రమణీయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమణీయం పుస్తక ముఖచిత్రం.

ఎ.యస్. రామశాస్త్రి వ్రాసిన తెలుగు కథల పుస్తకం రమణీయం . అనామకుడు అనే కలం పేరుతొ వ్రాసాడు. ఈ పుస్తకంలో ఆలుమగల దాంపత్య కాలచక్రం గురించి కవి రమణీయంగా వివరించాడు. ఏడాదికి ఆరు ఋతువులు వున్నట్టే ఆలుమగల దాంపత్య కాలచక్రంలోనూ వుంటాయని, పెళ్ళి, సంతోషం, సంసారం, సంగరం, సంతానం, సంతృప్తి అనే మజిలీల మీదుగా - కామం పెరిగి, విరిగి, తరిగి నిష్కామభరితమైన స్నేహంగా, ప్రేమగా యెలా పరివర్తనం చెందుతుందో కవి మనకు ఈ పుస్తకం ద్వారా చెప్పాడు. నిన్న కన్న బిడ్డ ఇవాళ పిల్లలవుతారు, ఇవ్వాల పిల్లలు - రేపటికి తల్లిదండ్రులు, ఎల్లుండికి తాతలూ, అవ్వలూ అవుతారు కవి మనకు రమణీయంలో ఈ కాలచక్రాన్ని సీత, రామం పాత్రల రూపంలో మనకు కళ్లకు కట్టినట్లు రమణీయంగా చెప్పాడు.

కథా విశేషం[మార్చు]

సీతారాముళ్లనే బావమరదళ్ల - ధరిమిలా ఆలూమగళ్ల - ఆ పైన తల్లీతండ్రుళ్ల - ఆ పిమ్మట అవ్వాతాతళ్ల కథలివి, వీళ్ళందరూ కలిపి ఇద్దరే (సీత, రామం). ప్రేమలో పడడం, పెళ్లాడడం, కామించడం, రెచ్చిపోవడం, అలిసి పోవడం, క్రమంగా కోరికలు వెలిసి పోవడం, కలుపు గడ్డి కల్పవృక్షంలా కనబడడం, తేలిగ్గా నాలిక్కరుచుకోవడం, నవ్వుకోవడం ఇదే ఈ పుస్తకంలోని కథల తాత్పర్యం!

కథాక్రమం[మార్చు]

ఈ పుస్తకంలోని కథలు ఈ క్రింది విదంగా వుంటాయి

  • రమణీయం
  • అంకురం
  • ఓ దశాబ్దం
  • మధురం..... మధురం.....
  • చతుర్దాంకం
  • అవునా?
  • అలిగిన వేళ
  • వానప్రస్థం

ముద్రణ వివరాలు[మార్చు]

రమణీయం మొదటి ముద్రణ 2008 జనవరిలొ బాపు, ముల్లపూడి వెంకటరమణ చేతుల మీదుగా వాహిని బుక్ ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో విడుదలైంది. దీనికి ముఖపత్ర పేజి విన్యాసం చేసినది, బొమ్మలు గీసినది బాపు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రమణీయం&oldid=3210027" నుండి వెలికితీశారు