యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | |
|---|---|
| చైర్పర్సన్/చైర్మన్ | వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వైఎస్. విజయమ్మ |
| స్థాపన తేదీ | మార్చి 11, 2011 |
| రాజకీయ విధానం | ప్రాంతీయతావాదం |
| రంగు(లు) | నీలం |
| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ | 67 / 175 |
| తెలంగాణా అసెంబ్లీ | 3 / 119 |
| లోక్ సభ | 9 / 545 |
| రాజ్య సభ | 2 / 245 |
| ఎన్నికల చిహ్నం | |

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకానొక రాజకీయ పార్టీ. కే.శివ కుమార్ ద్వారా స్థాపించబడి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేఖరరెడ్డి కుమారుడైన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ద్వారా ముందుకు తేబడింది [1]. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్, ఇద్దరు తండ్రీ కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే. తండ్రి మరణం తరువాత జగన్ కు కాంగ్రెస్ పార్టీకు కొన్ని విభేదాలు రావడం వలన జగన్ క్రొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి వైఎస్సార్ కాంగ్రెస్ ను కనుగొన్నారు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు[2]. రాజశేఖర రెడ్డి ఏకైక కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (జగన్) పేరు మీద కె.శివకుమార్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
ఎన్నికలు
2014
2014 సార్వత్రిక ఎన్నికలలో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక ఓట్ల శాతం సాధించింది. ఈ ఎన్నికలలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో ఈ పార్టీ స్థానం దక్కించుకుంది. సీమాంధ్రలో మొత్తం పోలయిన ఓట్లలో 44.4% సాధించింది.
శాసనసభ ఫలితాలు
| సంవత్సరము | సాధారణ ఎన్నికలు | గెలిచిన స్థానాలు | ఓట్ల శాతము | ఫలితం | మూలం |
|---|---|---|---|---|---|
| 2014 | 14వ శాసనసభ | 67 | 44.47 % | ఓటమి | [3] |
లోక్ సభ ఫలితాలు
| సంవత్సరము | సాధారణ ఎన్నికలు | గెలిచిన స్థానాలు |
|---|---|---|
| 2014 | 16వ లోక్ సభ | 9 |