ముత్తుముల అశోక్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముత్తుముల అశోక్‌ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1968 ఆగష్టు 5
హనుమంతరాయునిపల్లె, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రామచంద్ర రెడ్డి, లక్ష్మి దేవమ్మ
జీవిత భాగస్వామి పుష్పలీల
సంతానం దివ్యేష్ రెడ్డి, భవజ్ఞ రెడ్డి
వృత్తి రాజకీయ నాయకుడు

ముత్తుముల అశోక్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

ముత్తుముల అశోక్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు పై 12893 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై వైఎస్సార్‌సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.. ఆయన జూన్ 2016లో వైసీపీ ని విడి తెలుగుదేశంపార్టీలో చేరాడు.

ముత్తుముల అశోక్ రెడ్డి 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు చేతిలో 81035 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. "కలిసి కట్టుగా." Archived from the original on 3 June 2022. Retrieved 3 June 2022.