Coordinates: 18°05′29″N 78°27′50″E / 18.0914661°N 78.4638274°E / 18.0914661; 78.4638274

రామాయంపేట పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామాయంపేట పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
రామాయంపేట పురపాలకసంఘం is located in తెలంగాణ
రామాయంపేట పురపాలకసంఘం
రామాయంపేట పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 18°05′29″N 78°27′50″E / 18.0914661°N 78.4638274°E / 18.0914661; 78.4638274
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండలం రామాయంపేట
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ పల్లె జితేంద్ర గౌడ్
 - వైస్ చైర్‌పర్సన్‌ పుట్టి విజయలక్ష్మి
వైశాల్యము
 - మొత్తం 12.02 km² (4.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 17,860
 - పురుషుల సంఖ్య 8,774
 - స్త్రీల సంఖ్య 9,086
 - గృహాల సంఖ్య 4,820
పిన్ కోడ్ - 502101
Area code(s) టెలిఫోన్ కోడ్ - 08452
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

రామాయంపేట పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] రామాయంపేట పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం లోని మెదక్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న రామాయంపేట, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం[మార్చు]

రామాయంపేట 12.02 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°07′00″N 78°25′47″E / 18.116609°N 78.429766°E / 18.116609; 78.429766 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 85 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం మెదక్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 17860 మంది కాగా, అందులో 8774 మంది పురుషులు, 9086 మంది మహిళలు ఉన్నారు. 4820 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 20 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం పల్లె జితేంద్ర గౌడ్ చైర్‌పర్సన్‌గా, పుట్టి విజయలక్ష్మి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. బొర్రా అనిల్
  2. ఆర్. సుందర్ సింగ్
  3. పుట్టి విజయలక్ష్మి
  4. గజవడ నాగరాజు
  5. చంద్రపు శోభ
  6. డెమే యాదగిరి
  7. మల్యాల కవిత
  8. పల్లె జితేందర్ గౌడ్
  9. దేవుని జయ
  10. చింతల రాధభావని
  11. చిలుక గంగాధర్
  12. సరఫ్ సౌభాగ్య

మూలాలు[మార్చు]

  1. "Ramayampet Municipality". ramayampetmunicipality.telangana.gov.in. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 20 April 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 20 April 2021.
  4. "Basic Information of Municipality, Ramayampet Municipality". ramayampetmunicipality.telangana.gov.in. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 20 April 2021.
  5. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 20 April 2021.
  6. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 20 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]