యడవల్లి లక్ష్మణరావు
జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2025 జనవరి 25 | |||
నియమించిన వారు | ద్రౌపది ముర్ము | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కనిగిరి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | 1975 ఆగస్టు 3||
తల్లిదండ్రులు | రామచంద్రయ్య, సుబ్బమ్మ | ||
పూర్వ విద్యార్థి | ఆంధ్ర విశ్వవిద్యాలయం |
జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. జస్టిస్ అవధానం హరిహరనాథశర్మను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో 2025 జనవరి 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, కనిగిరిలో యడవల్లి వెంకటేశ్వర్లు, పద్మావతి దంపతులకు జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్యను ప్రకాశం జిల్లాలో పూర్తి చేసి నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం పూర్తి చేసి క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు అందుకున్నాడు. లక్ష్మణరావు నాగార్జున విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యుయేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు.
వృత్తి జీవితం
[మార్చు]లక్ష్మణరావు 1994లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకొని 2000లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసి 2014లో జ్యుడీషియల్ సర్వీసులోకి వచ్చి మొదట పోస్టింగ్ ఏలూరు జిల్లా అదనపు జిల్లా జడ్జిగా నియమితుడయ్యాడు. ఆయన ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించి ఉమ్మడి కృష్ణా జిల్లా పీడీజేగా పనిచేస్తూ 2021 సెప్టెంబరు 2న హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా, 2022 అక్టోబరు 22న రిజిస్ట్రార్ జనరల్గా నియమితులయ్యాడు.
జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో 2025 జనవరి 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3][4] ఆయన జనవరి 25న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Supreme Court Collegium approves appointment of two judges in Andhra Pradesh High Court" (in Indian English). The Hindu. 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "Justice Sujoy Paul appointed as Telangana HC CJ" (in Indian English). The Hindu. 15 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు". Andhrajyothy. 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు". 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "హైకోర్టు న్యాయమూర్తులుగా హరిహరనాథ శర్మ, లక్ష్మణరావు ప్రమాణం". Sakshi. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.