రామదేవ రాయలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646
హంపి శిథిలాలు

రామదేవ రాయలు, (లేదా వీర రామదేవ రాయలు) (సా.శ. 1617-1632) విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ప్రభువు. 1614లో తండ్రి, ప్రభువైన రెండవ శ్రీరంగ రాయలు వరుసకు తన సోదరుడైన జగ్గారాయుడి చేత చంపబడిన తర్వాత 1617లో సింహాసనం అధిష్టించాడు. రెండవ శ్రీరంగ రాయల కుటుంబం మొత్తం చంపబడ్డా రెండవ వేంకటపతి దేవ రాయల నమ్మకస్తుడైన సేనాపతి యాచమ నాయుడు చెరసాల నుండి రామ దేవుడిని కాపాడాడు.

అంతర్యుధ్ధం[మార్చు]

నేపథ్యం[మార్చు]

వేంకటపతి దేవరాయలకు నలుగురైదుగురు భార్యలున్నా వారిలో ఎవరికీ పుత్రసంతానం కలగకపోవడంతో బాయమ్మ అనే భార్య ఒక బ్రాహ్మణ బాలుడిని దత్తు తీసుకుని తనకు, దేవరాయలకు పుట్టిన కుమారునిగా చూపజూశారు. విషయం తెలుసుకున్న వేంకటపతి దేవరాయలు ఆ పిల్లవాణ్ణి తన కుమారుని వలెనే పెరగనిచ్చి, బావమరిది కుమార్తెనిచ్చి పెళ్ళిచేసినా చివరకు రాజ్యాన్ని మాత్రం అన్నగారి కుమారుడైన శ్రీరంగరాయలకు ఇచ్చారు. వేంకటపతి దేవరాయల మరణానంతరం శ్రీరంగరాయలు రాజ్యానికి వచ్చిన కొద్దిరోజుల్లోనే వేంకటపతిదేవరాయల బావమరిది, బాయమ్మ సోదరుడు జగ్గరాయలు శ్రీరంగరాయలను సకుటుంబంగా ఖైదుచేశారు. శ్రీరంగరాయలు సకుటుంబంగా ఖైదులో ఉండగానే యాచమనాయుడు అనే సేనాని జగ్గరాయని కుట్రకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తూ రామదేవరాయలను ఖైదు నుంచి తప్పించారు. ఆపైన శ్రీరంగరాయల కుటుంబాన్ని కూడా తప్పించబోగా జగ్గరాజు మొత్తంగా కుటుంబాన్ని అంతా నరికివేశారు.[1] జగ్గారాయుడు వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడిని సింహాసనంపై అధిష్టింపచేశారు.

యుద్ధం[మార్చు]

అసలు వారసుడైన రామదేవ రాయల తరఫున యాచమ నాయుడు ఆ ప్రయత్నాల్ని అడ్డుకున్నాడు. అనంతరం జరిగిన అంతర్యుధ్ధంలో యాచమ నాయుడు జగ్గారాయుడిని ఓడించాడు.

తొప్పూరు యుధ్ధం[మార్చు]

అంతర్యుధ్ధంలో ఓడిపోయిన జగ్గారాయుడు మొదట అడవుల్లోకి పారిపోయినా తర్వాత మదురై, జింజి నాయకుల సహాయం కోరాడు. అప్పటికే విజయనగర సామ్రాజ్యం నుండి విడిపోయి సొంత పాలన చేయాలని వున్న మదురై, జింజి నాయకులు, యాచమ నాయుడు, రామదేవ రాయల మీదకు దండెత్తారు. యాచమ నాయుడు, రామదేవ రాయలు తంజావూరు నాయకుల సహాయం కోరగా, విజయనగర పాలనను గౌరవిస్తున్న తంజావూరు నాయకులు అందుకు సమ్మతించారు.

సైన్యం[మార్చు]

జగ్గారాయుడు, మదురై, జింజి నాయకులు, కొందరు పోర్చుగీసు వారు తిరుచ్చిరాపల్లి వద్ద పెద్ద సైన్యాన్ని మోహరించారు. యాచమ నాయుడు వెల్లూరు నుండి తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. అతనికి దారిలో తంజావూరు నాయకుడి సైన్యం కలిసింది. కర్ణాటక నుండి కొంత, డచ్చి, జాఫ్నా సైన్యాలు కూడా కలిశాయి.

1616 చివరి మాసాల్లో రెండు సైన్యాలు తిరుచ్చికి సమీపంలో కావేరి నదికి ఉత్తరాన ఉన్న తొప్పూరు అనే ప్రదేశంలో ఎదురుపడ్డాయి. రెండు సైన్యాలు కలిపి పది లక్షల సైనికులు పోరాడిన ఈ యుధ్ధం దక్షిణ భారతదేశంలో జరిగిన అతిపెద్ద యుధ్ధాలలో ఒకటిగా చెప్పబడింది.

ఫలితం[మార్చు]

రాజ సైన్యం ధాటికి జగ్గారాయని సైన్యం నిలువలేకపోయింది. సైన్యాధ్యక్షులైన యాచమనాయుడు, తంజావూరు రఘునాథ నాయకుడు సైన్యాన్ని ఎంతో క్రమశిక్షణతో నడిపించారు. జగ్గారాయని సోదరుడైన యెతిరాజు ప్రాణాల కోసం పారిపోయాడు. మదురై నాయకుడు పారిపోవాలని చూసినా తిరుచ్చి దగ్గర పట్టుబడ్డాడు. వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడు కూడా పట్టుబడ్డాడు. జింజీ నాయకుడు ఒక్క జింజీ కోట తప్ప మిగతా అన్ని కోటలను కోల్పోయాడు. 1617 మొదట్లో యాచమ, తంజావూరు నాయకులు 15 ఏళ్ళ రామ దేవుడిని రామ దేవ రాయలుగా పట్టాభిషేకం చేశారు.

కొనసాగిన వైరం[మార్చు]

జగ్గారాయని సోదరుడైన యెతిరాజు మరలా జింజీ నాయకుని సహాయంతో తంజావూరు మీదకు దండెత్తినా జయించలేక పట్టుబడ్డాడు. చివరకు గెలవలేక తన కుమార్తెను రామదేవునికిచ్చి వివాహం చేశాడు. వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడు 1619లో మరణించడంతో రామదేవునికి పరిస్థితులు చక్కబడ్డాయి.

కర్నూలు చేజారుట[మార్చు]

అంతర్యుధ్ధాన్ని ఆసరాగా చేసుకొని బీజాపూరు సుల్తాను 1620లో కర్నూలు మీదకు సైన్యాన్ని పంపినా జయించలేక మరల 1624లో ఆ ప్రాంతాన్ని పూర్తిగా వశపర్చుకున్నాడు.

యాచమ[మార్చు]

అంతర్యుధ్ధం తర్వాత సర్వసైన్యాధ్యక్షుడైన యాచమ నాయుడు యెతిరాజు కుమార్తెతో రామ రాయల వివాహాన్ని వ్యతిరేకించినా, రామరాయలు లెక్క చేయక వివాహం చేసుకున్నాడు. ఇది అవమానంగా భావించిన యాచమనాయుడు ముసలివాడైన తనని రాజాస్థానం నుండి విరమింపచేయాలని కోరాడు. ఇప్పుడు రామ రాయలికి మామ అయిన యెతిరాజు, అంతర్యుధ్ధం సమయంలో జగ్గారాయని నుంచి స్వాధీనం చేసుకున్న గొబ్బూరు ప్రాంతాన్ని తిరిగి ఇవ్వాలని యాచమ నాయుడిపై ఒత్తడి తెచ్చాడు. అందుకు సమ్మతించని యాచమనాయుడిపై తంజావూరు, జింజీ సైన్యాల సహాయంతో రాజ సైన్యం యచమ నాయుడు పాలిస్తున్న ప్రాంతాలపై దండెత్తింది. యాచమ నాయుడి సైన్యం చిన్నదైనా ఎంతో గొప్పగా పోరాడి యెతిరాజు సైన్యాన్ని నిలువరించింది. ఎంతోకాలం సాగిన ముట్టడి తర్వాత గొబ్బూరు ప్రాంతాన్ని తిరిగి ఇవ్వడానికి యాచమ నాయుడు సమ్మతించాడు. పులికాటు, చెంగల్పట్టు, మధురాంతకం ప్రాంతాలు పూర్తిగా వెల్లూరు ఏలుబడిలోకి వచ్చాయి. వెంకటగిరి ప్రాంతాన్ని పాలించడానికి యాచమనాయుడికి అవకాశం వున్నా తన చివరి రోజులను ఉదయారుపాళ్యం సేనాపతి రక్షణలో గడపడానికి నిశ్చయించుకున్నాడు.

వారసుడు[మార్చు]

వారసులు, సోదరులు లేని రామ రాయలు, ఆనెగొందిని పాలిస్తున్న వరుసకు సోదరుడు, ఆళియ రామ రాయల మనవడు అయిన పెద వేంకట రాయుడిని (మూడవ వేంకట రాయలు) వారసుడిగా ప్రకటించి 30 ఏళ్ళ వయసులో 1632లో 15 ఏళ్ళ పాలన చేసి మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం


ఇంతకు ముందు ఉన్నవారు:
మొదటి శ్రీరంగ రాయలు
రామదేవుడు
1617 — 1632
తరువాత వచ్చినవారు:
వేంకటపతి రాయలు