Jump to content

యజ్ఞస్వామి సుందర రాజన్

వికీపీడియా నుండి
వై. ఎస్. రాజన్
వైఎస్ రాజన్ 2010లో
వైఎస్ రాజన్ 2010లో
జననం (1943-04-10) 1943 ఏప్రిల్ 10 (వయసు: 83)
కొత్తారం తిరునెల్వేలి, తమిళనాడు, భారతదేశం
జాతీయతIndian

యజ్ఞస్వామి సుందర రాజన్ లేదా వై. ఎస్. రాజన్ (జననం 10 ఏప్రిల్ 1943) ఒక భారతీయ ప్రొఫెసర్, శాస్త్రవేత్త ,నిర్వాహకుడు. ఆయన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గౌరవ విశిష్ట ప్రొఫెసర్గా ఉన్నారు. సైన్స్, టెక్నాలజీ ,ఆవిష్కరణల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలకు గణనీయమైన కృషి చేశారు.. సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఆయన చేసిన కృషికి గాను 2012లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు[1] భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్తో కలిసి పనిచేసిన ప్రసిద్ధ శాస్త్రవేత్తలలో ఆయన ఒకరు.[2] ఇస్రో అంతరిక్ష విభాగంలో శాస్త్రీయ కార్యదర్శి పదవితో సహా అనేక ముఖ్యమైన పదవులను ఆయన నిర్వహించాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

వై. ఎస్. రాజన్ 1943 ఏప్రిల్ 10న తిరునెల్వేలి సమీపంలోని కొట్టారంలో జన్మించారు. ఆయన తాత సుందర గణపతిగల్ గొప్ప వేద పండితుడు. తల్లి పేరు విశాలక్షి, తండ్రి పేరు ఎస్. యగ్నాస్వామి. తల్లిదండ్రులు ముంబైకి వెళ్లారు. డాక్టర్ వై. ఎస్. రాజన్ తన పాఠశాల విద్యను, తరువాత కళాశాల విద్యను అక్కడే పూర్తి చేశారు. 1964లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అక్కడే ఆయన భౌతిక పరిశోధన ప్రయోగశాలలో పరిశోధకుడిగా తన వృత్తిని ప్రారంభించారు .

కెరీర్

[మార్చు]

ఆయన అంతరిక్ష విభాగం, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలో శాస్త్రీయ కార్యదర్శి సహా అనేక కీలక పదవులు నిర్వహించారు. ఎస్టీఐ పరిపాలన, సంస్థ నిర్మాణం, వ్యూహాత్మక అధ్యయనాలు, దౌత్యం, పర్యావరణ సాంకేతికతలు, సహజ వనరుల నిర్వహణలో ఆయన చేసిన కృషి విశేషమైనది. 1986లో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ సభ్యత్వం పొందారు. టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అసెస్మెంట్ కౌన్సిల్ తొలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మిషన్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. నేషనల్ నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్, భారత పరిశ్రమల సమాఖ్యలో సీనియర్ హోదాల్లో పనిచేశారు. పంజాబ్ ముఖ్యమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా, పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా, నలంద విశ్వవిద్యాలయం బోర్డు ఛైర్మన్‌గా, బిట్స్ పిలానీలో అనుబంధ ప్రొఫెసర్‌గా ఆయన చేసిన సేవలు విశిష్టమైనవి. అదనంగా ఆల్ ఇండియా దయానంద్ ఆంగ్లో-వేదిక్ కళాశాల మేనేజింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల నెట్‌వర్క్ అభివృద్ధికి తోడ్పడ్డారు. బిట్స్ పిలానీ సెనేట్ సభ్యుడిగా, గ్లోబల్ నాలెడ్జ్ షేరింగ్ ఫోరం వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన చేసిన కృషి విద్యా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.[3]

పుస్తకాలు ,రచనలు

[మార్చు]

ఆయన ఎపిజె అబ్దుల్ కలామ్‌తో కలిసి ఇండియా 2020: ఎ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం పుస్తకాన్ని సహ రచించారు. (హిందీ వెర్షన్: భారత్ 2020 ఔర్ ఉస్కే బాద్). అదనంగా డిస్కవర్ యువర్ పవర్ కోషెంట్తో పాటు అనేక పుస్తకాలు రచించారు. ఆయన 200కి పైగా వ్యాసాలు, పత్రాలు రాశారు, ఇవి అంతర్జాతీయ పత్రికల్లో కూడా ప్రచురించబడ్డాయి.

గౌరవాలు

[మార్చు]

ఇతనికి 2012లో పద్మశ్రీ, 1998లో ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫెలో, 2010లో వరల్డ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ ఫెలో, అదే సంవత్సరంలో గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీతో పాటు అనేక పురస్కారాలు లభించాయి.[4]

సూచనలు

[మార్చు]
  1. "Padma Awards Announced". Press Information Bureau, Ministry of Home Affairs. 25 January 2012. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 July 2015.
  2. Sinha, Amitabh (29 July 2015). "A Friend Remembers Kalam: He belonged more at ISRO than DRDO". The Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 January 2019.
  3. Sinha, Amitabh (29 July 2015). "A Friend Remembers Kalam: He belonged more at ISRO than DRDO". The Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 January 2019.
  4. "Padma Awards Announced". Press Information Bureau, Ministry of Home Affairs. 25 January 2012. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 July 2015.