంతాల "పర్వత ప్రాంత వాసులు" లేదా "మాకెడోన్సు" వాయువ్య గ్రీకు జాతికి చెందినవారని రాశారు; వారు, పూర్వ కాలంలో దక్షిణానికి వలస వెళ్లి చారిత్రక "డోరియన్లు"గా మారిన వారికి దగ్గర సంబంధం ఉన్నవారు. భాషావేత్త రాబర్టు ఎస్. పి. బీక్సు ఈ రెండు పదాలు కూడా ప్రీ-గ్రీకు సబ్స్ట్రేటు మూలానికి చెందినవని. వాటిని ఇండో-యూరోపియను రూపశాస్త్రం పరంగా వివరించలేమని పేర్కొన్నారు; అయితే ఫిలిపు డి డెకరు, బీక్సు వాదనలు సరిపోవని తిరస్కరించారు. చిన్న ఆంగ్ల పేరు రూపమైన 'మాసిడాన్' మధ్యయుగ ఆంగ్లంలో, ఆ పేరు ఫ్రెంచి రూపమైన 'మాసెడోయిన్' నుండి స్వీకరించడం ద్వారా అభివృద్ధి చెందింది.
చరిత్ర
[మార్చు]ప్రాచీన చరిత్ర - పురాణం
[మార్చు]
శాస్త్రీయ గ్రీకు చరిత్రకారులు హెరోడోటసు, థుసిడిడెసు ఒక పురాణాన్ని నివేదించారు. దాని ప్రకారం ఆర్గియాడు రాజవంశం మాసిడోనియను రాజులు ఆర్గోసు రాజు అయిన టెమెనసు వారసులు. అందువలన వారు పౌరాణిక హెరాకిల్సును తమ పూర్వీకుడుగా, గ్రీకు దేవతల అధిపతి అయిన జీయసు నుండి వంశపారంపర్యంగా వచ్చినవారని చెప్పుకోగలిగారు.[12] పరస్పర విరుద్ధమైన పురాణాల ప్రకారం మాసిడోను 1వ పెర్డిక్కాసు లేదా మాసిడోను కారనసు ఆర్గియాడు రాజవంశ స్థాపకులు 1వ అమింటాసుకు ముందు ఐదు లేదా ఎనిమిది మంది రాజులు ఉన్నారు.[13] ఆర్గియాడులు టెమెనసు నుండి వచ్చారనే వాదనను ప్రాచీన ఒలింపికు క్రీడలు హెల్లానోడికై అధికారులు అంగీకరించారు. దీనివలన మాసిడోను 1వ అలెగ్జాండరు (r. 498 – 454) తన గ్రీకు వారసత్వం కారణంగా పోటీలలో పాల్గొనడానికి అనుమతించబడ్డాడు.[14] 1వ అలెగ్జాండరు తండ్రి అయిన మసిడోనియాకు చెందిన 1వ అమింటాసు (క్రీ.పూ. 547–498) పాలనకు ముందు పురాతన కాలం నాటి ఆ రాజ్యం గురించి పెద్దగా ఏమీ తెలియదు. మసిడోనియా రాజ్యం ప్రారంభంలో దిగువ మసిడోనియాలో, ఒలింపసు పర్వతంకు ఉత్తరాన, వెర్మియో, పీరియను పర్వత శ్రేణులకు తూర్పున, హాలియాక్మను, లౌడియాసు నదుల వెంబడి, థెర్మైకు సింధుశాఖ తీరం పొడవునా విస్తరించి ఉండేది. చరిత్రకారుడు రాబర్టు మాల్కం ఎర్రింగ్టను అభిప్రాయం ప్రకారం తొలి ఆర్గియా రాజులలో ఒకరు క్రీ.పూ. 7వ శతాబ్దం మధ్యలో ఐగై (ఆధునిక వెర్జీనా)ను తమ రాజధానిగాచేసి కొని దీనిని స్థాపించారు.[15] క్రీ.పూ. 4వ శతాబ్దానికి ముందు ఈ రాజ్యం ఆధునిక గ్రీసులో మాసిడోనియా ప్రాంతంలోని పశ్చి,మ మధ్య భాగాలకు సుమారుగా సరిపోయే ప్రాంతాన్ని కలిగి ఉండేది.[16] ఇది క్రమంగా ఎమాథియా, పియెరియా, బోటియా, అల్మోపియా, ఎయోర్డియా, మిగ్డోనియా, క్రెస్టోనియ, బిసాల్టియా ప్రాంతాలలోకి విస్తరించింది. ఈ ప్రాంతాలలో థ్రేసియన్ల, ఫ్రిజియన్ల వంటి వివిధ జాతుల ప్రజలు నివసించేవారు. లింసెస్టే, ఒరెస్టే ఎలిమియోటే అనే గ్రీకు తెగలు నివసించే ఎగువ మాసిడోనియా ప్రాంతంలోకి కూడా విస్తరించింది.[note 2] మాసిడోనియా గ్రీకుయేతర పొరుగువారిలో ఈశాన్యంలో నివసించే థ్రేసియన్లు, వాయువ్యంలో ఇల్లీరియన్ల, ఉత్తరాన పేయోనియన్లు ఉన్నారు. అయితే దక్షిణాన ఉన్న థెస్సాలం పశ్చిమాన ఉన్న ఎపిరు భూములలో మాసిడోనియన్ల మాదిరిగానే సంస్కృతిని కలిగి ఉన్న గ్రీకులు నివసించేవారు.[17]

పర్షియాకు చెందిన 1వ డారియసు (క్రీ.పూ. 522–486) సిథియన్లు, పేయోనియన్లు, థ్రేసియన్లు బాల్కన్సు లోని అనేక గ్రీకు నగర-రాజ్యాల మీద ఐరోపా మీదకు దండయాత్ర ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత పర్షియా సేనాధిపతి మెగాబాజసు దౌత్యం ఉపయోగించి 1వ అమింటాసును అకెమెనిడ్ సామ్రాజ్యంకు సామంత రాజ్యంగా లొంగిపోయేలా ఒప్పించాడు. ఇది అకెమెనిడు మాసిడోనియా కాలాన్ని ప్రారంభించింది.[note 3] ఈ దశలో మాసిడోనియాకు చెందిన 1వ అమింటాసు ఒక సామంతుడిగా ఏ విధమైన లొంగుబాటును అంగీకరించాడనే దాని మీద ఎర్రింగ్టను సందేహం వ్యక్తం చేశాడు. ఒకవేళ అంగీకరించినా అది కేవలం నామమాత్రపు లొంగుబాటు మాత్రమే అని పేర్కొన్నాడు. క్రీ.పూ. 506లో బహిష్కరించబడిన ఏథెన్సు నియంత హిప్పియాసును ఆంథెమౌసులో ఆశ్రయం పొందమని ఆహ్వానించడం వంటి తన సొంత కార్యాచరణను మాసిడోనియా రాజు ఎలా అనుసరించాడో కూడా ఆయన ప్రస్తావించాడు. మాసిడోనియా మీద అకెమెనిడు పర్షియను ఆధిపత్యం అయోనియను తిరుగుబాటు (క్రీ.పూ. 499–493) కారణంగా కొద్దికాలం అంతరాయానికి గురైంది. అయినప్పటికీ పర్షియను సేనాధిపతి మార్డోనియసు దానిని తిరిగి అకెమెనిడు సార్వభౌమాధికారం కిందకు తీసుకువచ్చాడు.
మాసిడోనియాకు అధిక స్థాయిలో స్వయంప్రతిపత్తి ఉన్నప్పటికీ అది అకెమెనిడు సామ్రాజ్యంలో ఎప్పుడూ ఒక సాత్రపీ (అంటే ప్రావిన్సు)గా చేయబడి అది అకెమెనిడు సైన్యానికి సైనికులను అందించాల్సి వచ్చింది. క్రీ.పూ. 480–479లో జరిగిన రెండవ పర్షియను గ్రీసు దండయాత్ర సమయంలో 1వ అలెగ్జాండరు 1వ జెర్క్సెసు మాసిడోనియను సైనిక మద్దతును అందించాడు. క్రీ.పూ. 479లో జరిగిన ప్లాటియా యుద్ధంలో మాసిడోనియను సైనికులు పర్షియన్ల పక్షాన పోరాడారు. క్రీ.పూ. 480లో సలామిసు యుద్ధంలో గ్రీకుల విజయం తరువాత 1వ అలెగ్జాండరు ఒక శాంతి ఒప్పందం, ఏథెన్సుతో పొత్తును ప్రతిపాదించడానికి అకెమెనిడు దౌత్యవేత్తగా నియమించబడ్డాడు. కానీ ఆ ప్రతిపాదన తిరస్కరించబడింది. ఆ తర్వాత కొద్దికాలానికే అకెమెనిడు దళాలు యూరోపియను ప్రధాన భూభాగం నుండి వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఇది మాసిడోనియా మీద పర్షియన్ల నియంత్రణ ముగింపును సూచించింది.
శాస్త్రీయ గ్రీకు ప్రపంచంలో భాగస్వామ్యం
[మార్చు]
మొదట పర్షియాకు సామంతుడైనప్పటికీ మాసిడోనుకు చెందిన మొదటి అలెగ్జాండరు తన పూర్వ గ్రీకు శత్రువులైన, ఏథెన్సు, స్పార్టా నేతృత్వంలోని గ్రీకు నగర-రాజ్యాల కూటమితో స్నేహపూర్వక దౌత్య సంబంధాలను పెంపొందించుకున్నాడు.[20]ఆయన వారసుడు 2వ పెర్డిక్కాసు (పాలన: క్రీ.పూ. 454–413) డెలియను లీగు నాయకుడైన ఏథెన్సుకు వ్యతిరేకంగా నాలుగు వేర్వేరు సంఘర్షణలలో మాసిడోనియన్లను యుద్ధానికి నడిపించాడు. అదే సమయంలో ఒడ్రిసియను రాజ్యం థ్రేసియను పాలకుడు సిటాల్సెసు చేసిన దండయాత్రలు ఈశాన్యంలో మాసిడోనియా ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించాయి.[21] ఏథెన్సు రాజనీతిజ్ఞుడు పెరికల్సు మాసిడోను రాజ్యానికి సమీపంలో ఉన్న స్ట్రైమోను నది వెంబడి వలసవాదాన్ని ప్రోత్సహించాడు. అక్కడ క్రీ.పూ. 437/436లో ఆంఫిపోలిసు అనే వలస నగరం స్థాపించబడింది. తద్వారా అది ఏథెన్సుకు వెండి, బంగారంతో పాటు ఏథెనియను నావికాదళంకు మద్దతుగా కలప, తారును స్థిరంగా సరఫరా చేయగలిగింది.[22] ప్రారంభంలో 2వ పెర్డిక్కాసు ఎటువంటి చర్య తీసుకోలేదు. బహుశా ఏథెనియన్లను స్వాగతించి ఉండవచ్చు ఎందుకంటే థ్రేసియన్లు వారిద్దరికీ శత్రువులు.[23] 2వ పెర్డిక్కాసుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఆయన సోదరుడు, బంధువుతో ఏథెన్సుతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ పరిస్థితి మారింది.[23] ఈ విధంగా క్రీ.పూ. 433, 431 మధ్య ఏథెన్సుకు వ్యతిరేకంగా రెండు వేర్వేరు యుద్ధాలు జరిగాయి.[23] మాసిడోనియను రాజు చాల్సిడిసులో ఏథెన్సు మిత్రుల తిరుగుబాటును ప్రోత్సహించడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు. తదనంతరం వ్యూహాత్మక నగరమైన పొటిడెయాను స్వాధీనం చేసుకున్నాడు.[24] మాసిడోనియను నగరాలైన థెర్మా, బెరోయాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఏథెన్సు పొటిడెయాను ముట్టడించింది. కానీ దానిని జయించడంలో విఫలమైంది; సిటాల్సెసు మధ్యవర్తిత్వం వహించిన ఒక శాంతి ఒప్పందంలో థెర్మా మాసిడోనియాకు తిరిగి ఇవ్వబడింది. చాల్సిడిసులో ఎక్కువ భాగం ఏథెన్సుకు ఇవ్వబడింది. దీనికి ప్రతిఫలంగా సిటాల్సెసు కొత్త థ్రేసియను మిత్రులను సంపాదించుకోవడానికి ఏథెన్సుకు సైనిక సహాయం అందించాడు.[25] ఏథెన్సు, స్పార్టా మధ్య జరిగిన పెలోపొన్నేసియను యుద్ధం (క్రీ.పూ. 431–404)లో 1వ పెర్డిక్కాసు స్పార్టాకు మద్దతు ఇచ్చాడు. క్రీ.పూ. 429లో ఏథెన్సు ప్రతీకారంగా సిటాల్సెసును మాసిడోనియా మీద దండెత్తమని ఒప్పించింది. కానీ శీతాకాలంలో సామాగ్రి కొరత కారణంగా ఆయన వెనక్కి తగ్గవలసి వచ్చింది. క్రీ.పూ. 424లో, ఎగువ మాసిడోనియాలోని లింకెస్టిసుకు చెందిన స్థానిక పాలకుడు అరబేయసు తన అధిపతి అయిన పెర్డిక్కాసుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటును అణచివేయడంలో సహాయం చేయడానికి స్పార్టన్లు అంగీకరించారు. లింకెస్టిసు యుద్ధంలో పోరాటం ప్రారంభం కాకముందే మాసిడోనియన్లు భయపడి పారిపోయారు. ఇది స్పార్టను జనరలు బ్రాసిడాసుకు కోపం తెప్పించింది. ఆయన సైనికులు కాపలా లేని మాసిడోనియను సామాగ్రిని దోచుకున్నారు. అప్పుడు బ్రాసిడాసు పెర్డిక్కాసు నుండి పక్షం మారి ఏథెన్సుకు మద్దతు ఇచ్చాడు. ఆయన అరబేయసు తిరుగుబాటును అణచివేయగలిగాడు.

క్రీ.పూ. 422లో బ్రాసిడాసు మరణించాడు. అదే సంవత్సరం ఏథెన్సు, స్పార్టా ఒక ఒప్పందానికి వచ్చాయి. అదే నిసియాసు శాంతి ఒప్పందం. ఇది మాసిడోనియాను ఏథెన్సు మిత్రదేశంగా ఉన్న బాధ్యతల నుండి విముక్తి కల్పించింది.[26] క్రీ.పూ. 418 నాటి మాంటినియా యుద్ధం తర్వాత విజయం సాధించిన స్పార్టన్లు ఆర్గోసుతో ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. చాల్సిడిసులో స్పార్టను మిత్రదేశాలు మిగిలి ఉన్నందున 2వ పెర్డిక్కాసు ఈ సైనిక ఒప్పందంలో చేరడానికి ఆసక్తి చూపాడు.[27] ఆర్గోసు అకస్మాత్తుగా ఏథెన్సుకు అనుకూలమైన ప్రజాస్వామ్యం పక్షంగా మారినప్పుడు ఏథెన్సు నావికాదళం మాసిడోనియను రేవుల మీద దిగ్బంధం విధించి, క్రీ.పూ. 417లో చాల్సిడిసు మీద దాడి చేయగలిగింది.[28] 2వ పెర్డిక్కాసు క్రీ.పూ. 414లో శాంతి కోసం విజ్ఞప్తి చేశాడు. ఏథెన్సుతో ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాడు. దీనిని ఆయన కుమారుడు, వారసుడు 1వ ఆర్కిలాసు (క్రీ.పూ. 413–399) కొనసాగించాడు.[29] ఆ తర్వాత క్రీ.పూ. 410లో పిడ్నా మీద మాసిడోనియను ముట్టడి సమయంలో ఏథెన్సు కలప, నావికా పరికరాలకు బదులుగా 1వ ఆర్కిలాసుకు నావికాదళ మద్దతును అందించింది.[30]
1వ ఆర్కిలాసు కొన్ని అంతర్గత తిరుగుబాట్లను ఎదుర్కొన్నప్పటికీ, లింకెస్టెసుకు చెందిన సిర్రాసు నాయకత్వంలోని ఇల్లీరియన్ల దండయాత్రను తిప్పికొట్టవలసి వచ్చినప్పటికీ, ఆయన థెస్సలీ మీద మాసిడోనియను అధికారాన్ని విస్తరించగలిగాడు. అక్కడ ఆయన తన మిత్రులకు సైనిక సహాయం పంపాడు.[31] ఆయన ఐగైని ఒక ఉత్సవ మతపరమైన కేంద్రంగా కొనసాగించినప్పటికీ 1వ ఆర్కిలాసు రాజధానిని ఉత్తరాన పెల్లాకు మార్చాడు. అది అప్పట్లో ఒక సరస్సు పక్కన ఉంది. ఒక నది దానిని ఏజియన్ సముద్రంతో కలిపేది.[32] ఆయన అధిక వెండి శాతం ఉన్న నాణేలను ముద్రించడం ద్వారా, ప్రత్యేకంగా రాగి నాణేలను జారీ చేయడం ద్వారా మాసిడోనియా కరెన్సీని మెరుగుపరిచాడు.[33] ఆయన రాజసభ ఏథెన్సుకు చెందిన నాటక రచయిత యూరిపిడిసు వంటి ప్రసిద్ధ మేధావులను ఆకర్షించింది.[34] 1వ అర్ఖెలసు హత్యకు గురైనప్పుడు (బహుశా తన ఆస్థానంలోని రాజ సేవకులతో ఒక స్వలింగ సంపర్క ప్రేమ వ్యవహారం కారణంగా) రాజ్యం అస్తవ్యస్తతలోకి జారిపోయింది. క్రీ.పూ. 399 నుండి 393 వరకు కొనసాగిన ఈ కాలంలో నలుగురు వేర్వేరు రాజులు పరిపాలించారు: 1వ అర్ఖెలసు కుమారుడైన ఒరెస్టిసు; ఒరెస్టిసు మామ, రాజప్రతినిధి, హంతకుడైన 2వ ఏరోపసు; 2వ ఏరోపసు కుమారుడైన పౌసానియాసు;1వ అర్ఖెలసు చిన్న కుమార్తెను వివాహం చేసుకున్న 2వ అమింటాసు ఈ అల్లకల్లోల కాలం గురించి చాలా తక్కువగా తెలుసు; అర్రిడాయసు కుమారుడు, 1వ అమింటాసు మనవడైన 3వ అమింటాసు (క్రీ.పూ. 393–370) పౌసానియాసును చంపి మాసిడోనియను సింహాసనాన్ని అధిష్టించడంతో ఇది ముగిసింది. [35]

పరస్పర విరుద్ధమైన కథనాల ప్రకారం, బార్డిలిసు నాయకత్వంలోని ఇల్లీరియన్ల భారీ దండయాత్ర కారణంగా 3వ అమింటాసు క్రీ.పూ. 393 లేదా 383లో తన రాజ్యాన్ని విడిచి పారిపోవలసి వచ్చింది.[note 4] ఆయన లేని సమయంలో సింహాసనం మీద హక్కును కోరిన ఆర్గేయసు పరిపాలించాడు. అయినప్పటికీ 3వ అమింటాసు చివరికి థెస్సాలియను మిత్రుల సహాయంతో తన రాజ్యానికి తిరిగి వచ్చాడు.[36] 3వ అమింటాసు దాదాపుగా చాల్సిడియను నగరమైన ఒలింథోసు దళాలచే పదవీచ్యుతుడయ్యాడు. కానీ స్పార్టా రాజు 2వ ఏజిసిలాసు సోదరుడైన టెలిటియాసు సహాయంతో మాసిడోనియన్లు క్రీ.పూ. 379లో ఒలింథోసును లొంగిపోయేలా చేసి వారి చాల్సిడియను లీగును రద్దు చేయించారు.[37]
1వ యూరిడైసు, 3వ అమింటాసు కుమారుడైన 2వ అలెగ్జాండరు (r. 370 – 368), తన తండ్రి తర్వాత సింహాసనాన్ని అధిష్టించి వెంటనే థెస్సాలీ మీద దండెత్తి, 'టాగసు' (థెస్సాలియన్ల సర్వోన్నత సైనిక నాయకుడు) అయిన అలెగ్జాండరు ఆఫ్ ఫెరేతో యుద్ధం చేసి లారిస్సా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.[38] 2వ అలెగ్జాండరు, అలెగ్జాండరు ఆఫ్ ఫెరే ఇద్దరినీ తమ అధిపతులుగా తొలగించుకోవాలని కోరుకున్న థెస్సాలియన్లు, థెబ్సుకు చెందిన పెలోపిడాసు సహాయం కోసం విజ్ఞప్తి చేశారు; ఆయన లారిస్సాను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించాడు. మాసిడోనియాతో కుదిరిన శాంతి ఒప్పందంలో 2వ అలెగ్జాండరు సోదరుడు, భవిష్యత్తు రాజు అయిన 2వ ఫిలిపు (r. 359 – 336)తో సహా ఉన్నత వర్గాలకు చెందిన బందీలుగా కొందరిని పొందాడు.[39] అలెగ్జాండరు తన బావమరిది టోలెమీ ఆఫ్ అలోరోసు చేత హత్య చేయబడినప్పుడు. తరువాతి వ్యక్తి 2వ అలెగ్జాండరు తమ్ముడైన 3వ పెర్డిక్కాసు (r. 368 – 359)కి నిరంకుశ సంరక్షకుడిగా వ్యవహరించాడు. అయితే పెర్డిక్కాసు క్రీ.పూ 365లో వయస్సు పరిమితికి చేరుకున్నప్పుడు టోలెమీని ఉరితీశాడు.[40] 3వ పెర్డికాసు పాలనలో మిగిలిన కాలం రాజకీయ స్థిరత్వం, ఆర్థిక పునరుద్ధరణతో గుర్తించబడింది.[41] అయితే తిమోతియసు కోనాను కుమారుడు మీథోను పిడ్నాను స్వాధీనం చేసుకున్నారు. బార్డిలిసు నేతృత్వంలోని ఇల్లియను దండయాత్ర 3వ పెర్డికాసు 4,000 మంది మాసిడోనియను దళాలను చంపడంలో విజయం సాధించింది. .[42]
మాసిడోనియా ఉదయనం
[మార్చు]
క్రీ.పూ. 359లో 2వ ఫిలిపు సింహాసనాన్ని అధిష్టించినప్పుడు ఆయనకు ఇరవై నాలుగు సంవత్సరాలు.[43] నేర్పుగా దౌత్యం ఉపయోగించి ఆయన బెరిసాడెసు ఆధ్వర్యంలోని థ్రేసియన్లను సింహాసనానికి వారసుడిగా చెప్పుకుంటున్న పౌసానియాసుకు మద్దతు ఇవ్వడం మానేయమని ఏథెనియన్లను మరొక వారసుడిగా చెప్పుకునేవాడికి మద్దతు ఇవ్వడం ఆపమని ఒప్పించగలిగాడు.[44] ఆయన థ్రేసియన్లకు వారి పేయోనియను మిత్రులకు లంచాలు ఇవ్వడం ద్వారా, ఆంఫిపోలిసు మీద తన వాదనలను వదులుకుంటూ ఏథెన్సుతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా వీటిని సాధించాడు. ఆయన తన సరిహద్దులకు ముప్పు కలిగించిన ఇల్లీరియన్లతో కూడా శాంతిని నెలకొల్పగలిగాడు.
2వ ఫిలిపు తన ప్రారంభ సంవత్సరాలను మాసిడోనియను సైన్యాన్ని సమూలంగా మార్చడానికి వెచ్చించాడు. దాని సంస్థ, పరికరాలు, శిక్షణలో చేసిన సంస్కరణలు, ముఖ్యంగా పొడవైన ఈటెలతో (అంటే 'సరిస్సా') సాయుధమైన మాసిడోనియను ఫాలాంక్సును ప్రవేశపెట్టడం ఆయన ఇల్లీరియను, పేయోనియను శత్రువుల మీద పరీక్షించినప్పుడు తక్షణమే విజయవంతమైంది. ప్రాచీన ఆధారాలలోని గందరగోళమైన వృత్తాంతాలు ఈ సంస్కరణలకు 2వ ఫిలిపు పూర్వీకులు ఎంతవరకు దోహదపడ్డారు. థీబను ఆధిపత్యం సమయంలో థీబ్సులో రాజకీయ బందీగా ఉన్న ఆయన కౌమార సంవత్సరాలు, ముఖ్యంగా జనరలు ఎపామినోండాసును కలిసిన తర్వాత ఆయన ఆలోచనలను ఎంతవరకు ప్రభావితం చేశాయనే దాని మీద ఆధునిక పండితులు చర్చించడానికి దారితీశాయి.
ఇతర గ్రీకుల మాదిరిగానే మాసిడోనియన్లు కూడా సాంప్రదాయకంగా ఏకపత్నీ వ్రతాన్ని పాటించేవారు. కానీ 2వ ఫిలిపు బహుభార్యత్వం పాటించి ఏడుగురిని వివాహం చేసుకున్నాడు. బహుశా క్లియోపాత్రా యూరిడైసుతో జరిగిన వివాహం తప్ప మిగతావి ఆయన ఉన్నత వర్గపు ప్రజల లేదా కొత్త మిత్రుల విధేయతను పొందడానికి ఉద్దేశించినవే. ముల్లరు మాసిడోనియాకు 2వ చెందిన ఫిలిపు తనకంటే చాలా చిన్నదైన క్లియోపాత్రా యూరిడైసును కేవలం ప్రేమతోనో లేదా తన మధ్యవయసు సంక్షోభం కారణంగానో వివాహం చేసుకున్నాడని ప్లూటార్కు, అథేనియసు చేసిన వాదనల పట్ల సందేహం వ్యక్తం చేశాడు. క్లియోపాత్రా జనరలు అటాలసు కుమార్తె. ఈ వివాహం జరిగిన కొద్దికాలానికే అటాలసుకు, ఆయన మామ పార్మెనియనుకు ఆసియా మైనరు (ఆధునిక టర్కీ)లో సైనిక పదవులు ఇవ్వబడ్డాయి. ఈ వివాహం ఒక ప్రభావవంతమైన మాసిడోనియను ఉన్నత కుటుంబం విధేయతను నిర్ధారించడానికి ఉద్దేశించిన రాజకీయ అవగాహనలో భాగమని కూడా ముల్లరు అనుమానిస్తున్నాడు. ఆయన మొదటి వివాహాలు ఉన్నత మాసిడోనియను ఉన్నత వర్గానికి చెందిన ఫిలా ఆఫ్ ఎలిమియాతో వివాహ సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి ఇల్లీరియను యువరాణి ఆడాటాతో జరిగాయి. థెస్సలీలోని లారిస్సాతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన క్రీ.పూ. 358లో థెస్సాలియను ఉన్నత మహిళ ఫిలిన్నాని వివాహం చేసుకున్నాడు. ఆమె ఆయనకు ఒక కుమారుడిని ప్రసవించింది. ఆయన తరువాత 2వ ఫిలిపు అరిడాయసు (క్రీ.పూ. 323–317)గా పరిపాలించాడు. క్రీ.పూ. 357లో ఎపిరసు, మొలోసియన్ల రాజు అయిన అరిబ్బాసుతో పొత్తును పటిష్టం చేసుకోవడానికి ఆయన ఒలింపియాసును వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ద్వారా ఒక కుమారుడు జన్మించాడు. ఆయన తరువాత 3వ అలెగ్జాండరు (మహానుభావుడైన అలెగ్జాండరు అని ప్రసిద్ధి చెందాడు) గా పరిపాలించాడు. ఎపిరసు నుండి తన వంశపారంపర్య వారసత్వం ద్వారా పౌరాణిక అకిలెసు నుండి తాను ఉద్భవించినట్లు చెప్పుకున్నాడు.[45] అకెమెనిడు పర్షియను రాజులు 2వ ఫిలిపు బహుభార్యత్వ ఆచారాన్ని ప్రభావితం చేశారో లేదో అస్పష్టంగా ఉంది. అయినప్పటికీ ఆయన పూర్వీకుడైన 3వ అమింటాసుకు గైగేయా అనే రెండవ భార్యతో ముగ్గురు కుమారులు ఉన్నారు: ఆర్కిలాసు, అరిడాయసు మెనెలాసు.[46] 2వ ఫిలిపు క్రీ.పూ. 359లో ఆర్కిలాసును మరణశిక్షకు గురిచేశాడు. అయితే 2వ ఫిలిపు ఇతర ఇద్దరు సవతి సోదరులు ఒలింథోసుకు పారిపోయారు. ఇది చాల్సిడియను లీగుకు వ్యతిరేకంగా జరిగిన ఒలింథియను యుద్ధానికి (క్రీ.పూ. 349–348) ఒక యుద్ధకారణంగా మారింది.[47]
ఏథెన్సు సామాజిక యుద్ధంతో (క్రీ.పూ. 357–355) నిమగ్నమై ఉన్నప్పుడు 2వ ఫిలిపు క్రీ.పూ. 357లో వారి నుండి ఆంఫిపోలిసును తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. మరుసటి సంవత్సరం పిడ్నా, పొటిడాయాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. వాటిలో చివరిదాన్ని ఒక ఒప్పందంలో వాగ్దానం చేసినట్లుగా చాల్సిడియను లీగుకు అప్పగించాడు.[48] క్రీ.పూ. 356లో ఆయన క్రెనిడెసును స్వాధీనం చేసుకుని దానికి ఫిలిప్పి అని పేరు పెట్టి పునఃస్థాపించాడు. అదే సమయంలో ఆయన సేనాధిపతి పార్మెనియను గ్రాబేయికి చెందిన ఇల్లీరియను రాజు 2వ గ్రాబోసును ఓడించాడు. [49] క్రీ.పూ. 355–354లో మెథోను మీద ముట్టడి సమయంలో 2వ ఫిలిపు బాణం గాయం కారణంగా తన కుడి కన్నును కోల్పోయాడు. కానీ నగరాన్ని స్వాధీనం చేసుకోగలిగాడు. బానిసలుగా చేయబడిన పొటిడెయన్ల వలె కాకుండా నివాసులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాడు.[note 5]
ఆ తర్వాత 2వ ఫిలిపు మాసిడోనియాను మూడవ పవిత్ర యుద్ధంలో (క్రీ.పూ. 356–346) పాలుపంచుకునేలా చేశాడు. చెల్లించని జరిమానాలను సమర్పించడానికి బదులుగా, ఫోసిసు డెల్ఫీలోని అపోలో ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, దోచుకున్నప్పుడు ఈ యుద్ధం ప్రారంభమైంది. దీనివలన ఆంఫిక్టియోనికు లీగు ఫోసిసు మీద యుద్ధం ప్రకటించింది. ఫోసిసు లేదా థీబ్సుతో పొత్తు పెట్టుకున్న థెస్సాలియను లీగు సభ్యుల మధ్య అంతర్యుద్ధం చెలరేగింది.[50] లారిస్సా అభ్యర్థన మేరకు క్రీ.పూ. 353లో థెస్సాలీలోని ఫెరే మీద 2వ ఫిలిపు చేసిన తొలి సైనిక చర్య, ఫోసియను సేనాధిపతి ఒనోమార్కసు చేతిలో రెండు ఘోర పరాజయాలతో ముగిసింది. [note 6] ప్రతిగా 2వ ఫిలిపు క్రీ.పూ. 352లో క్రోకసు ఫీల్డు యుద్ధంలో ఒనోమార్కసును ఓడించాడు. ఇది 2వ ఫిలిపు థెస్సాలియను లీగు నాయకుడిగా (ఆర్కాను) ఎన్నిక కావడానికి దారితీసింది. ఆయనకు ఆంఫిక్టియోనికు కౌన్సిలులో ఒక స్థానాన్ని కల్పించింది. ఫెరే పాలకుడు జాసను మేనకోడలైన నిసెసిపోలిసును వివాహం చేసుకోవడం ద్వారా ఫెరేతో వైవాహిక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి వీలు కల్పించింది.[51]
2వ ఫిలిపుకు అకెమెనిడు సామ్రాజ్యంతో కొంత ప్రారంభ సంబంధం ఉంది. ముఖ్యంగా అకెమెనిడు రాజు కేంద్ర అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సాత్రపులకు, కిరాయి సైనికులకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ సంబంధం ఏర్పడింది. 3వ ఆర్టాక్సెర్క్సెసుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన హెలెస్పాంటైను ఫ్రిజియా సాత్రపు అయిన 2వ ఆర్టాబాజోసు, క్రీ.పూ. 352 నుండి 342 వరకు మాసిడోనియను ఆస్థానంలో ప్రవాసిగా ఆశ్రయం పొందగలిగాడు. ఆయనతో పాటు ఆయన కుటుంబం, ఆయన కిరాయి సైన్యాధ్యక్షుడు రోడ్సుకు చెందిన మెమ్నాను కూడా ప్రవాసంలో ఉన్నారు. ఆర్టాబాజోసు కుమార్తె, భవిష్యత్తులో అలెగ్జాండరు ది గ్రేటు భార్య కాబోయే బార్సినే, మాసిడోనియను ఆస్థానంలో పెరిగింది.
థ్రేసియను పాలకుడు సెర్సోబ్లెప్టెసుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తర్వాత క్రీ.పూ. 349లో 2వ ఫిలిపు తాత్కాలికంగా రద్దు చేయబడి క్రీ.పూ. 375లో పునఃస్థాపించబడిన చాల్సిడియను లీగుకు వ్యతిరేకంగా తన యుద్ధాన్ని ప్రారంభించాడు.[52] చారిడెమసు నేతృత్వంలో ఏథెన్సు జోక్యం చేసుకున్నప్పటికీ[53] క్రీ.పూ. 348లో ఒలింథోసు నగరాన్ని 2వ ఫిలిపు స్వాధీనం చేసుకున్నాడు. దాని నివాసులను, కొంతమంది ఏథెన్సు పౌరులతో సహా బానిసలుగా అమ్మేశాడు.[54] ఏథెన్సు వాసులు ముఖ్యంగా డెమోస్తనీసు చేసిన 'ఒలింథియాక్సు' అని పిలువబడే ప్రసంగాల ద్వారా తమ మిత్రదేశాలను ఎదురుదాడి చేయడానికి ఒప్పించడంలో విఫలమయ్యారు. క్రీ.పూ. 346లో మాసిడోనియాతో ఫిలోక్రేట్సు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు.[55] ఈ ఒప్పందం ప్రకారం బానిసలుగా పట్టుబడిన ఏథెన్సు పౌరులను విడుదల చేయడానికి, 2వ ఫిలిపు థ్రేసియను చెర్సోనీసు లోని ఏథెన్సు స్థావరాల మీద దాడి చేయడనే హామీకి బదులుగా ఏథెన్సు మాసిడోనియా తీరప్రాంత భూభాగాల మీద, చాల్సిడిసు, ఆంఫిపోలిసు మీద తన దావాలను వదులుకోవాలి.[56] ఇంతలో ఫోసిసు థెర్మోపైలే మాసిడోనియను దళాలచే స్వాధీనం చేసుకోబడ్డాయి. డెల్ఫికు దేవాలయం దొంగలకు మరణశిక్ష విధించబడింది. 2వ ఫిలిపుకి ఆంఫిక్టియోనికు కౌన్సిలులో ఫోసిసుకు చెందిన రెండు స్థానాలు, పైథియను క్రీడల మీద ఉత్సవాల నిర్వాహకుడు పదవి లభించాయి.[57] ఏథెన్సు మొదట కౌన్సిలులో ఆయన సభ్యత్వాన్ని వ్యతిరేకించింది. నిరసనగా క్రీడలకు హాజరు కావడానికి నిరాకరించింది. కానీ చివరికి వారు ఈ షరతులను అంగీకరించారు. బహుశా డెమోస్థనీసు తన 'ఆన్ ది పీసు' అనే ప్రసంగం చేసి ఒప్పించడం వల్ల కావచ్చు.[58]
తరువాతి కొన్ని సంవత్సరాలలో 2వ ఫిలిపు థెస్సలీలోని స్థానిక ప్రభుత్వాలను సంస్కరించాడు. ఇల్లీరియను పాలకుడు 1వ ప్లూరాటసు వ్యతిరేకంగా సైనిక చర్యలు చేపట్టాడు. ఎపిరసులో అరిబ్బాసును పదవీచ్యుతుడిని చేసి తన బావమరిది 1వ అలెగ్జాండరుకు (2వ ఫిలిపు ఒలింపియాసును వివాహం చేసుకోవడం ద్వారా) అధికారం అప్పగించాడు. థ్రేసులో సెర్సెబ్లెప్టెసును ఓడించాడు. ఇది అకెమెనిడు అనటోలియా మీద దండయాత్రకు సన్నాహకంగా హెలెస్పాంటు మీద మాసిడోనియను నియంత్రణను విస్తరించడానికి ఆయనకు వీలు కల్పించింది.[60] క్రీ.పూ. 342లో 2వ ఫిలిపు ఇప్పుడు బల్గేరియాలో ఉన్న ఒక థ్రేసియను నగరాన్ని జయించి దానికి ఫిలిప్పోపోలిసు (ఆధునిక ప్లోవుడివు) అని పేరు పెట్టాడు.[61] క్రీ.పూ. 340లో 2వ ఫిలిపు పెరింథసు, బైజాంటియనుల మీద రెండు విఫలమైన ముట్టడులలో నిమగ్నమై ఉన్నప్పుడు ఏథెన్సుతో యుద్ధం చెలరేగింది. ఆ తర్వాత డాన్యూబు నది వెంబడి సిథియన్లకు వ్యతిరేకంగా ఒక విజయవంతమైన సైనిక చర్య, క్రీ.పూ. 339లో ఆంఫిస్సాకు వ్యతిరేకంగా జరిగిన నాల్గవ పవిత్ర యుద్ధంలో మాసిడోనియా ప్రమేయం జరిగింది.[62] థీబ్సు థెర్మోపైలే సమీపంలోని నైసియా నుండి మాసిడోనియను సైనిక దళాన్ని వెళ్లగొట్టింది. దీని ఫలితంగా థీబ్సు, ఏథెన్సు, మెగారా, కొరింతు, అఖియా, యూబోయాలతో కలిసి క్రీ.పూ. 338లో జరిగిన ఖైరోనియా యుద్ధంలో మాసిడోనియాకు వ్యతిరేకంగా చివరి పోరాటంలో పాల్గొంది. [63] ఖైరోనియాలో మాసిడోనియా విజయం సాధించిన తర్వాత 2వ ఫిలిపు థీబ్సులో ఒక ఒలిగార్కీని స్థాపించాడు. అయినప్పటికీ ఏథెన్సు పట్ల ఉదారంగా వ్యవహరించాడు. ఎందుకంటే అఖెమెనిడు సామ్రాజ్యం మీద తాను ప్రణాళిక వేసిన దండయాత్రలో వారి నావికాదళాన్ని ఉపయోగించుకోవాలని కోరుకున్నాడు. [64] ఆ తర్వాత స్పార్టా మినహా ప్రధాన గ్రీకు నగర-రాజ్యాలను చేర్చిన కొరింతు కూటమి ఏర్పాటుకు ఆయనే ప్రధానంగా బాధ్యత వహించాడు. కూటమి నుండి మాసిడోనియా రాజ్యం అధికారికంగా మినహాయించబడినప్పటికీ క్రీ.పూ. 337లో 2వ ఫిలిపు దాని మండలికి ('సినెడ్రియాను') నాయకుడిగా ('హెగెమోను'), అఖెమెనిడు సామ్రాజ్యం మీద జరగబోయే దండయాత్రకు సర్వ సైన్యాధ్యక్షుడు ('స్ట్రాటెగోసు ఆటోక్రేటరు')గా ఎన్నికయ్యాడు. మరిన్ని వివరాల కోసం [65] గ్రీకుల కష్టాలకు పర్షియన్లను శిక్షించడానికి ఆసియా మైనరులోని గ్రీకు నగరాలను విముక్తి చేయడానికి ఫిలిపు వేసిన ప్రణాళిక[66] అలాగే బహుశా గ్రీసు మీద మరో పర్షియను దండయాత్ర జరుగుతుందనే సర్వ-హెలెనికు భయం, అకెమెనిడు సామ్రాజ్యం మీద దండెత్తాలనే ఆయన నిర్ణయానికి దోహదపడ్డాయి.[67] క్రీ.పూ. 341–340లో పర్షియన్లు పెరింథసు బైజాంటియనుకు సహాయం అందించారు. ఇది పెరుగుతున్న అకెమెనిడు ఆక్రమణకు వ్యతిరేకంగా థ్రేసు, ఏజియను సముద్రాన్ని సురక్షితం చేసుకోవాల్సిన మాసిడోనియా వ్యూహాత్మక అవసరాన్ని నొక్కి చెప్పింది. ఎందుకంటే పర్షియను రాజు 3వ ఆర్టాక్సెర్క్సెసు పశ్చిమ అనటోలియా లోని సాత్రపీల మీద తన నియంత్రణను మరింత పటిష్టం చేసుకున్నాడు.[68] బాల్కన్ల కంటే చాలా ఎక్కువ సంపద, విలువైన వనరులను అందించే ఈ ప్రాంతాన్ని, దాని అపారమైన ఆర్థిక సామర్థ్యం కారణంగా మాసిడోనియను రాజు కూడా ఆశించాడు.[69]
2వ ఫిలిపు జనరలు అటాలసు మేనకోడలైన క్లియోపాత్రా యూరిడైసును వివాహం చేసుకున్నప్పుడు వివాహ విందులో కొత్త వారసులను అందించడం గురించిన చర్చలు చైరోనియా యుద్ధంలో పాల్గొన్న అనుభవజ్ఞుడైన 2వ ఫిలిపు కుమారుడు అలెగ్జాండరు ఆయన తల్లి ఒలింపియాసుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. 2వ ఫిలిపు అలెగ్జాండరును పెల్లాకు తిరిగి పిలిచే వరకు వారు ఇద్దరూ కలిసి ఎపిరసుకు పారిపోయారు. 2వ ఫిలిపు తన కుమారుడు అర్హిడియసుకు కారియా పర్షియను సాత్రపు అయిన పిక్సోడారసు కుమార్తె అయిన అడా ఆఫ్ కారియాతో వివాహం ఏర్పాటు చేసినప్పుడు అలెగ్జాండరు జోక్యం చేసుకుని తాను అడా ఆఫ్ కారియాను వివాహం చేసుకోవడానికి ప్రతిపాదించాడు. అప్పుడు 2వ ఫిలిపు ఆ వివాహాన్ని పూర్తిగా రద్దు చేసి అలెగ్జాండరు సలహాదారులైన టోలెమీ, నియాకసు హర్పాలసులను బహిష్కరించాడు. ఒలింపియాసుతో రాజీపడటానికి 2వ ఫిలిపు వారి కుమార్తె క్లియోపాత్రాకు ఒలింపియాసు సోదరుడు ( క్లియోపాత్రా మామ) అయిన ఎపిరసుకు చెందిన 1వ అలెగ్జాండరుతో వివాహం జరిపించాడు. కానీ వారి వివాహ విందు సమయంలో 2వ ఫిలిపు తన అంగరక్షకుడు పాసానియాసు ఆఫ్ ఒరెస్టిసు చేత హత్య చేయబడ్డాడు. క్రీ.పూ. 336లో అలెగ్జాండరు ఆయన వారసుడయ్యాడు. మాసిడోను ఫిలిపును హత్య చేయడానికి జరిగిన కుట్రలో న్యాయ విచారణల వివరాల కోసం ఇతర అనుమానితుల అరెస్టులు జరిగాయి. [70]
అలెగ్జాండరు సామ్రాజ్యం
[మార్చు]
ఆధునిక మేధావులు 2వ ఫిలిపు హత్యలో 3వ అలెగ్జాండరు "ది గ్రేటు", ఆయన తల్లి ఒలింపియాసు సాధ్యమైన పాత్ర మీద వాదించారు. ఫిలిపు తన ప్రణాళికాబద్ధమైన ఆసియా దండయాత్ర నుండి అలెగ్జాండరును మినహాయించి ఆయనను గ్రీసుకు రాజప్రతినిధిగా, కొరింథు లీగు డిప్యూటీ హెగెమోనుగా నియమించడాన్ని అలాగే 2వ ఫిలిపు ఆయన కొత్త భార్య క్లియోపాత్రా యూరిడైసు మధ్య మరొక మగ వారసుడు పుట్టే అవకాశం ఉండటాన్ని వారు ప్రస్తావించారు. [note 7]3వ అలెగ్జాండరు (క్రీ.పూ. 336–323)ని సైన్యం, ప్రముఖ ఉన్నత వర్గాల సభ వెంటనే రాజుగా ప్రకటించింది. వారిలో ముఖ్యులు యాంటిపేటరు పార్మెనియను. [71] క్రీ.పూ. 323లో ఆయన పాలన సైనిక జీవితం ముగిసే నాటికి అలెగ్జాండరు గ్రీకు ప్రధాన భూభాగం, ఆసియా మైనరు, లెవంతు, పురాతన ఈజిప్టు, మెసొపొటేమియా, పర్షియా, మధ్య ఆసియా, దక్షిణ ఆసియాలోని చాలా భాగాలను (అంటే ఆధునిక పాకిస్తాన్) కలిగి ఉన్న ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.[72] ఆయన మొదటి చర్యలలో ఒకటి ఐగైలో తన తండ్రికి అంత్యక్రియలు జరపడం.[73] 2వ ఫిలిపు మరణవార్త తెలియగానే కొరింతు కూటమి సభ్యులు తిరుగుబాటు చేశారు. కానీ సైనిక బలంతో పాటు ఒప్పించే దౌత్యం ద్వారా వారిని త్వరలోనే అణచివేశారు. అకెమెనిడు పర్షియా మీద ప్రణాళిక వేసిన దండయాత్రను నిర్వహించడానికి అలెగ్జాండరును కూటమికి 'హెగెమోన్'గా ఎన్నుకున్నారు. [74]
క్రీ.పూ. 335లో అలెగ్జాండరు హేమసు మోన్సు వద్ద డాన్యూబు నది వెంబడి ట్రిబల్లి అనే థ్రేసియను తెగతో పోరాడి, ప్యూసు ద్వీపంలో వారిని లొంగిపోయేలా చేశాడు.[75] ఆ తర్వాత కొద్దికాలానికే, బార్డిలిసు కుమారుడైన ఇల్లీరియను నాయకుడు అయిన క్లీటసు, టాలంటియీ రాజు అయిన గ్లాసియాసు సహాయంతో మాసిడోనియా మీద దాడి చేస్తానని బెదిరించాడు. కానీ అలెగ్జాండరు చొరవ తీసుకుని పెలియను (ఆధునిక అల్బేనియాలో) వద్ద ఇల్లీరియన్లను ముట్టడించాడు. థీబ్సు మరోసారి కొరింతు కూటమి నుండి తిరుగుబాటు చేసి కాడ్మియాలోని మాసిడోనియను సైనిక దళాన్ని ముట్టడించినప్పుడు అలెగ్జాండరు ఇల్లీరియను యుద్ధరంగం నుండి బయలుదేరి థీబ్సుకు సైన్యాన్ని నడిపించి ఆ నగరాన్ని ముట్టడించాడు. గోడలను ఛేదించిన తర్వాత అలెగ్జాండరు సైన్యాలు 6,000 మంది థీబన్లను చంపి 30,000 మంది నివాసులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నాయి. స్పార్టా మినహా మిగిలిన అన్ని గ్రీకు రాజ్యాలు మళ్లీ అలెగ్జాండరును సవాలు చేయకుండా చేయడానికి హెచ్చరికగా ఆ నగరాన్ని నేలమట్టం చేశాయి.
తన సైనిక జీవితమంతటా అలెగ్జాండరు వ్యక్తిగతంగా నాయకత్వం వహించిన ప్రతి యుద్ధంలోనూ విజయం సాధించాడు.[76] క్రీ.పూ. 334లో ఆసియా మైనరులోని గ్రానికసు యుద్ధంలో పర్షియన్ల మీద సాధించిన తన మొదటి విజయంలో తన పదాతిదళం నదిని దాటడానికి వీలుగా ఒక చిన్న అశ్విక దళాన్ని అబ్లెనుగా ఉపయోగించాడు. ఆ తర్వాత తన సహచర అశ్వికదళంతో అశ్వికదళ దాడి చేశాడు.[77] క్రీ.పూ. 333లో జరిగిన ఇస్ససు యుద్ధంలో అశ్వికదళ దాడికి నాయకత్వం వహించి అలెగ్జాండరు పర్షియను రాజు 3వ డారియసును, ఆయన సైన్యాన్ని పారిపోయేలా చేశాడు. సైనిక సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ 3వ డారియసు క్రీ.పూ. 331లో జరిగిన గౌగమెలా యుద్ధం నుండి కూడా పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రీ.పూ. 330లో పర్షియను రాజు ఆయన స్వంత బాక్ట్రియా సాత్రపు బంధువైన బెస్ససును చేత బంధించబడి ఉరితీయబడ్డాడు. అనంతరం మాసిడోనియను రాజు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్గా పిలువబడే ప్రాంతంలో బెస్ససును వేటాడి ఉరితీశాడు. ఈ ప్రక్రియలో సోగ్డియా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.క్రీ.పూ. 326లో జరిగిన హైడాస్పెసు యుద్ధంలో (ఆధునిక పంజాబ్), పౌరవులుల రాజు పోరసు యుద్ధ ఏనుగులు అలెగ్జాండరు సైన్యానికి ముప్పు కలిగించినప్పుడు ఆయన తన సైనికులను విడివిడిగా నిలబడమని ఆదేశించి వారి 'సరిస్సా' బల్లేలను ఉపయోగించి ఏనుగులను చుట్టుముట్టి, వాటి మావటీలను కిందకు దించమని చెప్పాడు.క్రీ.పూ. 324లో బాబిలోనియాలోని ఓపిస వద్ద (ఆధునిక ఇరాక్లోని బాగ్దాద్ సమీపంలో) ఆయన మాసిడోనియను సైనికులు తిరుగుబాటుకు ప్రయత్నించినప్పుడు అలెగ్జాండరు దానికి బదులుగా పర్షియను అధికారులకు, యూనిట్లకు మాసిడోనియను సైనిక బిరుదులను ఉన్నత బాధ్యతలను అప్పగించాడు. దీనితో తన సైనికులు పర్షియన్లు మాసిడోనియన్ల మధ్య ఏర్పాటు చేసిన రాజీ విందులో క్షమాపణ కోరేలా బలవంతం చేశాడు.

అలెగ్జాండరు బహుశా అహంకారానికి సంబంధించిన సంకేతాలను ప్రదర్శించడం ద్వారా తన సొంత పాలనను బలహీనపరిచాడు.[78] గోర్డియను ముడిని తెంచడం వంటి ప్రభావవంతమైన పోరాటాన్ని ఉపయోగించుకుంటూనే ఆయన క్రీ.పూ. 331లో లిబియను ఎడారిలోని (ఆధునిక ఈజిప్టులో) సివా వద్ద ఉన్న దేవాలయాన్ని సందర్శించిన తర్వాత తనను తాను జీవించి ఉన్న దేవుడిగా జ్యూసు కుమారుడిగా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నించాడు.[79] క్రీ.పూ. 327లో బాక్ట్రాలో పర్షియను రాజుల నుండి స్వీకరించిన 'ప్రోస్కైనెసిసు' అనే ఆచారంలో భాగంగా తన సైనికులను తన ముందు సాష్టాంగపడేలా చేయాలని ప్రయత్నించాడు. ఆయన ప్రయత్నాన్ని ఆయన ఆస్థాన చరిత్రకారుడు కాలిస్థెనెసు ఈ ఆచారాన్ని పాటించడానికి నిరాకరించిన తర్వాత ఆయన మాసిడోనియను, గ్రీకు ప్రజలు మతపరమైన దైవదూషణగా తిరస్కరించారు.[78] క్రీ.పూ. 330లో ఎక్బటానాలో (ఆధునిక హమదాను, ఇరాన్ సమీపంలో) అలెగ్జాండరు పార్మెనియనును హత్య చేయించినప్పుడు ఇది "రాజు ప్రయోజనాలకు, ఆయన దేశం, ప్రజల ప్రయోజనాలకు మధ్య పెరుగుతున్న అంతరానికి సంకేతం" అని ఎర్రింగ్టను పేర్కొన్నాడు.[80] క్రీ.పూ. 328లో క్లీటసు ది బ్లాకును ఆయన హత్య చేయడాన్ని డాన్ ఎల్. గిల్లె, ఇయాను వర్తింగ్టను "ప్రతీకారపూరితమైన అవివేకమైనది"గా వర్ణించారు.[81] తన తండ్రి బహుభార్యత్వ అలవాట్లను కొనసాగిస్తూ, అలెగ్జాండరు తన సైనికులను ఆసియాలోని స్థానిక మహిళలను వివాహం చేసుకోమని ప్రోత్సహించాడు. సోగ్డియను యువరాణి అయిన రోక్సానాను వివాహం చేసుకోవడం ద్వారా స్వయంగా ఆచరించి చూపాడు. బాక్ట్రియాలో. ఆయన క్రీ.పూ. 324లో జరిగిన సూసా వివాహాలలో 3వ డారియసు పెద్ద కుమార్తె అయిన 2వ స్టేటిరాను 3వ ఆర్టాక్సెర్క్సెసు చిన్న కుమార్తె అయిన 2వ పారిసాటిసును వివాహం చేసుకున్నాడు.
ఇంతలో గ్రీసులో స్పార్టా రాజు 3వ అగిసు మాసిడోనియాకు వ్యతిరేకంగా గ్రీకులను సమీకరించి తిరుగుబాటుకు నాయకత్వం వహించడానికి ప్రయత్నించాడు.[82] క్రీ.పూ. 331లో మెగాలోపోలిసు యుద్ధంలో ఆయన ఆంటిపేటరు చేతిలో ఓడిపోయాడు. అలెగ్జాండరు స్థానంలో ఆంటిపేటరు మాసిడోనియాకు రాజప్రతినిధిగా కొరింథు కూటమికి డిప్యూటీ హెగెమోనుగా పనిచేస్తున్నాడు.[note 8] ఆంటిపేటరు పెలోపొన్నేసులో తన సైనిక చర్యను ప్రారంభించడానికి ముందు, థ్రేసు గవర్నరు అయిన మెమ్నానును దౌత్యం ద్వారా తిరుగుబాటు చేయకుండా నివారించారు.[83] యాంటిపేటరు స్పార్టాకు విధించాల్సిన శిక్షను అలెగ్జాండరు నాయకత్వంలోని కొరింతు కూటమికి వాయిదా వేశాడు. చివరికి అలెగ్జాండరు స్పార్టన్లు యాభై మంది ప్రభువులను బందీలుగా అప్పగించాలనే షరతు మీద వారిని క్షమించాడు.[84] అసమ్మతివాదులను బహిష్కరించడం, నగరాలలో మాసిడోనియను సైనికులను మోహరించడం వంటి తన పద్ధతుల కారణంగా (బహుశా అలెగ్జాండరు ఆదేశాల మేరకు) గ్రీసులో యాంటిపేటరు ఆధిపత్యం కొంత అపఖ్యాతి పాలైంది. అయినప్పటికీ క్రీ.పూ. 330లో గ్రీసులో స్థాపించబడిన నిరంకుశ పాలనలను రద్దు చేయాలని, గ్రీకు స్వేచ్ఛను పునరుద్ధరించాలని అలెగ్జాండరు ప్రకటించాడు.[85]


క్రీ.పూ. 323లో బాబిలోనులో అలెగ్జాండరు ది గ్రేటు మరణించినప్పుడు ఆయన తల్లి ఒలింపియాసు వెంటనే ఆయనకు విషమిచ్చారని ఆంటిపేటరు, ఆయన వర్గం మీద ఆరోపించింది. అయితే దీనిని ధృవీకరించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.[86] అధికారిక వారసుడు లేకపోవడంతో మాసిడోనియను సైనిక కమాండు చీలిపోయింది. ఒక వర్గం అలెగ్జాండరు సవతి సోదరుడైన 3వ ఫిలిపు అరిడేయసును (క్రీ.పూ. 323-317) రాజుగా ప్రకటించగా మరొక వర్గం అలెగ్జాండరు, రోక్సానా పసికందు కుమారుడైన 4వ అలెగ్జాండరు (క్రీ.పూ. 323-309) పక్షాన నిలిచింది.[87] యూబోయన్లు, బోయోటియన్లు మినహా, గ్రీకులు కూడా వెంటనే ఆంటిపేటరుకు వ్యతిరేకంగా లామియను యుద్ధం (క్రీ.పూ. 323-322) అని పిలువబడే తిరుగుబాటుకు లేచారు.[88] క్రీ.పూ. 323 నాటి థెర్మోపైలే యుద్ధంలో యాంటిపేటరు ఓడిపోయినప్పుడు ఆయన లామియాకు పారిపోయాడు. అక్కడ ఏథెన్సు సేనాధిపతి లియోస్థెనెసు ఆయనను ముట్టడించాడు. లియోనాటసు నాయకత్వంలోని మాసిడోనియను సైన్యం ముట్టడిని ఎత్తివేసి యాంటిపేటరును రక్షించింది. [89] యాంటిపేటరు తిరుగుబాటును అణచివేశాడు. అయినప్పటికీ క్రీ.పూ. 319లో ఆయన మరణం ఒక అధికార శూన్యాన్ని సృష్టించింది. దీనిలో మాసిడోనియాకు ప్రకటించబడిన ఇద్దరు రాజులు అలెగ్జాండరు సైన్యంలోని మాజీ సేనాధిపతులైన డయాడోకీల మధ్య జరిగిన అధికార పోరాటంలో పావులుగా మారారు. [90]
అలెగ్జాండరు మరణించిన వెంటనే బాబిలోనులో సైన్యం ఒక మండలి సమావేశమై 3వ ఫిలిపును రాజుగా, చిలియార్కు పెర్డిక్కాసును ఆయన ప్రతినిధిగా నియమించింది.[91] టోలెమీ అలెగ్జాండరు ది గ్రేటు శవపేటికను స్వాధీనం చేసుకోవడంతో ప్రారంభమైన అంతర్యుద్ధంలో యాంటిపేటరు, యాంటిగోనషు మోనోఫ్తాల్మసు, క్రాటెరసు, టోలెమీ పెర్డిక్కాసుకు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేశారు.[92] క్రీ.పూ. 321లో టోలెమీకి వ్యతిరేకంగా ఈజిప్టులో జరిగిన ఒక విఫలమైన సైనిక చర్య సమయంలో పెర్డిక్కాసు తన సొంత అధికారులచే హత్య చేయబడ్డాడు. ఈ దండయాత్రలో నైలు నది వెంబడి ఆయన ప్రయాణం కారణంగా ఆయన 2,000 మంది సైనికులు మునిగిపోయారు.[93] కార్డియాకు చెందిన యూమెనెసు యుద్ధంలో క్రాటెరసును చంపగలిగినప్పటికీ క్రీ.పూ. 321లో సిరియాలో జరిగిన ట్రిపరాడిససు విభజన ఫలితం మీద ఇది పెద్దగా ప్రభావం చూపలేదు. అక్కడ విజయం సాధించిన కూటమి కొత్త ప్రతినిధి పాలన, ప్రాదేశిక హక్కుల సమస్యను పరిష్కరించింది.[94] యాంటిపేటరు ఇద్దరు రాజులకు ప్రతినిధిగా నియమించబడ్డాడు. క్రీ.పూ. 319లో ఆంటిపేటరు మరణించడానికి ముందు ఆయన తన సొంత కుమారుడైన కాసాండరును కాదని ఆర్గియాడు వంశానికి గట్టి విధేయుడైన పాలిపెర్చోనును తన వారసుడిగా నియమించాడు. (3వ ఫిలిపు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని భావించినందున) కొత్త రీజెంటును ఎన్నుకునే రాజు హక్కును విస్మరించి పరోక్షంగా సైనిక మండలిని కూడా పక్కన పెట్టాడు.[95]
టాలెమీ, ఆంటిగోనసు, లైసిమాకసులతో పొత్తు పెట్టుకుని, కాసాండరు తన అధికారి నికానోరుతో గ్రీకు నగరాలు మాసిడోనియను సైనిక దళాల నుండి విముక్తి పొందాలని పాలిపెర్చోను జారీ చేసిన డిక్రీని ధిక్కరిస్తూ, ఏథెన్సు ఓడరేవు పట్టణమైన పిరాయసు మునిచియా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఇది రెండవ డయాడోచి యుద్ధానికి (క్రీ.పూ. 319–315) దారితీసింది.[96] పాలిపెర్చోను వరుస సైనిక వైఫల్యాల నేపథ్యంలో క్రీ.పూ. 317లో 3వ ఫిలిపు తన రాజకీయంగా చురుకైన భార్య 2వ యూరిడిసు అధికారికంగా ఆయనను రాజప్రతినిధి పదవి నుండి తొలగించి కాసాండరును నియమించింది.[97] ఆ తర్వాత పాలిపెర్చోను నిస్సహాయంగా ఎపిరసులో ఉన్న ఒలింపియాసు సహాయం కోసం ప్రయత్నించాడు.[97] ఎపిరోటులు, ఎటోలియన్లు పాలిపెర్చోను దళాలతో కూడిన ఒక సంయుక్త సైన్యం మాసిడోనియా మీద దండెత్తి, 3వ ఫిలిపు యూరిడిసు సైన్యాన్ని లొంగిపోయేలా చేసాడు. ఇది ఒలింపియాసు రాజును ఉరితీయడానికి ఆయన రాణిని ఆత్మహత్య చేసుకోమని బలవంతం చేయడానికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఒలింపియాసు నికానోరును, డజన్ల కొద్దీ ఇతర మాసిడోనియను ప్రభువులను చంపించింది. కానీ క్రీ.పూ. 316 వసంతకాలం నాటికి కాసాండరు ఆమె దళాలను ఓడించి ఆమెను బంధించి, హత్య నేరం మీద విచారణ జరిపి ఆమెకు మరణశిక్ష విధించాడు.
కాసాండరు 2వ ఫిలిపు కుమార్తె థెస్సలోనికీని వివాహం చేసుకున్నాడు. మాసిడోనియను నియంత్రణను ఇలీరియాలోకి, ఎపిడామ్నోసు (ఆధునిక డర్రెసు, అల్బేనియా) వరకు క్లుప్తంగా విస్తరించాడు. క్రీ.పూ. 313 నాటికి దీనిని ఇలీరియను రాజు గ్లాసియాసు తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.[98] క్రీ.పూ. 316 నాటికి యాంటిగోనసు యూమెనెసు భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత సెల్యూకసు నికేటరును ఆయనను బాబిలోనియను సాత్రపీ నుండి బహిష్కరించడంలో విజయం సాధించాడు. దీనితో క్రీ.పూ. 315లో కాసాండరు టోలెమీ, లైసిమాకసు యాంటిగోనసుకు ఒక ఉమ్మడి అల్టిమేటం జారీ చేసి ఆసియాలోని వివిధ భూభాగాలను అప్పగించాలని డిమాండు చేశారు.యాంటిగోనసు వెంటనే ఇప్పుడు కొరింథులో ఉన్న పాలిపెర్చానుతో పొత్తు పెట్టుకుని, కాసాండరుకు తన సొంత అల్టిమేటం జారీ చేశాడు. ఒలింపియాసును ఉరితీసినందుకు ఆయన మీద హత్య ఆరోపణలు చేసి రాజకుటుంబాన్ని, రాజు 4వ అలెగ్జాండరు రాణి తల్లి రోక్సానాను అప్పగించాలని డిమాండు చేశాడు.[99] దీని తరువాత జరిగిన సంఘర్షణ క్రీ.పూ. 312/311 శీతాకాలం వరకు కొనసాగింది. ఆ సమయంలో కుదిరిన కొత్త శాంతి ఒప్పందం కాసాండరును యూరపు జనరలుగా, యాంటిగోనసును "ఆసియాలో ప్రథముడిగా", టోలెమీని ఈజిప్టు జనరలుగా లైసిమాకసును థ్రేసు జనరలుగా గుర్తించింది.[100] కాసాండరు క్రీ.పూ. 311/310 శీతాకాలంలో 4వ అలెగ్జాండరు, రోక్సానాలను చంపించాడు. క్రీ.పూ. 306, 305 మధ్య కాలంలో డయాడోకీలు వారి సంబంధిత భూభాగాలకు రాజులుగా ప్రకటించబడ్డారు.[101]
హెలెనిస్టికు యుగం
[మార్చు]హెలెనిస్టికు గ్రీసు ప్రారంభం. మొదట యాంటిపాటరు కుమారుడైన కాసాండరు (r. 305 – 297) నేతృత్వంలోని యాంటిపాట్రిడు రాజవంశం మాసిడోనియను జనరలు మొదటి యాంటిగోనసు మోనోఫ్తాల్మసు (r. 306 – 301), తరువాత ఆయన కుమారుడు భవిష్యతు రాజు 1వ డెమెట్రియసు (r. 294 – 288) నేతృత్వంలోని యాంటిగోనిడు రాజవంశం మధ్య జరిగిన పోరాటం ద్వారా నిర్వచించబడింది. కసాండరు క్రీ.పూ. 303లో ఏథెన్సును ముట్టడించాడు. కానీ డెమెట్రియసు ఆయన వెనుక ఉన్న బోయోటియా మీద దాడి చేసి ఆయన తిరోగమన మార్గాన్ని తెంచడానికి ప్రయత్నించడంతో ఆయన మాసిడోనియాకు వెనక్కి తగ్గవలసి వచ్చింది.[102] ఆంటిగోనసు, డెమెట్రియసు తాము ఇద్దరూ అధిపతులుగా 2వ ఫిలిపు హెల్లెనికు లీగును పునఃసృష్టించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కసాండరు, ఈజిప్టులోని టోలెమికు రాజవంశానికి చెందిన 1వ టోలెమీ సోటరు (క్రీ.పూ. 305–283), సెల్యూసిడ్ సామ్రాజ్యానికి చెందిన 1వ సెల్యూకసు నికేటరు (క్రీ.పూ. 305–281), థ్రేసు రాజు లైసిమాకసు (క్రీ.పూ. 306–281) లతో కూడిన పునరుద్ధరించబడిన కూటమి క్రీ.పూ. 301లో ఇప్ససు యుద్ధంలో ఆంటిగోనిడులను ఓడించి, ఆంటిగోనసును చంపి, డెమెట్రియసును పలాయనం చేసేలా చేసింది.[103]
కస్సాండరు క్రీ.పూ. 297లో మరణించాడు. ఆయన అనారోగ్యంతో ఉన్న కుమారుడు 4వ ఫిలిపు కూడా అదే సంవత్సరం మరణించాడు. ఆయన తర్వాత కస్సాండరు ఇతర కుమారులు 5వ అలెగ్జాండరు (క్రీ.పూ. 297–294), 2వ యాంటిపేటరు (క్రీ.పూ. 297–294) సింహాసనాన్ని అధిష్టించారు. వారి తల్లి థెస్సలోనికే సంరక్షకురాలిగా వ్యవహరించింది.డెమెట్రియసు గ్రీసులో యాంటిపాట్రిడు దళాలతో పోరాడుతున్నప్పుడు 2వ యాంటిపేటరు అధికారం కోసం తన సొంత తల్లిని చంపేశాడు.ఆయన నిస్సహాయ సోదరుడు 5వ అలెగ్జాండరు అప్పుడు పైరసు ఆఫ్ ఎపిరసు (క్రీ.పూ. 297–272) నుండి సహాయం కోరాడు. ఆయన ఇప్ససు యుద్ధంలో డెమెట్రియసుతో కలిసి పోరాడాడు. కానీ డెమెట్రియసు, 1వ టోలెమీ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా బందీగా ఈజిప్టుకు పంపబడ్డాడు.[104] 2వ యాంటిపేటరు దళాలను ఓడించి ఆయన థ్రేసులోని లైసిమాకసు ఆస్థానానికి పారిపోయేలా చేసినందుకు ప్రతిఫలంగా పైరసుకు మాసిడోనియను రాజ్యంలోని పశ్చిమ ప్రాంతాలు బహుమతిగా ఇవ్వబడ్డాయి.[105] డెమెట్రియసు తన మేనల్లుడు అలెగ్జాండరును హత్య చేయించి ఆ తర్వాత మాసిడోనియా రాజుగా ప్రకటించబడ్డాడు. కానీ ఆయన ప్రజలు ఆయన ఏకాంత పౌరాత్య శైలి నిరంకుశ పాలనను నిరసించారు.
క్రీ.పూ. 290లో పిర్రసు భార్య, సిరక్యూసుకు చెందిన అగాథోక్లెసు కుమార్తె అయిన లనాస్సా, పిర్రసును విడిచిపెట్టి డెమెట్రియసు వద్దకు వెళ్లి తన కట్నంగా వచ్చిన కోర్సిరాను ఆయనకు అప్పగించినప్పుడు పిర్రసు, డెమెట్రియసు మధ్య యుద్ధం చెలరేగింది. [106] ఈ యుద్ధం క్రీ.పూ. 288 వరకు కొనసాగింది. అప్పుడు డెమెట్రియసు మాసిడోనియన్ల మద్దతును కోల్పోయి దేశం విడిచి పారిపోయాడు. [106] ఆ తర్వాత మాసిడోనియా పిర్రసు, లైసిమాకసు మధ్య విభజించబడింది. మొదటివాడు పశ్చిమ మాసిడోనియాను, రెండవవాడు తూర్పు మాసిడోనియాను తీసుకున్నారు. [note 9] క్రీ.పూ. 286 నాటికి లైసిమాకసు పిర్రసును ఆయన బలగాలను మాసిడోనియా నుండి తరిమివేశాడు. క్రీ.పూ. 282లో 1వ సెల్యూకసు, లైసిమాకసు మధ్య కొత్త యుద్ధం చెలరేగింది; తరువాతి వ్యక్తి కొరుపెడియను యుద్ధంలో మరణించాడు. ఇది 1వ సెల్యూకసుకి థ్రేసు, మాసిడోనియా మీద నియంత్రణ సాధించడానికి వీలు కల్పించింది.[107] అదృష్టం రెండు నాటకీయంగా తలక్రిందులైన సంఘటనలలో క్రీ.పూ. 281లో 1వ సెల్యూకసు తన అధికారి టోలెమీ కెరౌనోసు చేత హత్య చేయబడ్డాడు. ఈ టోలెమీ కెరౌనోసు 1వ టోలెమీ కుమారుడు యాంటిపేటరు మనవడు. ఆయన మాసిడోనియా రాజుగా ప్రకటించబడిన తర్వాత క్రీ.పూ. 279లో గ్రీసు మీద గాలికు దండయాత్రలో సెల్టికు దండయాత్రదారుల చేతిలో యుద్ధంలో చంపబడ్డాడు.[108] మాసిడోనియను సైన్యం జనరలు సోస్థెనెసును రాజుగా ప్రకటించింది. అయితే ఆయన ఆ బిరుదును నిరాకరించినట్లు తెలుస్తోంది. [109] గాలికు పాలకుడు బోల్గియోసును ఓడించి, బ్రెన్నసు దండయాత్ర బృందాన్ని తరిమివేసిన తర్వాత, సోస్థెనెసు మరణించాడు. మాసిడోనియాలో ఒక అస్తవ్యస్తమైన పరిస్థితిని విడిచిపెట్టాడు. గాలికు ఆక్రమణదారులు మాసిడోనియాను నాశనం చేశారు. [110] చివరికి డెమెట్రియసు కుమారుడైన ఆంటిగోనసు గోనాటాసు క్రీ.పూ. 277లో థ్రేసులోని లైసిమాచియా యుద్ధంలో వారిని ఓడించాడు, ఆ తర్వాత మాసిడోను రాజు 3వ ఆంటిగోనసుగా ప్రకటించబడ్డాడు (పాలన: క్రీ.పూ. 277–274, 272–239). (r. 277 – 274).[111]
క్రీ.పూ. 280లో పిర్రసు మాగ్నా గ్రేసియా (అంటే దక్షిణ ఇటలీ)లో రోమను రిపబ్లికుకు వ్యతిరేకంగా పిర్రికు యుద్ధంగా పిలువబడే ఒక సైనిక దండయాత్రను ప్రారంభించాడు. దీని తర్వాత ఆయన సిసిలీ మీద దండెత్తాడు.[112] టోలెమీ కెరౌనోసు ఈ ప్రయత్నం కోసం పిర్రసుకు ఐదు వేల మంది సైనికులను, ఇరవై యుద్ధ ఏనుగులును ఇవ్వడం ద్వారా మాసిడోనియను సింహాసనం మీద తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.[104] ఈ రెండు దండయాత్రలు చివరికి విఫలమైన తర్వాత పిర్రసు క్రీ.పూ. 275లో ఎపిరసుకు తిరిగి వచ్చాడు. ఇది రోం ఉదయంకు దోహదపడింది. ఎందుకంటే టారెంటం వంటి దక్షిణ ఇటలీలోని గ్రీకు నగరాలు ఇప్పుడు రోమను మిత్రదేశాలుగా మారాయి.[112] పిర్రసు క్రీ.పూ. 274లో మాసిడోనియా మీద దండెత్తి, క్రీ.పూ. 274 నాటి ఆవసు యుద్ధంలో 2వ ఆంటిగోనసు కిరాయి సైనికులతో కూడిన సైన్యాన్ని ఓడించి ఆయనను మాసిడోనియా నుండి తరిమివేశాడు. దీంతో ఆయన ఏజియనులో తన నావికాదళంతో ఆశ్రయం పొందవలసి వచ్చింది.[113]

క్రీ.పూ. 273లో పైరసు అదుపులేని గాలికు కిరాయి సైనికులు ఐగైలోని రాజ శ్మశానవాటికను దోచుకున్నప్పుడు మాసిడోనియన్లలో ఆయన మద్దతు చాలా వరకు కోల్పోయాడు.[114] పైరసు పెలోపొన్నేసులో 2వ ఆంటిగోనసును వెంబడించాడు. అయినప్పటికీ 2వ ఆంటిగోనసు చివరికి మాసిడోనియాను తిరిగి స్వాధీనం చేసుకోగలిగాడు.[115] క్రీ.పూ. 272లో ఆర్గోసును ముట్టడిస్తున్నప్పుడు పైరసు చంపబడ్డాడు. ఇది 2వ ఆంటిగోనసుకు మిగిలిన గ్రీసును తిరిగి పొందడానికి వీలు కల్పించింది.[116] ఆ తర్వాత ఆయన ఐగైలోని ఆర్గియాడు రాజవంశ సమాధులను పునరుద్ధరించి పేయోనియా రాజ్యాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు.[117]
ఏటోలియను లీగు 2వ ఆంటిగోనసు మధ్య గ్రీసు మీద నియంత్రణకు ఆటంకం కలిగించింది. క్రీ.పూ. 251లో అఖేయను లీగు ఏర్పడటంతో మాసిడోనియను దళాలు పెలోపొన్నేసియాలోని చాలా ప్రాంతాల నుండి వెనక్కి నెట్టబడ్డాయి. కొన్నిసార్లు ఏథెన్సు, స్పార్టాను కూడా తమలో కలుపుకున్నాయి.[118] సిరియను యుద్ధాల సమయంలో సెల్యూసిడ్ సామ్రాజ్యం టోలెమికు ఈజిప్టుకు వ్యతిరేకంగా ఆంటిగోనిడు మాసిడోనియాతో పొత్తు పెట్టుకున్నప్పటికీ టోలెమికు నావికాదళం ప్రధాన భూభాగ గ్రీసును నియంత్రించాలనే 2వ ఆంటిగోనసు ప్రయత్నాలకు తీవ్ర అంతరాయం కలిగించింది.[119] టోలెమికు నావికాదళం సహాయంతో ఏథెన్సు రాజనీతిజ్ఞుడు క్రెమోనిడెసు మాసిడోనియను అధికారం మీద క్రెమోనిడియను యుద్ధం (క్రీ.పూ. 267–261) అని పిలువబడే తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.[120] క్రీ.పూ. 265 నాటికి, ఏథెన్సు 2వ ఆంటిగోనసు దళాలచే చుట్టుముట్టబడి ముట్టడికి గురైంది. కోసు యుద్ధంలో టోలెమికు నౌకాదళం ఓడిపోయింది. ఏథెన్సు చివరకు క్రీ.పూ. 261లో లొంగిపోయింది.[121] మాసిడోనియా సెల్యూసిడు పాలకుడు 3వ ఆంటియోకసుతో పొత్తు పెట్టుకున్న తర్వాత క్రీ.పూ. 255లో 2వ ఆంటిగోనసు, ఈజిప్టుకు చెందిన 2వ టోలెమీ ఫిలడెల్ఫసు మధ్య చివరకు శాంతి ఒప్పందం కుదిరింది.[122]

క్రీ.పూ. 251లో సిసియోనుకు చెందిన అరాటసు 2వ ఆంటిగోనసుకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. క్రీ.పూ. 250లో 2వ టోలెమీ స్వయం ప్రకటిత రాజు కొరింతుకు చెందిన అలెగ్జాండరుకు తన మద్దతును ప్రకటించాడు. [123]అలెగ్జాండర్ క్రీ.పూ. 246లో మరణించినప్పటికీ, ఆంటిగోనసు ఆండ్రోసు వద్ద టోలెమీలకు వ్యతిరేకంగా నావికా విజయాన్ని సాధించగలిగినప్పటికీ మాసిడోనియన్లు క్రీ.పూ. 243లో అక్రోకొరింతును అరాటసు దళాలకు కోల్పోయారు. ఆ తర్వాత కొరింతు అఖేయను లీగులో చేర్చబడింది.[124] అంటిగోనసు క్రీ.పూ. 240లో అఖేయను లీగుతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని గ్రీసులో తాను కోల్పోయిన భూభాగాలను వారికి అప్పగించాడు. అంటిగోనసు క్రీ.పూ. 239లో మరణించాడు. ఆయన కుమారుడు 2వ డెమెట్రియసు ఆయన వారసుడయ్యాడు (పాలన: క్రీ.పూ. 239–229). ఎటోలియన్ల నుండి రక్షణ కోసం మాసిడోనియాతో పొత్తు కోరుతూ ఎపిరసు రాణి తల్లి, రాజప్రతినిధి అయిన 2వ ఒలింపియాసు తన కుమార్తె ఫ్తియాను 2వ డెమెట్రియసుకు ఇచ్చి వివాహం చేయడానికి ప్రతిపాదించింది. 2వ డెమెట్రియసు ఆమె ప్రతిపాదనను అంగీకరించాడు. కానీ స్ట్రాటోనిసుకు విడాకులు ఇవ్వడం ద్వారా సెల్యూసిడులతో సంబంధాలను దెబ్బతీశాడు. దీని ఫలితంగా ఎటోలియన్లు అఖేయను లీగుతో పొత్తు పెట్టుకున్నప్పటికీ 2వ డెమెట్రియసు క్రీ.పూ. 236 నాటికి బోయోటియా మీద దండెత్తి దానిని ఎటోలియన్ల నుండి స్వాధీనం చేసుకోగలిగాడు.
అఖియను లీగు క్రీ.పూ. 235లో మెగాలోపోలిసును స్వాధీనం చేసుకోగలిగింది. 2వ డెమెట్రియసు పాలన ముగిసే నాటికి ఆర్గాసు మినహా పెలోపొన్నేసిసులో ఎక్కువ భాగం మాసిడోనియన్ల నుండి చేజిక్కించుకోబడింది.[125] ఒక గణతంత్ర విప్లవంలో రాచరికం పడగొట్టబడినప్పుడు 2వ డెమెట్రియసు ఎపిరసులో తన మిత్రుడిని కూడా కోల్పోయాడు.[126] ఏటోలియాకు వ్యతిరేకంగా అకార్నానియాను రక్షించడానికి 2వ డెమెట్రియసు ఇల్లీరియను రాజు అగ్రాను సహాయాన్ని కోరాడు. క్రీ.పూ. 229లో వారు పాక్సోసు యుద్ధంలో ఏటోలియను, అఖియను లీగుల సంయుక్త నావికాదళాలను ఓడించగలిగారు.[126] డార్డేనియను రాజ్యానికి చెందిన మరో ఇల్లీరియను పాలకుడు, లాంగరసు, మాసిడోనియా మీద దండెత్తి, క్రీ.పూ. 229లో 2వ డెమెట్రియసు మరణానికి కొద్దికాలం ముందు ఆయన సైన్యాన్ని ఓడించాడు.[127] ఆయన చిన్న కుమారుడు ఫిలిపు వెంటనే సింహాసనాన్ని అధిష్టించినప్పటికీ ఆయన రాజప్రతినిధి 3వ యాంటిగోనసు డోసను (r. 229 – 221), 2వ యాంటిగోనసు మేనల్లుడు, ఉత్తరాన ఇల్లీరియన్లకు, థెస్సలీలో ఏటోలియన్లకు వ్యతిరేకంగా సాధించిన వరుస సైనిక విజయాల తరువాత సైన్యం చేత రాజుగా ప్రకటించబడ్డాడు. ఫిలిపు ఆయన వారసుడిగా ఉన్నాడు.[128]

స్పార్టాకు చెందిన సంస్కరణవాద రాజు 3వ క్లియోమెనెసు క్లియోమెనియను యుద్ధం (229–222 బిసి)లో మిగిలిన గ్రీసుకు ముప్పు కలిగిస్తున్నందున అరాటసు క్రీ.పూ. 226లో 3వ యాంటిగోనసు వద్దకు ఒక రాయబార బృందాన్ని పంపి ఊహించని పొత్తు కోసం కోరాడు. [129] సైనిక సహాయానికి బదులుగా 3వ యాంటిగోనసు కొరింతును మాసిడోనియను నియంత్రణకు తిరిగి అప్పగించాలని డిమాండు చేశాడు. దీనికి అరాటసు చివరకు క్రీ.పూ. 225లో అంగీకరించాడు.[130] క్రీ.పూ. 224లో 3వ ఆంటిగోనసు దళాలు స్పార్టా నుండి ఆర్కాడియాను స్వాధీనం చేసుకున్నాయి.2వ ఫిలిపు కొరింథు లీగు తరహాలోనే ఒక హెల్లెనికు లీగును ఏర్పాటు చేసిన తర్వాత ఆయన క్రీ.పూ. 222లో సెల్లాసియా యుద్ధంలో స్పార్టాను ఓడించగలిగాడు. స్పార్టా తన చరిత్రలో మొదటిసారిగా ఒక విదేశీ శక్తిచే ఆక్రమించబడింది. ఇది గ్రీసులో మాసిడోనియాను తిరిగి అగ్రగామి శక్తిగా నిలబెట్టింది. ఆంటిగోనసు ఒక సంవత్సరం తర్వాత బహుశా క్షయవ్యాధితో మరణించాడు. తన వారసుడైన 5వ ఫిలిపు కోసం ఒక బలమైన హెల్లెనిస్టికు రాజ్యాన్ని విడిచిపెట్టాడు.
మాసిడోనియాకు చెందిన 5వ ఫిలిపు (క్రీ.పూ. 221–179) తన అధికారం మీద ఇల్లీరియను డార్డాని, ఏటోలియను లీగు నుండి తక్షణ సవాళ్లను ఎదుర్కొన్నాడు.[131] 5వ ఫిలిపు ఆయన మిత్రులు సామాజిక యుద్ధం (క్రీ.పూ. 220–217)లో ఏటోలియన్లు, వారి మిత్రుల మీద విజయం సాధించారు. అయినప్పటికీ, ఉత్తరాన డార్డాని దండయాత్రల గురించి, క్రీ.పూ. 217లో ట్రాసిమెను సరస్సు యుద్ధంలో కార్తేజియన్లు రోమన్ల మీద సాధించిన విజయం గురించి విన్న తర్వాత ఆయన ఏటోలియన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు.[132] ఫారోసుకు చెందిన డెమెట్రియసు ఇటాలియను ద్వీపకల్పం మీద దండయాత్రకు ముందుగా ఇల్లీరియాను సురక్షితం చేసుకోవాలని 5వ ఫిలిపును ఒప్పించాడని ఆరోపణ ఉంది. [note 10] క్రీ.పూ. 216లో 5వ ఫిలిపు ఇలీరియా మీద దాడి చేయడానికి వంద తేలికపాటి యుద్ధనౌకలను ఏడ్రియాటికు సముద్రంలోకి పంపాడు. ఈ చర్య కారణంగా అర్డియను రాజ్యానికి చెందిన స్కెర్డిలైడాసును సహాయం కోసం రోమన్లను అభ్యర్థించారు.[133] రోం స్పందించి ఇలీరియను తీరాలలో గస్తీ తిరగడానికి రోమను సిసిలీ నుండి పది భారీ క్వింక్విరీంలను పంపింది. దీనితో 5వ ఫిలిపు తన నిర్ణయాన్ని మార్చుకుని తన నౌకాదళాన్ని వెనక్కి తగ్గమని ఆదేశించాడు. తద్వారా ప్రస్తుతానికి ప్రత్యక్ష సంఘర్షణను నివారించాడు.[134]
రోంతో సంఘర్షణ
[మార్చు]
క్రీ.పూ. 215లో కార్తేజియన్ సామ్రాజ్యంతో రెండవ పునికు యుద్ధం ఉధృతంగా జరుగుతున్న సమయంలో రోమను అధికారులు కలబ్రియా తీరంలో ఒక ఓడను అడ్డగించారు. ఆ ఓడలో ఒక మాసిడోనియను దూత, ఒక కార్తేజియను రాయబారి ఉన్నారు. వారి వద్ద హన్నిబలు రచించిన ఒక ఒప్పందం ఉంది. అది 5వ ఫిలిపుతో పొత్తును ప్రకటించింది.[135] ఆ ఒప్పందం ప్రకారం రోం లొంగిపోవడానికి సంబంధించిన షరతులను చర్చించే ఏకైక హక్కు కార్తేజుకు మాత్రమే ఉంటుంది. పునరుజ్జీవం పొందిన రోం మాసిడోనియా లేదా కార్తేజు మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే పరస్పర సహాయం అందిస్తామని వాగ్దానం చేసింది.[136] మాసిడోనియన్లు బహుశా ఇల్లిరియాలో తాము కొత్తగా జయించిన భూభాగాలను కాపాడుకోవడంలో మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ [137] అయినప్పటికీ మొదటి మాసిడోనియను యుద్ధం (క్రీ.పూ. 214–205) సమయంలో ఏడ్రియాటికు ప్రాంతం మీద 5వ ఫిలిపుకు ఉన్న గొప్ప ఆశయాలను రోమన్లు అడ్డుకోగలిగారు. క్రీ.పూ. 214లో రోం ఓరికసులో ఒక నౌకాదళాన్ని మోహరించింది. దీని మీద మాసిడోనియను దళాలు అపోలోనియాతో పాటు దాడి చేశాయి.[138] క్రీ.పూ. 212లో మాసిడోనియన్లు లిససును స్వాధీనం చేసుకున్నప్పుడు రోమను సెనేటు దానికి ప్రతిస్పందనగా ఏటోలియను లీగు, స్పార్టా, ఎలిసు, మెస్సేనియా, పెర్గామోనుకు చెందిన 1వ అటాలసు I (క్రీ.పూ. 241–197)లను 5వ ఫిలిపు మీద యుద్ధం చేయడానికి ప్రేరేపించింది. తద్వారా ఆయన ఇటలీకి దూరంగా ఉంచి నిమగ్నమయ్యేలా చేసింది.[139]
ఏటోలియను లీగు క్రీ.పూ. 206లో 5వ ఫిలిపుతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. రోమను రిపబ్లికు క్రీ.పూ. 205లో ఫోనిసు ఒప్పందం మీద చర్చలు జరిపింది. ఇది యుద్ధాన్ని ముగించి మాసిడోనియన్లు ఇల్లిరియాలో స్వాధీనం చేసుకున్న కొన్ని స్థావరాలను తమ వద్దే ఉంచుకోవడానికి అనుమతించింది.[140] క్రీ.పూ. 202లో మాసిడోనియా మీద మరోసారి యుద్ధం ప్రకటించాలనే ఏటోలియన్ల అభ్యర్థనను రోమన్లు తిరస్కరించినప్పటికీ, క్రీ.పూ. 201లో పెర్గామోను, దాని మిత్రపక్షమైన రోడ్సు చేసిన ఇలాంటి ప్రతిపాదనను రోమను సెనేటు తీవ్రంగా పరిగణించింది.[141] ఈ రాజ్యాలు సెల్యూసిడు సామ్రాజ్యానికి చెందిన 3వ ఆంటియోకసు ది గ్రేటుతో 5వ ఫిలిపు కుదుర్చుకున్న కూటమి గురించి ఆందోళన చెందాయి. 5వ ఫిలిపు ఏజియను సముద్రంలో టోలెమికు స్థావరాలను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో ఆ సామ్రాజ్యం యుద్ధంతో అలసిపోయి ఆర్థికంగా బలహీనపడిన టోలెమికు సామ్రాజ్యం మీద ఐదవ సిరియను యుద్ధంలో (202–195 క్రీ.పూ.) దండెత్తింది.[142] క్రీ.పూ. 200లో పెర్గామోను, రోడ్సుతో కలిసి మాసిడోనియా వ్యతిరేక కూటమిలో చేరడానికి ఏథెన్సును ఒప్పించడంలో రోం దూతలు కీలక పాత్ర పోషించినప్పటికీ 'కొమిటియా సెంచురియాటా' (ప్రజాసభ) మాసిడోనియా మీద యుద్ధ ప్రకటన చేయాలన్న రోమను సెనేటు ప్రతిపాదనను తిరస్కరించింది.[143] ఇంతలో 5వ ఫిలిపు హెల్లెస్పాంటు, బోస్పోరసులోని భూభాగాలను, అలాగే టోలెమికు సామ్రాజ్యానికి చెందిన సామోసును జయించాడు. ఇది రోడ్సును మాసిడోనియాకు వ్యతిరేకంగా పెర్గామోను, బైజాంటియం, సైజికసు, చియోసులతో కూటమిని ఏర్పాటు చేయడానికి దారితీసింది.[144] సెల్యూసిడు రాజుతో 5వ ఫిలిపు నామమాత్రపు కూటమి ఉన్నప్పటికీ ఆయన క్రీ.పూ. 201లో జరిగిన చియోసు నావికా యుద్ధంలో ఓడిపోయాడు. రోడియను, పెర్గామెను నావికాదళాలచే బార్గిలియా వద్ద దిగ్బంధించబడ్డాడు.[145]

5వ ఫిలిపు రోం గ్రీకు మిత్రదేశాలతో పోరాడటంలో నిమగ్నమై ఉన్నప్పుడు రోం దీనిని హన్నిబాలు ఈ మాజీ మిత్రుడిని శిక్షించడానికి ఒక అవకాశంగా భావించింది. ఈ యుద్ధం తమకు విజయాన్ని అందిస్తుందని తక్కువ వనరులు అవసరమవుతాయని వారు ఆశించారు.[note 11] రోమను సెనేటు 5వ ఫిలిపు పొరుగున ఉన్న గ్రీకు రాజ్యాల మీద శత్రుత్వాలను నిలిపివేయాలని ఫిర్యాదులను పరిష్కరించుకోవడానికి ఒక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కమిటీకి లోబడి ఉండాలని డిమాండు చేసింది.[146] క్రీ.పూ. 200లో కొమిటియా సెంచురియాటా చివరకు రోమను సెనేటు యుద్ధ ప్రకటనకు ఆమోదం తెలిపి రోడ్సు పెర్గామోనులకు చెల్లించాల్సిన నష్టాలను అంచనా వేయడానికి ఒక ట్రిబ్యునలు ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ 5వ ఫిలిపుకు తమ అల్టిమేటంను అందజేసినప్పుడు. మాసిడోనియను రాజు దానిని తిరస్కరించాడు. ఇది రెండవ మాసిడోనియను యుద్ధం (క్రీ.పూ 200–197 ) ప్రారంభానికి నాంది పలికింది. పబ్లియసు సుల్పిసియసు గల్బా మాగ్జిమసు అపోలోనియాలో సైనిక చర్యలకు నాయకత్వం వహించాడు.[147]
మాసిడోనియన్లు సుమారు రెండు సంవత్సరాల పాటు తమ భూభాగాన్ని విజయవంతంగా రక్షించుకున్నారు.[148] కానీ రోమను కాన్సులు టైటసు క్వింక్టియసు ఫ్లామినసు క్రీ.పూ. 198లో 5వ ఫిలిపుని మాసిడోనియా నుండి తరిమివేయగలిగాడు. ఆయన సైనికులు థెస్సాలీలో ఆశ్రయం పొందవలసి వచ్చింది.[149] అఖియను లీగు తమ విధేయతను మాసిడోనియా నుండి రోంకు మార్చినప్పుడు మాసిడోనియను రాజు శాంతి కోసం విజ్ఞప్తి చేశాడు. కానీ అందించిన షరతులు చాలా కఠినంగా ఉన్నాయని భావించడంతో యుద్ధం కొనసాగింది.[149] క్రీ.పూ. 197 జూన్లో సినోస్సెఫలే యుద్ధంలో మాసిడోనియన్లు ఓడిపోయారు.[150] ఆ తర్వాత రోం ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. ఇది ఇల్లిరియను, థ్రేసియను దండయాత్రల నుండి గ్రీసుకు రక్షణగా ఉండేందుకు మాసిడోనియా సరైన భూభాగం వెలుపల ఉన్న దాని గ్రీకు ఆస్తులలో చాలా వరకు నియంత్రణను వదులుకోవలసి వచ్చింది.[151] కొంతమంది గ్రీకులు గ్రీసులో కొత్త ఆధిపత్య శక్తిగా మాసిడోనియా స్థానంలోకి రావాలనే రోమన్ల ఉద్దేశాలను అనుమానించినప్పటికీ ఫ్లామినీయసు క్రీ.పూ. 196 నాటి ఇస్త్మియను క్రీడలలో రోం ఎటువంటి సైనిక దళాలను వదిలివేయకుండా ఎలాంటి కప్పం వసూలు చేయకుండా గ్రీకు స్వాతంత్ర్యాన్ని పరిరక్షించాలని ఉద్దేశించిందని ప్రకటించాడు.[152] ఈలోగా ఆర్గాసును స్వాధీనం చేసుకున్న స్పార్టా రాజు నాబిసుతో జరిగిన చర్చల కారణంగా ఆయన వాగ్దానం ఆలస్యమైంది. అయినప్పటికీ రోమను దళాలు క్రీ.పూ. 194లో గ్రీసును ఖాళీ చేశాయి.[153]
ఏటోలియను లీగు ప్రోత్సాహంతో, రోమన్ల నుండి గ్రీసును విముక్తి చేయాలనే వారి పిలుపులతో సెల్యూసిడు రాజు 3వ ఆంటియోకసు క్రీ.పూ. 192లో తన సైన్యంతో థెస్సాలీలోని డెమెట్రియాసు వద్ద దిగాడు. ఏటోలియన్లచే 'స్ట్రాటెగోస్'గా ఎన్నుకోబడ్డాడు.[154] మాసిడోనియా, అఖేయను లీగు, ఇతర గ్రీకు నగర-రాజ్యాలు రోంతో తమ పొత్తును కొనసాగించాయి.[155] క్రీ.పూ. 191లో జరిగిన థెర్మోపైలే యుద్ధంలో, క్రీ.పూ. 190లో జరిగిన మాగ్నీషియా యుద్ధంలో రోమన్లు సెల్యూసిడులను ఓడించారు. దీని ఫలితంగా క్రీ.పూ. 188లో జరిగిన అపామియా ఒప్పందం ప్రకారం సెల్యూసిడులు యుద్ధ నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది. వారి నౌకాదళంలో ఎక్కువ భాగాన్ని రద్దు చేయవలసి వచ్చింది. టారసు పర్వతాలకు ఉత్తరాన లేదా పశ్చిమాన ఉన్న ఏ భూభాగాల మీద అయినా తమ దావాలను వదులుకోవలసి వచ్చింది. రోం అంగీకారంతో 5వ ఫిలిపు క్రీ.పూ. 191–189 మధ్యకాలంలో 3వ ఆంటియోకసుకు మిత్రపక్షంగా ఉన్న మధ్య గ్రీసులోని కొన్ని నగరాలను స్వాధీనం చేసుకోగలిగాడు. అదే సమయంలో రోడ్సు, పెర్గామోనుకు చెందిన 2వ యూమెనెసు (క్రీ.పూ. 197–159) ఆసియా మైనరులో భూభాగాలను పొందారు.
వివిధ ప్రాదేశిక వివాదాలలో అన్ని పక్షాలను సంతృప్తిపరచడంలో విఫలమైన రోమను సెనేటు క్రీ.పూ. 184/183లో 5వ ఫిలిపును ఏనసు, మరోనియాను వదిలివేయమని బలవంతం చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే అపామియా ఒప్పందంలో ఈ నగరాలు స్వేచ్ఛా నగరాలుగా ప్రకటించబడ్డాయి.[note 12] ఇది మాసిడోనియా హెల్లెస్పాంటులోని తన భూభాగాలకు ముప్పు కలిగించవచ్చనే 2వ యూమెనెసు భయాన్ని తగ్గించింది.[156] పెర్సియసు ఆఫ్ మాసిడోను (క్రీ.పూ. 179-168) 5వ ఫిలిపు తర్వాత అధికారంలోకి వచ్చాడు. రోమన్లచే ఆదరించబడిన తన సోదరుడు డెమెట్రియసును ఉరితీశాడు. ఆయన మీద పెర్సియసు రాజద్రోహం ఆరోపణలు మోపాడు.[157] ఆ తర్వాత పెర్సియసు బితినియాకు చెందిన 2వ ప్రూసియాసు, సెల్యూసిడ్ సామ్రాజ్యంకు చెందిన 4వ సెల్యూకసు ఫిలోపేటరుతో వివాహ సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాడు. అలాగే రోడ్సుతో సంబంధాలను పునరుద్ధరించుకున్నాడు. ఇది 2వ యూమెనెసును తీవ్రంగా కలవరపరిచింది.[158] 2వ యూమెనెసు ఈ దౌత్య సంబంధాలను బలహీనపరచడానికి ప్రయత్నించినప్పటికీ పెర్సియసు బోయోటియను లీగుతో పొత్తును పెంపొందించుకున్నాడు. ఇలీరియా థ్రేసు వరకు తన అధికారాన్ని విస్తరించాడు. క్రీ.పూ. 174లో ఆంఫిక్టియోనికు కౌన్సిలులో సభ్యుడిగా డెల్ఫీలోని అపోలో ఆలయ నిర్వహణ పాత్రను గెలుచుకున్నాడు.[159]
2వ యూమెనెసు క్రీ.పూ. 172లో రోంకు వచ్చి, పెర్సియసు ఆరోపిత నేరాలు, ఉల్లంఘనలను ఖండిస్తూ రోమను సెనేటుకు ఒక ప్రసంగం చేశాడు.[160] ఇది రోమను సెనేటును మూడవ మాసిడోనియను యుద్ధాన్ని (క్రీ.పూ. 171–168) ప్రకటించడానికి ఒప్పించింది.[note 13] క్రీ.పూ. 171లో క్యాలినైకసు యుద్ధంలో పెర్సియసు దళాలు రోమన్ల మీద విజయం సాధించినప్పటికీ క్రీ.పూ. 168 జూన్లో పిడ్నా యుద్ధంలో మాసిడోనియను సైన్యం ఓడిపోయింది.[161] పెర్సియసు సమోత్రేసుకు పారిపోయాడు. కానీ కొద్దిసేపటికే లొంగిపోయాడు. అఆయన లూసియసు ఎమిలియసు పౌలసు మాసిడోనికసు విజయయాత్ర కోసం రోంకు తీసుకువచ్చారు. ఆల్బా ఫ్యూసెన్సులో గృహ నిర్బంధంలో ఉంచారు. అక్కడ ఆయన క్రీ.పూ. 166లో మరణించాడు. రోమన్లు మాసిడోనియను రాచరికాన్ని రద్దు చేసి దాని స్థానంలో నాలుగు వేర్వేరు మిత్ర గణతంత్ర రాజ్యాలను స్థాపించారు. వాటి రాజధానులు ఆంఫిపోలిసు, థెస్సలోనికా, పెల్లా, పెలగోనియాలో ఉన్నాయి. ఈ గణతంత్ర రాజ్యాల నివాసుల మధ్య అనేక సామాజిక, ఆర్థిక సంబంధాలను నిరోధించే కఠినమైన చట్టాలను రోమన్లు విధించారు. ఇందులో వారి మధ్య వివాహాలను నిషేధించడం, బంగారం, వెండి తవ్వకాల మీద (తాత్కాలిక) నిషేధం విధించడం వంటివి ఉన్నాయి. ఆంటిగోనిడు వంశానికి చెందినవాడినని చెప్పుకున్న ఆండ్రిస్కసు అనే వ్యక్తి రోమన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, మాసిడోనియా రాజుగా ప్రకటించుకున్నాడు. నాల్గవ మాసిడోనియను యుద్ధం (క్రీ.పూ. 150–148) సమయంలో ఆయన రోమను ప్రైటరు పబ్లియసు జువెన్షియసు థాల్నా సైన్యాన్ని ఓడించాడు. అయినప్పటికీ, క్రీ.పూ. 148లో ఆండ్రిస్కసు క్వింటసు సిసిలియసు మెటెల్లసు మాసిడోనికసు చేతిలో రెండవ పిడ్నా యుద్ధంలో ఓడిపోయాడు. ఆయన సైన్యాలు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాయి. దీని తరువాత క్రీ.పూ. 146లో రోమన్లు కార్తేజు విధ్వంసం కొరింతు యుద్ధంలో అఖేయను లీగు మీద విజయం సాధించారు. ఇది రోమను గ్రీసు శకానికి నాంది పలికింది. క్రమంగా మసిడోనియా రోమను ప్రావిన్సు స్థాపనకు దారితీసింది.
సంస్థలు
[మార్చు]అధికార విభజన
[మార్చు]
మాసిడోనియా ప్రభుత్వానికి అధిపతిగా రాజు (బాసిలసు) ఉండేవాడు. [note 14]కనీసం 2వ ఫిలిపు పాలన నుండి, రాజుకు రాజ సేవకులు (బాసిలికోయి పైడెసు), అంగరక్షకులు (సోమాటోఫైలాక్సు), సహచరులు (హెటైరోయి), స్నేహితులు (ఫిలోయి), సైనిక సభ్యులతో కూడిన ఒక సభ, (హెలెనిస్టికు కాలంలో) న్యాయాధికారిలు సహాయం చేసేవారు. [note 15]ఈ సమూహాలలో ప్రతి ఒక్కటి రాజుతో ఏ మేరకు అధికారాన్ని పంచుకున్నాయి. లేదా వాటి ఉనికికి అధికారిక రాజ్యాంగ చట్రంలో ఆధారం ఉందా అనే దాని గురించి సాక్ష్యాలు లేవు.[162]మాసిడోనియను రాచరికం నిరంకుశత్వం గురించిన వాదన కోసం,[note 16]చూడండి.
అయితే ఎన్. జి. ఎల్. హమ్మండు, ఎఫ్. డబ్ల్యూ. వాలుబ్యాంకు స్పష్టమైన నిశ్చయంతో నమ్మకంతో వ్రాస్తూ, మాసిడోనియను రాజ్యాంగ ప్రభుత్వం రాజును పరిమితం చేసి, సైన్యం, ప్రజా సభను కలిగి ఉండేదని వర్ణించారు.[1]2వ ఫిలిపు పాలనకు ముందు గ్రంథ ఆధారాల ద్వారా మద్దతు ఉన్న ఏకైక సంస్థ రాచరికం మాత్రమే.[2] [note 17]
రాజరికం - రాజసభ
[మార్చు]ప్రాచీన మాసిడోనియా తొలిగా తెలిసిన ప్రభుత్వం దాని రాజరికం ఇది క్రీ.పూ. 167 వరకు కొనసాగింది. ఆ తర్వాత రోమన్లు దీనిని రద్దు చేశారు.[163] మాసిడోనియను వంశపారంపర్య రాజరికం కనీసం ఆర్కైకు గ్రీసు కాలం నుండి ఉనికిలో ఉంది. దీనికి మైసీనియను గ్రీసులో హోమెరికు ఉన్నత వర్గాల మూలాలు ఉన్నాయి.[164] థుసిడిడెసు ఇలా వ్రాశాడు. పూర్వ కాలంలో మాసిడోనియా చిన్న చిన్న గిరిజన ప్రాంతాలుగా విభజించబడి ఉండేది. ప్రతిదానికి దాని స్వంత చిన్న రాజు ఉండేవాడు. దిగువ మాసిడోనియాలోని తెగలు చివరికి ఒక గొప్ప రాజు క్రింద ఏకమయ్యాయి. ఆయన ఎగువ మాసిడోనియా లోని చిన్న రాజుల మీద అధిపతిగా అధికారాన్ని చెలాయించాడు.[165] క్రీ.పూ. 396లో మాసిడోను ఒరెస్టిసు హత్య తర్వాత తండ్రి నుండి కొడుకుకు ప్రత్యక్ష వారసత్వ పరంపర తెగిపోయింది (ఆరోపణ ప్రకారం, రాజ్య ప్రతినిధి వారసుడు మాసిడోను 2వ ఏరోపసు చేత). ఇది జ్యేష్ఠ పుత్ర వారసత్వం స్థిరపడిన ఆచారమా లేదా సైన్యం సభకు లేదా ప్రజలకు మరొక రాజును ఎన్నుకోవడానికి రాజ్యాంగ హక్కు ఉందా అనే విషయాన్ని అస్పష్టంగా మార్చింది.[166] మాసిడోను 2వ పెర్డిక్కాసు, ఒక బానిస స్త్రీ కుమారుడైన మాసిడోను 1వ ఆర్కెలాయసు సింహాసనాన్ని అధిష్టించిన దృష్ట్యా, మాసిడోనియను రాణుల లేదా భార్యల మగ సంతానానికి ఇతరుల కంటే ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వబడిందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. అయినప్పటికీ ఆర్కెలాయసు తన తండ్రి నియమించిన స్పష్టమైన వారసుడుని హత్య చేసిన తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు.[167]

2వ ఫిలిపుకు ముందున్న మాసిడోనియను రాజులు విదేశీ దౌత్యవేత్తలకు ఆతిథ్యం ఇవ్వడం, రాజ్య విదేశాంగ విధానాలను నిర్ణయించడం, విదేశీ శక్తులతో పొత్తులను చర్చించడం వంటి అధికారాలను నిలబెట్టుకున్నారని, బాధ్యతలను నిర్వర్తించారని తెలిసింది.[168] క్రీ.పూ. 480లో సలామిసు యుద్ధంలో గ్రీకుల విజయం తర్వాత పర్షియను సేనాధిపతి మార్డోనియసు, అకెమెనిడు సామ్రాజ్యానికి, ఏథెన్సుకు మధ్య పొత్తును కుదర్చడానికి మాసిడోనియాకు చెందిన మొదటి అలెగ్జాండరును ప్రధాన దూతగా ఏథెన్సుకు పంపించాడు. అలెగ్జాండరును పంపాలనే నిర్ణయం ఒక ఉన్నత పర్షియను కుటుంబంతో ఆయన వివాహ సంబంధం, ఏథెన్సు నగర-రాజ్యంతో ఆయనకు గతంలో ఉన్న అధికారిక సంబంధం మీద ఆధారపడి ఉంది.[168] బంగారం, వెండి, కలప, రాజ భూములతో సహా సహజ వనరుల మీద యాజమాన్యం ఉండటంతో తొలి మాసిడోనియను రాజులు విదేశీ, దేశీయ వర్గాలకు ఆకట్టుకునే బహుమతులతో లంచం ఇవ్వగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండేవారు.[169]
ప్రాచీన మాసిడోనియా న్యాయవ్యవస్థ గురించి చాలా తక్కువగా తెలుసు కేవలం రాజు రాజ్యానికి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించాడనే విషయం తప్ప.[170] మాసిడోనియను రాజులు సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షులుగా కూడా ఉండేవారు.[note 18] 2వ ఫిలిపు కూడా దేశానికి ప్రధాన పూజారిగా సేవ చేస్తూ, తన భక్తి కార్యాలకు ఎంతో గౌరవించబడ్డాడు. ఆయన ప్రతిరోజూ ఆచారబద్ధమైన బలులు ఇచ్చేవాడు, మతపరమైన ఉత్సవాలకు నాయకత్వం వహించేవాడు.[171] అలెగ్జాండరు తన తండ్రి పాలనలోని వివిధ అంశాలను అనుకరించాడు. ఉదాహరణకు విధేయులైన ఉన్నత వర్గ అనుచరులకు భూములు, బహుమతులు ఇవ్వడం వంటివి,[171] కానీ మాసిడోనియను రాజులకు వారి సహచరులతో ఉన్న సాంప్రదాయ సంబంధమైన "సహయోధుడు" వలె కాకుండా, తూర్పు దేశపు, పర్షియను చక్రవర్తి కొన్ని ఆడంబరాలను అంటే "ప్రభువు, యజమాని" అనే పద్ధతిని స్వీకరించడం వల్ల వారిలో కొంత కీలక మద్దతును కోల్పోయాడు. అని కరోలూ జె. కింగు సూచిస్తున్నారు.[172] అలెగ్జాండరు తండ్రి, 2వ ఫిలిపు, ఒక రాజ కార్యదర్శి, రాజ గ్రంథాలయం, రాజ సేవకులు, ఒక సింహాసనం వంటి అకెమెనిడు రాజ్యంలో కనిపించే సంస్థల మాదిరిగానే కొన్నింటిని స్వీకరించినప్పుడు, బహుశా పర్షియను సంప్రదాయాలచే ప్రభావితమై ఉండవచ్చు.[173]
రాజ సేవకులు
[మార్చు]రాజ సేవకులు అనేవారు ఉన్నత కుటుంబాల నుండి నిర్బంధంగా నియమించబడిన కౌమారదశలో ఉన్న బాలురు, యువకులు. వీరు బహుశా 2వ ఫిలిపు పాలన నుండి మాసిడోనియా రాజులకు సేవ చేశారు. అయినప్పటికీ దీనికి మరింత పటిష్టమైన ఆధారాలు అలెగ్జాండరు ది గ్రేటు పాలన కాలం నాటివి. [note 19]రాజ సేవకులు ఉన్నత రాజకీయాలలో ప్రత్యక్ష పాత్ర పోషించలేదు. వారిని రాజకీయ జీవితానికి పరిచయం చేసే సాధనంగా నియమించుకున్నారు. [174]శిక్షణ, సేవ ఒక కాలం తర్వాత ఆ సేవకులు రాజు సహచరులు, వ్యక్తిగత పరివారంలో సభ్యులుగా మారతారని ఆశించారు. [175] వారి శిక్షణ సమయంలో ఆ సేవకులు రాజు నిద్రిస్తున్నప్పుడు ఆయనకు కాపలా కాయడం, ఆయనకు గుర్రాలను అందించడం, ఆయన గుర్రం ఎక్కడానికి సహాయం చేయడం, రాజ వేటలలో ఆయనతో పాటు వెళ్లడం, 'సింపోజియా' (అంటే అధికారిక పానీయ విందులు) సమయంలో ఆయనకు సేవ చేయడం వంటివి చేయాల్సి ఉండేది. [176] ఆంటిగోనిడు కాలంలో రాజ సేవకుల గురించి తక్కువ ఆధారాలు ఉన్నప్పటికీ క్రీ.పూ. 168లో రోమన్ల చేతిలో ఓటమి తర్వాత వారిలో కొందరు మాసిడోను రాజు పెర్సియసుతో పాటు సమోత్రేసుకు పారిపోయారని తెలిసింది.[177]
అంగరక్షకులు
[మార్చు]రాజ అంగరక్షకులు ఆస్థానంలో, యుద్ధభూమిలో రాజుకు అత్యంత సన్నిహిత సభ్యులుగా ఉండేవారు.[174] వారు రెండు వర్గాలుగా విభజించబడ్డారు: వందల సంఖ్యలో ఉండే ఒక రకమైన ప్రాచీన ప్రత్యేక దళాలు అయిన హైపాస్పిస్టై అగెమా, వారి వ్యక్తిగత యోగ్యతల కోసం లేదా వారికి చెందిన ఉన్నత కుటుంబాలను గౌరవించడం కోసం రాజుచే ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన చిన్న సమూహం.[174] అందువలన సంఖ్యలో పరిమితంగా ఉండి, రాజు అంతరంగిక వర్గాన్ని ఏర్పరిచే ఈ అంగరక్షకులు, యుద్ధభూమిలో, వెలుపల రాజు ప్రాణాలను రక్షించడానికి ఎల్లప్పుడూ బాధ్యత వహించేవారు కాదు; వారి బిరుదు. పదవి ఒక విశిష్టతకు చిహ్నంగా ఉండేది. బహుశా ఉన్నత కుటుంబాల మధ్య వైరుధ్యాలను అణచివేయడానికి దీనిని ఉపయోగించేవారు.[174]
సహచరులు, స్నేహితులు, మండళ్లు - సభలు
[మార్చు]ఉన్నత సహచర అశ్వికదళం పెజెటైరోయి పదాతిదళంతో సహా సహచరులు, రాజు అంగరక్షకుల కంటే గణనీయంగా పెద్ద సమూహంగా ఉండేవారు.[note 20] అత్యంత విశ్వసనీయమైన లేదా అత్యున్నత హోదాలో ఉన్న సహచరులు ఒక మండలిగా ఏర్పడి, రాజుకు సలహా మండలిగా పనిచేశారు.[178] యుద్ధ సమయాలలో సైనిక సభ, శాంతి సమయాలలో ప్రజా సభ ఉనికిలో ఉన్నట్లు స్వల్ప ఆధారాలు సూచిస్తున్నాయి.[note 21]
మండలి సభ్యులకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉండేది. వారు రాజ్య వ్యవహారాల మీద ఓటు వేశారనడానికి ప్రత్యక్ష ఆధారాలు లేనప్పటికీ రాజు కనీసం అప్పుడప్పుడు వారి డిమాండ్లకు అంగీకరించడానికి ఒత్తిడికి గురయ్యాడని స్పష్టమవుతోంది.[179] దేశద్రోహం కేసులను విచారించి వారికి శిక్షలు విధించే హక్కు సభకు ఇవ్వబడినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు అలెగ్జాండరు ది గ్రేటు తన తండ్రి హత్య కుట్రలో ముగ్గురు నిందితుల విచారణ, శిక్షలో ప్రాసిక్యూటరుగా వ్యవహరించినప్పుడు (అయితే చాలా మంది నిర్దోషులుగా విడుదలయ్యారు).[180] అయితే, మండలులు, సభలు క్రమం తప్పకుండా నిర్వహించబడ్డాయని లేదా రాజ్యాంగబద్ధంగా స్థాపించబడ్డాయని లేదా వాటి నిర్ణయాలను రాజు ఎల్లప్పుడూ పాటించాడని నిర్ధారించడానికి బహుశా తగినంత ఆధారాలు లేవు.[181] అలెగ్జాండరు ది గ్రేటు మరణానంతరం, ఆయన సహచరులు ఆయన సామ్రాజ్యం మీద నియంత్రణ సాధించడానికి తక్షణమే ఒక మండలిని ఏర్పాటు చేశారు. కానీ దాని సభ్యుల మధ్య బహిరంగ పోటీ, సంఘర్షణల కారణంగా అది త్వరలోనే అస్థిరపడింది. సైన్యం కూడా రాజకీయ లక్ష్యాలను సాధించడానికి తిరుగుబాటును ఒక సాధనంగా ఉపయోగించుకుంది.
న్యాయాధికారులు, కామన్వెల్తు, స్థానిక ప్రభుత్వం - మిత్రరాజ్యాలు
[మార్చు]యాంటిగోనిడు మాసిడోనియను రాజులు రాజ్య వ్యవహారాలను నిర్వహించడానికి వివిధ ప్రాంతీయ అధికారుల మీద ఆధారపడ్డారు.[182] ఇందులో సైనిక 'స్ట్రాటెగోసు' 'పొలిటార్కు' వంటి ఉన్నత స్థాయి మునిసిపలు అధికారులు, అంటే ఒక పెద్ద నగరం ('పోలిసు') ఎన్నికైన గవర్నరు ('ఆర్కాను'), అలాగే 'ఎపిస్టేట్సు' అనే రాజకీయ-మతపరమైన పదవి కూడా ఉన్నాయి. [note 22]ఈ అధికారుల వ్యక్తిగత నేపథ్యాల గురించి ఎటువంటి ఆధారాలు లేవు అయినప్పటికీ సైనిక అధికారుల ఖాళీలను భర్తీ చేసిన అదే ఉన్నత వర్గానికి చెందిన 'ఫిలోయి' , 'హెటైరోయి' సమూహం నుండి వారు ఎంపిక చేయబడి ఉండవచ్చు.[170]
ప్రాచీన ఏథెన్సులో క్రీ.పూ. 322లో ఆంటిపేటరు నగరాన్ని మొదట జయించిన తర్వాత ఏథెనియను ప్రజాస్వామ్యం మూడు వేర్వేరు సందర్భాలలో పునరుద్ధరించబడింది.[183] అది మాసిడోనియను పాలనలోకి పదేపదే వచ్చినప్పుడు నగర-రాజ్యంలో అత్యంత ధనవంతులైన సభ్యులతో కూడిన మాసిడోనియన్లు విధించిన ఒక అల్పజన పాలన ద్వారా అది పరిపాలించబడింది. [note 23]మాసిడోనియాను, ఆ తర్వాత గ్రీకు ప్రధాన భూభాగాన్ని జయించే వరకు మాసిడోనియను రాజులు ఏథెన్సును పాలించారు. ఇతర నగర-రాజ్యాలను చాలా భిన్నంగా చూశారు. వాటికి అధిక స్థాయిలో స్వయంప్రతిపత్తిని అనుమతించారు. క్రీ.పూ. 357లో 2వ ఫిలిపు ఆంఫిపోలిసును జయించిన తర్వాత ఆ నగరానికి దాని రాజ్యాంగం, ప్రజాసభ, నగర మండలి (బౌలే), కొత్త అధికారుల కోసం వార్షిక ఎన్నికలతో సహా దాని ప్రజాస్వామ్యాన్ని నిలుపుకోవడానికి అనుమతించారు. కానీ నగరం రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నగర గోడల లోపల ఒక మాసిడోనియను సైనిక దళాన్ని, ఒక మాసిడోనియను రాజ ప్రతినిధిని (ఎపిస్టేట్సు) ఉంచారు. [184] 2వ ఫిలిపు స్థాపించిన ఫిలిప్పి నగరం, మాసిడోనియను కామన్వెల్తులో ప్రజాసభలతో కూడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కలిగి ఉన్న ఏకైక నగరం, ఎందుకంటే థెస్సలోనికి సభ (ఎక్లేసియా) ఆచరణలో కేవలం నిష్క్రియ పాత్రను మాత్రమే పోషించినట్లు కనిపిస్తుంది. [185] కొన్ని నగరాలు తమ సొంత మునిసిపలు ఆదాయాలను కూడా నిర్వహించుకున్నాయి. మాసిడోనియను రాజు, కేంద్ర ప్రభుత్వం దేవాలయాలు పౌరోహిత్యాల ద్వారా వచ్చే ఆదాయాలను నిర్వహించేవారు. [186]
మాసిడోనియను కామన్వెల్తులో క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందిన కొన్ని ఆధారాలు విదేశీ సంబంధాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించేదని సూచిస్తున్నాయి. వ్యక్తిగత మాసిడోనియను నగరాలు నామమాత్రంగా స్వతంత్ర సంస్థలుగా పాన్హెలెనికు కార్యక్రమాలలో పాల్గొన్నప్పటికీ వాస్తవానికి, కొన్ని నగరాలకు 'అసైలియా' (అభేద్యత, దౌత్యపరమైన రోగనిరోధక శక్తి, పుణ్యక్షేత్రాలలో ఆశ్రయం పొందే హక్కు) మంజూరు చేయడం రాజుచే నేరుగా నిర్వహించబడింది.[187] అదేవిధంగా సమకాలీన గ్రీకు 'కోయినా' (అంటే, నగర-రాజ్యాల సమాఖ్యలు, 'సింపోలిటీయా')లోని నగర-రాజ్యాలు తమ కూటమి సభ్యులచే సమిష్టిగా ఓటు వేయబడిన సమాఖ్య శాసనాలకు కట్టుబడి ఉండేవి. [note 24] ఒక కూటమి లేదా కామన్వెల్తుకు చెందిన నగర-రాజ్యాలలో, ప్రాక్సేనియా (అంటే విదేశీ రాయబారులకు ఆతిథ్యం ఇవ్వడం) మంజూరు చేయడం అనేది సాధారణంగా స్థానిక, కేంద్ర అధికారులచే పంచుకోబడిన హక్కు.[188] పొరుగున ఉన్న ఎపిరోటు లీగు ప్రాక్సేనియా మంజూరు చేయడం కేవలం కేంద్ర అధికారుల ప్రత్యేక హక్కుగా ఉన్నట్లు పుష్కలమైన ఆధారాలు ఉన్నాయి. మాసిడోనియను కామన్వెల్తులో కూడా అదే విధమైన ఏర్పాటు ఉన్నట్లు కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి.[189] మాసిడోనియాతో మిత్రపక్షంగా ఉన్న నగర-రాజ్యాలు ప్రాక్సేనియాకు సంబంధించి తమ సొంత శాసనాలను జారీ చేశాయి.[190] విదేశీ కూటములు కూడా మాసిడోనియను రాజులతో పొత్తులు ఏర్పరచుకున్నాయి. ఉదాహరణకు క్రేటను లీగు 2వ డెమెట్రియసు ఎటోలికసు. 3వ యాంటిగోనసు, డోసనులతో ఒప్పందాలు కుదుర్చుకుని మాసిడోనియను సైన్యంలోకి క్రేటను కిరాయి సైనికులను చేర్చుకోవడాన్ని నిర్ధారించింది, 5వ ఫిలిపు ఆఫ్ మాసిడోనును ఆ కూటమికి గౌరవ సంరక్షకుడిగా (ప్రోస్టేట్సు) ఎన్నుకుంది.[191]
సైన్యం
[మార్చు]తొలి మాసిడోనియను సైన్యం
[మార్చు]ప్రాచీన మాసిడోనియను సైన్యం ప్రాథమిక నిర్మాణం సహచర అశ్వికదళం (హెటైరోయి), పదాతి సహచరులు (పెజెటైరోయి) అనే విభాగాల మీద ఆధారపడి ఉండేది. వీరికి వివిధ మిత్రరాజ్యాల సైనికులు, విదేశీ నియమిత సైనికులు, కిరాయి సైనికులు తోడయ్యేవారు.[192] పదాతి సహచరులు బహుశా మాసిడోను రాజు మొదటి అలెగ్జాండరు పాలన నుండి ఉనికిలో ఉన్నారు.[193] కండరాల కవచాలు ధరించిన మాసిడోనియను అశ్వికదళం, పెలోపొన్నేసియను యుద్ధంలో పాల్గొన్నప్పుడు. ఆ తర్వాత గ్రీసులో ప్రసిద్ధి చెందింది. ఆ సమయంలో వారు కొన్నిసార్లు ఏథెన్సు లేదా స్పార్టా పక్షాన నిలిచారు.[194] ఈ కాలంలో మాసిడోనియను పదాతిదళం సరిగా శిక్షణ లేని గొర్రెల కాపరులు, రైతులను కలిగి ఉండేది. అయితే అశ్వికదళం ఉన్నత వంశీయులతో కూడి ఉండేది.[195] క్రీ.పూ. 4వ శతాబ్దం ప్రారంభ నాటి కళాఖండాల ద్వారా రుజువైనట్లుగా, 2వ ఫిలిపు కాలానికి ముందు మాసిడోనియను సైన్యం మీద స్పార్టా ప్రభావం స్పష్టంగా ఉండేది.[196] నికోలసు విక్టరు సెకుండా అభిప్రాయం ప్రకారం క్రీ.పూ. 359లో 3అ ఫిలిపు పాలన ప్రారంభంలో, మాసిడోనియను సైన్యంలో 10,000 పదాతిదళం, 600 అశ్వికదళం ఉండేవి.[197] అయితే ప్రాచీన రచయితలు ఉదహరించిన ఈ సంఖ్యలను కొంత సందేహంతో పరిగణించాలని మాల్కం ఎర్రింగ్టను హెచ్చరించారు.[198]
2వ ఫిలిపు - అలెగ్జాండరు ది గ్రేటు
[మార్చు]థీబ్సులో సంవత్సరాల తరబడి రాజకీయ బందీగా గడిపిన తర్వాత, 2వ ఫిలిపు గ్రీకుల సైనిక శిక్షణ, పౌర సైనికులకు ప్రామాణిక పరికరాలను అందించే పద్ధతిని అనుకరించడానికి ప్రయత్నించాడు. మాసిడోనియను సైన్యాన్ని వృత్తిరహిత రైతుల బలవంతపు సైన్యం నుండి సుశిక్షితమైన, వృత్తిపరమైన సైన్యంగా మార్చడంలో విజయం సాధించాడు.[199] 2వ ఫిలిపు తన శత్రువులైన సైనిక వ్యూహాలులో కొన్నింటిని స్వీకరించాడు. ఉదాహరణకు సిథియన్లుల, ఎంబోలాను (ఎగిరే చీలిక) అశ్వికదళ నిర్మాణం.[200] ఆయన పదాతిదళం మునుపటి ఆస్పిసు తరహా డాలుల స్థానంలో పెల్టాయి డాలులను ఉపయోగించింది. రక్షణ హెల్మెట్లు, గ్రీవులు, క్యూరాసులతో సన్నద్ధమయ్యారు. వక్షకవచాలు లేదా 'కొత్తిబోసు' ఉదర పట్టీలను ధరించి, 'సరిస్సా' బల్లెములు ద్వితీయ ఆయుధాలుగా కఠారులతో సాయుధులై ఉండేవారు.[note 25] 'పెజెటైరోయి' శ్రేణుల నుండి ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన పురుషులతో కూడిన ఉన్నత 'హైపాస్పిస్టాయి' పదాతిదళం 2వ ఫిలిపు పాలనలో ఏర్పడింది. అలెగ్జాండరు ది గ్రేటు పాలనలో కూడా నిరంతరాయంగా ఉపయోగంలో ఉంది.[201] రాజ అంగరక్షకుల ('సోమాటోఫైలాక్సు') స్థాపనకు కూడా 2వ ఫిలిపు బాధ్యత వహించాడు.[202]
తన తేలికపాటి క్షిపణి దళాల కోసం 2వ ఫిలిపు కిరాయి క్రీటను విలుకాళ్లుతో పాటు థ్రేసియను, పేయోనియను, ఇల్లీరియను ఈటె విసిరేవారిని, వడిసెల వాడేవారిని, విలుకాళ్లను నియమించుకున్నాడు.[203] ఆయన థెస్సలీకి చెందిన పాలిడసు పెల్లాకు చెందిన డయాడెసు వంటి ఇంజనీర్లను నియమించుకున్నాడు. వీరు అత్యాధునిక ముట్టడి యంత్రాలు పెద్ద బాణాలను ప్రయోగించే ఫిరంగిలను నిర్మించగలరు.[200] క్రినైడ్సు (తరువాత ఫిలిప్పిగా పేరు మార్చబడింది) వద్ద ఉన్న లాభదాయకమైన గనులను స్వాధీనం చేసుకున్న తర్వాత రాజ ఖజానా ఒక శాశ్వత, వృత్తిపరమైన స్థాయీ సైన్యంను పోషించగలిగింది.[204] 2వ ఫిలిపు పాలనలో రాష్ట్ర ఆదాయాలు పెరగడం వల్ల మాసిడోనియన్లు మొదటిసారిగా ఒక చిన్న నావికాదళాన్ని నిర్మించగలిగారు. ఇందులో ట్రైరీంలు కూడా ఉన్నాయి.[205]
అలెగ్జాండరు కాలంలో ఉన్నట్లుగా ధృవీకరించబడిన ఏకైక మాసిడోనియను అశ్విక దళం సహచర అశ్విక దళం మాత్రమే,[202] అయినప్పటికీ ఆయన ఆసియాలో సైనిక దండయాత్ర చేస్తున్నప్పుడు, పూర్తిగా జాతి పర్షియన్లతో కూడిన సహచర అశ్విక దళం ఒక 'హిప్పార్కియా' (అంటే కొన్ని వందల మంది అశ్వికదళ సైనికుల యూనిటు)ను ఏర్పాటు చేశాడు.[206] తన బలగాలను ఆసియాలోకి నడిపించినప్పుడు అలెగ్జాండరు మాసిడోనియా నుండి 1,800 అశ్వికదళ సైనికులను, థెస్సాలీ నుండి 1,800 అశ్వికదళ సైనికులను, గ్రీసులోని ఇతర ప్రాంతాల నుండి 600 అశ్వికదళ సైనికులను, థ్రేసు నుండి 900 'ప్రోడ్రోమోయి' అశ్వికదళ సైనికులను తీసుకువచ్చాడు.[207] క్రీ.పూ. 323లో లామియను యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఆంటిపేటరు స్థానిక మాసిడోనియను అశ్వికదళానికి చెందిన 600 మంది సైనికులతో కూడిన ఒక బలగాన్ని త్వరగా సమీకరించగలిగాడు.[207] అలెగ్జాండరు 'హైపాస్పిస్టాయ్'లో అత్యంత ఉన్నత శ్రేణి సభ్యులను 'అగేమా'గా నియమించారు. క్రీ.పూ. 331లో గౌగమెలా యుద్ధం తర్వాత 'హైపాస్పిస్టాయ్' కోసం ఒక కొత్త పదం ఉద్భవించింది: 'అర్గిరాస్పిడెసు' (వెండి డాలులు).[208] తరువాతి వారు అలెగ్జాండరు ది గ్రేటు పాలన తర్వాత కూడా సేవలను కొనసాగించారు. వారు ఆసియా మూలానికి చెందినవారై ఉండవచ్చు.[note 26] మొత్తంగా ఆయన ఈటెలు పట్టుకున్న ఫాలాంక్సు పదాతిదళంలో సుమారు 12,000 మంది సైనికులు ఉన్నారు. వీరిలో 3,000 మంది ఉన్నత శ్రేణి హైపాస్పిస్టాయి. 9,000 మంది పెజెటైరోయి.[note 27] అలెగ్జాండరు క్రేటను విలుకాళ్ల వినియోగాన్ని కొనసాగించాడు. స్థానిక మాసిడోనియను విలుకాళ్లను సైన్యంలోకి ప్రవేశపెట్టాడు.[209] గౌగమెలా యుద్ధం తర్వాత, పశ్చిమ ఆసియా నేపథ్యానికి చెందిన విలుకాళ్లు సర్వసాధారణమయ్యారు.[209]
యాంటిగోనిడు కాలం నాటి సైన్యం
[మార్చు]
మాసిడోనియను సైన్యం యాంటిగోనిడు రాజవంశం పాలనలో అభివృద్ధి చెందుతూనే ఉంది. అలెగ్జాండరు ది గ్రేటు పాలన చివరిలో ఎనిమిది మంది ఉన్న 'సోమాటోఫైలాకెస్'గా ఎంతమందిని నియమించారనేది అనిశ్చితంగా ఉంది. అయితే 'హైపాస్పిస్టాయి' బహుశా 'సోమాటోఫైలాకెసు' సహాయకులుగా రూపాంతరం చెందినట్లు కనిపిస్తుంది. [note 28] అలెగ్జాండరు ది గ్రేటు రాజ సహచర అశ్విక దళంలో 800 మంది సైనికులు ఉండేవారు. ఇది క్రీ.పూ. 219 నాటి సామాజిక యుద్ధం సమయంలో 5వ ఫిలిపు నాయకత్వం వహించిన పవిత్ర దళం (లాటిన్: సాక్రా అలా; గ్రీకు: హియరా ఇలే)లోని అశ్విక దళం సంఖ్యకు సమానం. [210]కల్లినకస్ వద్ద సాధారణ మాసిడోనియను అశ్విక దళం సంఖ్య 3,000, ఇది పవిత్ర దళం, రాజ అశ్విక దళం నుండి వేరుగా ఉండేది.క్రీ.పూ. 4వ శతాబ్దపు మాసిడోనియను అశ్విక దళం డాలులు లేకుండా పోరాడినప్పటికీ, క్రీ.పూ. 270లలో గలాటియా, మధ్య అనటోలియాలో స్థిరపడిన సెల్టికు ఆక్రమణదారుల నుండి అశ్విక దళం డాలుల వాడకాన్ని స్వీకరించింది.[211]
క్రీ.పూ. 218, 181 నాటి ఆంఫిపోలిసు, గ్రీయా నుండి లభించిన సమకాలీన శాసనాలకు ధన్యవాదాలు. చరిత్రకారులు 5వ ఫిలిపు ఆధ్వర్యంలోని యాంటిగోనిడు సైన్యం సంస్థను పాక్షికంగా పునర్నిర్మించగలిగారు. [note 29] కనీసం ఆంటిగోనసు 3వ డోసను కాలం నుండి, ఆంటిగోనిడు కాలంలోని అత్యంత ఉన్నతమైన పదాతిదళం పెల్టాస్టులు. వీరు మెసిడోనియను ఫాలాంక్సు పైక్మెనుల కంటే తేలికైన, మరింత విన్యాసాలు చేయగల సైనికులు, వీరు 'పెల్టాయి' ఈటెలు, కత్తులు, చిన్న కాంస్య డాలును కలిగి ఉండేవారు. అయినప్పటికీ వారు కొన్నిసార్లు ఆ హోదాలో కూడా సేవలందించారు. [note 30] పెల్టాస్టులలో సుమారు 2,000 మంది పురుషులను ఉన్నతమైన 'అగెమా' ముందువరుస దళంలో సేవ చేయడానికి ఎంపిక చేశారు. మిగిలిన పెల్టాస్టుల సంఖ్య సుమారు 3,000.పెల్టాస్టుల సంఖ్య కాలక్రమేణా మారుతూ ఉండేది. బహుశా ఎప్పుడూ 5,000 మందికి మించి ఉండేది కాదు. [note 31] ప్రాచీన చరిత్రకారులు పేర్కొన్న ఉన్నత శ్రేణి మాసిడోనియను పెల్టాస్టుల అతిపెద్ద సంఖ్య 5,000 సైనికులు, ఈ సంఖ్య సామాజిక యుద్ధం (క్రీ.పూ. 220–217) సమయంలో ఉండేది. వారు ఫాలాంక్సు పైక్మెనులతో పాటు పోరాడారు. వీరు ఇప్పుడు 'చల్కాస్పిడెసు' (కంచు డాలు), 'ల్యూకాస్పిడెసు' (తెల్ల డాలు) రెజిమెంట్లుగా విభజించబడ్డారు. [212]
యాంటిగోనిడు మాసిడోనియను రాజులు నావికాదళాన్ని విస్తరించడం, సన్నద్ధం చేయడం కొనసాగించారు.[213] కాసాండరు పిడ్నాలో ఒక చిన్న నౌకాదళాన్ని నిర్వహించాడు. మాసిడోనియాకు చెందిన మొదటి డెమెట్రియసు పెల్లాలో ఒక నౌకాదళాన్ని కలిగి ఉన్నాడు. 2వ ఆంటిగోనసు. గొనాటాసు, గ్రీస్లో డెమెట్రియసుకు జనరలుగా పనిచేస్తున్నప్పుడు డెమెట్రియాసు, చాల్కిసి, పిరాయసు, కొరింథులలోని మాసిడోనియను ఆస్తులను సురక్షితం చేయడానికి నావికాదళాన్ని ఉపయోగించాడు.[214] ఇది క్రెమోనిడియను యుద్ధం (క్రీ.పూ. 267–261) సమయంలో నావికాదళం గణనీయంగా విస్తరించబడింది. ఇది క్రీ.పూ. 255 నాటి కోసు యుద్ధంలో, క్రీ.పూ. 245 నాటి ఆండ్రోసు యుద్ధంలో టోలెమికు ఈజిప్షియను నావికాదళాన్ని ఓడించడానికి మాసిడోనియను నావికాదళానికి వీలు కల్పించింది. సైక్లేడ్సు మీద మాసిడోనియను ప్రభావం వ్యాపించడానికి దోహదపడింది.[214] 3వ ఆంటిగోనసు డోసను కారియా మీద దండెత్తడానికి మాసిడోనియను నావికాదళాన్ని ఉపయోగించాడు. అయితే 5వ ఫిలిపు క్రీ.పూ. 201లో చియోసు యుద్ధంలో పోరాడటానికి 200 నౌకలను పంపాడు.[214] రోమను రిపబ్లికుతో జరిగిన రెండవ మాసిడోనియను యుద్ధాన్ని ముగించిన క్రీ.పూ. 197 శాంతి ఒప్పందంలో అంగీకరించినట్లుగా మాసిడోనియను నావికాదళం కేవలం ఆరు నౌకలకు తగ్గించబడింది. అయినప్పటికీ మాసిడోనియాకు చెందిన పెర్సియసు క్రీ.పూ. 171లో మూడవ మాసిడోనియను యుద్ధం ప్రారంభమైనప్పుడు త్వరగా కొన్ని లెంబాయీలను సమీకరించాడు.[214]
సమాజం - సంస్కృతి
[మార్చు]భాష - మాండలికాలు
[మార్చు]మాసిడోనియను పాలనకు చెందిన 2వ ఫిలిపు ఆస్థాన భాషగా స్వీకరించబడిన తరువాత పురాతన మాసిడోనియను రచయితలు తమ రచనలను చివరి క్లాసికలు, హెలెనిస్టికు గ్రీసు భాషా భాష అయిన కోయిను గ్రీకులో రాశారు. [note 32] అరుదైన పాఠ్య ఆధారాలు స్థానిక మాసిడోనియను భాష థెస్సాలియను గ్రీకు వాయువ్య గ్రీకులకు సమానమైన గ్రీకు మాండలికం అని సూచిస్తున్నాయి, [note 33] లేదా గ్రీకుకు దగ్గరి సంబంధం ఉన్న భాష.[note 34] పెల్లా శాప టాబ్లెటును పురాతన మాసిడోనియను వాయువ్య గ్రీకు రకం అని వాదనగా ముందుకు తెచ్చారు.[215][216] పురాతన మాసిడోనియా నుండి మిగిలి ఉన్న శాసనాలలో ఎక్కువ భాగం అట్టికు గ్రీకు, దాని వారసుడు కోయిను గ్రీకులో వ్రాయబడ్డాయి. [217] అట్టికు ( తరువాత కోయిను) గ్రీకు పురాతన మాసిడోనియను సైన్యం ప్రాధాన్యత గల భాష, అయినప్పటికీ అలెగ్జాండరు ది గ్రేటు ఒకప్పుడు మద్యపాన పార్టీలో తన రాజ గార్డులకు మాసిడోనియనులో అత్యవసర ఆదేశాన్ని అరిచాడని తెలిసింది. అక్కడ ఆయన క్లీటసు ది బ్లాకును చంపాడు. [218] హెలెనిస్టికు లేదా రోమను కాలంలో మాసిడోనియను అంతరించిపోయి పూర్తిగా కోయిను గ్రీకుతో భర్తీ చేయబడింది.[219][note 35]
మత విశ్వాసాలు - అంత్యక్రియల ఆచారాలు
[మార్చు]

క్రీ.పూ. 5వ శతాబ్దానికి వచ్చేసరికి, మాసిడోనియన్లు, దక్షిణ గ్రీకులు దాదాపుగా గ్రీకు దేవతా సముదాయంలోని అవే దేవతలను పూజించేవారు. [221]మాసిడోనియాలో రాజకీయ, మతపరమైన పదవులు తరచుగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉండేవి. ఉదాహరణకు, ఆంఫిపోలిసు నగరానికి అధిపతిగా ఉన్న వ్యక్తి, వైద్యానికి గ్రీకు దేవత అయిన అస్క్లెపియోసుకు పూజారిగా కూడా పనిచేశాడు; కాసాండ్రియాలో కూడా ఇలాంటిదే ఒక ఏర్పాటు ఉండేది. అక్కడ నగరాన్ని స్థాపించిన కాసాండరును గౌరవించే ఒక మత పూజారి నగరానికి నామమాత్రపు అధిపతిగా ఉండేవాడు.[222] జ్యూసు ప్రధాన పుణ్యక్షేత్రం డియోనులో నిర్వహించబడింది. అయితే వెరియాలోని మరొక పుణ్యక్షేత్రం హెరాకిల్సుకు అంకితం చేయబడింది. దీనిని 2వ డెమెట్రియసు ఎటోలికసు (క్రీ.పూ. 239-229) పోషించాడు.[223] ఇంతలో థెస్సలోనికిలోని సరపిసు ఆలయం వంటి ఈజిప్టు నుండి వచ్చిన విదేశీ మత ఆచారాలను రాజసభ ప్రోత్సహించింది.[224] మాసిడోనియన్లకు "అంతర్జాతీయ" మత ఆచారాలతో కూడా సంబంధాలు ఉండేవి; ఉదాహరణకు మాసిడోనియను రాజులు 3వ ఫిలిపు 4వ అలెగ్జాండరు, కాబీరి రహస్య ఆరాధన అంతర్జాతీయంగా గౌరవించబడిన సమోత్రేసు ఆలయ సముదాయానికి మొక్కుబడిగా కానుకలు సమర్పించారు.[224]
వెర్జీనాలోని మూడు రాజ సమాధులలో వృత్తిపరమైన చిత్రకారులు గోడలను హేడిసు పెర్సెఫోనును అపహరించుకుపోతున్న పౌరాణిక దృశ్యం, రాజ వేట దృశ్యాలతో అలంకరించారు. అదే సమయంలో ఆయుధాలు, కవచాలు, పానపాత్రలు, వ్యక్తిగత వస్తువులతో సహా విలాసవంతమైన సమాధి వస్తువులను మృతులతో పాటు ఉంచారు. వారి ఎముకలను బంగారు శవపేటికలలో ఖననం చేయడానికి ముందు దహనం చేశారు.[225] కొన్ని సమాధి వస్తువులు, అలంకరణలు ఇతర మాసిడోనియను సమాధులలో సాధారణంగా కనిపించేవి. అయినప్పటికీ వెర్జీనాలో కనుగొనబడిన కొన్ని వస్తువులు కిరీటం, విలాసవంతమైన వస్తువులు, ఆయుధాలు, కవచాలతో సహా, స్పష్టంగా రాజకుటుంబానికి సంబంధించినవిగా ఉన్నాయి. [226]1977–1978లో వారి అవశేషాలు కనుగొనబడినప్పటి నుండి పండితులు ఈ సమాధులలో ఖననం చేయబడిన వారి గుర్తింపు గురించి చర్చించుకుంటున్నారు.[227] ఇటీవలి పరిశోధనలు, ఫోరెన్సికు పరీక్షలు ఖననం చేయబడిన వ్యక్తులలో కనీసం ఒకరు 2వ ఫిలిపు అని నిర్ధారించాయి..[note 36] 2014లో పురాతన మాసిడోనియను కాస్టా సమాధి ఆంఫిపోలిసు వెలుపల కనుగొనబడింది. [228] ఇది గ్రీసులో కనుగొనబడిన అతిపెద్ద పురాతన సమాధి (2017 నాటికి).[229]
ఆర్థిక శాస్త్రం - సామాజిక వర్గం
[మార్చు]యువ మాసిడోనియను పురుషులు సాధారణంగా మేకలు గొర్రెల వంటి పశువులను మేపే వారి సంచార జీవనశైలి ఫలితంగా వేట, యుద్ధ పోరాటాలలో పాల్గొనవలసి ఉంటుంది. అయితే గుర్రాల పెంపకం, పశువుల పెంపకం ఇతర సాధారణ వృత్తులుగా ఉండేవి.[230] కొంతమంది మాసిడోనియన్లు వ్యవసాయం చేసేవారు. తరచుగా మాసిడోనియను రాజ్యం మద్దతు ఇచ్చే నీటిపారుదల, భూమి పునరుద్ధరణ, ఉద్యానవన కార్యకలాపాలతో కూడిన వ్యవసాయం చేసేవారు.[note 37] మాసిడోనియను ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ ఆర్థిక వనరులు ప్రధానంగా కలప కోత, రాగి, ఇనుము, బంగారం, వెండి వంటి విలువైన ఖనిజాల తవ్వకం ద్వారా సమకూరేవి.[231] ఈ ముడి పదార్థాలను తుది ఉత్పత్తులుగా మార్చడం, ఆ ఉత్పత్తుల అమ్మకం క్రీ.పూ. 5వ శతాబ్దంలో పట్టణ కేంద్రాల పెరుగుదలను, సాంప్రదాయ మాసిడోనియను గ్రామీణ జీవనశైలి నుండి క్రమంగా దూరం కావడాన్ని ప్రోత్సహించాయి. మాసిడోనియను రాజు ప్రభుత్వం, సమాజం రెండింటికీ అధిపతిగా ఒక నిరంకుశ వ్యక్తిగా ఉండేవాడు, రాజ్య వ్యవహారాలు, ప్రజా విధానాలను నిర్వహించడంలో ఆయనకు నిస్సందేహంగా అపరిమితమైన అధికారం ఉండేది. కానీ ఆయన తన 'హెటైరోయి'తో అంటే మాసిడోనియను ఉన్నత వర్గాల కేంద్రంతో సన్నిహిత సంబంధాలు లేదా అనుబంధాలు కలిగిన ఒక అత్యంత వ్యక్తిగత పాలన నాయకుడు కూడా. ఈ ఉన్నత వర్గాల వారు అధికారం, విశేషాధికారాల విషయంలో రాజు తర్వాత రెండవ స్థానంలో ఉండేవారు. ఆయన పరిపాలనలో ఉన్నత పదవులను భర్తీ చేస్తూ, సైన్యంలో కమాండింగు అధికారులుగా పనిచేసేవారు. అలెగ్జాండరు ది గ్రేటు సామ్రాజ్యం తర్వాత వచ్చిన హెలెనిస్టికు రాజ్యాల మరింత అధికారిక పాలనలలోనే, ముఖ్యంగా టోలెమికు ఈజిప్టులో, ఉన్నత వర్గాలలో చేరాలనుకునే సమాజ సభ్యులకు ఎక్కువ సామాజిక చలనశీలత కనిపించింది. ఒక రాజు, యుద్ధ ఉన్నత వర్గాలచే పరిపాలించబడినప్పటికీ సమకాలీన గ్రీకు రాజ్యాలలో కనిపించిన బానిసల విస్తృత వినియోగం మాసిడోనియాలో లేదనిపిస్తుంది.
దృశ్య కళలు
[మార్చు]క్రీ.పూ. 5వ శతాబ్దంలో 2వ ఆర్కిలాసు పాలన నాటికి ప్రాచీన మాసిడోనియను ఉన్నత వర్గం గ్రీసులోని ఇతర ప్రాంతాల నుండి ఆచారాలు, కళా సంప్రదాయాలను దిగుమతి చేసుకుంటుండేవారు. అదే సమయంలో వారు తమ సమాధులలో మరణించిన మాసిడోనియను ప్రభువుల చితాభస్మాన్ని ఉంచే అలంకార లోహపు క్రేటరుల వంటి వస్తువులతో విలక్షణంగా ఉండే బహుశా హోమరు కాలం నాటి, సింపోజియంకు సంబంధించిన మరింత పురాతన అంత్యక్రియల ఆచారాలను కూడా కొనసాగించారు.[232] వీటిలో ఒకటి థెస్సలోనికిలోని క్రీ.పూ. 4వ శతాబ్దపు సమాధి నుండి లభించిన పెద్ద కంచు డెర్వేని క్రేటరు, ఇది గ్రీకు దేవత డయోనిససు, ఆయన పరివారం దృశ్యాలతో అలంకరించబడింది. సైనిక వృత్తిని కలిగి ఉన్న ఒక ఉన్నత వర్గానికి చెందినది.[233] మాసిడోనియను లోహపు పని సాధారణంగా క్రీ.పూ. 6వ శతాబ్దం నుండి ఏథెనియను శైలి పాత్రల ఆకృతులను అనుసరించింది, మాసిడోనియను సమాధులలో లభించిన అనేక లోహ వస్తువులలో పానపాత్రలు, ఆభరణాలు, పాత్రలు, కిరీటాలు, కిరీటంలుమ్ నాణేలు ఉన్నాయి.[234]

మిగిలి ఉన్న మాసిడోనియను చిత్రకళాఖండాలలో ఫ్రెస్కోలు కుడ్యచిత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా విగ్రహాలు, ఉబ్బెత్తు శిల్పాలు వంటి శిల్పకళాఖండాల మీద అలంకరణలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు క్రీ.పూ. 4వ శతాబ్దం చివరి నాటి అలెగ్జాండరు సార్కోఫాగసులోని శిల్పాల మీద ఇప్పటికీ రంగుల ఆనవాళ్లు కనిపిస్తాయి.[236] మాసిడోనియను చిత్రలేఖనాలు చరిత్రకారులకు ప్రాచీన మాసిడోనియన్లు ధరించిన దుస్తుల ఫ్యాషన్లను అలాగే సైనిక పరికరాలను పరిశోధించడానికి వీలు కల్పించాయి.[237] లోహపు పని చిత్రలేఖనంతో పాటు, మొజాయికులు కూడా మాసిడోనియను కళారూపాలలో మరో ముఖ్యమైన రూపం.[234] పెల్లాలోని జింక వేట మొజాయికు, దాని త్రిమితీయ లక్షణాలు, భ్రమ కలిగించే శైలితో, చిత్రలేఖనం, విస్తృత హెలెనిస్టికు కళా ధోరణుల నుండి స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. అయినప్పటికీ వేట అనే గ్రామీణ ఇతివృత్తం మాసిడోనియన్ల అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడింది.[238] పెల్లాలోని ఇదే విధమైన సింహ వేట మొజాయికు, అలెగ్జాండరు ది గ్రేటు తన సహచరుడు క్రాటెరసుతో ఉన్న దృశ్యాన్ని లేదా కేవలం వేట అనే రాజ వినోదానికి సంబంధించిన ఒక సాంప్రదాయ చిత్రాన్ని వర్ణిస్తుంది.[238] పౌరాణిక ఇతివృత్తాలు కలిగిన మొజాయికులలో డయోనిససు చిరుతపులి మీద స్వారీ చేస్తున్న దృశ్యాలు, థేసియసు చేత ట్రోజను హెలెను అపహరణకు గురైన దృశ్యాలు ఉన్నాయి; వీటిలో రెండవది మాసిడోనియను చిత్రలేఖనాలకు సమానమైన భ్రమ కలిగించే లక్షణాలను, వాస్తవిక నీడలను ఉపయోగిస్తుంది.[238] మాసిడోనియను చిత్రలేఖనాలు, మొజాయికులలో సాధారణ ఇతివృత్తాలలో యుద్ధం, వేట, దూకుడు పురుష లైంగికత (అంటే అత్యాచారం లేదా వివాహం కోసం మహిళలను అపహరించడం) ఉన్నాయి; ఈ విషయాలు కొన్నిసార్లు ఒకే కళాఖండంలో మిళితం చేయబడతాయి. బహుశా ఒక అలంకారిక సంబంధాన్ని సూచిస్తాయి. [note 38]
థియేటరు, సంగీతం - ప్రదర్శన కళలు
[మార్చు]క్రీ.పూ. 336లో, తన కుమార్తె క్లియోపాత్రా వివాహ వేడుకల్లో భాగంగా జరుగుతున్న క్రీడలు, ప్రదర్శనల మధ్య, ఐగై లోని థియేటరులో 2వ ఫిలిపు హత్యకు గురయ్యాడు.[239] అలెగ్జాండరు ది గ్రేటు థియేటరు, సంగీతం రెండింటినీ గొప్పగా ఆరాధించేవాడని చెబుతారు.ఆయన ముఖ్యంగా క్లాసికలు ఏథీనియను దుఖాంత నాటక రచయిత లైన ఐస్కిలసు, సోఫోక్లిసు, యూరిపిడిసుల నాటకాలను ఎంతగానో ఇష్టపడేవాడు. వారి రచనలు, హోమరు ఇతిహాసాలతో పాటు గ్రీకు భాషా అధ్యయనంతో కలిపి ఆయన కొత్త తూర్పు రాజ్య ప్రజలకు సరైన గ్రీకు విద్యలో భాగంగా ఉండేవి.[240] ఆయన, ఆయన సైన్యం టైరు (ఆధునిక లెబనాన్లో)లో ఉన్నప్పుడు అలెగ్జాండరు తన సేనాధిపతులను అథ్లెటికు పోటీలకే కాకుండా గ్రీకు విషాద నాటకాల రంగస్థల ప్రదర్శనలకు కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించమని ఆదేశించాడు.[241] ఆ కాలపు ప్రసిద్ధ నటులైన థెస్సలసు, అథెనోడోరసు ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చారు. [note 39]
మాసిడోనియాలో సంగీతం కూడా ఆదరణ పొందింది. అగోరా, జిమ్నాసియం, థియేటరు, గ్రీకు దేవతలకు అంకితం చేయబడిన మతపరమైన పుణ్యక్షేత్రాలు దేవాలయాలతో పాటు, అలెగ్జాండరు ది గ్రేటు సామ్రాజ్యంలో ఒక నిజమైన గ్రీకు నగరానికి ప్రధాన గుర్తింపులలో ఒకటి, సంగీత ప్రదర్శనల కోసం ఒక ఓడియను ఉండటం.[242] ఇది ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు మాత్రమే కాకుండా, ఇప్పుడు ఆధునిక ఆఫ్ఘనిస్తానులో ఉన్న ఐ-ఖానౌం వంటి సుదూర నగరాలకు కూడా వర్తిస్తుంది.[242]
సాహిత్యం, విద్య, తత్వశాస్త్రం - పోషణ
[మార్చు]
మాసిడోనియాకు చెందిన 2వ పెర్డిక్కాసు తన రాజసభలో ప్రసిద్ధ శాస్త్రీయ గ్రీకు మేధావి సందర్శకులను ఆతిథ్యం ఇవ్వగలిగాడు. వారిలో గేయ కవి మెలనిప్పైడ్సు, ప్రఖ్యాత వైద్యుడు హిప్పోక్రేట్సు ఉన్నారు. మాసిడోనియాకు చెందిన 1వ అలెగ్జాండరు కోసం పిండారు రాసిన 'ఎన్కోమియను' బహుశా ఆయన ఆస్థానంలోనే స్వరపరచబడి ఉండవచ్చు.[243] అర్ఖెలస్ I తన పూర్వీకుల కంటే చాలా ఎక్కువ మంది గ్రీకు పండితులు, కళాకారులు మరియు ప్రముఖులను తన ఆస్థానంలోకి ఆహ్వానించాడు. [244] అతని గౌరవ అతిథులలో చిత్రకారుడు జ్యూక్సిస్, వాస్తుశిల్పి కాలిమాకస్, కవులు చోరిలస్ ఆఫ్ సామోస్, తిమోతియస్ ఆఫ్ మిలెటస్ మరియు అగాథాన్, అలాగే ప్రసిద్ధ ఏథెనియన్ నాటక రచయిత యూరిపిడిస్ ఉన్నారు. 1వ అర్ఖెలసును తత్వవేత్త ప్లేటో విమర్శించినప్పటికీ, సోక్రటీస్ అతన్ని ద్వేషించాడని చెప్పబడినప్పటికీ, మరియు బార్బేరియన్ అనే బిరుదు పొందిన మొదటి మాసిడోనియన్ రాజు అయినప్పటికీ, చరిత్రకారుడు థుసిడిడెస్ ఈ మాసిడోనియన్ రాజును గొప్పగా ప్రశంసించాడు, ముఖ్యంగా పాన్హెలెనిక్ క్రీడలలో అతని భాగస్వామ్యం మరియు సాహిత్య సంస్కృతిని ప్రోత్సహించినందుకు. [note 40] ఏథెన్సులోని ప్లేటోనికు అకాడమీలో చదువుకుని, అరిస్టాటిల్ తత్వశాస్త్ర పాఠశాలను స్థాపించిన తత్వవేత్త అరిస్టాటిల్ మాసిడోనియాకు వెళ్ళాడు, మరియు యువ అలెగ్జాండరు ది గ్రేటుకు బోధించాడని అలాగే 2వ ఫిలిపుకు గౌరవనీయమైన దౌత్యవేత్తగా కూడా పనిచేశాడని చెబుతారు.[245] అలెగ్జాండరు పరివారంలోని కళాకారులు, రచయితలు, తత్వవేత్తలలో తాత్విక సంశయవాదం పాఠశాల అయిన పైరోనిజం వ్యవస్థాపకుడు ఎలిసుకు చెందిన పైర్హో కూడా ఉన్నాడు.ఆంటిగోనిడు కాలంలో ఆంటిగోనోసు గోనాటాసు తత్వశాస్త్రంలోని ఎరెట్రియను పాఠశాల వ్యవస్థాపకుడైన ఎరెట్రియాకు చెందిన మెనెడెమోసు, స్టోయిసిజం వ్యవస్థాపకుడైన జెనానుతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకున్నాడు.[246]
ప్రారంభ గ్రీకు చరిత్ర రచన, తర్వాతి రోమను చరిత్ర రచనల పరంగా ఫెలిక్సు జాకోబీ తన 'ఫ్రాగ్మెంటే డెర్ గ్రీఖిషెను హిస్టోరికర్'లో మాసిడోనియా గురించి రాసిన పదమూడు మంది ప్రాచీన చరిత్రకారులను గుర్తించారు. హెరోడోటసు, థుసిడిడెసు రచనలలోని వృత్తాంతాలు కాకుండా, జాకోబీ సంకలనం చేసిన రచనలు కేవలం శకలాలుగా మాత్రమే ఉన్నాయి. [247] అయితే ఆంటిపేటరు రాసిన 3వ పెర్డిక్కాసు పోరాడిన ఇల్లీరియను యుద్ధ చరిత్ర వంటి ఇతర రచనలు పూర్తిగా నశించిపోయాయి. [248] మాసిడోనియను చరిత్రకారులు మార్సియాసు ఆఫ్ పెల్లా , మార్సియాసు ఆఫ్ ఫిలిప్పి మాసిడోనియా చరిత్రలను రాశారు టోలెమిక్ రాజు 1వ టోలెమీ సోటరు అలెగ్జాండరు గురించి ఒక చరిత్రను రచించారు. హియరోనిమసు ఆఫ్ కార్డియా అలెగ్జాండరు. రాజ వారసుల గురించి ఒక చరిత్రను రాశారు. మార్సియాసు ఆఫ్ పెల్లా గురించి మరిన్ని వివరాల కోసం, [note 41] అలెగ్జాండరు ది గ్రేటు భారతీయ దండయాత్ర తరువాత మాసిడోనియను సైనిక అధికారి నియాకసు, సింధు నది ముఖద్వారం నుండి పర్షియను గల్ఫు వరకు తాను చేసిన సముద్రయానం గురించి ఒక గ్రంథాన్ని రాశాడు.[249] మాసిడోనియను చరిత్రకారుడు క్రాటెరసు, అరిస్టాటిలు పాఠశాలలో చదువుతున్నప్పుడు, ఏథెనియను ప్రజాస్వామ్యం ప్రజాసభ చేసిన శాసనాల సంకలనాన్ని ప్రచురించాడు.[249] మాసిడోను రాజు 5వ ఫిలిపు థియోపొంపసు రాసిన 2వ ఫిలిపు చరిత్ర మాన్యుస్క్రిప్టులను తన ఆస్థాన పండితులచే సేకరించి మరిన్ని ప్రతులతో వాటిని వ్యాప్తి చేయించాడు.[246]
క్రీడలు - వినోదం
[మార్చు]
మాసిడోను రాజు 1వ అలెగ్జాండరు ప్రాచీన ఒలింపికు క్రీడలలోని పరుగు పందెంలో పోటీ పడటానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు. ఈవెంటు నిర్వాహకులు మొదట ఆయన అభ్యర్థనను తిరస్కరించారు. గ్రీకులకు మాత్రమే పోటీ పడటానికి అనుమతి ఉందని వివరించారు. అయితే 1వ అలెగ్జాండరు ప్రాచీన ఆర్గివు టెమెనిడు వంశానికి చెందిన ఆర్జియాడు రాజ వంశావళికి సంబంధించిన రుజువును సమర్పించాడు. ఈ చర్య చివరికి ఒలింపికు హెల్లానోడికై అధికారులను అతని గ్రీకు మూలాలు, పోటీపడే సామర్థ్యం గురించి ఒప్పించింది.[250] క్రీ.పూ. 5వ శతాబ్దం చివరి నాటికి మాసిడోనియను రాజు 1వ ఆర్కిలాసు రథాల పందెం పోటీలలో విజయం సాధించినందుకు ఒలింపియా మరియు డెల్ఫీ (పైథియను క్రీడలలో) రెండింటిలోనూ ఆలివు పూల కిరీటంతో సత్కరించబడ్డాడు.[251] 2వ ఫిలిపు తన కుమారుడు అలెగ్జాండరు ది గ్రేటు జన్మించిన అదే రోజున అంటే క్రీ.పూ. 356 జూలై 19 లేదా 20న తన గుర్రం ఒలింపిక్సులో (వ్యక్తిగత గుర్రపు పందెంలో లేదా రథాల పందెంలో) విజయం సాధించిందని విన్నట్లు చెబుతారు.[252] క్రీ.పూ. 4వ శతాబ్దం నాటికి రాజకుటుంబానికి చెందని మాసిడోనియన్లు కూడా వివిధ ఒలింపికు పోటీలలో పాల్గొని విజయం సాధించారు.[253] సాహిత్య పోటీలతో పాటు అలెగ్జాండరు ది గ్రేటు తన సామ్రాజ్యం అంతటా సంగీతం, అథ్లెటిక్సు కోసం పోటీలను నిర్వహించాడు.
భోజనం - వంటకాలు
[మార్చు]
ప్రాచీన మాసిడోనియాలో గ్రీకు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఎంతో ప్రశంసలు పొందిన కొన్ని ఉత్తమ ఆహార పదార్థాలు లేదా పానీయాలు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. వాటిలో స్ట్రైమోనియను గల్ఫు నుండి లభించే ఈల్ చేపలు, చాల్సిడిసులో ఉత్పత్తి చేయబడిన ప్రత్యేక వైన్ ఉన్నాయి.[255] మాంసం కోసం చపాతీని పళ్ళెంగా ఉపయోగించిన మొట్టమొదటి ఉదాహరణ క్రీ.పూ. 3వ శతాబ్దంలో మాసిడోనియాలో కనుగొనబడింది. ఇది బహుశా తర్వాతి కాలపు మధ్యయుగ ఐరోపా ట్రెంచరు బ్రెడును ప్రభావితం చేసి ఉండవచ్చు.[255] పశువులు, మేకలు తినేవారు అయినప్పటికీ మధ్యయుగాల వరకు సాహిత్యంలో మాసిడోనియను పర్వత చీజుల గురించి ప్రస్తావన లేదు.[255] హాస్య నాటక రచయిత మెనాండరు మాసిడోనియను భోజనపు అలవాట్లు ఏథెన్స్ ఉన్నత సమాజంలోకి చొచ్చుకుపోయాయని రాశారు; ఉదాహరణకు భోజనంలోని డెజర్టు విభాగానికి మాంసాలను ప్రవేశపెట్టడం.[256] మాసిడోనియన్లు ఏథెనియను వంటకాలకు 'మ్యాటీ'ని కూడా పరిచయం చేసి ఉండవచ్చు, ఇది సాధారణంగా చికెను లేదా ఇతర మసాలా, ఉప్పు వేసి, సాసుతో వండిన మాంసంతో తయారు చేయబడి, వైన్ అందించే సమయంలో వడ్డించబడే ఒక వంటకం.[257] మాసిడోనియాకు చెందిన 2వ డెమెట్రియసు కాలంలో ఏథెనియన్ల క్షీణిస్తున్న నైతికత గురించి ఏథెనియను హాస్య కవి అలెక్సిసు రాసిన ఒక నాటకంలో ఈ ప్రత్యేక వంటకాన్ని ఎగతాళి చేసి దానిని స్వేచ్ఛా ప్రవర్తన, తాగుబోతుతనంతో ముడిపెట్టారు.[258]
మాసిడోనియను, విస్తృత గ్రీకు సామ్రాజ్యంలో 'సింపోజియం' అనేది ఉన్నత వర్గం, విశేషాధికార వర్గం వారి కోసం ఏర్పాటు చేసే ఒక విందు, ఇది విందు, పానీయాలు, వినోదం, కొన్నిసార్లు తాత్విక చర్చలకు ఒక సందర్భం.[259] మాసిడోనియను అరిస్టోక్రసీ లోని ప్రముఖ సభ్యులైన 'హెటైరోయి' తమ రాజుతో పాటు ఇటువంటి విందులకు హాజరు కావాలని ఆశించబడేవారు.[260] వారు వేట మాంసం సంపాదించడం కోసం, అలాగే వినోదం కోసం రాజుతో పాటు రాజ వేటలకు కూడా వెళ్లాలని ఆశించబడేవారు.[260]
జాతి గుర్తింపు
[మార్చు]ప్రాచీన రచయితలు ఆధునిక పండితులు ఇద్దరూ కూడా ప్రాచీన మాసిడోనియన్ల కచ్చితమైన జాతి గుర్తింపు గురించి ఏకీభవించరు. ప్రబలమైన దృక్కోణం ప్రకారం, మాసిడోనియన్లు "నిజమైన గ్రీకులే" అయితే వారు గ్రీసు దక్షిణ ప్రాంతాలలో నివసించే వారి కంటే మరింత పురాతన జీవనశైలిని కొనసాగించారు.[262] అయితే ఎర్నెస్టు బాడియను గ్రీకులు, మాసిడోనియన్ల మధ్య వైరుధ్యాలు, తేడాల గురించి మిగిలి ఉన్న దాదాపు అన్ని ప్రస్తావనలు రోమన్ సామ్రాజ్యం కాలంలో జీవించిన అర్రియను లిఖితపూర్వక ప్రసంగాలలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సమయంలో మాసిడోనియన్లకు ఇతర గ్రీకులకు మధ్య జాతిపరమైన వ్యత్యాసం అనే భావన అర్థం చేసుకోలేనిదిగా ఉండేది.[263]మాసిడోనియన్లకు, ఇతర గ్రీకులకు మధ్య నిజమైన జాతిపరమైన వ్యత్యాసం ఏమీ లేదని కేవలం క్రీ.పూ. 337లో కొరింతు కూటమి స్థాపన తర్వాత సృష్టించబడిన రాజకీయ భేదం మాత్రమే ఉందని హాట్జోపౌలోసు వాదించారు (ఈ కూటమికి మాసిడోనియా నాయకత్వం వహించింది. కూటమిచే ఎన్నుకోబడిన దాని హెగెమోను 2వ ఫిలిపు ద్వారా ఆయన స్వయంగా కూటమిలో సభ్యుడు కానప్పటికీ); [note 42] ఎన్. జి. ఎల్. హామండు వాదిస్తూ, మాసిడోనియా జాతి గుర్తింపును మిగిలిన గ్రీకు మాట్లాడే ప్రపంచం నుండి వేరుచేసే ప్రాచీన దృక్కోణాలను, రెండు విభిన్న రాజకీయ వ్యవస్థల మధ్య సంఘర్షణ వ్యక్తీకరణగా చూడాలని పేర్కొన్నాడు: నగర-రాజ్యాల ప్రజాస్వామ్య వ్యవస్థ (ఉదా. ఏథెన్సు) వర్సెసు రాచరిక వ్యవస్థ (మాసిడోనియా).[264]గ్రీకు మాట్లాడే ప్రపంచంలోని మరొక భాగం ఉత్తరాన పెలగోనియా నుండి దక్షిణాన మాసిడోనియా వరకు విస్తరించి ఉంది. ఇది అనేక గిరిజన రాజ్యాలచే ఆక్రమించబడింది, అవి నిరంతరం ఇల్లిరియన్లు, పేయోనియన్లు, థ్రేసియన్లతో యుద్ధాలు చేసేవి. ప్రతి రాజ్యానికి దాని స్వంత రాచరికం ఉండేది. బాచియాడే అనే రాజకుటుంబం హెరాకిల్సు వంశానికి చెందినవారని చెప్పుకునే లింసెస్టేలకు, మరియు మాసిడోనియన్లకు ప్రత్యేక ప్రతిష్ట ఉండేది, వీరి రాజకుటుంబానికి కూడా ఇలాంటి వంశపారంపర్యమే ఉంది. [...] నగర-రాజ్యాల అభిప్రాయం ప్రకారం ఈ గిరిజన రాజ్యాలు గ్రీకు భాష మాండలికాలను మాట్లాడినప్పటికీ అవి వెనుకబడినవి, గ్రీకు అనే పేరుకు అనర్హమైనవి. అరిస్టాటిలు ప్రకారం, తమను తాము పరిపాలించుకోలేని అంత తెలివితక్కువ ప్రజలకు రాచరికం ఒక చిహ్నం. [265] మాసిడోనియన్లకు, గ్రీకులకు మధ్య ఉన్న వ్యత్యాసం నిజమైన జాతిపరమైనది కాకుండా రాజకీయమైనదని అంగీకరించే ఇతర విద్యావేత్తలలో మైఖేలు బి. సకెల్లారియో కూడా ఉన్నారు.[266] మాల్కం ఎరింగ్టను ఉన్నారు. [note 43]"మాసిడోనియన్లు గ్రీకులు కారని ప్రాచీన కాలంలో వచ్చిన ఆరోపణలన్నీ 2వ ఫిలిపుతో పోరాటం జరుగుతున్న సమయంలో ఏథెన్సులోనే పుట్టాయి. అప్పట్లోనూ ఇప్పుడు కూడా రాజకీయ పోరాటమే ఈ పక్షపాతానికి కారణమైంది. తన ప్రత్యర్థులు తీవ్రంగా రెచ్చగొట్టిన ఈ పక్షపాతాన్ని ఎదుర్కోవడానికి వక్త ఐస్కినిసు ఒకసారి ఈ విషయంలో ఫిలిపును సమర్థించడం అవసరమని భావించి, ఏథెన్సు ప్రజాసభ సమావేశంలో ఆయనను 'పూర్తిగా గ్రీకువాడు' అని వర్ణించాడు. డెమోస్తనీసు చేసిన ఆరోపణలకు ఒక విశ్వసనీయత లభించడానికి కారణం, ప్రతి పరిశీలకుడికి స్పష్టంగా కనిపించే ఒక వాస్తవమే: అదేమిటంటే, మాసిడోనియన్ల జీవనశైలి, [note 44]
నిర్దిష్ట భౌగోళిక, చారిత్రక పరిస్థితులచే నిర్ణయించబడిన ఈ జీవన విధానం, ఒక గ్రీకు నగర-రాజ్యం జీవన విధానానికి భిన్నంగా ఉండేది. అయితే ఈ విభిన్న జీవన విధానం ఎపిరసు, అకార్నానియా, ఐటోలియాకు చెందిన పశ్చిమ గ్రీకులకు అలాగే మాసిడోనియన్లకు కూడా సాధారణంగా ఉండేది. వారి ప్రాథమిక గ్రీకు జాతీయతపై ఎప్పుడూ సందేహం కలగలేదు. కేవలం మాసిడోనియాతో రాజకీయ విభేదాల పర్యవసానంగానే ఈ సమస్య అసలు లేవనెత్తబడింది." [note 45] సైమను హార్న్బ్లోవరు, మాసిడోనియన్ల మూలం, భాష, ఆచారాలు, ప్రాచీన గ్రీకు సంప్రదాయాలకు సంబంధించిన ఆచారాలను పరిగణనలోకి తీసుకుని, వారి గ్రీకు గుర్తింపు మీద వాదిస్తున్నారు. [note 46] "ఏదైనా పిలవబడే అనాగరిక ప్రజల కంటే తక్కువ స్థాయిలో ఉన్న శక్తి అయిన మాసిడోనియన్లకు వ్యతిరేకంగా మహారాజుతో ఏథెన్సు పొత్తును సమర్థించే క్రమంలో డెమోస్థనీసు అనాగరికుల వర్గాన్ని పూర్తిగా విస్మరించగలిగాడు. [267] ఐస్కినిసు విషయంలో 2వ ఫిలిపు 'దేవుని ప్రతీకారానికి అర్హత పొందిన ఒక అనాగరికుడు' కావచ్చు, కానీ 346లో పెల్లాకు ఆ వక్త రాయబారం పంపిన తర్వాత ఆయన ఏథెన్సుకు అంకితమైన 'పూర్తి గ్రీకు'గా మారాడు. ఇదంతా మాసిడోనియాతో ఒకరి తక్షణ రాజకీయ దృక్పథం మీద ఆధారపడి ఉండేది, దీనిని చాలా మంది గ్రీకులు సహజంగానే చిన్నచూపు చూశారు. ఇది ఎల్లప్పుడూ లోతైన ద్వంద్వ వైఖరితో నిండి ఉండేది."
కొంతమంది గ్రీకు రచయితలు మాసిడోనియన్ల కచ్చితమైన జాతి గుర్తింపు గురించి సంక్లిష్టమైన లేదా నిరంతరం మారుతున్న, అస్పష్టమైన ఆలోచనలను వ్యక్తం చేశారని అన్సను వాదిస్తున్నారు. వీరిని కొందరు అనాగరికులుగా మరికొందరు పాక్షిక-గ్రీకులుగా లేదా పూర్తిగా గ్రీకులుగా పరిగణించారు. [note 47] మాసిడోనియను భాష సరైన వర్గీకరణ, గ్రీకు భాషతో దాని సంబంధం గురించి ఆధునిక కాలంలో కూడా అనిశ్చితి కొనసాగడంతో పాటు, ప్రాచీన రచయితలు కూడా మాసిడోనియన్ల గురించి పరస్పర విరుద్ధమైన ఆలోచనలను అందించారని రోజరు డి. వుడువార్డు పేర్కొన్నారు. [note 48] సైమను హార్నుబ్లోవరు మాసిడోనియన్ల మూలం, భాష, ఆచారాలు, ప్రాచీన గ్రీకు సంప్రదాయాలకు సంబంధించిన ఆచారాలను పరిగణనలోకి తీసుకుని, వారి గ్రీకు గుర్తింపు మీద వాదిస్తున్నారు.[268] క్రీ.పూ. 148 నాటికి, మాసిడోనియాను రోమన్లు జయించిన వెంటనే, ఆ తర్వాత కొరింతు యుద్ధంలో (క్రీ.పూ. 146) రోమను రిపబ్లికు చేతిలో అఖియను లీగు ఓడిపోయిన తర్వాత మిగిలిన గ్రీసును కూడా జయించడంతో, గ్రీకులు, మాసిడోనియన్ల మధ్య ఉన్న ఏవైనా ముందస్తు జాతిపరమైన తేడాలు మసకబారిపోయాయి.[269]
సాంకేతికత - ఇంజనీరింగు
[మార్చు]వాస్తుశిల్పం
[మార్చు]మాసిడోనియను వాస్తుశిల్పం, గ్రీసులోని ఇతర ప్రాంతాల నుండి విభిన్న రూపాలు, శైలుల మిశ్రమాన్ని ఉపయోగించుకున్నప్పటికీ ఇతర ప్రాచీన గ్రీకు వాస్తుశిల్పం నుండి ప్రత్యేకమైన లేదా విభిన్నమైన శైలిని సూచించలేదు.శాస్త్రీయ శైలులలో మాసిడోనియను వాస్తుశిల్పులు అయోనికు శైలికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ప్రైవేటు గృహాలలోని పెరిస్టైలు ప్రాంగణాలలో.[271] మాసిడోనియను రాజభవన వాస్తుశిల్పానికి సంబంధించిన అనేక ఉదాహరణలు శిథిలావస్థలో ఉన్నప్పటికీ నేటికీ మనుగడలో ఉన్నాయి. వీటిలో రాజధాని పెల్లా ఉన్న ప్రదేశంలోని ఒక రాజభవనం పాత రాజధాని ఐగై సమీపంలోని వెర్జీనాలో ఉన్న వేసవి నివాసం ఆధునిక వోలోసు సమీపంలోని డెమెట్రియాసులో ఉన్న రాజ నివాసం ఉన్నాయి.[271] వెర్జీనాలో పాలరాతి పలకలతో వేసిన నేలలు (పైకప్పు పలకల శిధిలాలతో కప్పబడి ఉన్నాయి) కలిగిన మూడు పెద్ద విందుశాలల శిధిలాలు ఉన్నాయి. వీటి నేల ప్రణాళిక కొలతలు సుమారుగా 16.7 x 17.6 మీ (54.8 x 57.7 అడుగులు) ఉన్నాయి. ఇవి బహుశా స్మారక త్రిభుజాకార పైకప్పు ట్రసులకు తొలి ఉదాహరణలను ప్రదర్శిస్తాయి. ఒకవేళ వీటిని ఆంటిగోనసు గొనాటాసు పాలన కాలానికి ముందు లేదా హెలెనిస్టికు కాలం ప్రారంభానికి ముందు నాటివిగా పరిగణిస్తే.[272] తర్వాతి మాసిడోనియను వాస్తుశిల్పంలో తోరణాలు, వంపులు కూడా ఉన్నాయి.[273] వెర్జీనా, డెమెట్రియాసు రెండింటి రాజభవనాల గోడలు ఎండబెట్టిన ఇటుకలతో నిర్మించబడ్డాయి. అయితే తరువాతి రాజభవనంలో ఒక రాజుకు లేదా కనీసం ఒక సైనిక గవర్నరుకు తగిన బలవర్థకమైన నివాసం వలె కేంద్ర ప్రాంగణం చుట్టూ నాలుగు మూల గోపురాలు ఉన్నాయి.[271]
మాసిడోనియను పాలకులు మాసిడోనియాకు వెలుపల కూడా నిర్మాణ కళాకృతులను ప్రోత్సహించారు. ఉదాహరణకు క్రీ.పూ. 338లో జరిగిన చెరోనియా యుద్ధంలో విజయం సాధించిన తర్వాత 2వ ఫిలిపు ఒలింపియాలో ఫిలిప్పీయను అని పిలువబడే ఒక గుండ్రని స్మారక భవనాన్ని నిర్మించాడు. దాని లోపల తనను తన తల్లిదండ్రులైన 3వ అమింటాసు, 1వ యూరిడిసులను, తన భార్య ఒలింపియాసును, తన కుమారుడైన అలెగ్జాండరు ది గ్రేటును చిత్రీకరించే విగ్రహాలతో అలంకరించాడు. [274]

ప్రస్తుత గ్రీసులోని మాసిడోనియా, థ్రేసు ప్రాంతాలలో సుమారు ఇరవై గ్రీకు థియేటరుల శిధిలాలు మనుగడలో ఉన్నాయి: పదహారు బహిరంగ థియేటర్లు, మూడు ఓడియనులు, వెరియాలో తవ్వకాలలో ఉన్న ఒక థియేటరు ఉన్నాయి.[275]
సైనిక సాంకేతికత - ఇంజనీరింగు
[మార్చు]హెలెనిస్టికు కాలం నాటికి గ్రీకు రాజ్యాలు మరింత శక్తివంతమైన టార్షను ముట్టడి యంత్రాలు, నౌకలు, ఆయుధాలు, కవచాల కోసం ప్రామాణిక రూపకల్పనల అభివృద్ధికి విస్తరణకు నిధులు సమకూర్చడం సాధారణమైంది.[276] 2వ ఫిలిపు అలెగ్జాండరు ది గ్రేటు హయాంలో బోల్టులను ప్రయోగించే బాలిస్టాలు వంటి ముట్టడి ఫిరంగిదళం, భారీ కదిలే ముట్టడి గోపురంల వంటి ముట్టడి యంత్రాలు మెరుగుపరచబడ్డాయి.[277] ఇ.డబల్యూ మార్సుడెను ఎమ్. వై. ట్రైస్టరు వాదించిన దాని ప్రకారం క్రీ.పూ. 4వ శతాబ్దం చివరిలో మాసిడోనియను పాలకులైన 1వ ఆంటిగోనసు మోనోఫ్తాల్మసు, ఆయన వారసుడు 1వ డెమెట్రియసు ఆఫ్ మాసిడోను హెలెనిస్టికు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ముట్టడి ఫిరంగిదళాన్ని కలిగి ఉన్నారు.[278] క్రీ.పూ. 306లో సైప్రసులోని సలామిసు ముట్టడికి పెద్ద ముట్టడి యంత్రాలను నిర్మించడం, పశ్చిమ ఆసియా లోని కొన్ని ప్రాంతాల నుండి చేతివృత్తి నిపుణులను నియమించడం అవసరమైంది.[279] మాసిడోనియన్ల రోడ్సు ముట్టడి (క్రీ.పూ. 305–304) కోసం 1వ డెమెట్రియసు ఆదేశం మీద నిర్మించబడిన. మూడు వేల మందికి పైగా సైనికులచే రక్షించబడిన ముట్టడి గోపురం తొమ్మిది అంతస్తుల ఎత్తులో నిర్మించబడింది.[280] దీనికి 4,300 square feet (399 square metres) విస్తీర్ణంలో ఆధారం ఇరువైపులా తిప్పగల ఇరుసులతో కూడిన ఎనిమిది చక్రాలు, అగ్ని నుండి రక్షించడానికి ఇనుప పలకలతో కప్పబడిన మూడు వైపులా, బాణాలు నుండి పెద్ద బోల్టుల వరకు వివిధ రకాల క్షిపణులను ప్రయోగించడానికి వీలుగా యాంత్రికంగా తెరుచుకునే వివిధ పరిమాణాల కిటికీలు (బాలిస్టా గుళ్ల దెబ్బను తగ్గించడానికి ఉన్నితో నింపిన తోలు తెరలతో కప్పబడినవి) ఉండేవి.[280]
క్రీ.పూ. 211లో మాసిడోను రాజు 5వ ఫిలిపు చేత ఎకినసు (ఫ్తియోటిసు) ముట్టడి సమయంలో ముట్టడిదారులు సైనికులను, సైనిక ఇంజనీర్లను శిబిరం నుండి ముట్టడి పనులకు వెళ్ళేటప్పుడు రక్షించడానికి సొరంగాలు నిర్మించారు. వీటిలో రాళ్లు విసిరే బాలిస్టాలతో అమర్చబడిన తాత్కాలికంగా అల్లిన గోడతో అనుసంధానించబడిన రెండు ముట్టడి గోపురాలు, ముట్టడి కొయ్యను సమీపంలోకి తీసుకువచ్చేటప్పుడు రక్షణ కల్పించేందుకు షెడ్లు ఉన్నాయి.[281] ముట్టడి సాంకేతికతలో మాసిడోనియాకు ప్రారంభంలో ఉన్న పేరు ఉన్నప్పటికీ క్రీ.పూ. 3వ శతాబ్దానికి, టోలెమికు ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం ఫిలో ఆఫ్ అలెగ్జాండ్రియా రచనల ద్వారా నిరూపించబడినట్లుగా విసిరే యంత్రానికి సంబంధించిన సాంకేతిక మెరుగుదలలకు కేంద్రంగా మారింది.[279]
ఇతర ఆవిష్కరణలు
[మార్చు]సాంకేతిక ఆవిష్కరణల విషయంలో గ్రీసులోని ఇతర ప్రాంతాలంతగా ప్రసిద్ధి చెందకపోయినప్పటికీ ముట్టడి యంత్రాలు, ఫిరంగిదళం కాకుండా, మాసిడోనియాలో ఉద్భవించి ఉండవచ్చని భావించే కొన్ని ఆవిష్కరణలు ఉన్నాయి. ఆలివు నూనెను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే భ్రమణ పద్ధతిలో పనిచేసే ఆలివు ప్రెసు ప్రాచీన మాసిడోనియాలో లేదా గ్రీసులోని మరొక భాగంలో లేదా తూర్పున లెవంతు లేదా అనటోలియాలో కూడా కనుగొనబడి ఉండవచ్చు.[282] అచ్చులో పోత పోసిన గాజు మొదటిసారిగా క్రీ.పూ. 4వ శతాబ్దంలో మాసిడోనియాలో కనిపించింది (అయితే ఇది అకెమెనిడు సామ్రాజ్యంలో కూడా ఏకకాలంలో ఉండి ఉండవచ్చు); గ్రీకు ప్రపంచంలో తెలిసిన మొదటి స్పష్టమైన, పారదర్శక గాజు ముక్కలు మాసిడోనియా రోడ్సులో కనుగొనబడ్డాయి. అవి క్రీ.పూ. 4వ శతాబ్దం రెండవ భాగం నాటివి.[283] గ్రీకు సాంకేతిక, శాస్త్రీయ సాహిత్యం క్రీ.పూ. 5వ శతాబ్దంలో క్లాసికలు ఏథెన్సుతో ప్రారంభమైంది. అయితే హెలెనిస్టికు కాలంలో సాంకేతిక ఆవిష్కరణలు, గ్రంథాలకు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు అలెగ్జాండ్రియా, రోడ్సు, పెర్గామను.[284]
కరెన్సీ, ఆర్థిక వ్యవహారాలు - వనరులు
[మార్చు]
రాజు ఖర్చుల కోసం చెల్లింపుల మార్గంగా 1వ అలెగ్జాండరు పాలనలో వెండి నాణేల ముద్రణ ప్రారంభమైంది.[170] 1వ ఆర్కిలాసు విదేశీ, దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి తన నాణేలలో వెండి శాతాన్ని పెంచడమే కాకుండా రాగి నాణేలను కూడా ముద్రించాడు.[33] 2వ ఫిలిపు, అలెగ్జాండరు ది గ్రేటు పాలనలో నాణేల ముద్రణ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా పంగాయియను కొండలు స్వాధీనం చేసుకున్న తర్వాత రాజ్య ఆదాయాలు పెరగడంతో ఇది జరిగింది.[285] హెలెనిస్టికు కాలంలో మాసిడోనియా, టోలెమికు ఈజిప్టు, అటాలిడు రాజ్యం రాజవంశాలు తమ సైన్యాలకు నిధులు సమకూర్చడాన్ని నిర్ధారించుకోవడానికి గనుల తవ్వకం కార్యకలాపాల మీద పూర్తి గుత్తాధిపత్య నియంత్రణను కలిగి ఉండేవి.[286] అలెగ్జాండరు ది గ్రేటు దండయాత్రలు ముగిసే నాటికి మాసిడోనియా నుండి బాబిలోను వరకు విస్తరించి ఉన్న దాదాపు ముప్పై టంకశాలలు ప్రామాణిక నాణేలను ఉత్పత్తి చేశాయి.[287] నాణేలను ముద్రించే హక్కు కేంద్ర ప్రభుత్వం కొన్ని స్థానిక ప్రభుత్వాలకు అంటే మాసిడోనియను కామన్వెల్తు లోని థెస్సలోనికి, పెల్లా, ఆంఫిపోలిసు స్వయంప్రతిపత్తి గల పురపాలక ప్రభుత్వాలకు ఉండేది.[288] అంతర్గత వినియోగం, బాహ్య వాణిజ్యం కోసం వేర్వేరు నాణేలను జారీ చేసిన మొదటివారు కూడా మాసిడోనియన్లే. .[289]
రాజ్య ఆదాయాలు సాగు భూముల నుండి పంటలను, అడవుల నుండి కలపను, ఓడరేవుల వద్ద దిగుమతులు, ఎగుమతుల మీద పన్నులను వసూలు చేయడం ద్వారా కూడా పెంచబడ్డాయి.[290] మాసిడోనియను రాజ్యానికి చెందిన కొన్ని గనులు, తోటలు, వ్యవసాయ భూములు అడవులను మాసిడోనియను రాజు ఉపయోగించుకున్నాడు. అయినప్పటికీ వీటిని తరచుగా ఆస్తులుగా లీజుకు ఇచ్చేవారు లేదా 'హెటైరోయి', 'ఫిలోయి' వంటి ఉన్నత వర్గాల సభ్యులకు మంజూరుగా ఇచ్చేవారు.[291] మాసిడోనియను సముద్ర ఓడరేవుల నుండి లోపలికి, బయటకు వెళ్లే వస్తువుల మీద విధించే సుంకాలు కనీసం 3వ అమింటాసు పాలన నుండి ఉనికిలో ఉన్నాయి. అఫిడ్నేకు చెందిన కాలిస్ట్రాటసు (మ. క్రీ.పూ. 350) 3వ పెర్డిక్కాసుకు సహాయం చేసి, రాజ్యానికి కస్టమ్సు సుంకాల మీద వచ్చే వార్షిక లాభాలను 20 నుండి 40 టాలెంట్లకు రెట్టింపు చేశాడు.[292]
క్రీ.పూ. 168లో పిడ్నా యుద్ధంలో మాసిడోనియాకు చెందిన పర్సియసు ఓటమి తర్వాత, రోమను సెనేటు ఇనుము, రాగి గనులను తిరిగి తెరవడానికి అనుమతించింది. కానీ మాసిడోనియాలోని రాచరిక వ్యవస్థ స్థానంలో కొత్తగా స్థాపించబడిన నాలుగు స్వయంప్రతిపత్తి గల సామంత రాజ్యాలు బంగారం, వెండి తవ్వకాలను చేపట్టడాన్ని నిషేధించింది. బంగారం, వెండి తవ్వకాల నుండి లభించే భౌతిక సంపద మాసిడోనియన్లకు సాయుధ తిరుగుబాటుకు నిధులు సమకూర్చడానికి వీలు కల్పిస్తుందనే భయం కారణంగా ఈ చట్టాన్ని సెనేటు రూపొందించి ఉండవచ్చు. మాసిడోనియను వెండి తవ్వకం నుండి పెరిగిన ద్రవ్య సరఫరా వల్ల కలిగే ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం గురించి కూడా రోమన్లు బహుశా ఆందోళన చెంది ఉండవచ్చు. మాసిడోనియన్లు క్రీ.పూ. 167 - 148 మధ్య (అంటే, మాసిడోనియా రోమను ప్రావిన్సు స్థాపనకు కొద్దికాలం ముందు) వెండి నాణేలను ముద్రించడం కొనసాగించారు. క్రీ.పూ. 158లో రోమన్లు మాసిడోనియను వెండి తవ్వకం మీద నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు, అది సెనేటు శాసనంతో సంబంధం లేకుండా ఈ చట్టవిరుద్ధమైన పద్ధతి కొనసాగుతున్న స్థానిక వాస్తవికతను ప్రతిబింబించి ఉండవచ్చు.
వారసత్వం
[మార్చు]2వ ఫిలిపు, అలెగ్జాండరు ది గ్రేటు పాలనలో శాస్త్రీయ గ్రీసు అంతరించి, హెలెనిస్టికు నాగరికత ఆవిర్భవించింది. ఇది అలెగ్జాండరు దండయాత్రల సమయంలో ఆ తర్వాత సమీప ప్రాచ్యానికి గ్రీకు సంస్కృతి వ్యాపించడం వల్ల జరిగింది.[293] ఆ తర్వాత మాసిడోనియన్లు ఈజిప్టు, ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు వలస వెళ్లారు. కానీ విదేశీ భూభాగాలను విస్తృతంగా వలసరాజ్యం చేయడం వల్ల స్వయంగా మాసిడోనియాలో అందుబాటులో ఉన్న మానవశక్తి తగ్గిపోయింది. ఇది ఇతర హెలెనిస్టికు శక్తులతో పోరాటంలో రాజ్యాన్ని బలహీనపరిచి రోమన్లచే దాని పతనానికి, ఆక్రమణకు దోహదపడింది.[294] అయితే ఎర్రింగ్టను అభిప్రాయం ప్రకారం పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికాలో అలెగ్జాండరు విజయాల ద్వారా సుస్థిరమైన గ్రీకు సంస్కృతి, భాష వ్యాప్తి, ఈ భూభాగాలలో తర్వాతి రోమను విస్తరణకు ఒక "పూర్వ షరతు"గా, బైజాంటైను సామ్రాజ్యానికి పూర్తి ఆధారంగా పనిచేసింది.[295]

టోలెమికు, సెల్యూసిడు వారసత్వ రాజ్యాల జాతి మాసిడోనియను పాలకులు గ్రీకు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన పురుషులను తమ 'హెటైరోయి' సహచరులుగా అంగీకరించారు. ఆంటిగోనిడ్ల వలె జాతీయ గుర్తింపును ప్రోత్సహించలేదు.[296] ఈ హెలెనిస్టికు వారసత్వ రాజ్యాలు తూర్పు లేదా దక్షిణ గ్రీకు సంప్రదాయాల కంటే తమ మాసిడోనియను మూలాలచే ఎలా ఎక్కువగా ప్రభావితమయ్యాయో అనే దాని మీద ఆధునిక పాండిత్యం దృష్టి సారించింది.[297] స్పార్టను సమాజం ఎక్కువగా ఏకాంతంగా ఉండగా, ఏథెన్సు పౌరసత్వం పొందడం మీద కఠినమైన పరిమితులను విధించడం కొనసాగించగా, ఆసియా, ఈశాన్య ఆఫ్రికాలోని విశ్వజనీన హెలెనిస్టికు నగరాలు నగరాలు మాసిడోనియను నగరాలతో ఎక్కువ పోలికను కలిగి ఉండేవి. స్థానికులు, గ్రీకు, మాసిడోనియను వలసవాదులు, గ్రీకు మాట్లాడే హెలెనైజ్డు తూర్పువాసులతో సహా వివిధ రకాల ప్రజల సమ్మేళనాన్ని కలిగి ఉండేవి. వీరిలో చాలామంది గ్రీకులు, స్థానిక ప్రజల మధ్య జరిగిన వివాహాల ఫలితంగా జన్మించినవారే.[298]
మాసిడోనియను చక్రవర్తులను దైవంగా ఆరాధించడం బహుశా 2వ ఫిలిపు మరణంతో ప్రారంభమై ఉండవచ్చు. కానీ ఆయన కుమారుడైన అలెగ్జాండరు ది గ్రేటు స్పష్టంగా తాను ఒక జీవించి ఉన్న దేవుడినని ప్రకటించుకున్నాడు.[note 49] క్రీ.పూ. 334లో డిడిమాలోని దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఆయన దైవత్వాన్ని సూచించిన తర్వాత అలెగ్జాండరు తన దైవిక హోదాను ధృవీకరించుకోవడానికి క్రీ.పూ. 332లో లిబియను ఎడారిలోని సివా ఒయాసిసులో ఉన్న ఈజిప్షియను అమును-రాకు గ్రీకు సమానమైన జ్యూసు అమ్మోను దేవాలయం వద్దకు ప్రయాణించాడు.[note 50] టోలెమికు, సెల్యూసిడు సామ్రాజ్యాలు పూర్వీకుల ఆరాధనలను కొనసాగించి, తమ పాలకులను దైవంగా ఆరాధించినప్పటికీ, మాసిడోనియా రాజ్యంలో రాజులను పూజించలేదు.[299] అలెగ్జాండరు పాలనకు ముందు నుంచే గ్రీకులకు జ్యూసు అమ్మోను గురించి తెలుసు. ముఖ్యంగా సైరీను, లిబియా లోని గ్రీకు కాలనీలో అలెగ్జాండరు మొదటి మాసిడోనియను చక్రవర్తిగా ఐగుప్తు, పర్షియను బాబిలోనియను పూజారులను, దేవతలను పోషించాడు. తద్వారా సమీప ప్రాచ్య, గ్రీకు మత విశ్వాసాల సమ్మేళనాన్ని బలపరిచాడు.[300] ఆయన పాలన తర్వాత, ఐసిసు ఆరాధన క్రమంగా హెలెనిస్టికు, రోమను ప్రపంచం అంతటా వ్యాపించింది. అయితే ఐగుప్తు దేవుడు సరాపిసు మీద ఉన్న నమ్మకాలను ఐగుప్తులోని టోలెమికు పాలకులు ఆయన ఆరాధన మాసిడోనియా, ఏజియను ప్రాంతానికి వ్యాపించడానికి ముందే పూర్తిగా హెలెనైజు చేశారు.[301] జర్మనీ చరిత్రకారుడు జోహాను గుస్తావు డ్రోయ్సెను అలెగ్జాండరు ది గ్రేటు విజయాలు, హెలెనిస్టికు ప్రపంచం, సృష్టి రోమను యుగంలో క్రైస్తవ మతం పెరుగుదలకు, స్థాపనకు మార్గం సుగమం చేశాయని వాదించారు.[302]
మూలాలు
[మార్చు]- ↑ Hatzopoulos 1996, pp. 105–106; Roisman 2010, p. 156.
- ↑ Engels 2010, p. 92; Roisman 2010, p. 156.
- ↑ E. Kapetanopoulos. "Alexander's Patrius Sermo in the Philotas Affair", The Ancient World 30 (1999), pp. 125." If Xennias was a Makedon, then the phrase..." (PDF Archived 2011-07-16 at the Wayback Machine or HTM Archived 2022-08-21 at the Wayback Machine)
- ↑ 4.0 4.1 Sprawski 2010, pp. 135–138; Olbrycht 2010, pp. 342–345.
- ↑ Turchin, Peter; Adams, Jonathan M.; Hall, Thomas D. (December 2006). "East-West Orientation of Historical Empires". Journal of World-Systems Research. 12 (2): 223. ISSN 1076-156X. Retrieved 12 September 2016.
- ↑ Taagepera, Rein (1979). "Size and Duration of Empires: Growth-Decline Curves, 600 B.C. to 600 A.D.". Social Science History. 3 (3/4): 121. doi:10.2307/1170959. JSTOR 1170959.
- ↑ Bang, Peter Fibiger; Bayly, C. A.; Scheidel, Walter (2020). The Oxford World History of Empire: Volume One: The Imperial Experience (in ఇంగ్లీష్). Oxford University Press. pp. 92–94. ISBN 978-0-19-977311-4.
- ↑ Hornblower 2008, pp. 55–58.
- ↑ Austin 2006, pp. 1–4.
- ↑ "Macedonia". Encyclopædia Britannica. Encyclopædia Britannica Online. 23 October 2015. Archived from the original on 8 December 2008. Retrieved 5 February 2017.
- ↑ 11.0 11.1 Beekes 2009, p. 894.
- ↑ King 2010, p. 376; Sprawski 2010, p. 127; Errington 1990, pp. 2–3.
- ↑ King 2010, p. 376; Errington 1990, pp. 3, 251.
- ↑ Badian 1982, p. 34;
- ↑ Errington 1990, p. 2.
- ↑ Thomas 2010, pp. 67–68, 74–78.
- ↑ Anson 2010, pp. 5–6.
- ↑ "DNa – Livius". www.livius.org.
- ↑ Olbrycht 2010, pp. 343–344
- ↑ Sprawski 2010, pp. 141–143; Errington 1990, pp. 9, 11–12.
- ↑ Roisman 2010, pp. 145–147.
- ↑ Roisman 2010, pp. 146–147; Müller 2010, p. 171; Cawkwell 1978, p. 72; మరిన్ని వివరాల కోసం Errington 1990, pp. 13–14 కూడా చూడండి.
- ↑ 23.0 23.1 23.2 Roisman 2010, pp. 146–147.
- ↑ Roisman 2010, pp. 146–147; మరిన్ని వివరాల కోసం Errington 1990, p. 18 కూడా చూడండి.
- ↑ Roisman 2010, pp. 147–148; Errington 1990, pp. 19–20.
- ↑ Roisman 2010, p. 153; Errington 1990, pp. 22–23.
- ↑ Roisman 2010, pp. 153–154; మరిన్ని వివరాల కోసం Errington 1990, p. 23 కూడా చూడండి.
- ↑ Roisman 2010, p. 154; మరిన్ని వివరాల కోసం Errington 1990, p. 23 కూడా చూడండి.
- ↑ Roisman 2010, p. 154; Errington 1990, pp. 23–24.
- ↑ Roisman 2010, pp. 154–155; Errington 1990, p. 24.
- ↑ Roisman 2010, pp. 155–156.
- ↑ Roisman 2010, p. 156; Errington 1990, p. 26.
- ↑ 33.0 33.1 Roisman 2010, pp. 156–157.
- ↑ Roisman 2010, pp. 156–157; Errington 1990, pp. 28–29.
- ↑ Roisman 2010, p. 158; Errington 1990, pp. 28–29.
- ↑ Roisman 2010, p. 159; మరిన్ని వివరాల కోసం Errington 1990, p. 30 కూడా చూడండి.
- ↑ Roisman 2010, pp. 159–160; ఎర్రింగ్టన్ 1990, pp. 32–33.
- ↑ రోయిస్మాన్ 2010, p. 161; ఎర్రింగ్టన్ 1990, pp. 34–35.
- ↑ రోయిస్మాన్ 2010, pp. 161–162; ఎర్రింగ్టన్ 1990, pp. 35–36.
- ↑ రోయిస్మాన్ 2010, pp. 162–163; ఎరింగ్టన్ 1990, p. 36.
- ↑ Roisman 2010, pp. 162–163.
- ↑ Roisman 2010, pp. 163–164; ఎరింగ్టన్ 1990, p. 37.
- ↑ Müller 2010, pp. 166–167; Buckley 1996, pp. 467–472.
- ↑ Müller 2010, pp. 167–168; Buckley 1996, pp. 467–472.
- ↑ Müller 2010, pp. 170–171; Gilley & Worthington 2010, p. 187.
- ↑ Müller 2010, pp. 167, 169; Roisman 2010, p. 161.
- ↑ Müller 2010, pp. 169, 173–174; Cawkwell 1978, p. 84; Errington 1990, pp. 38–39.
- ↑ Müller 2010, p. 171; Buckley 1996, pp. 470–472; Cawkwell 1978, pp. 74–75.
- ↑ Müller 2010, p. 172; Hornblower 2002, p. 272; Cawkwell 1978, p. 42; Buckley 1996, pp. 470–472.
- ↑ Müller 2010, pp. 171–172; Buckler 1989, pp. 8, 20–22, 26–29.
- ↑ Müller 2010, p. 173; Cawkwell 1978, pp. 62, 66–68; Buckler 1989, pp. 74–75, 78–80; Worthington 2008, pp. 61–63.
- ↑ Müller 2010, p. 173; Cawkwell 1978, p. 44; Schwahn 1931, col. 1193–1194.
- ↑ Cawkwell 1978, p. 86.
- ↑ Müller 2010, pp. 173–174; Cawkwell 1978, pp. 85–86; Buckley 1996, pp. 474–475.
- ↑ Müller 2010, pp. 173–174; Worthington 2008, pp. 75–78; Cawkwell 1978, pp. 96–98.
- ↑ Müller 2010, p. 174; Cawkwell 1978, pp. 98–101.
- ↑ Müller 2010, pp. 174–175; Cawkwell 1978, pp. 95, 104, 107–108; Hornblower 2002, pp. 275–277; Buckley 1996, pp. 478–479.
- ↑ Müller 2010, p. 175.
- ↑ Errington 1990, p. 227.
- ↑ Müller 2010, pp. 175–176; Cawkwell 1978, pp. 114–117; Hornblower 2002, p. 277; Buckley 1996, p. 482; Errington 1990, p. 44.
- ↑ Mollov & Georgiev 2015, p. 76.
- ↑ Müller 2010, p. 176; Cawkwell 1978, pp. 136–142; Errington 1990, pp. 82–83.
- ↑ Müller 2010, pp. 176–177; Cawkwell 1978, pp. 143–148.
- ↑ Müller 2010, p. 177; Cawkwell 1978, pp. 167–168.
- ↑ Müller 2010, pp. 177–179; Cawkwell 1978, pp. 167–171; see also Hammond & Walbank 2001, p. 16 for further details.
- ↑ Davis Hanson, Victor (2010). Makers of Ancient Strategy: From the Persian Wars to the Fall of Rome. Princeton University Press. p. 119. ISBN 978-0-691-13790-2.
Afterwards he [Alexander] revived his father's League of Corinth, and with it his plan for a pan-Hellenic invasion of Asia to punish the Persians for the suffering of the Greeks, especially the Athenians, in the Greco-Persian Wars and to liberate the Greek cities of Asia Minor.
- ↑ Olbrycht 2010, pp. 348, 351
- ↑ Olbrycht 2010, pp. 347–349
- ↑ Olbrycht 2010, p. 351
- ↑ Müller 2010, pp. 181–182; Errington 1990, p. 44; Gilley & Worthington 2010, p. 186; see Hammond & Walbank 2001, pp. 3–5 for details of the arrests and judicial trials of other suspects in the conspiracy to assassinate Philip II of Macedon.
- ↑ Gilley & Worthington 2010, p. 190; Müller 2010, p. 183; Renault 2001, pp. 61–62; Fox 1980, p. 72; see also Hammond & Walbank 2001, pp. 3–5 for further details.
- ↑ Gilley & Worthington 2010, p. 186.
- ↑ Gilley & Worthington 2010, p. 190.
- ↑ Gilley & Worthington 2010, pp. 190–191; see also Hammond & Walbank 2001, pp. 15–16 for further details.
- ↑ Gilley & Worthington 2010, p. 191; Hammond & Walbank 2001, pp. 34–38.
- ↑ Gilley & Worthington 2010, pp. 192–193.
- ↑ Gilley & Worthington 2010, p. 193.
- ↑ 78.0 78.1 Gilley & Worthington 2010, p. 195.
- ↑ Gilley & Worthington 2010, pp. 194–195.
- ↑ Errington 1990, pp. 105–106.
- ↑ Gilley & Worthington 2010, p. 198.
- ↑ Gilley & Worthington 2010, p. 199; Errington 1990, p. 93.
- ↑ Gilley & Worthington 2010, pp. 200–201; Errington 1990, p. 58.
- ↑ Gilley & Worthington 2010, p. 201.
- ↑ Gilley & Worthington 2010, pp. 201–203.
- ↑ Gilley & Worthington 2010, p. 204; మరిన్ని వివరాల కోసం Errington 1990, p. 44 కూడా చూడండి.
- ↑ Gilley & Worthington 2010, p. 204; మరిన్ని వివరాల కోసం Errington 1990, pp. 115–117 కూడా చూడండి.
- ↑ Gilley & Worthington 2010, p. 204; Adams 2010, p. 209; Errington 1990, pp. 69–70, 119.
- ↑ Gilley & Worthington 2010, pp. 204–205; Adams 2010, pp. 209–210; Errington 1990, pp. 69, 119.
- ↑ Gilley & Worthington 2010, p. 205; see also Errington 1990, p. 118 for further details.
- ↑ Adams 2010, pp. 208–209; Errington 1990, p. 117.
- ↑ Adams 2010, pp. 210–211; Errington 1990, pp. 119–120.
- ↑ Adams 2010, p. 211; Errington 1990, pp. 120–121.
- ↑ Adams 2010, pp. 211–212; Errington 1990, pp. 121–122.
- ↑ Adams 2010, pp. 207 n. #1, 212; Errington 1990, pp. 122–123.
- ↑ Adams 2010, pp. 212–213; Errington 1990, pp. 124–126.
- ↑ 97.0 97.1 Adams 2010, p. 213; Errington 1990, pp. 126–127.
- ↑ Adams 2010, pp. 214–215.
- ↑ Adams 2010, pp. 215–216.
- ↑ Adams 2010, p. 216.
- ↑ Adams 2010, pp. 216–217; ఎర్రింగ్టన్ 1990, p. 129.
- ↑ Adams 2010, p. 217; Errington 1990, p. 145.
- ↑ Adams 2010, p. 217; Errington 1990, pp. 145–147; Bringmann 2007, p. 61.
- ↑ 104.0 104.1 Bringmann 2007, p. 61.
- ↑ Adams 2010, p. 218; Errington 1990, p. 153.
- ↑ 106.0 106.1 Adams 2010, pp. 218–219; Bringmann 2007, p. 61.
- ↑ Adams 2010, p. 219; Bringmann 2007, p. 61; Errington 1990, pp. 156–157.
- ↑ Adams 2010, p. 219; Bringmann 2007, pp. 61–63; Errington 1990, pp. 159–160.
- ↑ Errington 1990, p. 160.
- ↑ Errington 1990, pp. 160–161.
- ↑ Adams 2010, p. 219; Bringmann 2007, p. 63; Errington 1990, pp. 162–163.
- ↑ 112.0 112.1 Adams 2010, pp. 219–220; Bringmann 2007, p. 63.
- ↑ Adams 2010, pp. 219–220; Bringmann 2007, p. 63; ఎర్రింగ్టన్ 1990, p. 164.
- ↑ ఆడమ్స్ 2010, p. 220; ఎర్రింగ్టన్ 1990, pp. 164–165.
- ↑ ఆడమ్స్ 2010, p. 220.
- ↑ ఆడమ్స్ 2010, p. 220; బ్రింగ్మాన్ 2007, p. 63; ఎర్రింగ్టన్ 1990, p. 167.
- ↑ ఆడమ్స్ 2010, p. 220; ఎర్రింగ్టన్ 1990, pp. 165–166.
- ↑ Adams 2010, p. 221; ఏరియస్ I ఆధ్వర్యంలో స్పార్టా పునరుజ్జీవనం గురించి Errington 1990, pp. 167–168 కూడా చూడండి.
- ↑ Adams 2010, p. 221; Errington 1990, p. 168.
- ↑ Adams 2010, p. 221; Errington 1990, pp. 168–169.
- ↑ Adams 2010, p. 221; ఎర్రింగ్టన్ 1990, pp. 169–171.
- ↑ ఆడమ్స్ 2010, p. 221.
- ↑ Adams 2010, pp. 221–222; Errington 1990, p. 172.
- ↑ ఆడమ్స్ 2010, p. 222; Errington 1990, pp. 172–173.
- ↑ Adams 2010, p. 223; Errington 1990, pp. 173–174.
- ↑ 126.0 126.1 Adams 2010, p. 223; Errington 1990, p. 174.
- ↑ Adams 2010, p. 223; ఎర్రింగ్టన్ 1990, pp. 174–175.
- ↑ ఆడమ్స్ 2010, p. 223; ఎర్రింగ్టన్ 1990, pp. 175–176.
- ↑ Adams 2010, pp. 223–224; Eckstein 2013, p. 314; see also Errington 1990, pp. 179–180 for further details.
- ↑ ఆడమ్స్ 2010, pp. 223–224; Eckstein 2013, p. 314; see also Errington 1990, pp. 179–180 for further details.
- ↑ Eckstein 2010, p. 229; Errington 1990, pp. 184–185.
- ↑ Eckstein 2010, p. 229; Errington 1990, pp. 185–186, 189.
- ↑ Eckstein 2010, p. 230; Errington 1990, pp. 189–190.
- ↑ Eckstein 2010, pp. 230–231; Errington 1990, pp. 190–191.
- ↑ Bringmann 2007, p. 79; Eckstein 2010, p. 231; Errington 1990, p. 192; also mentioned by Gruen 1986, p. 19.
- ↑ Bringmann 2007, p. 80; మరిన్ని వివరాల కోసం Eckstein 2010, p. 231 మరియు Errington 1990, pp. 191–193 కూడా చూడండి.
- ↑ Errington 1990, pp. 191–193, 210.
- ↑ Bringmann 2007, p. 82; Errington 1990, p. 193.
- ↑ Bringmann 2007, p. 82; Eckstein 2010, pp. 232–233; Errington 1990, pp. 193–194; Gruen 1986, pp. 17–18, 20.
- ↑ Bringmann 2007, p. 83; Eckstein 2010, pp. 233–234; Errington 1990, pp. 195–196; Gruen 1986, p. 21; ఏటోలియన్ లీగ్ మరియు మాసిడోనియాకు చెందిన ఫిలిప్ V మధ్య జరిగిన ఒప్పందం మరియు మునుపటి ఒప్పందాన్ని ఉల్లంఘించారని భావించి, రోమన్ సహాయం కోరడానికి ఏటోలియన్లు చేసిన రెండవ ప్రయత్నాన్ని రోమ్ తిరస్కరించిన వివరాల కోసం Gruen 1986, pp. 18–19 కూడా చూడండి.
- ↑ Bringmann 2007, p. 85; మరిన్ని వివరాల కోసం Errington 1990, pp. 196–197 కూడా చూడండి.
- ↑ Eckstein 2010, pp. 234–235; Errington 1990, pp. 196–198; మరిన్ని వివరాల కోసం Bringmann 2007, p. 86 కూడా చూడండి.
- ↑ Bringmann 2007, pp. 85–86; Eckstein 2010, pp. 235–236; Errington 1990, pp. 199–201; Gruen 1986, p. 22.
- ↑ Bringmann 2007, p. 86; మరిన్ని వివరాల కోసం Eckstein 2010, p. 235 కూడా చూడండి.
- ↑ Bringmann 2007, p. 86; ఎర్రింగ్టన్ 1990, pp. 197–198.
- ↑ బ్రింగ్మాన్ 2007, p. 87.
- ↑ బ్రింగ్మాన్ 2007, pp. 87–88; ఎర్రింగ్టన్ 1990, pp. 199–200; మరిన్ని వివరాల కోసం ఎక్స్టెయిన్ 2010, pp. 235–236 కూడా చూడండి.
- ↑ Eckstein 2010, p. 236.
- ↑ 149.0 149.1 Bringmann 2007, p. 88.
- ↑ Bringmann 2007, p. 88; Eckstein 2010, p. 236; Errington 1990, p. 203.
- ↑ Bringmann 2007, p. 88; Eckstein 2010, pp. 236–237; Errington 1990, p. 203.
- ↑ Bringmann 2007, pp. 88–89; Eckstein 2010, p. 237.
- ↑ Bringmann 2007, pp. 89–90; మరిన్ని వివరాల కోసం Eckstein 2010, p. 237 మరియు Gruen 1986, pp. 20–21, 24 కూడా చూడండి.
- ↑ Bringmann 2007, pp. 90–91; Eckstein 2010, pp. 237–238.
- ↑ Bringmann 2007, p. 91; Eckstein 2010, p. 238.
- ↑ Bringmann 2007, p. 97; మరిన్ని వివరాల కోసం Errington 1990, pp. 207–208 కూడా చూడండి.
- ↑ Bringmann 2007, p. 97; Eckstein 2010, pp. 240–241; అతని పాలన ప్రారంభంలో పెర్సియస్ చర్యల గురించిన చర్చ కోసం Errington 1990, pp. 211–213 కూడా చూడండి.
- ↑ Bringmann 2007, pp. 97–98; Eckstein 2010, p. 240.
- ↑ Bringmann 2007, p. 98; Eckstein 2010, p. 240; Errington 1990, pp. 212–213.
- ↑ Bringmann 2007, pp. 98–99; Eckstein 2010, pp. 241–242.
- ↑ Bringmann 2007, p. 99; Eckstein 2010, pp. 243–244; Errington 1990, pp. 215–216;
- ↑ King 2010, p. 374; see also Errington 1990, pp. 220–221 for further details.
- ↑ King 2010, p. 373.
- ↑ King 2010, pp. 375–376.
- ↑ King 2010, p. 376.
- ↑ King 2010, pp. 376–377.
- ↑ King 2010, p. 377.
- ↑ 168.0 168.1 King 2010, p. 378.
- ↑ King 2010, p. 379.
- ↑ 170.0 170.1 170.2 Errington 1990, p. 222.
- ↑ 171.0 171.1 King 2010, p. 380.
- ↑ King 2010, p. 380; మరింత సందర్భం కోసం, Errington 1990, p. 220 చూడండి.
- ↑ Olbrycht 2010, pp. 345–346.
- ↑ 174.0 174.1 174.2 174.3 King 2010, p. 381.
- ↑ Sawada 2010, p. 403.
- ↑ Sawada 2010, pp. 404–405.
- ↑ Sawada 2010, p. 406.
- ↑ King 2010, p. 382; Errington 1990, p. 220.
- ↑ Sawada 2010, pp. 382–383.
- ↑ Hammond & Walbank 2001, pp. 5, 12.
- ↑ King 2010, pp. 384–389; Errington 1990, p. 220.
- ↑ King 2010, p. 390.
- ↑ అమెమియా 2007.
- ↑ Errington 1990, pp. 229–230.
- ↑ Errington 1990, p. 230.
- ↑ Errington 1990, pp. 231–232.
- ↑ Hatzopoulos 1996, pp. 365–366.
- ↑ Hatzopoulos 1996, pp. 366–367.
- ↑ Hatzopoulos 1996, pp. 367–369.
- ↑ Hatzopoulos 1996, pp. 368–369.
- ↑ Errington 1990, p. 242.
- ↑ Sekunda 2010, p. 447; Errington 1990, pp. 243–244.
- ↑ Sekunda 2010, pp. 447–448.
- ↑ Sekunda 2010, pp. 448–449; మరిన్ని వివరాల కోసం Errington 1990, pp. 238–239 కూడా చూడండి.
- ↑ Errington 1990, pp. 238–239, 243–244.
- ↑ Sekunda 2010, p. 449.
- ↑ Sekunda 2010, pp. 448–449.
- ↑ Errington 1990, pp. 239–240.
- ↑ Errington 1990, pp. 238, 247.
- ↑ 200.0 200.1 Sekunda 2010, p. 451.
- ↑ Sekunda 2010, p. 450; Errington 1990, p. 244.
- ↑ 202.0 202.1 Sekunda 2010, p. 452.
- ↑ Sekunda 2010, p. 451; Errington 1990, pp. 241–242.
- ↑ Sekunda 2010, pp. 449–451.
- ↑ Sekunda 2010, p. 451; Errington 1990, pp. 247–248; 248}}; Hammond & Walbank 2001, pp. 24–26
- ↑ Sekunda 2010, p. 453.
- ↑ 207.0 207.1 Sekunda 2010, p. 454.
- ↑ Sekunda 2010, p. 455; Errington 1990, p. 245.
- ↑ 209.0 209.1 సెకుండా 2010, pp. 458–459.
- ↑ Sekunda 2010, p. 461.
- ↑ Sekunda 2010, p. 469
- ↑ Sekunda 2010, pp. 463–464.
- ↑ Errington 1990, pp. 247–248.
- ↑ 214.0 214.1 214.2 214.3 Errington 1990, p. 248.
- ↑ Lamont 2023, p. 121; Brixhe 2018, pp. 1862–1867; Masson 2014, p. 483; Méndez-Dosuna 2012, pp. 141, 145; Engels 2010, p. 95; Meier-Brügger 2003, p. 28; Hornblower 2002, p. 90; Masson & Dubois 2000, p. 292
- ↑ Masson 2014, pp. 905–906: "we must now think of a link with North-West Greek (Locrian, Aetolian, Phocidian, Epirote). This view is supported by the recent discovery at *Pella of a curse tablet (4th century BC) which may well be the first 'Macedonian' text attested"
- ↑ Anson 2010, p. 17, n. 57, n. 58; Woodard 2010, pp. 9–10; Hatzopoulos 2011a, pp. 43–45; Engels 2010, pp. 94–95.
- ↑ Engels 2010, p. 95.
- ↑ Engels 2010, p. 94.
- ↑ Sansone 2017, p. 223.
- ↑ Anson 2010, pp. 17–18; see also Christesen & Murray 2010, pp. 428–445 for ways in which Macedonian religious beliefs diverged from mainstream Greek polytheism, although the latter was hardly "monolithic" throughout the Classical Greek and Hellenistic world and Macedonians were "linguistically and culturally Greek" according to Christesen and Murray. Christesen & Murray 2010, pp. 428–429.
- ↑ Errington 1990, pp. 225–226.
- ↑ Errington 1990, p. 226; Christesen & Murray 2010, pp. 430–431
- ↑ 224.0 224.1 Errington 1990, p. 226.
- ↑ Borza 1992, pp. 257–260; Christesen & Murray 2010, pp. 432–433; మరిన్ని వివరాల కోసం Hammond & Walbank 2001, pp. 5–7 కూడా చూడండి.
- ↑ Borza 1992, pp. 257–260; Christesen & Murray 2010, pp. 432–433; see also Hammond & Walbank 2001, pp. 5–7 for further details.
- ↑ Borza 1992, pp. 257, 260–261.
- ↑ Borza 1992, p. 257.
- ↑ Sansone 2017, pp. 224–225.
- ↑ Hatzopoulos 2011a, pp. 47–48; Errington 1990, p. 7.
- ↑ Hatzopoulos 2011a, p. 48; Errington 1990, pp. 7–8, 222–223.
- ↑ Hardiman 2010, p. 515.
- ↑ Hardiman 2010, pp. 515–517.
- ↑ 234.0 234.1 Hardiman 2010, p. 517.
- ↑ Palagia 2000, pp. 182, 185–186.
- ↑ Head 2016, pp. 12–13; Piening 2013, p. 1182.
- ↑ Head 2016, p. 13; Aldrete, Bartell & Aldrete 2013, p. 49.
- ↑ 238.0 238.1 238.2 Hardiman 2010, p. 518.
- ↑ Müller 2010, p. 182.
- ↑ Worthington 2014, p. 186.
- ↑ Worthington 2014, p. 185.
- ↑ 242.0 242.1 Worthington 2014, pp. 183, 186.
- ↑ Hatzopoulos 2011b, p. 58; Roisman 2010, p. 154; Errington 1990, pp. 223–224.
- ↑ Hatzopoulos 2011b, pp. 58–59; see also Errington 1990, p. 224 for further details.
- ↑ Chroust 2016, p. 137.
- ↑ 246.0 246.1 Errington 1990, p. 224.
- ↑ Rhodes 2010, p. 23.
- ↑ Rhodes 2010, pp. 23–25; see also Errington 1990, p. 224 for further details.
- ↑ 249.0 249.1 Errington 1990, p. 225.
- ↑ Badian 1982, p. 34, Anson 2010, p. 16; Sansone 2017, pp. 222–223.
- ↑ Hatzopoulos 2011b, p. 59.
- ↑ Nawotka 2010, p. 2.
- ↑ Anson 2010, p. 19
- ↑ Cohen 2010, p. 28.
- ↑ 255.0 255.1 255.2 Dalby 1997, p. 157.
- ↑ Dalby 1997, pp. 155–156.
- ↑ Dalby 1997, p. 156.
- ↑ Dalby 1997, pp. 156–157.
- ↑ Anson 2010, p. 10; Cohen 2010, p. 28.
- ↑ 260.0 260.1 Anson 2010, p. 10.
- ↑ Engels 2010, p. 87; Olbrycht 2010, pp. 343–344.
- ↑ Engels 2010, p. 84.
- ↑ Badian 1982, p. 51, n. 72; Johannes Engels comes to a similar conclusion. See: Engels 2010, p. 82.
- ↑ Hammond, N.G.L. (1997). The Genius of Alexander the Great. The University of North Carolina Press. p. 11. ISBN 978-0-8078-2350-7.
The other part of the Greek-speaking world extended from Pelagonia in the north to Macedonia in the south. It was occupied by several tribal states, which were constantly at war against Illyrians, Paeonians and Thracians. Each state had its own monarchy. Special prestige attached to the Lyncestae whose royal family, the Bacchiadae claimed descent from Heracles, and to the Macedonians, whose royal family had a similar ancestry. [...] In the opinion of the city-states these tribal states were backward and unworthy of the Greek name, although they spoke dialects of the Greek language. According to Aristotle, monarchy was the mark of people too stupid to govern themselves.
- ↑ Hammond, N.G.L. (1997). The Genius of Alexander the Great. The University of North Carolina Press. p. 11. ISBN 978-0-8078-2350-7.
The other part of the Greek-speaking world extended from Pelagonia in the north to Macedonia in the south. It was occupied by several tribal states, which were constantly at war against Illyrians, Paeonians and Thracians. Each state had its own monarchy. Special prestige attached to the Lyncestae whose royal family, the Bacchiadae claimed descent from Heracles, and to the Macedonians, whose royal family had a similar ancestry. [...] In the opinion of the city-states these tribal states were backward and unworthy of the Greek name, although they spoke dialects of the Greek language. According to Aristotle, monarchy was the mark of people too stupid to govern themselves.
- ↑ Sakellariou 1983, p. 52.
- ↑ Simon Hornblower (2016). "2: Greek Identity in the Archaic and Classical Periods". In Zacharia, Katerina (ed.). Hellenisms: Culture, Identity, and Ethnicity from Antiquity to Modernity. Routledge. p. 58. ISBN 978-0-7546-6525-0.
The question "Were the Macedonians Greeks?" perhaps needs to be chopped up further. The Macedonian kings emerge as Greeks by criterion one, namely shared blood, and personal names indicate that Macedonians generally moved north from Greece. The kings, the elite, and the generality of the Macedonians were Greeks by criteria two and three, that is, religion and language. Macedonian customs (criterion four) were in certain respects unlike those of a normal apart, perhaps, from the institutions which I have characterized as feudal. The crude one-word answer to the question has to be "yes."
- ↑ Simon Hornblower (2016). "2: Greek Identity in the Archaic and Classical Periods". In Zacharia, Katerina (ed.). Hellenisms: Culture, Identity, and Ethnicity from Antiquity to Modernity. Routledge. p. 58. ISBN 978-0-7546-6525-0.
The question "Were the Macedonians Greeks?" perhaps needs to be chopped up further. The Macedonian kings emerge as Greeks by criterion one, namely shared blood, and personal names indicate that Macedonians generally moved north from Greece. The kings, the elite, and the generality of the Macedonians were Greeks by criteria two and three, that is, religion and language. Macedonian customs (criterion four) were in certain respects unlike those of a normal apart, perhaps, from the institutions which I have characterized as feudal. The crude one-word answer to the question has to be "yes."
- ↑ Hatzopoulos 2011b, p. 74.
- ↑ Bolman 2016, pp. 120–121.
- ↑ 271.0 271.1 271.2 Winter 2006, p. 163.
- ↑ Winter 2006, pp. 164–165.
- ↑ Winter 2006, p. 165.
- ↑ Errington 1990, p. 227; see also Hammond & Walbank 2001, pp. 3, 7–8 for further details.
- ↑ Koumpis 2012, p. 34.
- ↑ Treister 1996, pp. 375–376.
- ↑ Humphrey, Oleson & Sherwood 1998, p. 570.
- ↑ Treister 1996, p. 376, no. 531.
- ↑ 279.0 279.1 ట్రీస్టర్ 1996, p. 376.
- ↑ 280.0 280.1 హాంఫ్రీ, ఓలెసన్ & షెర్వుడ్ 1998, pp. 570–571.
- ↑ Humphrey, Oleson & Sherwood 1998, pp. 570–572.
- ↑ Curtis 2008, p. 380.
- ↑ Stern 2008, pp. 530–532.
- ↑ Cuomo 2008, pp. 17–20.
- ↑ Errington 1990, p. 246.
- ↑ Treister 1996, p. 379.
- ↑ Meadows 2008, p. 773.
- ↑ Hatzopoulos 1996, pp. 432–433.
- ↑ Kremydi 2011, p. 163.
- ↑ Hatzopoulos 1996, p. 433.
- ↑ Hatzopoulos 1996, p. 434.
- ↑ Hatzopoulos 1996, pp. 433–434; Roisman 2010, p. 163.
- ↑ Anson 2010, pp. 3–4.
- ↑ Anson 2010, pp. 4–5.
- ↑ Errington 1990, p. 249.
- ↑ Asirvatham 2010, p. 104.
- ↑ Anson 2010, p. 9.
- ↑ Anson 2010, pp. 11–12.
- ↑ Errington 1990, pp. 219–220.
- ↑ Christesen & Murray 2010, pp. 435–436.
- ↑ Christesen & Murray 2010, p. 436.
- ↑ Anson 2010, p. 3.
ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు
- Articles containing Ancient Greek (to 1453)-language text
- Pages using infobox country or infobox former country with the symbol caption or type parameters
- Pages including recorded pronunciations
- Articles containing Greek-language text
- Pages using multiple image with auto scaled images
- మూలాల లోపాలున్న పేజీలు