రఘువంశ్ ప్రసాద్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రఘువంశ్ ప్రసాద్ సింగ్
రఘువంశ్ ప్రసాద్ సింగ్

రఘువంశ్ ప్రసాద్ సింగ్


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1996–2014
ముందు శివ శరన్ సింగ్
తరువాత రామా కిషోర్ సింగ్
నియోజకవర్గం వైశాలి

వ్యక్తిగత వివరాలు

జననం (1946-06-06)1946 జూన్ 6
వైశాలి జిల్లా, బీహార్, భారతదేశం
మరణం 2020 సెప్టెంబరు 13(2020-09-13) (వయసు 74)
న్యూఢిల్లీ,
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
జీవిత భాగస్వామి కిరణ్ సింగ్
సంతానం 2 కుమారులు, 1 కుమార్తె
నివాసం పాట్నా

రఘువంశ్ ప్రసాద్ సింగ్ ( 1946 జూన్ 6 - 2020 సెప్టెంబరు 13) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్‌లోని వైశాలి నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై యూపీఎ - 1 ప్రభుత్వంలోని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోగ్రామీణాభివృద్ధి శాఖ, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ, పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

  • కార్యదర్శి, సంయుక్త సోషలిస్ట్ పార్టీ (SSP), సీతామర్హి జిల్లా (1973 – 77)
  • బీహార్ శాసనసభ్యుడు (1977 – 90)
  • రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత), విద్యుత్, బీహార్ ప్రభుత్వం (1977 – 79)
  • లోక్ దళ్ అధ్యక్షుడు, సీతామర్హి జిల్లా (1980 – 85)
  • బీహార్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ (1990)
  • బీహార్ శాసనమండలి డిప్యూటీ లీడర్ (1991 – 94)
  • బీహార్ శాసనమండలి సభ్యుడు (1991 – 95)
  • బీహార్ శాసనమండలి చైర్మన్ (1994 – 95)
  • బీహార్ రాష్ట్ర ఇంధనం, ఉపశమనం, పునరావాసం, అధికార భాషల శాఖ మంత్రి (1995 – 96)
  • 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (1996)
  • కేంద్ర రాష్ట్ర మంత్రి, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ (స్వతంత్ర బాధ్యత) (1996 – 97)
  • కేంద్ర రాష్ట్ర మంత్రి, ఆహారం & వినియోగదారుల వ్యవహారాల (స్వతంత్ర బాధ్యత) (1997 – 98)
  • 12వ లోక్‌సభకు 2వ సారి ఎన్నికయ్యాడు (1998)
  • 13వ లోక్‌సభకు 3వ సారి ఎన్నికయ్యాడు (1999)
  • రాష్ట్రీయ జనతాదళ్ పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభ నాయకుడు (1999 – 2000)
  • 14వ లోక్‌సభకు 4వ సారి ఎన్నికయ్యాడు (2004)
  • కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి (2004 – 09)
  • వైస్ ప్రెసిడెంట్, పార్లమెంటరీ ఫోరమ్ ఆన్ వాటర్ కన్జర్వేషన్ & మేనేజ్‌మెంట్
  • 15వ లోక్‌సభకు 5వ సారి ఎన్నికయ్యాడు (2009)

మరణం[మార్చు]

రఘువంశ్‌ ప్రసాద్‌ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2020 సెప్టెంబరు 13న మరణించాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Lok Sabha (2022). "Raghuvansh Prasad Singh". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
  2. "రఘువంశ్‌ ప్రసాద్‌ కన్నుమూత". 13 September 2020. Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
  3. TV9 Telugu (13 September 2020). "మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కన్నుమూత". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)